Ranked
-
ఆ దేశంలో తుపాకీ పట్టని పోలీసులు.. కారణమిదే
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొందరు కొత్త సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ నేపధ్యంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అత్యంత సురక్షిత దేశంఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి భద్రత గురించి మనకు ముందుగా తెలియదు. అటువంటి పరిస్థితిలో భద్రత కలిగిన ప్రాంతాల గురించి మనం అన్వేషిస్తాం. ఇటీవల అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్షైర్ హాత్వే ట్రావెల్ తాజాగా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు ఐస్లాండ్. ఈ దేశం 2025లో సందర్శించడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఆ కంపెనీ తెలిపింది.పలు అంశాలపై సర్వేఈ జాబితాను సిద్ధం చేసేందుకు బెర్క్షైర్ హాత్వే ట్రావెల్ కంపెనీ ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో, క్రైమ్ రేట్, మహిళల భద్రత, ఎల్జీబీటీఐక్యూ ప్లస్, ప్రయాణికుల అనుభవం, రవాణా వ్యవస్థ, ఆరోగ్య సేవలు తదితర వివరాలను ప్రయాణికుల నుంచి సేకరించారు. ఈ సంస్థ 2016 నుంచి ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తోంది.పోలీసులు తుపాకులు పట్టుకోరుగత సంవత్సరం ఈ జాబితాలో ఐస్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే 2024లో ప్రయాణికులు అందించిన వివరాలు, రేటింగ్ ఆ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాయి. ఈ ద్వీపం చాలా చిన్నది. నాలుగు లక్షల జనాభా మాత్రమే ఇక్కడ ఉంటోంది. ఇక్కడ హింసాత్మక నేరాల రేటు చాలా తక్కువ. పోలీసులు తుపాకులను పట్టరు. ఐస్లాండ్కు సైన్యం కూడా లేదు. ఐస్లాండ్ 2024లో అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలను చవిచూసింది. ఇది పర్యాటకుల తాకిడిపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం విశేషంఐస్లాండ్లో ఏమిటి ఫేమస్?ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్ పర్యాటకులలో నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న అతిపెద్ద చర్చి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఐస్లాండ్లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన మంచుకొండలను దగ్గరి నుంచి చూడవచ్చు. దేశంలో పర్యాటకులను ఆకర్షించేలా అనేక ప్రదేశాలు ఉన్నాయి.సురక్షిత దేశాల జాబితాలో.. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. ఈ దేశాన్ని పర్యాటకులకు సురక్షితం దేశంగా భావిస్తారు. నేరాల రేటు కూడా ఇక్కడ చాలా తక్కువ. పర్యాటకులు ఈ దేశ రవాణా భద్రతను ఉత్తమంగా రేట్ చేశారు. సురక్షితమైన దేశాల జాబితాలో కెనడా మూడవ స్థానంలో నిలిచింది. ఈ దేశం మహిళలకు, ఎల్జీబీటీక్యూఐఏ ప్లస్ వర్గాలకు సురక్షితమైనదని, నేరాల రేటు తక్కువగా ఉందని సర్వే పేర్కొంది. నయాగరా జలపాతం, బాన్ఫ్ నేషనల్ పార్క్ కెనడాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు.ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఉంది. ఈ దేశంలో నేరాల రేటు చాలా తక్కువ. ఈ దేశంలో 50 లక్షల జనాభా ఉంది. ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, జర్మనీ, నార్వే, జపాన్, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాలు ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
భారత్లో ఐఎస్బీ నంబర్–1
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన గుర్తింపు సాధించింది. ఫైనాన్షియల్ టైమ్స్–2020 సోమవారం ప్రకటించిన ఈఎంబీఏ ర్యాంకింగ్స్లో పీజీ పీమ్యాక్స్ కోర్సు నిర్వహణతో దేశంలోకే ఐఎస్బీ మొదటి స్థానం పొందగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో 53వ స్థానం పొందింది. (క్యాబ్ చార్జీలు; డ్రైరన్ పేరిట బాదుడు) ఐఎస్బీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యాపార యజమానులకు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న 15 నెలల కాలపరిమితితో కూడిన గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ స్థాయి ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. 2017 పీజీ పీమ్యాక్స్ క్లాస్ నుంచి ఐఎస్బీ పూర్వ విద్యార్థులు ఈ ఏడాది ర్యాంకింగ్ కోసం సర్వే చేయబడ్డారు. ప్రధానంగా లక్ష్యాల సాధన, జీతాల పెంపుదల, ప్రస్తుత జీతాలు, కెరియర్ ప్రొగ్రామ్స్ నిర్వహణ, మహిళా ఫ్యాకల్టీ, విద్యార్థినులు, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాలపై పరిశీలించి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంక్లను ప్రకటించింది. గతేడాది 52వ ర్యాంక్ పొందగా ఈ ఏడాది 53 వస్థానం పొందగలిగింది. తాజా ర్యాకింగ్స్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రాముఖ్యతతో పాటు ఐఎస్బీ ప్రాధాన్యత పెరిగిందని డీన్ ప్రొఫెసర్ రాజేంద్రశ్రీవాత్సవ అన్నారు. -
007 జేమ్స్ బ్రాండ్
-
దేశంలో మోస్ట్ అట్రాక్టివ్ సంస్థ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్గా నిలిచింది. హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ రాండ్స్టడ్ సర్వే ప్రకారం గూగుల్ ఇండియా ఎట్రాక్టివ్ ఎంప్లాయిర్గా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. అలాగే మెర్సిడెస్ బెంజ్ ఇండియా రెండవ స్తానంలో నిలిచింది. మానవ వనరుల సేవల సంస్థ రాండ్స్టడ్ 2017 నివేదిక సర్వే ప్రకారం గూగుల్ ఈ ఘనతను సాధించింది. ఈ సర్వే లో ఈ కామర్స్ లో అమెజాన్ ఇండియా, ఎఫ్ఎంసీజీ ఐటీసీ, కన్యూమర్ అండ్ హెల్త్ కేర్ ఫిలిప్స్ ఇండియాలాంటి దిగ్గజాలు ఈ పోటీల్లో రంగాలవారీగా టాప్లో నిలిచాయి. మరోవైపు స్టార్ట్ అప్ కంపెనీల్లో పనిచేయడానికి ఐటీ నిపుణులు మొగ్గు చూపుతున్నారట. నిపుణులు, ప్రతిభావంతులలైన ఉద్యోగులకోసం కంపెనీలు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కొనసాగిస్తున్నాయని రాండ్ స్టడ్ ఇండియా ఎండీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూర్తీ కే ఉప్పాపురి చెప్పారు. క్రొత్త బ్రాండ్లను ఆకర్షించడం, నిలబెట్టుకోవడంతోపాటు పెట్టుబడిదారుల బ్రాండింగ్ వాల్యూను పెంచుకోవడంపై సంస్థలు దృష్టిపెట్టాయని తెలిపారు. సర్వే ఫలితాలు ప్రకారం, పెద్ద, బహుళజాతి సంస్థలు ఉద్యోగులు ఇష్టపడే ఎక్కువ కార్యాలయంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీ, ఐటి, రిటైల్, ఎఫ్ఎంసిజి రంగాల కంపెనీల కోసం భారతీయలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారుని సర్వేలో తేలింది. దేశంలో ఉత్తమ 'యజమాని బ్రాండ్'ను గుర్తించేందుకు రాండ్ స్టడ్ అవార్డు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. -
2015 జైత్రయాత్రకు సానియా మీర్జా రెడీ
-
పేదవిద్యార్ధి ప్రతిభ