Usha Chilukuri Vance
-
ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ..
న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటనలోభాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగారు. తెలుగమ్మాయి, భార్య ఉషా చిలుకూరి, తమ ముగ్గురు సంతానం ఇవాన్, వివేక్, మీరాబెల్తో కలిసి వాన్స్ ‘ఎయిర్ఫోర్స్ టు’ విమానం నుంచి దిగారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ కేంద్ర కేబినెట్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాదర స్వాగతం పలికారు. వాన్స్తోపాటు అమెరికా జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్ రికీ గిల్, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. ఎయిర్బేస్లోనే కళాకారులతో ఏర్పాటుచేసిన నృత్యకార్యక్రమం వాన్స్ కుటుంబసభ్యులను అలరించింది. తర్వాత వాన్స్ భారత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వాన్స్ భారత్కు రావడం ఇదే తొలిసారి. భారతీయ దుస్తుల్లో పిల్లలు విమానం దిగేటప్పుడు వాన్స్ ముగ్గురు పిల్లలు భారతీయ దుస్తుల్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎనిమిదేళ్ల పెద్దకుమారుడు ఇవాన్ బూడిద రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. ఐదేళ్ల కుమారుడు వివేక్ పసుపు రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. మూడేళ్ల కుమార్తె ఆకుపచ్చ రంగు అనార్కలీ సూట్, జాకెట్ ధరించారు. అమెరికా సెకండ్ లేడీ, వాన్స్ భార్య ఉషా ఆధునిక దుస్తుల్లో కనిపించారు. స్వాగత కార్యక్రమం పూర్తయ్యాక వాన్స్ కుటుంబం ఢిల్లీకి తరలివెళ్లింది. అక్షరధామ్ ఆలయ సందర్శన ఢిల్లీలో తొలుత అక్షరధామ్ ఆలయాన్ని వాన్స్ కుటుంబం సందర్శించింది. యమునా తీరంలో అత్యద్భుతంగా నిర్మించిన స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని చూసి వాన్స్ కుటుంబం పులకించిపోయింది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నాక ఆలయం మొత్తం కలియతిరిగారు. గజేంద్రపీఠంను చూసి అచ్చెరువొందారు. ‘‘ ఇంతటి సుందర ప్రదేశంలో సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంతో నేర్పుతో శ్రద్ధతో ఇంత అందమైన ఆలయాన్ని నిర్మించిన భారత్ను ప్రశంసించాల్సిందే. మా పిల్లలకు ఈ ఆలయం ఎంతో నచ్చింది’’ అని అక్కడి సందర్శకుల పుస్తకంలో వాన్స్ రాశారు. వాన్స్ దంపతులకు ఢిల్లీ అక్షరధామ్ ఆలయ నమూనాను, చెక్క ఏనుగును చిన్నారులకు చిన్నపిల్లల పుస్తకాన్ని ఆలయ నిర్వాహకులు కానుకగా ఇచ్చారు. ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉందని వాన్స్ కుటుంబం తనతో చెప్పిందని వాళ్లకు ఆలయంలో సహాయపడిన మీరా సోందాగర్ చెప్పారు. తర్వాత వాన్స్ దంపతులు జన్పథ్లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంను సందర్శించారు. అక్కడ కొన్ని భారతీయ హస్తకళలను కొనుగోలుచేశారు. ఢిల్లీలో ఉన్నంతసేపు వాన్స్ కుటుంబం ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బసచేయనుంది. ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకే..గతంలో అమెరికా ఉపాధ్యక్షులు విచ్చేసినప్పుడు కేంద్ర సహాయ మంత్రి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వంటి వారు మాత్రమే స్వాగతం పలికారు. ఈసారి ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రి అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. కేబినెట్ ర్యాంక్ స్థాయి నేత ఇలా స్వయంగా ఆహ్వానం పలకడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 2023 సెపె్టంబర్లో నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చినప్పుడు పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. బైడెన్ 2013లో ఉపాధ్యక్ష హోదాలో వచ్చినప్పుడు నాటి విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మథాయ్ స్వాగతం పలికారు. ట్రంప్ అధ్యక్షునిగా 2020లో వచ్చినపుడు కేబినెట్ మంత్రి కాకుండా కేవలం సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్కు స్వాగతం పలికారు. సుంకాల భారం మోపుతూ భారత్ పట్ల ఆగ్రహం ఉన్న ట్రంప్ సర్కార్ను వాన్స్ ద్వారా ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ ఇలా కేబినెట్ మంత్రిని పంపించి సాదరంగా ఆహ్వానించింది. నేడు జైపూర్లో సందర్శనమంగళవారం ఉదయం నుంచి జైపూర్లోని పలు చారిత్రక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనుంది. తొలుత జైపూర్లోని రామ్భాగ్ ప్యాలెస్లో బస చేస్తారు. మంగళవారం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన అంబర్ కోటకు వెళ్తారు. సాయంత్రం జైపూర్లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. బుధవారం ఉదయం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్మహల్ను సందర్శిస్తారు. తర్వాత భారతీయ శిల్పకళల ప్రదర్శనశాల అయిన శిల్పాగ్రామ్కు వెళ్తారు. సాయంత్రం మళ్లీ జైపూర్కు వస్తారు. జైపూర్ నుంచి గురువారం ఉదయం అమెరికాకు బయల్దేరతారు. -
వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్లతో కలిసి 7, లోక్కళ్యాణ్ మార్గ్లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వాన్స్ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్ చిన్నకుమారుడు వివేక్ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్ సూట్ ధరించారు. ఒప్పందం పురోగతిపై సంతృప్తితర్వాత మోదీ, వాన్స్లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్తో మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్కు, ఇటు వికసిత్ భారత్ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. టారిఫ్లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్ ఢిల్లీకి వచ్చారు. -
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సతీసమేతంగా భారత పర్యటనకు రాబోతున్నారు. భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్తో కలిసి ఆయన సోమవారం ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. దేశంలో మొత్తం నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాన్స్ దంపతులు ఇండియాకు వస్తుండడం ఇదే మొదటిసారి. ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమెరికా మహిళ అనే సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించడం, తర్వాత 90 రోజులపాటు వాయిదా వంటి పరిణామాల నేపథ్యంలో జె.డి.వాన్స్ ఇండియా పర్యటన ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్లు, ప్రాంతీయ భద్రత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం విందు ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఇరువురు నేతలు సమావేశమవుతారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇరు దేశాల నడుమ సంబంధాల పురోగతిని వారు సమీక్షిస్తారు. సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్లు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అత్యంత కీలకమైన ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మోదీ–వాన్స్ భేటీలో ముందడుగు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చర్చల్లో భారత్ తరఫున ప్రధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారని తెలిసింది. అమెరికా తరఫున వాన్స్తోపాటు ఐదుగురు సీనియర్ అధికారులు హాజరవుతారని సమాచారం. జైపూర్, ఆగ్రా సందర్శన ఢిల్లీకి చేరుకున్న తర్వాత వాన్స్, ఉషా దంపతులు ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భారతీయ సంప్రదాయ హస్తకళాకృతులు విక్రయించే మార్కెట్ను సందర్శిస్తారు. ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బస చేయబోతున్నారు. సోమవారం రాత్రి వారు రాజస్తాన్ రాజధాని జైపూర్కు చేరుకుంటారు. రామ్భాగ్ ప్యాలెస్లో బస చేస్తారు. మంగళవారం అమేర్(అంబర్) కోటతోపాటు రాజస్తాన్లోని ప్రఖ్యాత కట్టడాలను సందర్శిస్తారు. సాయంత్రం జైపూర్లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ కార్యక్రమంలో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ పాలనలో భారత్–అమెరికా సంబంధాలపై ఆయన అభిప్రాయాలు వెల్లడిస్తారని సమాచారం. బుధవారం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్మహల్ను సందర్శించబోతున్నారు. సాయంత్రం మళ్లీ జైపూర్కు తిరిగివెళ్తారు. వాన్స్ కుటుంబం జైపూర్ నుంచి గురువారం అమెరికాకు పయనమవుతుంది -
భారత్కు వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీసమేతంగా భారత్కు వస్తున్నారు. భార్య ఉషా చిలుకూరి వాన్స్తో కలిసి ఏప్రిల్ 21 నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటిస్తారని సమాచారం. ఉషవి తెలుగు మూలాలున్న విషయం తెలిసిందే. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఆమె భారత్ రానుండటం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్య తదితర రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా ఏప్రిల్ 21–24 తేదీల్లోనే భారత్లో పర్యటించనున్నారు. వాన్స్ ఉన్నతస్థాయి చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు.తాజ్మహల్ సందర్శన భారత పర్యటన సందర్భంగా వాన్స్ దంపతులు తాజ్మహల్ను కూడా వీక్షించనున్నారు. ఆగ్రాతో పాటు జైపూర్ను కూడా వాళ్లు సందర్శిస్తారని తెలుస్తోంది. -
ఆమెకున్న తెలివితేటలకు హ్యాట్సాఫ్!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా తనదైన శైలిలో మద్దతుదారులను అలరించారు. యూఎస్ 47వ ప్రెసిడెంట్గా ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో తన విన్యాసాలతో మద్దతుదారులను ఉత్సహపరిచారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయోత్సవ ర్యాలీలో ఐకానిక్ డాన్స్ మూవ్స్తో సందడి చేసిన ఆయన ఆద్యంతం అదరగొట్టారు. అంతేకాదు తనకు మద్దతుగా నిలిచిన వారిని ప్రశంసించారు. ముఖ్యంగా ‘సెకండ్ లేడీ’ ఉషా చిలుకూరిని (Usha Chilukuri) పొగడ్తల్లో ముంచెత్తారు. అమెరికా చట్టాలు అనుమతించివుంటే ఆమెను ఉపాధ్యక్షురాలిని చేసేవాడినని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ తన మిత్రబృందాన్ని పొగిడారు. ముఖ్యంగా ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జేడీ వాన్స్ దంపతులను ప్రత్యేకంగా ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికా పార్లమెంట్ భవనంలోని రొటుండా హాల్లో అధ్యక్షుడి ప్రమాణస్వీకారం పూర్తవగానే ట్రంప్ ఉపన్యసించారు. ‘‘రాజకీయనేతగా జేడీ వాన్స్ను మొదట్నుంచీ గమనిస్తున్నా. ఒహాయాలో ఆయనకు మద్దతుగా నిల్చున్నా. ఆయన గొప్ప సెనేటర్. తెలివైన నాయకుడు. ఇందులో విశేషమేమంటే ఆయన భార్య ఉషా సైతం తెలివైన వ్యక్తే’’ అని అన్నారు.ఉపాధ్యక్షురాలిగా చేసేవాడినిజేడీ వాన్స్ వైపు చూస్తూ.. ‘‘ఆమెకున్న తెలివితేటలకు నిజానికి ఉషానే నేను ఉపాధ్యక్షురాలిగా చేసేవాడిని. కానీ అమెరికా నిబంధనలు అందుకు ఒప్పుకోవుగా’’ అని ట్రంప్ సరదాగా నవ్వుతూ పొగడటంతో అక్కడున్నవారంతా ట్రంప్తో పాటు నవ్వులు చిందించారు. ‘‘ఈమె గ్రేట్. ఈయన కూడా గ్రేట్. వీళ్లది అద్భుతమైన, అందమైన జోడీ. నమ్మశక్యంకానంతటి గొప్ప కెరీర్ వీళ్లది’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’గా సంబోధిస్తారు. అలాగే ఉపాధ్యక్షుడి భార్యగా ‘సెకండ్ లేడీ’ హోదాతో గౌరవిస్తారు. ఈ హోదా పొందిన తొలి భారతీయ అమెరికన్గా, తొలి హిందువుగా ఉష చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. కాగా, తెలుగు మూలాలు కలిగిన ఉషా చిలుకూరికి అమెరికా ‘సెకండ్ లేడీ’గా గౌరవం దక్కడంతో తెలుగు ప్రజలతో పాటు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉష పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామం. ఉష తల్లిదండ్రులు ఇద్దరూ విద్యాధికులే. ఉష కూడా పెద్ద చదువులే చదివారు. శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ చదివిన ఆమె తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశారు.2013లో యేల్ వర్సిటీలోనే వాన్స్తో ఉషకు పరిచయమైంది. తర్వాతి ఏడాది 2014లో వీరు పెళ్లి చేసుకున్నారు. వాన్స్ రాజకీయాల్లో రాణించడం వెనుక ఉష కృషి ఎంతో ఉంది. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు స్వయంగా వెల్లడించారు. ‘భార్యే నా ధైర్యం. ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అంటూ వాన్స్ పలుమార్లు మెచ్చుకున్నారు. తాజాగా ట్రంప్ కూడా ఆమెను పొగిడారంటే ఉష ఎంతటి ప్రతిభవంతురాలో తెలుస్తోంది. కాగా, అతి చిన్న వయసులో అమెరికా‘సెకండ్ లేడీ’హోదా సాధించిన వారిలో మన ఉష కూడా ఉండడం మరింత విశేషం. -
అత్తగారి కుటుంబంతో సరదాగా.. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో వైరల్
వాషింగ్టన్ : అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉష చిలుకూరి దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనా.. సాదాసీదాగా నీలిరంగు టీ షర్ట్ ధరించిన జేడీ వాన్స్ తన కుమారుడిని ఎత్తుకున్నారు. తన భార్య ఉష చిలుకూరి తరఫు బంధువులతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోని సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాప్టలిస్ట్ ఆషా జెడేజా మోత్వాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. JD Vance at Thanksgiving -). Reminds me of the big fat Indian wedding…. pic.twitter.com/vzEjODMRZt— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) December 2, 2024జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడేఅమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్ప్రెసిడెంట్గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. వాన్స్తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్ను ఎక్స్లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 277(270) దాటి సొంతం చేసుకున్న ట్రంప్.. ఆగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఇక యూఎస్ ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ వ్యవహరించనున్నారు. ఇందుకు ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ తెలుగమ్మాయి కావడమే కారణం. ఇక ఉష అమెరికాకు సెకండ్ లేడీగా అవతరించబోతున్నారు.ఉష చిలుకూరి.. కొంతకాలం వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ ఒహాయో రాష్ట్ర సెనేటర్గా జేడీ వాన్స్ను రిపబ్లికర్ పార్టీ ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసినప్పటి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయంతో ఆమె పేరు మరోసారి మార్మోగుతోంది. నిజానికి వాన్స్ ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి సహ కా రం ఎంతో ఉంది. మరి కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు..ఉషా పూర్వికులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు. తండ్రి రాధాకృష్ణ... క్రిష్ చిలుకూరి ఏరోస్పేస్ ఇంజినీర్.వీరికి ముగ్గురు సంతానం. వారిలో ఒకరు ఉష. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.ఉష యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు.యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు.భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. ఒహాయో సెనేటర్గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. తన భర్త ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. ఇక ప్రస్తుతం ఆమె రిపబ్లికన్ల తరఫున సెకండ్ లేడీగా వ్యవహరించనున్నారు. -
ఉషా చిలుకూరిపై ఎలోన్ మస్క్ ట్వీట్ వైరల్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్ ఎంపికయ్యారు. అయితే, జేడీ వాన్స్ ఎంపికతో ఆయన సతీమణి ఉషా చిలుకూరికి భారత్ మూలాలు ఉన్నాయని వెలుగులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.వారిలో అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఉన్నారు.ఇంతకీ ఆయన ఎందుకు స్పందించారు.మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జేడీ వాన్స్ను ప్రకటించారు.అంతకంటే ముందే జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ప్రొఫైల్ను చూసి తాను ముగ్ధుడినయ్యానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి అభినందనలు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. వారిలో డాక్టర్ పారిక్ పటేల్ ఎక్స్ వేదికగా ఉషా చిలుకూరి ప్రతిభాపాటవాలపై ప్రశంసలు కురిపించారు. You either hire an Indian CEO or live long enough to see yourself become Indian pic.twitter.com/RmcjFaGrtj— Dr. Parik Patel, BA, CFA, ACCA Esq. (@ParikPatelCFA) July 15, 2024 మీరు భారతీయ సీఈవోలని నియమించుకోండి లేదా మీరే భారతీయుల్లా వ్యవహరించండి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై ఎలోన్ మస్క్ స్పందించారు.భళ్ళున ఓ నవ్వి నవ్వుతూ ఓ స్మైలీ ఎమోజీని ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్ వైరల్గా మారింది 😂— Elon Musk (@elonmusk) July 15, 2024 -
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి.. మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి (ఫొటోలు)
-
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి?
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జేడీ వాన్స్ను ప్రకటించారు.జేడీ వాన్స్ భార్యే ఉషా చిలుకూరి వాన్స్. ఈ ఎన్నికల్లో వాన్స్ గెలిస్తే అమెరికాకి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ (రెండో మహిళ)గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా ఉషా చిలుకూరి ఎవరు? ఆమె తల్లిదండ్రులు, భర్త జేడీ వాన్స్ ఎవరు? అనే వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఎవరీ ఉషా చిలుకూరి? న్యూయార్క్ టైమ్స్ ప్రకారం..అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామమని తెలుస్తోంది. సుధీర్ఘకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో,కాలిఫోర్నియాలో పెరిగారు.ఉషా చిలుకూరి ఏం చదువుకున్నారు?ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.ఆమె లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివారు.ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ పూర్తి చేశారు.ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు.యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలో యేలే లా జర్నల్,టెక్నాలజీ విభాగానికి ఎగ్జిక్యూటీవ్ డెవలప్మెంట్ ఎడిటర్గా, మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశారు.అదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టులో కేసుల్ని ఎలా వాదించాలి? కేసులో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేయాలనే అంశాలపై అమెరికా లా యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన సుప్రీం కోర్టు లాయర్లతో సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సును అందిస్తాయి. ఆ కోర్స్లో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్పై పని చేశారు. ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో ఉషా చిలుకూరి జేడీ వాన్స్ను తొలిసారి కలుసుకున్నారు. లా కాలేజీలో జరిగిన ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే సబ్జెట్పై జరిగిన డిస్కషన్ గ్రూప్లో ఉషా, వాన్స్లు కలిసి పనిచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. ఇరుకుటుంబసభ్యుల అంగీకారంతో ఉషా చిలుకూరి, జేడీ వాన్స్లు ఒక్కటయ్యారు. వారిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది.జేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలుజేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు.ఇవాన్,వివేక్ ఇద్దరు కుమారులు కాగా కుమార్తె మిరాబెల్.ప్రముఖ న్యాయవాదిగాకాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. ఉషా 2018లో అమెరికా సుప్రీం కోర్ట్కు లా క్లర్క్గా పని చేయడం కంటే ముందు 2015 నుండి 2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ ఈలోని ముంగేర్, టోల్లెస్ అండ్ ఓల్సన్ ఎల్ఎల్పీలో న్యాయవాదిగా పనిచేశారు. రాజకీయాల్లో జేడీ వాన్స్వాన్స్ రాజకీయాల కంటే ప్రముఖ వ్యాపార వేత్తగా, ఇన్వెస్టర్గా పేరు సంపాదించుకున్నారు. 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్.. 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ..ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీరవిధేయుల్లో ఒక్కరిగా మారారు. పుస్తకం కాస్త.. సినిమాగాఇక వాన్స్ తనలోని రాజకీయ నాయకుడితో పాటు మంచి రచయిత ఉన్నాడంటూ ‘హిల్బిల్లీ ఎలెజీ’తో నిరూపించారు. హిల్బిల్లీ ఎలెజీ పుస్తకం ద్వారా సంక్షోభంలో ఉన్నశ్వేతజాతి అమెరికన్ల సంస్కృతి, ఉద్వేగం, వ్యక్తిగతం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వాన్స్ తన జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాల్ని వివరించారు. పేదరికం, వ్యసనం, అస్థిరతతో అతని కుటుంబం, పోషణ కోసం పోరాటాలు, చివరికి తన ప్రయాణం ఎలా సాగిందో వివరించారు. ఆ పుస్తకం ఎక్కువగా అమ్ముడు పోవడంతో అది సినిమాగా తెరక్కిక్కింది. 2020లో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు. ట్రంప్ను అమెరికా అధ్యక్షుడిని చేసిన వాన్స్అంతేకాదు ఈ పుస్తకం ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ట్రంప్ ప్రచారంలో తన సందేశాన్ని బలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద తెల్లజాతి, అమెరికా ఉద్యోగుల ఓటర్లను ఆకర్షించేలా, తనవైపుకు తిప్పుకునేందుకు సహకరించింది. మధ్య అమెరికాలో సాంస్కృతిక, ఆర్థిక అంశాలను లోతుగా విశ్లేషించేందుకు ఉపయోగపడింది. కాగా, 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంలో ఈ ఓటర్లే కీలకమయ్యారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.జేడీ వాన్స్ విజయంలో ఉషా తన భర్త జేడీ వాన్స్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.తరచూ రాజకీయ కార్యక్రమాలకు అతనికి దిశానిర్ధేశం ఇస్తూ మద్దతుగా నిలిచారు. ఆమె 2016,2022లో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రచారం చేశారు. సెనేటర్ అంటే అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు.