వెహికల్ ఇన్ స్పెక్టర్ ఇంటిలో ఏసీబీ సోదాలు
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వర్ణ శ్రీనివాస్ నాయక్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం దాడులు చేశారు. బెంగళూరు, అమలాపురం, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లోని నాయక్ బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయనికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు అందటంతో అలర్ట్ అయిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాలకొల్లులోని నాయక్ ఇంటి నుంచి రూ.24 వేల నగదు, కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఇళ్ల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.