shoot at sight
-
వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
పట్నా: ఇటీవల హత్యకు గురైన ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను పొగుడుతున్న వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అశ్విని చౌబె. అలాంటి వాళ్లు కన్పించిన వెంటనే కాల్చి పడేయాలని వ్యాఖ్యానించారు. బిహార్లో కూడా యోగి మోడల్ ప్రభుత్వం అవసరం ఉందన్నారు. పట్నాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు అతీక్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విని చౌబె వాళ్లపై ఫైర్ అయ్యారు. బిహార్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే వాళ్లను కాల్చిపడేయాలన్నారు. మోదీ, యోగికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేసిన తీరు బాధాకరమన్నారు. క్రిమినల్స్, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న యోగి మార్క్ పాలన బిహార్లోనూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్లో ప్రస్తుతం కుటంబ, కుల రాజకీయాలు చేసే వారే అధికారంలో ఉన్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా.. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్ను ముగ్గురు యువకులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. చదవండి: 35 రోజులుగా వేట.. అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసిన పోలీసులు! -
కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్
వాషింగ్టన్ : కరోనా వైరస్ కట్టడికి ఉత్తర కొరియా షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా యూఎస్ ఫోర్సెస్ కొరియా (యూఎస్ఎఫ్కే) కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ వెల్లడించారు. చైనాతో సరిహద్దుల్ని పంచుకున్నప్పటికీ ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ ఉత్తర కొరియాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో కరోనా కేసు చైనాలో బయటపడిన వెంటనే జనవరిలోనే కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. ఒక వ్యక్తికి కరోనా వైరస్ అనుమానం ఉందనే చెప్పింది తప్ప, అధికారికంగా కొరియా నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి తరుణంలో యూఎస్ఎఫ్కే కమాండర్ రాబర్ట్ వాషింగ్టన్లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆన్లైన్ సదస్సులో పాల్గొన్నారు. కరోనా కట్టడికి ఉత్తర కొరియా అధికారులు షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కరోనా ఎవరికైనా సోకిందని తెలిసిన వెంటనే వారిని కాల్చి చంపేయాలని ఉత్తర కొరియా స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు -
రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి హెచ్చరించారు. ‘ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే, వారిపై.. హైదరాబాద్ విలీనం సమయంలో సర్దార్ వల్లభాయి పటేల్ చేపట్టిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాం’ అన్నారు. కఠిన చర్యలు అంటే కనిపిస్తే కాల్చివేతనే అని పేర్కొన్నారు. -
శివాలెత్తిన పోలీసులు
-
విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత: ఎస్పీ కార్తీకేయ
రాష్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు రోజులుగా విజయనగరంలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన కేసులో ఇప్పటి వరకు 35 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కార్తీకేయ ఆదివారం వెల్లడించారు. విజయనగరం పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పారు. పట్టణ వీధుల్లో ఎవరైన కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలను విజయనగరంలో భారీగా మోహరించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరం. రాష్ట్ర విభజనకు ఆయన ముఖ్య కారకుడని స్థానికులు భావిస్తున్నారు. దాంతో గత రెండు రోజులుగా బొత్స, ఆయన బంధువుల ఆస్తులపై సమైక్యవాదులు పెద్ద పెట్టున విధ్వంసానికి పాల్పడుతున్నారు. దాంతో విజయనగరం అట్టుడుకుతుంది. దీంతో ప్రభుత్వం పోలీసు బలగాను మోహరించింది.