-
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
ఎలన్ మస్క్ పాఠశాలలో సీటు సాధించిన వరంగల్ విద్యార్థి..!
6th Class Student From Warangal Secured Seat In Elon Musk School: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే కాబోలు చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటాడు వరంగల్కు చెందిన ఓ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ...కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ లాంగ్వేజ్లో పట్టు సాధించి ఏకంగా ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్లో అనిక్ పాల్ అడ్మిషన్ సాధించాడు. అనిక్ పాల్ తండ్రి విజయ్పాల్ వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ గురించి తెలుసుకున్న విజయ్పాల్... తన కుమారుడిని ఎలాగైనా అందులో చేర్పించాలని నిశ్చయించుకున్నారు. అందుకు సరిపడా శిక్షణను అనిక్ కు అందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనిక్ పాల్ కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్లో ప్రావీణ్యం సాధించాడు. మూడు రౌండ్లను అలవోకగా..! ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిన్ స్కూల్ ప్రవేశ పరీక్షలోని మూడు రౌండ్లను అనిక్ పాల్ అలవోకగా సాధించాడు. ప్రవేశ పరీక్షలో భాగంగా మొదటి రౌండ్లో పిల్లలు ఆడే వీడియో గేమ్స్కు సంబంధించిన పలు లాజికల్ ప్రశ్నలను అనిక్ పాల్ ఇట్టే పరిష్కరించాడు. రెండో రౌండ్లో సింథసిస్ స్కూల్ బోర్డు ఇచ్చిన ఓ ప్రశ్నకు వివరణాత్మక సమాధానంతో కూడిన వీడియోను రూపొందించి పంపగా అందులో సెలక్ట్ అవ్వగా...మూడో రౌండ్లో పర్సనల్ ఇంటర్వ్యూ లోనూ సత్తా చాటాడు. దీంతో అనిక్ పాల్కు సింథసిస్ స్కూల్లో సీటు ఖరారైంది. ప్రస్తుతం అనిక్ పాల్ ఆన్లైన్ క్లాసులను వింటున్నట్లు తెలుస్తోంది. సింథసిస్ స్కూల్ ప్రత్యేకతలివే ఎలన్ మస్క్, జోష్ డాన్తో కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్ను విద్యార్థులకు నేర్పిస్తారు. గతంలో స్పేస్ఎక్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు. చదవండి: స్పైడర్మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! -
బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగానే ఉంది: ఆర్బీఐ
ముంబై: దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, సుస్థిరంగానే ఉందని, వదంతుల ఆధారంగా భయపడిపోవాల్సిన పని లేదని దేశ ప్రజలకు భరోసానిస్తూ ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకులో సంక్షోభంతోపాటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు చలామణి అవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కొన్ని బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకుల పట్ల వదంతులు చలామణి అవుతున్నాయి. ఇవి డిపాజిటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా, స్థిరంగా ఉందని, ఈ వదంతులను విని భయపడిపోవాల్సిన అవసరం లేదని సాధారణ ప్రజలకు ఆర్బీఐ హామీ ఇస్తోంది’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు మంగళవారం స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ స్టాక్స్ సైతం తీవ్ర నష్టాల పాలయ్యాయి. -
ఎల్అండ్టి టెక్నాలజీ సర్వీసెస్ భారీ డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రోకు చెందిన ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ మల్టీ మిలియన్ డాలర్ల కాంట్రాక్టును సొంతం చేసుకుంది. ప్రపంచ అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీ నుంచి మల్టీ మిలియన్ డాలర్ విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎల్ అండ్ టి టెక్నాలజీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక పొత్తులో ఉత్పత్తుల బలోపేతం, ఉన్నతమైన నాణ్యతా ఉత్పత్తులను వినియోగదారులకు అందించనున్నట్టు బీఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో బుధవారం నాటి మార్కెట్ లో 0.79 శాతం ఎగిసింది. అయితే, ఈ ఒప్పందం మొత్తం విలువ ఇంకా బహిర్గతం చేయలేదు. బహుళ సంవత్సరాల భాగస్వామ్య అవార్డు గెల్చుకున్న తమ సంస్థ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని ఎల్ అండ్ టి టెక్ సీఈఓ, ఎండీ కేశవ్ పాండా చెప్పారు. ప్రపంచ వినియోగదారులకు కటిండ్ ఎడ్జ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ అందించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. కాగా ఈ సెప్టెంబర్ ఐపీవోలో రూ. 900 కోట్లను సాధించిన సంగతి తెలిసిందే.