TB Day
-
World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు -
World TB Day: 50 వేల గ్రామాల్లో జీరో కేసులు
నేడు ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు(సోమవారం) టీబీ నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక గౌరవం అందించనుంది. భారతదేశ 100 రోజుల టీబీ నిర్మూలన ప్రచారం విజయవంతం అయిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ టీబీ వ్యతిరేక పోరాటాన్ని 300 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం(World Tuberculosis Day) సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలోని 50 వేల గ్రామాలు టీబీ నుండి విముక్తి పొందినందున ఆయా గ్రామాలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. గత రెండేళ్లలో ఈ గ్రామాల్లో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాలేదు. టీబీ ఇన్ఫెక్షన్కు సంబంధించి మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, మేఘాలయలు అగ్రస్థానంలో ఉన్నాయి. టీబీ చికిత్సలో ఔషధాలతో పాటు పోషకాహారం పాత్ర ఎంతో ముఖ్యమైనది. టీబీ బాధితులకు పోషకాహారం అందించడంపై మేఘాలయ ప్రత్యేక చొరవ తీసుకుంది. బాధితులను ఆరోగ్య కేంద్రాలకు తీసుకు వచ్చేందుకు గ్రామీణ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కూడా టీబీ నిర్మూలన విషయంలో విశేష కృషి చేసింది.క్షయ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బాక్టీరియా(Tuberculosis bacteria) వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా అరచినప్పుడు కూడా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. 2024లో దేశంలో 26.19 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 94 శాతం. భారతదేశం 2025 నాటికి టీబీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ వ్యాధి నిర్మూలనకు విరివిగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా 50 వేలకు పైగా గ్రామాలు టీబీ రహితంగా మారాయి. ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట -
జిల్లా వ్యాప్తంగా 4,292 టీబీ కేసులు
ఒంగోలు సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా 4,292 టీబీ కేసులను గత సంవత్సరం ఆఖరు వరకూ గుర్తించినట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ డి.సురేష్కుమార్ తెలిపారు. స్థానిక జిల్లా క్షయ నివారణ కార్యాలయంలోని టీటీసీఓ చాంబర్లో శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 24,042 మంది క్షయ అనుమాతులను పరీక్షించినట్లు తెలిపారు. వీరిలో 4,292 కేసులు పాజిటివ్గా వచ్చాయన్నారు. 41,233 కేసులను చికిత్స ద్వారా నయం చేసినట్లు తెలిపారు. ఎండీఆర్టీబీ అనుమానితులను పరీక్షించగా 90 మందికి ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో 77 మందికి చికిత్స ద్వారా టీబీని నయం చేసినట్లు తెలిపారు. టీబీ–హెచ్ఐవీతో బాధపడుతున్న 533 మందికి మందులు అందిస్తున్నట్లు తెలిపారు. టీబీ మరణాలను నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో టీబీ వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించి, ప్రతి గ్రామం, మండలంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. లక్ష మంది ప్రజలలో 217 మందికి క్షయ వ్యాధి వస్తుంటే ఈ సంఖ్యను గణనీయంగా 171కి తగ్గించగలిగామన్నారు. క్షయ వ్యాధి మరణాలు లక్షకు 38 ఉంటే వాటిని 19కి తగ్గించామని చెప్పారు. 2025వ సంవత్సరానికి లక్ష మందిలో కేవలం 10 మంది క్షయ వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆన్లైన్లో రోగి వివరాలు... ఎలక్ట్రానిక్ ల్యాబ్ విధానం ద్వారా ప్రతి రోగి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు జిల్లా క్షయనివారణ అధికారి డాక్టర్ సురేష్ తెలిపారు. నిక్షయ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా రోగులను నమోదు చేస్తామని, నేమ్ బేస్డ్.. కేస్ బేస్డ్గా నమోదు చేయడంతో ఫాలో అప్ చికిత్సలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. జిల్లాకు మరో సిబినాట్ యంత్రం మార్కాపురంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యంత్రం ద్వారా రెండు గంటల్లోనే ఎండీఆర్ టీబీని గుర్తించవచ్చన్నారు. యూనివర్సల్ డీఎస్టీలో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి రోగికి 2 కళ్లె నమూనాలు సేకరించి ఎండీఆర్ టీబీ, రెండో నమూనాను ఎల్పీఏ పరీక్ష నిమిత్తం విశాఖపట్నానికి పంపిస్తామన్నారు. దీని వలన ఏ మందులు రోగికి పనిచేస్తాయో తెలుసుకుని ఆ మందులను వాడటం జరుగుతుందన్నారు. టీబీ రోగులకు పోషకాహారం తీసుకునేందుకు చికిత్స కాలంలో ప్రతి నెలా 500 పెన్షన్ను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలో ఈ నెల 24న ఉదయం 9 గంటలకు అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం సంతపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో సభ నిర్వహిస్తామని తెలిపారు. -
కలెక్టర్ మురళిపై వేధింపులు ఆపాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న భూపాలపల్లి కలెక్టర్ మురళిపై ప్రభుత్వం వేధింపులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. టీబీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటల్ని కొందరు వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అందుబాటులో ఉన్న ఆహారాన్ని తినాలని ఆదివాసీలకు సూచించడం సరైన ఆలోచన కాదా అని ప్రశ్నించారు.