report to center
-
నేడు మణిపూర్కు ‘ఇండియా’
న్యూఢిల్లీ: మణిపూర్లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్కు నివేదిక అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16 పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నుంచి ఆధిర్ రంజన్ ఛౌధురి, గౌరవ్ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ జయంత్ చౌధరి, ఆర్జేడీ మనోజ్ ఝా, ఆర్ఎస్పీ ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నేత తిరుమావళన్. వీరితో పాటు జేడీ(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, జేడీ–యూకు చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్పీ నుంచి జావెద్ అలీఖాన్, ఐయూఎంఎల్ ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ నేత సుశీల్ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్ ఈ బృందంలో ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్ హింసపై దర్యాప్తు జరిపించాలని లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం అనుకుంటోందని ఆరోపించారు. మహిళల గౌరవంతో ఆటలా? బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో షేర్ చేశారు. మణిపూర్లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని దేశం పురోగమించదన్నారు. -
‘డేటా రక్షణ’ ముసాయిదా సిద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు తదితర అంశాలను పొందుపరిచింది. ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాలో సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించింది. శుక్రవారం ఈ కమిటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు నివేదికను అందజేసింది. డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించాల్సిన జరిమానా వివరాలనూ ముసాయిదాలో పొందుపరిచింది. దీని ప్రకారం.. డేటా ప్రాసెసింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 15కోట్ల జరిమానా లేదా ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సంస్థల టర్నోవర్లో 4% జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. డేటా రక్షణ ఉల్లంఘనపై చర్య తీసుకోవడంలో విఫలమైతే రూ.5 కోట్ల జరిమానా లేదా డేటా సేకరణ సంస్థల టర్నోవర్లో 2% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇది ఒక చారిత్రక చట్టం. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని అనుకుంటున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా భారత సమాచార రక్షణ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం’ అని రవిశంకర్ చెప్పారు. -
కేంద్రానికి గవర్నర్ నివేదిక
-
కేంద్రానికి గవర్నర్ నివేదిక
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపారు. అయితే ఈ నివేదికలో మాత్రం ఆయన ఎలాంటి సూచనలు చేయలేదని తెలిసింది. వివిధ రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను మాత్రం క్రోడీకరించి వాటిని మాత్రమే ఓ నివేదిక రూపంలో పంపారు. అలాగే, ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు పాటించే సంప్రదాయంలో భాగంగా ప్రతిపక్ష నాయకులు అందరితోనూ గవర్నర్ మాట్లాడారు. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా గవర్నర్ ఫోన్లో మాట్లాడి, ముఖ్యమంత్రి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు.