breaking news
Sujeet
-
పరాజయాన్ని ప్రేరణగా మార్చి...
సాక్షి క్రీడా విభాగం : గత ఏడాది పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు జోర్డాన్లోని అమ్మాన్లో వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ (ఆసియా) జరుగుతోంది. భారత్లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో గెలిచిన తర్వాత సుజీత్ కల్కాల్ ఇక్కడ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే అనూహ్య వరదలు దుబాయ్ నుంచి ముంచెత్తడంతో అక్కడి నుంచి విమానంలో అతను సరైన సమయానికి అమ్మాన్ చేరలేకపోయాడు. దాంతో సుజీత్ తీవ్రమైన పోటీ ఉండే వరల్డ్ క్వాలిఫయర్స్లో తలపడాల్సి వచ్చింది. ఇస్తాంబుల్లో జరిగిన ఈ టోర్నీ లో ఈ ఈవెంట్ ఆరంభంలో సత్తా చాటిన సుజీత్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు. మరొక్క విజయం సాధిస్తే చాలు పారిస్ ఒలింపిక్స్ టికెట్ ఖాయమయ్యేది. కానీ తర్వాతి రెండు బౌట్లలో ఓటమిపాలై అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడు. రెండో బౌట్లోనైతే వరల్డ్ చాంపియన్ జైన్ రూథర్ఫోర్డ్తో హోరాహోరీగా తలపడి 2–2తో నిలిచాడు. అయితే చివరి పట్టు (క్రయిటీరియా) ప్రత్యరి్థది కావడంతో సుజీత్ ఓటమి నమోదైంది. అయితే సుజీత్ నిరాశ చెందలేదు. ఆ పరాజయం తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందని, పరాజయాన్నే స్ఫూర్తిగా తీసుకుంటానంటూ నాటి పరాజయం ఫొటోను అతను తన ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నాడు. ఎప్పుడు దానిని చూసినా ఇంకా సాధించాలనే ప్రేరణ తనకు దక్కుతుందని సుజీత్ చెబుతాడు. ‘నేను ఓడినా సరే ఈ రెండు మ్యాచ్లకు నా కెరీర్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరాజయాలతో నేను ఎంతో నేర్చుకున్నాను’ అని సుజీత్ తెలిపాడు. సంపూర్ణ ఆధిపత్యం... ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఎంత వేగంగా తాను పైకి లేవగలనో సుజీత్ ఇటీవలే నిరూపించాడు. గత నెలలో క్రొయేషియాలో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో సుజీత్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్లో 5–6తో ఇరాన్ రెజ్లర్ రెహమాన్ మూసా అమూజాద్ఖలీలి చేతిలో పోరాడి ఓడిపోయాడు. సుజీత్పై నెగ్గిన రెహమాన్ మూసా చివరకు ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. రెహమాన్ ఫైనల్కు చేరుకోవడంతో సుజీత్కు ‘రెపిచాజ్’ రూపంలో కాంస్య పతకం సాధించే అవకాశం లభించింది. అయితే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో సుజీత్ 5–7తో రియల్ మార్షల్ రే వుడ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయి పతకానికి దూరమైపోయాడు. కానీ ఈ మెగా ఈవెంట్లో తాను చేసిన తప్పిదాలను సమీక్షించుకొని ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమయ్యాడు. సుజీత్ పకడ్బందీ సన్నాహాలు సత్ఫలితాలు ఇచ్చాయి. సెర్బియాలోని నోవిసాద్లో సోమవారం ముగిసిన ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్లో సుజీత్ విశ్వవిజేతగా అవతరించాడు. తన కెరీర్లో తొలిసారి ప్రపంచ టైటిల్ను సాధించాడు. స్వర్ణ పతకం సాధించే క్రమంలో సుజీత్... క్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు అండర్–23 వరల్డ్ చాంపియన్ బషీర్ మగోమెదోవ్ (రష్యా)పై 4–2తో... సెమీఫైనల్లో ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ యుటో నిషియుచి (జపాన్)పై 3–2తో గెలుపొందాడు. నిషియుచితో జరిగిన బౌట్లో సుజీత్ చివరి సెకను వరకు ఓటమి అంగీకరించకూడదనే తత్వం విజయాన్ని అందించింది. బౌట్ ముగియడానికి 7 సెకన్లు మాత్రమే ఉన్నదశలో సుజీత్ 1–2తో వెనుకబడి పరాజయం అంచుల్లో నిలిచాడు. కానీ ఈ 7 సెకన్లలో సుజీత్ తన బలాన్నంతా కూడదీసుకున్నాడు. నిషియుచిని కింద పడేసి రెండు పాయింట్లు సాధించాడు. చివరకు 3–2తో నెగ్గిన సుజీత్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. గత నెలలో జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం నెగ్గిన ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)తో సుజీత్ ఫైనల్ బౌట్కు సిద్ధమయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న జలోలోవ్పై సుజీత్ నమ్మశక్యంకాని రీతిలో 10–0తో బ్రహ్మండ విజయాన్ని సాధించాడు. సుజీత్ డిఫెన్స్ను ఎలా ఛేదించాలో తెలుసుకునేలోపే జలోలోవ్ పది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకున్నాడు. 2 పాయింట్లే కోల్పోయి... ఈ రెండు మెగా ఈవెంట్లకు ముందు సుజీత్ జులైలో బుడాపెస్ట్లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. ఇదేమీ సాధారణ విజయం కాదని అతను ఓడించిన ఆటగాళ్లను చూస్తే అర్థమవుతుంది. ఒలింపిక్ కాంస్యపతక విజేత ఇస్లామ్ దుదేవ్, రెండు సార్లు ఒలింపిక్స్ ఆడిన వాజ్గన్ తెవన్యమ్, నాలుగు సార్లు యూరోపియన్ మెడలిస్ట్ అలీ రహీమ్జాదేలపై సుజీత్ విజయం సాధించాడు. ఈ టోర్నీలో నాలుగు బౌట్లలో కలిపి 33 పాయింట్లు సాధించిన అతను 2 పాయింట్లు మాత్రమే కోల్పోయి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనతో భవిష్యత్లో సుజీత్ అద్భుతాలు చేయగలడని అంచనాలు మరింత పెరిగాయి. ఓవరాల్గా ఈ ఏడాది ఐదు టోర్నీల్లో పోటీపడ్డ సుజీత్ 3 పతకాలు సాధించాడు. 21 బౌట్లలో పోటీపడ్డ సుజీత్ 17లో గెలుపొంది, 4లో ఓడిపోయాడు. 169 పాయింట్లు స్కోరు చేసి, ప్రత్యర్థులకు 37 పాయింట్లు మాత్రమే సమర్పించుకున్నాడు. భిన్నమైన శైలితో విజయాలు... సాధారణంగా ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి ఆపై పైచేయి సాధించడం భారత రెజ్లర్ల శైలి. అంటే ఆరంభంలో వెనుకబడినా ఆ తర్వాత కోలుకొని పట్టు బిగిస్తారు. అయితే సుజీత్ శైలి దీనికి పూర్తిగా భిన్నం. సాధ్యమైనంత త్వరగా ఆటను ముగించడమే లక్ష్యంగా అతను బరిలోకి దిగుతాడు. సరిగ్గా చెప్పాలంటే టెక్నిక్పైనే అతను ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సుజీత్ను టెక్నికల్ రెజ్లర్గా అంతా పిలుస్తారు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్లో ఓడిపోవడం ఒక రకంగా తనకు మేలు చేసిందని అతను అన్నాడు. అత్యున్నత స్థాయిలో ఆడేటప్పుడు లోపాలు ఎలా సరి చేసుకోవాలో తనకు అర్థమైందని, మ్యాట్ ట్రైనింగ్ తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సుజీత్ చెప్పాడు. ఈ ఏడాది ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో పతకం చేజారినా... తన అసలు లక్ష్యం మాత్రం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడమేనని తెలిపాడు.ఇంజినీరింగ్ను కాదని రెజ్లింగ్కు... ప్రస్తుతం భారత పురుషుల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. నిజానికి అతను ఆటలో చాలా ఆలస్యంగా వచ్చాడు. గత ఐదేళ్ల నుంచే పూర్తి స్థాయిలో రెజ్లింగ్పై దృష్టి పెట్టాడు. హరియాణాలోని భివాని సమీప గ్రామం ఇమ్లోటా అతని స్వస్థలం. అతని తండ్రి దయానంద్ రెజ్లింగ్లో మాజీ చాంపియన్ కావడంతోపాటు 2005 వరల్డ్ చాంపియన్షిప్లో గ్రీకో రోమన్ విభాగంలో పోటీ పడ్డాడు. అయితే మొదటి నుంచీ సుజీత్ చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. ఇంటర్మీడియట్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించాడు. దాంతో తండ్రి కూడా చదువుపైనే దృష్టి పెట్టమని చెప్పాడు. కానీ ఈ కుర్రాడు నేను రెండూ చేయగలనంటూ అటు చదువు, ఇటు రెజ్లింగ్ కొనసాగించే ప్రయత్నం చేశాడు. సహజంగానే రెండింటిపై దృష్టి పెట్టలేకపోయాడు. చదువులో మంచి మార్కులు రాగా ... రెజ్లింగ్ అండర్–17, అండర్–19 స్థాయిల్లోనూ ఎలాంటి ఫలితాలు రాలేదు. ‘నేను ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నాను. జేఈఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ మాక్ టెస్టులకు కూడా హాజరయ్యాను. అప్పుడు నాన్న స్పష్టంగా చెప్పారు. రెండూ సాధ్యం కాదని, ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని అన్నారు. చాలా ఆలోచించిన తర్వాత రెజ్లింగ్ వైపు మళ్లాను. నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం. సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా ఆట చూస్తూ పెరిగాను దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయంగా భావించా’ అని సుజీత్ చెప్పాడు. దాంతో మరింత మెరుగైన శిక్షణ కోసం సోనీపథ్ చేరిన అతను కుల్దీప్ సింగ్ కోచింగ్లో రాటుదేలాడు. 2021లో ఇక్కడికి వచ్చిన సుజీత్ నాలుగేళ్లలో భారత అత్యుత్తమ రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 2022లో తొలిసారి సీనియర్ నేషనల్స్లో పాల్గొన్న అనంతరం అతను వేగంగా దూసుకుపోయాడు. గత ఏడాది అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో 70 కేజీల్లో పోటీపడి కాంస్య పతకాన్ని నెగ్గిన సుజీత్... ఆసియా అండర్–23 చాంపియన్షిప్లో రెండుసార్లు విజేతగా నిలిచాడు. -
సుజీత్కు స్వర్ణ పతకం
నోవిసాద్ (సెర్బియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం రాత్రి జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 22 ఏళ్ల సుజీత్ 10–0 పాయింట్ల తేడాతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నిర్ణీత ఆరు నిమిషాల్లో... 4 నిమిషాల 53 సెకన్లు ముగిసిన దశలో సుజీత్ తన ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడు. దాంతో నిబంధనల ప్రకారం రిఫరీ బౌట్ను నిలిపివేసి సుజీత్ను విజేతగా ప్రకటించారు. అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ చరిత్రలో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మూడో భారతీయ రెజ్లర్గా సుజీత్ గుర్తింపు పొందాడు. 2022లో అమన్ సెహ్రావత్ (57 కేజీలు), 2024లో చిరాగ్ చికారా (57 కేజీలు) భారత్కు పసిడి పతకాలు అందించారు. తాజా ప్రదర్శనతో సుజీత్ తన కెరీర్లో తొలిసారి ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. సుజీత్ 2022, 2025లలో ఆసియా అండర్–23 చాంపియన్షిప్లో, 2022లో ఆసియా అండర్–20 చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. -
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'ఓజీ'. పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే గ్లింప్స్, తొలి పాటతో హై తీసుకొచ్చారు గానీ తర్వాత వచ్చిన సాంగ్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్)రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేస్తున్నారు. అంతెందుకు పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు'కి కూడా రిలీజ్ ముందురోజు రాత్రి షోలు వేశారు. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటంతో మూవీ ఫలితం బెడిసికొట్టింది. దీంతో పోలిస్తే 'ఓజీ'పై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండొచ్చని కొన్నిరోజుల క్రితం టాక్ వినిపించింది. కానీ ఇప్పుడవి లేవని అంటున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువజామున 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్చొచని టాక్. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే గ్యాంగ్స్టర్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాత. (ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!) -
'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్
రీసెంట్గా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడింది. దీంతో అభిమానులు ఈ మూవీ గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. ఈ సెప్టెంబరు చివర్లో రిలీజయ్యే 'ఓజీ' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి 'ఫైర్ స్ట్రోమ్' అంటూ సాగే తొలి లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?)పాట గురించి రిలీజ్ ముందు వరకు హైప్ ఎక్కువగానే ఇచ్చారు గానీ తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల్లానే బాగుంది. కాకపోతే మరీ సూపర్గా అయితే అనిపించలేదు. అదే టైంలో లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికైతే అభిమానులకు నచ్చినట్లే కనిపిస్తోంది. రానురాను పాట అలవాటు అవుతుందేమో చూడాలి.'ఓజీ' సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. సుజీత్ దర్శకుడు కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. సెప్టెంబరు 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అదే రోజున బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ కూడా ఉంది. మరి ఇద్దరు పోటీకి దిగుతారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?(చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?) -
సస్పెన్స్ విడిపోయింది.. ఒకేసారి రెండు సినిమాలపై క్లారిటీ
ఇప్పుడున్న హీరోల్లో వేగంగా సినిమాలు చేసేది ఎవరా అని చూస్తే చాలామందికి గుర్తొచ్చే పేరు నాని. ఓ మూవీ సెట్స్పై మరొకటి అనౌన్స్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం డబుల్ ధమాకా ఇచ్చేశాడు. గత కొన్నాళ్ల నుంచి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటిపై అధికారికంగా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమాలు? ఏంటి సంగతి? గతేడాది డిసెంబరులో 'హాయ్ నాన్న' అనే సెంటిమెంట్ మూవీతో హిట్ కొట్టిన హీరో నాని.. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 29న థియేటర్లలోకి ఇది రానుంది. దీని షూటింగ్ జోరుగా నడుస్తోంది. మరోవైపు నాని చేయబోయే కొత్త చిత్రాలపై కూడా ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) 'బలగం' దర్శకుడు వేణు.. తన రెండో మూవీతో నానితో చేయబోతున్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలతో పాటు వేణు కూడా నానిని కలిసి విష్ చేయడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసే ఈ సినిమా ప్రకటన త్వరలో వస్తుంది. మరోవైపు 'ఓజీ' తీస్తున్న సుజీత్.. నానితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. క్రూరమైన వ్యక్తి.. సౌమ్యుడిగా మారడంతో అతడి ప్రపంచం తలకిందులైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. సో ఇలా తన పుట్టినరోజున రెండు సినిమాల అప్డేట్స్ నాని నుంచి వచ్చేశాయ్. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్.. పోస్టర్ రిలీజ్
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటింస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు. ఇటీవలె ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుందంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటినే నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుందంటూ మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ నాని సరసన గ్యాంగ్ లీడర్, శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కల్యాన్తో నటించే ఛాన్స్ కొట్టేసింది. 𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF — DVV Entertainment (@DVVMovies) April 19, 2023 -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
అమెజాన్ ప్రైమ్లో సాహో మూవీ!
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా అదేస్థాయి అంచనాలతో తెరకెక్కిన భారీ సినిమా సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో మాత్రం అదిరిపోయే కలెక్షన్లతో ‘సాహో’ అనిపించింది. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సాహో సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. రూ.42 కోట్ల భారీ ధరతో ‘సాహో’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్లో ఉండనుందని సమాచారం. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సాహో సినిమాను తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్లు సృష్టించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘సాహో’ రిలీజ్ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్
బాహుబలి తరువాత అదే స్థాయి అంచనాలతో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా సాహో. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది. అయితే సినిమా రిలీజ్కు ముందు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్ రిలీజ్ తరువాత మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. సాహో రిలీజ్ అయిన రెండు వారాల తరువాత ప్రభాస్ మీడియా ముందుకు వచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ సినిమాల పట్ల పక్షపాత ధోరణిపై ప్రభాస్ స్పందించాడు. ఇతర భాషల సినిమాలను బాలీవుడ్ జనాలు పెద్దగా ఆదరించరన్నా విషయాన్ని అంగీకరిస్తూనే, ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లో ఉన్నాయన్నాడు. ‘ప్రతి భాషలో అక్కడి ప్రాంతీయ నటులు ఉంటారు. వారు 20, 30 సంవత్సరాలుగా వారికి తెలుసు. అందుకే కొత్తగా వచ్చిన వారిని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కానీ సినిమా బాగుంటే ఇవ్వని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. లేదంటే కొత్త నటుడికి, దర్శకుడికి అసలు అవకాశమే రాదు. బాహుబలి గతంలో ఉన్న ఎన్నో హద్దులను చెరిపేసి జాతీయ స్థాయి సినిమాలకు అవకాశం కల్పించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి’ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన సాహో ఇప్పటికే 425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డ్ల దిశగా దూసుకుపోతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’
టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. యువీ క్రియేషన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిని చిత్ర బృందానికి మరింత జోష్ కలిగించే వార్త లభించింది. తాజాగా సాహోకు ట్విటర్ ఎమోజీ వచ్చింది. ఇందులో వింతేముంది అనుకోకండి. ట్విటర్ ఎమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో’నిలిచింది. టాలీవుడ్ను ఏలిన అగ్రహీరోల సినిమాలకు సాధ్యంకానీ ఘనతను ప్రభాస్ సాహో సాధించింది. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్, బాలీవుడ్లో జీరో, సుల్తాన్ సినిమాలకు ట్విటర్ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: ‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా? -
సాహో సర్ప్రైజ్ వచ్చేసింది!
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్తో ప్రభాస్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ప్రైజ్ ఇస్తున్నాం అంటూ ప్రభాస్ సోమవారం ఓ వీడియో మేసేజ్ రిలీజ్ చేశాడు. అప్పటి నుంచి అభిమానులు ప్రభాస్ ఇచ్చే సర్ప్రైజ్ ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ సర్ప్రైజ్ను రివీల్ చేశాడు. సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్లుక్ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్తో సీరియస్ లుక్లో ఉన్న ప్రభాస్ పోస్టర్ క్షణాల్లో వైరల్గా మారింది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. View this post on Instagram Here it is darlings, for all of you... The new official poster of my next film Saaho. See you in theatres on 15th August! 😎 #15AugWithSaaho @officialsaahomovie @sujeethsign @shraddhakapoor @uvcreationsofficial #BhushanKumar @tseries.official A post shared by Prabhas (@actorprabhas) on May 20, 2019 at 11:33pm PDT -
రికార్డుల వేట మొదలైంది... సాహో
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్లో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రికార్డుల వేట మొదలు పెట్టింది. బాహుబలి సినిమాతో ఉత్తరిదిలో ప్రభాస్కు భారీ మార్కెట్ ఏర్పడింది. దీంతో సాహో సినిమా హక్కుల కోసం బాలీవుడ్ లో గట్టి పోటి నెలకొంది. అందుకు తగ్గట్టుగా సాహో హిందీ శాటిలైట్ హక్కులు 120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలో నటిస్తుండటంతో పాటు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్లు స్వరాలందించటం కూడా బాలీవుడ్ మార్కెట్కు కలిసొస్తుందని భావిస్తున్నారు. -
ప్రభాస్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది
గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి. రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్లో సినిమాను నిర్మించనుంది.


