Suprabhatha seva
-
'జరగని ఘటనను మీడియాకు అందించటం దురదృష్టకరం'
తిరుపతి : కలియుగ దైవం శ్రీనివాసుడికి సుప్రభాత సేవ ఆలస్యమైందంటూ వచ్చిన వార్తలపై టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు. బంగారు వాకిలి తాళం చెవి విరిగిపోవటంతో వాటిని వాటిని పగలగొట్టి ఉదయం 2.30 గంటలకు తెరిచామని ఆయన తెలిపారు. సుప్రభాత సేవను యథావిధిగానే తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించామని, ఎక్కడా ఆలస్యం జరగలేదని జేఈవో తెలిపారు. జరగని ఘటనను మీడియా సమాచారం అందించటం దురదృష్టకరమన్నారు. కాగా సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు అర్చకులపైనా టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
టీటీడీ సిబ్బందిపై ఈవో మండిపాటు
తిరుమల: టీటీడీ సిబ్బంది తీరుపై టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడ్డారు. సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు, అర్చకులపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన వచ్చిన సమయంలో బుధవారం వేకువజామన ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. కాగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.