Tapping
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ నేతల ధర్నా
-
ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు.. అది ‘కారు’చిచ్చే!
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అరెస్టైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు దీనితోపాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిపోర్టులోని వివరాల మేరకు.. ‘‘రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్రావును 2016లో ఎస్ఐబీ చీఫ్గా నియమించింది. తమ కులంతోపాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేసున్నారు. వివిధ విభాగాలు, జిల్లాల్లో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి డిప్యూటేషన్పై తెచ్చుకున్నారు. అందులో నల్లగొండ నుంచి ప్రణీత్రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్రావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్న ఉన్నారు. ప్రభాకర్రావు సూచనల మేరకే 2017లో రాధాకిషన్రావును బీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించింది. దీని వెనుక రాజకీయ, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్రావు, భుజంగరావు తరచుగా కలు స్తూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారు. గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో వెస్ట్జోన్కు 2021 వరకు ఇన్స్పెక్టర్గా పనిచేసిన గట్టుమల్లును రాధాకిషన్రావు సూచనల మేరకు ప్రభాకర్రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే కుట్రలను అమలు చేయడానికి గట్టుమల్లును వినియోగించుకున్నారు. ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ల్లోని మానవ వనరులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి.. వీరి అక్రమాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా ప్రభాకర్రావు బృందం అనేక జాగ్రత్తలు తీసుకుంది. వారంతా కేవలం వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారానే సంప్రదింపులు జరిపేవారు. ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు తన నమ్మినబంటు ప్రణీత్రావును స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) నిర్వహణ కోసమే తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి నేతలతోపాటు వారి అనుచరులనూ టార్గెట్ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశమున్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లో చేరేలా చేయడం వంటివే వారి టార్గెట్. నగదు రవాణాను గుర్తించి.. ప్రభాకర్రావు, ఆయన బృందం ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణాపై దృష్టి పెట్టింది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున భవ్య సిమెంట్ కంపెనీకి చెందిన ఆనంద్ ప్రసాద్ పోటీచేశారు. ఆ సమయంలో ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు రంగంలోకి దిగి.. ఆనంద్ ప్రసాద్ సంబందీకుల నగదు రవాణాపై నిఘాపెట్టారు. ఆ వివరాలను టాస్క్ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్రావుకు అందించారు. ఈయన ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రాంగోపాల్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్యారడైజ్ వద్ద రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్రావు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు సంబందీకులపై నిఘా పెట్టి వివరాలను రాధాకిషన్రావుకు చేరవేశారు. ఫలితంగానే సిద్దిపేటలో చిట్ఫండ్ కంపెనీ నిర్వహించే రఘునందన్రావు బంధువు నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. 2022 అక్టోబర్ రెండోవారంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో ప్రభాకర్రావు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధీకులపై ప్రణీత్రావు సాంకేతిక నిఘా ఉంచారు. నగదు రవాణా అంశాన్ని గుర్తించి రాధాకిషన్రావుకు తెలిపారు. ఈయన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేసి.. కోమటిరెడ్డి అనుచరులైన జి.సాయికుమార్రెడ్డి, ఎం.మహేందర్, ఎ.అనూ‹Ùరెడ్డి, వి.భరత్ల నుంచి రూ.3.5 కోట్లు స్వా«దీనం చేసుకుంది’’ అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. రాధాకిషన్రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ప్రతిపక్షాలతోపాటు విమర్శించే వారిపైనా.. ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం, అడ్డుకోవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే తమ లక్ష్యమంటూ ప్రభాకర్రావు తన బృందమైన రాధాకిషన్రావు, ప్రణీత్రావు, భుజంగరావు, వేణుగోపాల్రావు, తిరుపతన్నలకు స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబీకులు, సంబం«దీకులు, మద్దతిచ్చే వ్యాపారులతోపాటు బీఆర్ఎస్ను విమర్శించే వారిపైనా ప్రభాకర్రావు బృందం నిఘా ఉంచింది. బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు.. ఆ పార్టీ నాయకులు కొందరిపైనా నిఘా వేశారు. రాధాకిషన్రావు 2020 ఆగస్టులోనే పదవీ విరమణ చేసినా.. కుల ప్రాతిపదికన ఆయనకు ఓఎస్డీగా రెండుసార్లు అవకాశమిచ్చారు. హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే ఇలా చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ హెడ్క్వార్టర్ ఎక్కడ అంటే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్లోని ఎస్ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్లో ఎస్ఐబీ పోలీసులు కొందరు వార్ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్కు పాల్పడ్డారు. వరంగల్లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. వార్ రూం ఎంతకాలం నడిచిందో? గత డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్ రూంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్ రికార్డ్ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్ చేసిన కాల్స్లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం. సిరిసిల్లకే పరిమితం కాలేదా? వార్ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్ పరికరాలను ఓ వ్యాన్లో పెట్టుకొని, టార్గెట్ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్ కూడా వినే వీలుంటుంది. 2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్ 2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్ కట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక వ్యక్తుల పేర్లు
-
Phone tapping case: బెదిరింపుల దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. అనుకోకుండా దొరికిన అవకాశంతో.. ప్రభాకర్రావుతో పాటు హైదరాబాద్ టాస్్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్రావు తనవారైన మరింత మందిని ఎస్ఐబీలోకి తీసుకువచ్చారు. ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు.. ప్రభాకర్రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్లోని వార్రూమ్లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది. ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్రావు.. విషయాన్ని ప్రభాకర్రావుతో పాటు రాధాకిషన్రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్లకు ట్యాపింగ్లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం. ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్ ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా?
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ‘ప్రణీత్రావు అండ్ కో’ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు... ఈ నెల తొలి వారం నుంచి పోలీసులు లీకుల రూపంలో చెబు తున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్ కేసు, ఆయన రిమాండ్ రిపోర్టులో ఎక్కడా ట్యాపింగ్ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు టార్గెట్ వేరే ఉందా? అనే అనుమానాలు కలు గుతున్నా యి. ప్రణీత్ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్క ట్లేదు. కేసులో ఒక్కటి మినహా అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఏపీలో నమోదైన ‘స్కిల్డెవల ప్మెంట్’ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409సెక్షన్ ఈ కేసులోనూ ఉండటంతో ప్రణీత్ జ్యుడీషియల్ రిమాండ్కు వెళ్లాడని నిపుణులు చెప్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అస్పష్టంగా.. ఎస్ఐబీలో అంతర్భాగమైన స్పెషల్ ఆపరే షన్స్ టార్గెట్ (ఎస్ఓటీ) బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్.. ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్ఐబీ అంతర్గత విచారణలో ఆయన చేసిన అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ విభాగాధిపతి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణీత్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొంత వరకు ట్యాపింగ్కు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఎస్ఓ టీకి ఉద్దేశించిన లీజ్డ్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రణీత్ దుర్వినియోగం చేశారని అందులో ఆరోపించారు. అందులోనే 42 హార్డ్డిస్క్లు మార్చేయడం, ధ్వంసం చేయడం అంశాన్నీ ప్రస్తావించారు. ఈ సస్పెన్షన్ జరిగిన వారం తర్వాత ఎస్ఐబీ ఏఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో ప్రణీత్, ఇతరులపై కేసు నమోదైంది. ఆ రెంటిలో కనిపించని ప్రస్తావన... ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు మూడు చట్టాల్లోని 9 సెక్షన్ల కింద అభియోగాలు చేశారు. ఐపీసీ, ఐటీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లు వాడారు. ఈ నెల 13న అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్లో ఐపీసీలోని 120బీ (కుట్ర) ఉండగా... రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్ కనిపించలేదు. సెక్షన్ 34 చేర్చినప్పుడు 120బీ ఉండాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్టులో తొలగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. అయితే ఓ నిందితుడిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయాలంటే కచ్చితంగా టెలిగ్రాఫిక్ యాక్ట్ను జోడించాలి. అయితే ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ రెండింటిలోనూ ఎక్కడా ప్రత్యక్షంగా ట్యాపింగ్ ప్రస్తావన, ఈ యాక్ట్ కనిపించకపోవడం గమనార్హం. ఆ అధికారులూ బాధ్యతులే అవుతారు... ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ కేసులో దీన్ని ప్రస్తావించకపోవడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేయడం చాలా ఖరీదుతో కూడిన అంశం. అధికారికంగా ట్యాప్ చేయాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ సహకారం అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం వారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇది డీఎస్పీ ప్రణీత్ వద్ద నుంచే వచ్చి... ఎస్పీ సహా కొందరు ఉన్నతాధికారులు ఫార్వర్డ్ చేయాలి. ఈ లేఖలు సర్వీస్ ప్రొవైడర్ వద్ద నిర్ణీత కాలం వరకు భద్రంగా ఉండాలి. ట్యాపింగ్ కోణంలో దర్యాప్తు చేస్తే ఆధారాలు సేకరించడం, తదుపరి చర్యలు తీసుకోవడం తేలికే అయినప్పటికీ... అప్పట్లో లేఖలు ఫార్వర్డ్ చేసి, ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అసలు లేఖలే లేకుండా లేదా ప్రాపర్ చానల్లో రాకుండా ట్యాపింగ్కు సహకరిస్తే సర్వీస్ ప్రొవైడర్ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారికంగా ఎక్కడా ట్యాపింగ్ ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని టార్గెట్ వేరేది ఏదో ఉంటుందని, అది తెలియాలంటే మరికొన్నాళ్లు పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
ట్యాపింగ్లో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసుల అదుపులో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. కాగా సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్తున్న దర్యాప్తు అధికారులు ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో నిఘా విభాగానికి చెందిన అధికారులు పాల్గొంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసిన ప్రణీత్రావును హైదరాబాద్ తరలించిన అధికారులు ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్ ఏర్పాటు చేసుకున్న స్పెషల్ టీమ్లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్తో పాటు 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిసింది. వీరిని సైతం దర్యాప్తు అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తూ వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు ప్రణీత్ ఫోన్ ప్రణీత్ నుంచి సీజ్ చేసిన ఫోన్ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపారు. అక్క డి నిపుణులు ఆ ఫోన్ నుంచి వెళ్లిన ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాలను రిట్రీవ్ చేయగలిగారు. వాటి ఆధారంగానే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్ద రు ఉన్నతాధికారులను గుర్తించగలిగారని సమాచారం. ఫలా నా నంబర్ లేదా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటూ వీరి నుంచి ప్రణీత్కు సందేశాలు రావడం, ఆ ట్యాపింగ్కు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రణీత్ వీరికి పంపినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు అప్పటికే పదవీ విరమణ పొంది, ఎక్స్టెన్షన్పై కొనసాగిన అధి కారి కాగా.. మరొకరు ఇప్పటికీ సర్వీసులో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరికొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆ అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో 2 లక్షలసంభాషణలు రికార్డు ప్రణీత్రావు పోలీసు శాఖ జారీ చేసిన అధికారిక ఫోన్ తో పాటు మరికొన్ని ప్రైవే ట్ నంబర్లను విని యోగించినట్లు గుర్తించారు. ఈ ఫోన్ నంబర్లను సేకరించిన అధికారులు గడిచిన కొన్నేళ్లల్లో వాటికి వచి్చన, వెళ్లిన కాల్స్, ఎస్ఎమ్ఎస్ల వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రణీత్రావు 2018 నుంచి ఎస్ఐబీలో ఆ విభాగం చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్రావు కనుసన్నల్లో పని చేశాడు. ఐదేళ్లలో అతడు వివిధ ఫోన్ నంబర్లకు సంబంధించిన దాదాపు 2 లక్షల సంభాషణల్ని ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. గతే డాది డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసిన హార్డ్డిసు్కల్లో ఇవి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని రికార్డులను అతను కార్యాలయం నుంచి బ యటకు కూడా తరలించినట్లు భావిస్తున్న అధికారులు వాటి కోసం ఆరా తీస్తున్నారు. ప్రణీత్రావు కేవలం ప్రతిపక్షాలు, కొందరు ప్రముఖుల ఫోన్లు మాత్రమే కాకుండా బీఆర్ఎస్కు చెందిన కొందరివి, పోలీసు అత్యున్నత అధికారులవీ ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. వీళ్లు ఎవరు? ఎవరు చెప్పడంతో చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా నిధుల తరలింపు! గత ఎన్నికలతో పాటు ఇటీ వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రణీత్రావు ఓ పార్టీ నిధుల తరలింపులోనూ కీలక పాత్ర పోషించినట్లు పోలీసు లు అనుమానిస్తున్నారు. తన అధికారిక వాహనంతో పాటు ఎస్ఐబీ, గ్రేహౌండ్స్కు సంబంధించిన వాహనాలను దీనికోసం వినియోగించాడని తెలుస్తోంది. నగదు, బంగారం, వెండి ఆభరణా లతో పాటు ఇతర వస్తువులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేర్చడంలో ప్రణీత్ కీలక పాత్రధారని పోలీసులు చెప్తున్నారు. పోలీస్ కస్టడీ కోసంనేడు పిటిషన్ ప్రణీత్రావును బుధవారం రాత్రి పోలీసులు కొంపల్లిలోని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఆయన ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ప్రణీత్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇలావుండగా అయితే తాను మరికొందరితో కలిసి ఈ నేరం చేసినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించాడని వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.విజయ్కుమార్ వెల్లడించారు. ఈ కేసును జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్ ఫోన్. నా ఫోన్ లో ప్రతీకాల్ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్ రికార్డయింది’’ అని చెప్పారు. ‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్ చేసిన కాల్ కాదు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్ను ఫోరెన్సిక్కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నేను ఎవరో సీఎం జగన్కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్! -
ప్రతిపక్ష నేతల కాల్స్ ట్యాపింగ్
-
వైఎస్సార్ సీపీ నేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, లోకేశ్తో పాటు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) వ్యవస్థతో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యనేతలపై నిఘా పెట్టిన ముఖ్యమంత్రి.. తాజాగా వారి వాట్సాప్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు. వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తెప్పించారు. ఫోన్ ట్యాపింగ్లు, ప్రతిపక్ష అభ్యర్థుల కదలికలపై నిఘా ద్వారా సమాచారం సేకరించి.. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్యాపింగ్ ఈ విషయాన్ని అధికార వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ జాబితాను దొంగలించడమే కాకుండా ప్రభుత్వ సాధికార సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చి, దానిద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్కు ఇస్తూ ప్రభుత్వం, ఐటీ గ్రిడ్స్ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ఆటోనగర్లో ఐటీ కంపెనీలున్న భవనంలోని ఒక అంతస్తులో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు.. గతంలో ఈవీఎంలు టాంపరింగ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికిపోయిన చంద్రబాబు సన్నిహితుడు, బినామీ అయిన వేమూరి హరిప్రసాద్, పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్లు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాల సేకరణతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడలను సాగిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్లో పనిచేసే ఉద్యోగులను విజయవాడకు తరలించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఆర్టీజీఎస్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్యనేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్కు సైతం వారు పాల్పడుతున్నారు. యూరప్ నుంచి అధునాతన పరికరాలు ఇందుకోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తీసుకువచ్చారని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్లడించారు. ఒకసారి వాయిస్ రికార్డు చేస్తే ఫోను మార్చి మాట్లాడినా ఆ వాయిస్ను రికార్డు చేసే టెక్నాలజీ ఆ పరికరాలకు ఉన్నట్టు సమాచారం. అలాగే సెల్ ఫోన్ నంబర్ తెలుసుకోవడం ద్వారా, అలాగే సెల్ఫోన్ తయారీ నంబర్ ద్వారా ట్యాపింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ వ్యవహారం అంతా హరిప్రసాద్, అశోక్ కనుసన్నల్లోనే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజులుగా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల సమాచారం సేకరణ పనిలో నిమగ్నమయ్యారని, వారి ఫోన్ నంబర్లతో పాటు వారి బ్యాంకు అకౌంట్ల కోసం అన్వేషిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పార్టీ సేవా మిత్ర యాప్కు ఇచ్చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల బ్యాంకు ఖాతాల వివరాలను, వారి ఫోన్ నంబర్లను సేకరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సచివాలయంలోను, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్లతో ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. అందులో భాగంగానే డబ్బులున్న వ్యక్తులకే వైఎస్సార్సీపీ అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. పోలింగ్ సమయం దగ్గరపడే సరికి ఈ ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది వారి ఉద్దేశమని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారుల కోడ్ ఉల్లంఘనలపై చర్యలేవీ.. ఇలావుండగా ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బరితెగింపుతో అధికార దుర్వినియోగం, ఇంత అధికార పార్టీ పిచ్చితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను గతంలో ఎన్నడూ చూడలేదని పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర పార్టీలు పోలీసు యంత్రాంగం దురాగతాలపై ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి పంపి వాటిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అలాంటివేమీ జరగలేదని నివేదిక పంపితే ఆ ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారు తప్ప జిల్లా అధికార యంత్రాంగం నివేదికలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్లుగా తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని చంద్రబాబు నియమించారు. ఇప్పుడు వారిద్దరూ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అలాగే సచివాలయ స్థాయిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తూ యధేచ్చగా నియమావళిని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. గతంలో టీవీలు, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాల ఆధారంగా కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
వైన్ షాపు యజమాని దాష్టీకం
మిర్యాలగూడ: మద్యం కొనుగోలు చేసిన అనంతరం తనకు రావాల్సిన డబ్బులు అడిగిన వ్యక్తిపై వైన్ షాపు యజమాని మద్యం బాటిల్తో దాడి చేయడంతో.. బాధితుడి తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు వైన్ షాప్ యజమాని తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. తిమ్మాపురంకు చెందిన రమావత్ మంతు(35) మద్యం కొనుగోలు చేయడానికి బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్ షాపుకు వెళ్లాడు. రూ. 200 ఇచ్చి ఒక బీరు కొనుగోలు చేశాడు. అనంతరం తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన వైన్స్ యజమాని అదే బీరు బాటిల్తో తలపై బలంగా కొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని..
ఆదిలాబాద్: ఓ యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని ఆమె బంధువులు పోలీస్స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా రామక్రిష్ణాపురం పట్ణణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఓ బ్యూటీపార్లర్లోని వస్తువులు దొంగిలించిందనే నెపంతో లావణ్య (23) అనే యువతిని ఏఎస్సై రామయ్య విచారణ నిమిత్తం స్టేషన్కు పిలిపించారు. విచారణ చేస్తున్న సమయంలో ఏఎస్సై తనను కర్రతో కొట్టారని యువతి చెప్పుతుంది. దీంతో ఆమె బంధువులతో కలిసి స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. -
'వారిద్దరూ దొరికిన దొంగలే '
వరంగల్: ' ఓటుకు కోట్లు' లో చంద్రబాబు, 'ట్యాపింగ్' లో కేసీఆర్..ఇద్దరూ దొరికిన దొంగలే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కేంద్రం మందలించడంతో ఇద్దరూ మాట్లాడటంలేదన్నారు. త్వరలో ప్రజలే వీరికి తగిన బుద్ధి చేబుతారన్నారు. ఆయన శనివారం వరంగల్ లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా అవసరమైతే కార్మికులకు మద్దతుగా 48 గంటల దీక్షను చేపడతానని మందకృష్ణ అన్నారు. -
‘సిట్’ కు స్థానబలిమికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణపై కౌంటర్ ఎటాక్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజయవాడ కేంద్రంగా పని చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సూచనల మేరకు సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 12 మంది టెలికం సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని... భవానీపురం పోలీసుస్టేషన్లో హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణకు చెందిన ప్రముఖులు, అధికారుల్ని టార్గెట్గా చేసుకుని జరుగుతున్న ఈ దర్యాప్తును ఆ భూభాగంలో కంటే స్థానబలిమిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ట్యాపింగ్ పై ఆధారాల కోసమే పాట్లు! తెలంగాణలో జరిగిన నేరానికి సంబంధించిన ఆరోపణలపై ఏపీలోని వివిధ పోలీసుస్టేషన్లలో నమోదై, సిట్కు బదిలీ అయిన కేసుల్లో పస లేదనే అభిప్రాయాన్ని ఇప్పటికే న్యాయ నిపుణులు ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. అయినప్పటికీ ‘నోటీసులకు నోటీసులు’ అనే ధోరణిలో ముందుకు వెళ్తున్న ప్రభుత్వ పెద్దలు మాత్రం దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సిట్కు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ ఢిల్లీ వరకు వె ళ్లినా ఆశించిన స్పందన రాలేదు. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రభుత్వం తొలుత ‘ట్యాపింగ్ను నిరూపించడం’ పైనే దృష్టి పెట్టాల్సిందిగా సిట్కు స్పష్టం చేశారు. మొత్తం 147 నంబర్ల ట్యాపింగ్పై తమకు అనుమానాలు ఉన్నాయని, పూర్తి వివరాలు అందించాలని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించిన సిట్ సోమవారం విజయవాడలో విచారించనుంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) బదిలీ అయిన ‘మత్తయ్య కేసు’ దర్యాప్తును డీజీపీ జాస్తి వెంకట రాముడు ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటికి పూర్తయితే సీఐడీ పోలీసులూ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. -
ట్యాపింగ్పై కేంద్రానికి ఏపీ ఫిర్యాదు?
హోం శాఖ కార్యదర్శితో సీఎస్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్తో భేటీ అయ్యారు. టీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సెక్షన్ -8 ను అమలు చేయాలని, గవర్నర్కు అధికారాలివ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజాప్రతినిధుల స్వేచ్ఛకు భంగం కలిగేలా టీ సర్కా ర్ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి గోయల్ హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్య ఉన్నట్టు ఫిర్యాదులు, నివేదికలేవీ? సెక్షన్-8ను ఎందుకు అమలు చేయాలి? అని ప్రశ్నించినట్టు సమాచారం. గవర్నర్కు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలపైనా సీఎస్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు టెలికం కమిషన్ చైర్మన్, కార్యదర్శి రాకేష్ గర్గ్లతో భేటీ అయిన సీఎస్.. ట్యాపింగ్పై ఆధారాల్ని అందజేసినట్టు సమాచారం. విలేకరులపై సుజనా అసహనం ‘వాట్ ఏసీబీ..? తెలంగాణ, ఆంధ్రాలో ఏం సమస్య ఉంది? నాకు తెలియదు’ అంటూ కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో గురువారం ఉదయం ‘వాతావరణ మార్పు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు సందర్భంగా ఓటుకు కోట్లు కేసు, ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి సుజనా చౌదరిపై విలేకరులు ప్రశ్నించగా జవాబు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశారు.