Sikandar
-
అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బాబర్ ఆజం (Babar Azam) నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో అద్వితీయ విజయాలు అందుకున్న రిజ్వాన్.. సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు.న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో వన్డే త్రైపాక్షిక సిరీస్తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్గా రిజ్వాన్ను తొలగించి.. సల్మాన్ ఆఘాకు ఆ బాధ్యతలు అప్పగించింది.ఇదిలా ఉంటే.. రిజ్వాన్ తాజాగా పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆడకుండా అతడు.. పెషావర్లో ఓ స్థానిక క్లబ్కు ఆడినట్లు తెలుస్తోంది. ఇలా నేషనల్ టీ20 కప్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ బక్త్ తప్పుబట్టాడు.పీసీబీని అవమానించాడు.. ఈ విషయంలో రిజ్వాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీకి సూచించాడు. ‘‘నెలకు రూ. 60 లక్షలు తీసుకుంటున్నాడు. మరి జాతీయ జట్టు ఆటగాళ్లు పీసీబీ నిర్వహించే దేశీ మ్యాచ్లలో ఎందుకు ఆడరు? దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిజ్వాన్ పీసీబీని దారుణంగా అవమానించాడు.సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండిమొహ్సిన్ నక్వీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుసు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి వాళ్లపై కొరడా ఝులిపించాల్సిందే. పీసీబీని పట్టించుకోని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసే దిశగా ఆలోచన చేయాలి’’ అని సికందర్ బక్త్ పేర్కొన్నాడు.బ్యాటర్గానూ విఫలంకాగా కెప్టెన్గా ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం ద్వారా రిజ్వాన్ ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడి సారథ్యంలో పాకిస్తాన్.. గ్రూప్ దశలో న్యూ జిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయింది.ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావడంతో గెలుపున్నదే లేకుండా ఈ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో రిజ్వాన్ కివీస్తో మ్యాచ్లో 3, భారత్తో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. రోహిత్ సేనతో పోరులో రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించడం గమనార్హం. కాగా పాక్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కివీస్తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లు ఆడుతుంది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
సినిమా, సినిమాకి తగ్గుతున్న సల్మాన్ ఖాన్ క్రేజ్
-
బాలీవుడ్ వెళ్తున్న కల్కి మ్యూజిక్ డైరెక్టర్
-
బాబర్కు ఇప్పుడైనా సిగ్గు వచ్చింది: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైనపుడే ఈ పని చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా వన్డే వరల్డ్కప్-2023లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్ చేతిలో తొలిసారి వన్డే పరాజయం చవిచూసిన బాబర్ బృందం.. సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా బాబర్ ఆజం టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా ఈ క్రమంలో టెస్టు జట్టుకు షాన్ మసూద్ను నాయకుడిగా ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. టీ20 పగ్గాలను ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే, వీరిద్దరు ఆరంభం నుంచే కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు షాహిన్పై వేటు వేసిన పీసీబీ.. బాబర్ ఆజంను తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది.తాజాగా మరోసారి రాజీనామాఅయితే, అమెరికా- వెస్టిండీస్లో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓడటమే గాక.. కనీసం సూపర్-8 దశకు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టింది. జూన్లో ఈ టోర్నీ ముగిసిన నాటి నుంచి బాబర్ ఆజం.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చిందిబ్యాటింగ్పై దృష్టి పెట్టే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు బాబర్ ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సికందర్ బఖ్త్.. ‘‘ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది. నిజానికి వరల్డ్కప్లో మా జట్టు ఓడిన నాడు.. అంటే జూన్ 16నే అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పిందిఅప్పుడే కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. దేశం మొత్తం ఇదే కోరుకుంది. కానీ అతడు మొండిగా ప్రవర్తించాడు. తను తాను ఓ కింగ్లా ఊహించుకోవడం బాబర్కు అలవాటు. తన ఆట తీరు బాగా లేకున్నా.. బాగుందనే ఫీలవుతాడు. అయితే, బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది. అందుకే ఇప్పటికైనా కెప్టెన్సీని వదులుకున్నట్లు ప్రకటించాడు’’ అని పేర్కొన్నాడు.ఇంటా, బయటా వరుస ఓటములు.. అయినాకాగా టెస్టులకు షాన్ మసూద్నే సారథిగా కొనసాగించడంపై కూడా సికందర్ బఖ్త్ విమర్శలు చేశాడు. ఇంటా, బయటా వరుస టెస్టు సిరీస్లలో ఓటములనే బహుమతిగా ఇస్తున్న ఆటగాడు కెప్టెన్గా ఉండటం దురదృష్టకరమంటూ పెదవి విరిచాడు. కాగా పాకిస్తాన్ తరఫున 1976- 1989 వరకు సికందర్ బఖ్త్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 26 టెస్టుల్లో 67, వన్డేల్లో 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.చదవండి: ఇంగ్లండ్ బజ్బాల్ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్టయిలిష్ డాన్తో రొమాన్స్
మాస్కి కావాల్సిన వీరత్వం... క్లాస్ ప్రేక్షకులకు కావాల్సిన భిన్నత్వం... రెండూ సూర్యలో ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించుకున్నారాయన. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘సికిందర్’ చిత్రంతో మరోమారు భిన్నంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు సూర్య. లగడపాటి శిరీషా-శ్రీధర్, తిరుపతి బ్రదర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆగస్ట్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సూర్య స్టయిలిష్ డాన్గా ఇందులో కనిపించనున్నారు. గొప్ప కథాంశంతో లింగుస్వామి చిత్రాన్ని మలిచారు. యువన్శంకర్రాజా స్వరాలకు స్పందన బాగుంది. అందం, అభినయం కలబోతగా ఇందులో సమంత పాత్ర ఉంటుంది. పదేళ్లు పూర్తి చేసుకున్న మా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సంస్థకు ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. -
అందుకే సూర్యను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను : నాగార్జున
‘‘సూర్యను తెలుగు ప్రేక్షకులు మన హీరోలాగానే భావించి ఆదరిస్తున్నారు. తనకు తమిళనాడులో కన్నా ఇక్కడే ఎక్కువ క్రేజ్ ఉందని సూర్య ఇప్పుడే నాతో చెప్పాడు. సూర్య ప్రతి సినిమాకీ పడే కష్టం మామూలుది కాదు’’ అని నాగార్జున అన్నారు. సూర్య - సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ‘సికిందర్’ చిత్రం పాటల వేడుక గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. పాటల సీడీని నాగార్జున ఆవిష్కరించి రాజమౌళికి ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘నేనొకసారి సూర్యకు ఫోన్ చేసి చిన్న సహాయం అడిగాను. హెచ్.ఐ.వి. గురించి ప్రచారం చేయమని అడిగితే వెంటనే జ్యోతికతో కలిసి ప్రచారం చేయడానికొచ్చారు. అందుకే సూర్యను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’’ అని తెలిపారు. సూర్య మాట్లాడుతూ ‘‘చాలారోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. రాజమౌళి గారు ఒప్పుకుంటే బాహుబలిలో చిన్నవేషమైనా వేస్తాను’’ అన్నారు. ఈ వేడుకలో సమంత, లింగుస్వామి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.