www
-
www.. ప్రపంచ గతిని మార్చిన 3 అక్షరాలు!
ముప్ఫై ఐదేళ్ల క్రితం కనుక్కొన్న మూడు అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఆ మూడు అక్షరాలు లేకుంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంటర్నెట్ లేదు. ఆ మూడు అక్షరాలు www. అదే వరల్డ్ వైడ్ వెబ్. నేడు (ఆగస్ట్ 1) ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..ఇదీ www చరిత్రఇంటర్నెట్ అనేది కంప్యూటర్లను కలిపే నెట్వర్క్ అయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ వెబ్ పేజీలను కలిపే వ్యవస్థ. ఇది నేడు ప్రపంచాన్ని శాసించే వేలాది ఇతర ఆవిష్కరణల సృష్టికి దారితీసింది. అయితే, వరల్డ్ వైడ్ వెబ్ జనాల దృష్టికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1989లో టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన దీన్ని WWW అనే దాన్ని రూపొందించారు. బెల్జియన్ ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ కైలియాయు మరింత మెరుగుపరిచారు. వారిద్దరూ కలిసి హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (HTTP)ని అభివృద్ధి చేశారు. దాన్ని 1992లో ఆవిష్కరించారు. అనేక ఇతర గొప్ప సాంకేతికతల మాదిరిగానే WWW అనేది మొదట్లో సాధారణ ప్రజల కోసం రూపొందించింది కాదు. భౌతిక శాస్త్రవేత్తలు సమాచారాన్ని పంచుకోవడం కోసం దీన్ని రూపొందించారు. తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఇందులో మొదటి ఫోటో 1992లో బెర్నర్స్-లీ అప్లోడ్ చేశారు. 1990ల మధ్య నాటికి మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కూడగట్టుకోవడం ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ మాధ్యమంగా నిరూపించుకుంది. 21వ శతాబ్దం నాటికి, వెబ్ వినియోగం కంప్యూటర్లతోపాటు స్మార్ట్ఫోన్లకు కూడా మారింది. నేడు, వరల్డ్ వైడ్ వెబ్ను గేమింగ్ పరికరాలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వాచ్ల ద్వారా కూడా యాక్సెస్ చేస్తున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వరల్డ్ వైడ్ వెబ్ యాక్టివ్ యూజర్లున్నారు. -
ఫ్యాన్స్కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన WWE స్టార్ జాన్ సినా
స్టార్ రెజ్లర్, WWE వరల్డ్ లెజెండ్ జాన్ సినా తన కెరీర్కు విడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. 2025లో జరిగే రెసల్ మేనియా అనంతరం తన కెరీరీను ముగించనున్నట్లు జాన్ సినా ప్రకటించాడు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) మనీ ఈవెంట్కు హాజరైన సినా.. అందరని షాక్కు గురిచేశాలా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు."ఈ రోజు నా డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటిస్తున్నాను. వచ్చే ఏడాది రెసల్ మేనియా అనంతరం నా కెరీర్కు విడ్కోలు పలకనున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు" అని జాన్ సినా పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియాలో షేర్ చేసింది.2001లో రెజ్లింగ్లోకి అరంగేట్రం చేసిన జాన్ సినా.. ఈ రెండు దశాబ్దాల కాలంలో కోట్ల మంది అభిమానులను తన సొంం చేసుకున్నాడు. ఇప్పటివరకు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్గా జాన్ సినా నిలిచాడు. జాన్ సినా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. టీవీ షోల్లోనూ సందడి చేశారు. -
ఓటీటీలోకి 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' చిత్రం
WWW Movie Release In Sony Liv OTT: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేకర్ జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు విశేష ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' సినిమా డిజిటల్ రైట్స్ని ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం 'సోని లివ్'లో స్ట్రీమ్ అవనుంది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'మా మొదటి చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోని వంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సోని లివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్ మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. -
WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్ రిలీజ్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు? ఎక్కడ? ఎందుకు?). ‘118’ వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి పి రాజుదాట్ల నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ధరణ్ దాట్ల సహనిర్మాత. ఈ చిత్రంలోని 'కన్నులు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూశానే..' లిరికల్ సాంగ్ వీడియోను హీరో అడివి శేష్ విడుదల చేశాడు. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, యాసిమ్ నిజార్ ఆలపించారు. సైమన్ కె సింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. థ్రిల్లర్ జానర్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని కేవీ గుహన్ పేర్కొన్నాడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. చదవండి: Shah Rukh Khan: ఓటీటీలోకి బాలీవుడ్ బాద్షా! -
'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు
‘చరిత్రలో ఈరోజు ఏం జరిగెను?’ అనే కొచ్చెన్కు వినిపించే జవాబులలో బెర్నర్స్-లీ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇన్వెంటర్గా సుపరిచితుడైన లీ 12 మార్చి, 1989లో తొలి సారిగా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం గురించి ప్రతిపాదించాడు. అది ఇంతై.. ఇం తింతై...వెబ్డింతై ప్రపంచాల మధ్య హద్దులు చెరిపేసింది. ‘ప్రపంచం ఒక పెద్ద గ్రామం అయిపోయింది. దేశాలన్నీ గల్లీలైపోయా యి. ఆ గల్లీలో జరిగే విషయాలు ఈ గల్లీకి వాళ్లకు తెలియడం ఎంతసేపని...’ అని మనం సంబరాల్లో మునిగిపోతుంటాం. ఈలోపే ‘చాల్లేండి సంబడం’ అని ఆకాశవాణి ఉరుముతుంది. ఏమైంది? రాబోయే కాలంలో ఇంటర్నెట్ కంటే ‘స్ప్లింటర్ నెట్’ పేరు మాత్రమే ఎక్కువగా వినబడుతుంది. ‘వరల్డ్ వైడ్ వెబ్’ అనే కోటకు బీటలు పడతాయి. ఈ రోజుల్లో సమాచారాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదు. అందుకే దేశాలు సమాచారభద్రత విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తమ సమాచారం బయటికి పోకుండా, బయటి సమాచారం లోనికి రాకుండా గోడలు కడుతున్నాయి. అదే స్ప్లింటర్ నెట్. స్ప్లింట్(ముక్కలు చేయడం), ఇంటర్నెట్లను కలిపితే ‘స్ప్లింటర్ నెట్’ అయిందన్నమాట. ప్రపంచంలోని కొన్ని దేశాలు సొంత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉదా: ఇరాన్-హలాల్ ఇంటర్నెట్. ఈ గోడల వికేంద్రీకరణ దేశాలు దాటి రాష్ట్రాల వరకు రావచ్చు. జిల్లాల వరకూ కూడా రావచ్చు!. చదవండి: ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు సింగిల్ ఛార్జ్ తో 240 కి.మీ ప్రయాణం -
'నైలూ నది'' పాటను రిలీజ్ చేసిన తమన్నా
సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం హీరోయిన్ తమన్నా ఈ సినిమాలోని 'నైలూ నది' అనే పాటను రిలీజ్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషించారు. (డియర్ కామ్రేడ్ నా ఫస్ట్ సినిమా అయ్యుండేది) ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి..) Team #WWWMovie Thanks @tamannaahspeaks for launching Melodious #NailuNadi Telugu song 💕 ICYMI, ▶️https://t.co/6reYS6uMoi 🎵 @simonkking ✍️ @ramjowrites 🎤 @sidsriram@kvguhan @AdithOfficial @Rshivani_1 @RamantraCreate @DrRaviPRaju @VijayDharan_D @baraju_SuperHit @adityamusic pic.twitter.com/DactvRXdyT — BARaju (@baraju_SuperHit) January 29, 2021 -
‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’(ఎవరు.. ఎక్కడ.. ఎందుకు) అనే ట్యాగ్లైన్తో మరో థ్రిల్లర్ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్ను సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. (చదవండి: చెక్ మాస్టర్) 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్ని బట్టి చూస్తే సినిమా సైబర్ థ్రిల్లర్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నువ్వు నవ్వినప్పుడు డబుల్ అందంగా ఉంటావ్ తెలుసా.. నిన్ను వచ్చి కలిసేవరకు ఈ కాల్ కట్ చేయను అంటూ సరదగా సాగిన టీజర్ ఆ తర్వాత నా సిస్టమ్ పని చేయడం లేదు.. బ్రూట్ ఫోర్స్ ఎటాక్ అంటూ థ్రిల్లర్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక రామంత్ర క్రియేషన్స్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
విజువల్స్ బాగున్నాయి– రానా
‘‘గుహన్గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫర్. ఆయనతో కలిసి పనిచేశాను. ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ పోస్టర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమాలో విజువల్స్ సరికొత్తగా ఉంటాయి. గుహన్గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు రానా. ‘118’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రానా విడుదల చేశారు. కేవీ గుహన్ మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేశాను. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మా చిత్రాన్ని త్వరలోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మిస్టరీ థ్రిల్లర్గా గుహన్గారు ఈ సినిమాని బాగా తీశారు’’ అన్నారు డా. రవి పి.రాజు ధాట్ల. ‘‘కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు గుహన్గారు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘కేవీ గుహన్గారి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను లాంచ్ చేసిన రానాగారికి థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ నిర్మాత విజయ్ధరన్ ధాట్ల. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, కథ, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్. -
రెజ్లర్ సుశీల్ కుమార్ కొత్త ఇన్నింగ్స్!
ముంబై: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్ కొత్త ఇన్నింగ్స్ లో భాగంగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్యూడబ్యూడబ్యూ)తో ఒప్పందం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాడు ఈ హర్యానా రెజ్లర్. ఈ మేరకు గత అక్టోబర్లో డబ్యూడబ్యూడబ్యూతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన సుశీల్ కుమార్.. అందుకు తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో డబ్యూడబ్యూడబ్యూ ఈవెంట్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తికనబరచని సుశీల్.. తనకు అదే సరైనదని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే డబ్యూడబ్యూతో మరొకసారి సంప్రదింపులు జరిపి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ లో డబ్యడబ్యూడబ్యూ ఈవెంట్లలో సుశీల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ది గ్రేట్ ఖలీ తరువాత వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో పాల్గొన్న రెండో భారత రెజ్లర్గా సుశీల్ నిలుస్తాడు. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్.. రియోకు వెళ్లేందుకు తనకే అర్హత ఉందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాడి ఓడిపోయాడు. సాంకేతికంగా నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో సుశీల్ దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనిపై సుశీల్ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 40 వరకూ ఉన్న రెజ్లర్లను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డ డబ్యూడబ్యూడబ్యూ.. భారత రెజ్లర్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. దీనిలో్ భాగంగా సుశీల్ కుమార్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. -
www @ 25
మనిషి జీవితాన్ని ఇంటర్నెట్ అమాంతం మార్చేసింది. అవసరం రీత్యాగానీ, కాలక్షేపానికి గానీ ఒక్కసారి నెట్కు అలవాటుపడితే వారికి నెట్ లేకుండా రోజు గడవటం కష్టమవుతోంది. ఇలాంటి నెట్కు ఆధారభూతం వరల్డ్ వైడ్ వెబ్. దీన్నే క్లుప్తంగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు(WWW) అని పిలుస్తాం. రాసుకుంటాం. ఈ మూడు అక్షరాలు ఎంతో మంది జీవితాలను మార్చాయి. ప్రపంచంలోని అద్భుతాలన్నింటిని నెట్టింట్లోకి తెచ్చాయి. ఏదైనా ఒక వెబ్ పేజీలోకి వెళ్లే ముందు మొదట మనం www అని టైప్ చేస్తాం. ఈ మూడు అక్షరాలు లేకపోతే మనం ఏ వెబ్సైట్లోకి వెళ్లలేం. ఇంటర్నెట్కు ముఖద్వారం లాంటి wwwకు ఈ నెల 12కు పాతికేళ్లు నిండాయి. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్నెట్ కారణమైనా, దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్.. ఈ రెండూ ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రెండింటికి ఎంతో తేడా ఉంది. ఇంటర్నెట్ అనేది అనేక పర్యాటక ప్రాంతాల సముదాయమైతే, వరల్డ్వైడ్ వెబ్ అనేది వాటి మధ్య ట్రావెల్స్ కంపెనీ లాంటిది. ఇంటర్నెట్ ఎప్పుడో 1969లోనే మొగ్గ తొడిగింది. కంప్యూటర్ల మధ్య డేటాను ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో ఇంటర్నెట్ను అమెరికా ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇంటర్నెట్ పుట్టిన 30 ఏళ్ల తర్వాత అంటే 1989లో వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించింది. బ్రిటిష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ wwwను ఆవిష్కరించారు. ఈయన సెర్న్ అనే యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో కంప్యూటర్ సైంటిస్టుగా పని చేసే వారు. 1989 మార్చి 12న ఈయన ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రతిపాదించారు. అదే ఏడాది నవంబరు కల్లా తన ప్రతిపాదనను అమల్లోకి తెచ్చారు. హైపర్టెక్ట్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్-http క్లయింట్, సర్వర్ మధ్య విజయవంతంగా కమ్యూనికేషన్ నెలకొల్పారు. ఇదే ఆ తర్వాత వరల్డ్వైడ్ వెబ్గా మారింది. ఇదే క్లుప్తంగా www చరిత్ర. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణతో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఈమెయిళ్లు పంపడం - వీడియోలు చూడటం - ఛాటింగ్ చేసుకోవడం.... ఇలా ఎన్నో రకాల పనులు మనం ఈ www ద్వారానే చేసుకుంటున్నాం. రోజు రోజుకు మనం ఇంటర్నెట్ మీద ఆధారపడటం పెరుగుతోంది. దాదాపు 240 కోట్ల మంది ప్రజలు ఈవాళ ఇంటర్నెట్ను వాడుతున్నారు. వరల్డ్వైడ్ వెబ్ను నిర్మించిన తర్వాత వచ్చిన మొట్ట మొదటి వెబ్సైట్ http స్లాష్ info.సెర్న్.ch. ఈరోజు ఇంటర్నెట్లో కొన్ని లక్షల వెబ్ సైట్లు ఉన్నాయి. మంచికి, చెడుకు కూడా ఈ సైట్లు ఉపయోగపడుతున్నాయి. ఇంటర్నెట్లో కొన్ని లక్షల వెబ్సైట్లు ఉన్నప్పటికీ వాటిలో యుట్యూబ్కు ఉన్న ప్రత్యేకత వేరు. ఖండ ఖండాల్లో ఉన్న వండర్స్ను ఈ సైట్ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. కొన్ని దృశ్యాలను చూస్తూ కన్నార్పలేం. గుండె దడ పుడుతుంది. వామ్మో అనిపిస్తుంది. అంతలోనే వావ్ అనిపిస్తుంది. తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తాం. www.యుట్యూబ్.కామ్ ఇలాంటి వేల వీడియోలను మన ముందు ఆవిష్కరిస్తోంది. అవతార్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న దృశ్యాలు చైనాలోని జాంగ్జియాజి నేషనల్ పార్కులో ఉన్నాయి. వాటిని యుట్యూబ్ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పార్కులో కొండలు నిర్మితమైన తీరు చూస్తే రెప్ప వాల్చాలనిపించదు. ఎన్నో తీపి గుర్తుల్ని నెట్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకునే అవకాశం మనకు వరల్డ్ వైడ్ వెబ్ కల్పించింది. సువిశాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో వండర్స్ - నిప్పు మీద - నీటి మీద - మంచు మీద - ఆకాశంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలను www మన ముందుంచుతోంది. మంచు మీద చేసే ముచ్చటైన పలు రకాల విన్యాసాలను యుట్యూబ్లో ఉన్నాయి. ఈ ప్రపంచం చాలా సుందరమైంది. నీటి గలగలలు, పక్షుల కిలకిలరావాలు, విచ్చుకునే పుష్పాలు... ఒకటేమిటి.. ప్రకృతిలో ప్రతి దృశ్యం పరవశింపజేస్తుంది. ఇలాంటి దృశ్యాలను నేరుగా వెళ్లి చూసే అవకాశం అందరికీ రాదు. ఇంట్లో కూర్చొని అద్భుతాల్ని వీక్షించే అవకాశం మనకు వరల్డ్ వైడ్ వైబ్ కల్పిస్తోంది. తెలుగు వారికి సినిమాలు అంటే మహా ఇష్టం. చక్కటి పాటలను, కామెడీ సీన్లను ఎంతగానో ఆస్వాదిస్తారు. వరల్డ్వైడ్ వెబ్ వచ్చిన తర్వాత ఈ ఆస్వాదన మరింతగా పెరిగింది. వరల్డ్ వైడ్ వెబ్ వల్ల ప్రపంచ రికార్డులను మనం ఇంటర్నెట్లో వీక్షించే అవకాశం లభించింది. ఇలాంటివి వీక్షించే అవకాశం మనకు కల్పించిన టిమ్ బెర్నర్స్ లీకి మనమెంతో రుణపడి ఉన్నాం. s.nagarjuna@sakshi.com -
వరల్డ్ వైడ్ వెబ్కు 25 ఏళ్లు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలన్న సుప్రీం ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మార్చి 10న కిందిస్థాయి కోర్టులను ఆదేశించింది. అభియోగాలు నమోదైన సంవత్సరంలోగా విచారణ ముగించాలని పేర్కొంది. ఏడాదిలోగా విచారణ పూర్తికాకపోతే దిగువ కోర్టులు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణలో జాప్యం వల్ల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగుతున్నారని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. డ్రాపౌట్ల సంఖ్య 8 కోట్లు భారత్లో ప్రాథమిక విద్య పూర్తికాక ముందే బడి మానే స్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యూనిసెఫ్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పిల్లలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే స్కూలు డ్రాపౌట్లుగా మారారని తెలిపారు. ప్రాథమిక విద్య (ఎనిమిదో తరగతి వరకూ) పూర్తి కాకుండానే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందన్నారు. 10వ యంగ్ ఇండియన్ సదస్సు 10వ యంగ్ ఇండియన్ సదస్సు న్యూఢిల్లీలో మార్చి 15న ప్రారంభమైంది. ‘ఇండియా-ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కు చెందిన యంగ్ ఇండియన్స్ (వైఐ) సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. విద్వేషం చిమ్మే నేతలను బుక్ చేయండి: సుప్రీం కులం, మతం, ప్రాంతం, జాతి ఆధారంగా నేతలు చేసే విద్వేష ప్రసంగాలు సమాజానికి విఘాతకరమని.. అలాంటి ప్రసంగాలు చేసే రాజ కీయ, సంఘ, మత సంస్థల నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు లేదా నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే... ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలా? అన్న అంశాన్ని పరిశీలించాలని లా కమిషన్ను సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. నేతల విద్వేష ప్రసంగాలు ప్రజస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ భలాయ్ సంఘటన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మార్చి 12న విచారించింది. ఎన్నికల్లో నల్లధనం నియంత్రణకు ‘గ్రిడ్’ రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లధనాన్ని నియంత్రించడంలో భాగంగా రెవెన్యూ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక నిఘా వ్యవస్థ(గ్రిడ్)ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ఇది ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేస్తుంది. తద్వారా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. యూఐడీఏఐకి నిలేకని రాజీనామా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ పదవికి నందన్ నిలేకని మార్చి 13న రాజీనామా చేశారు. యూఐడీఏఐ చైర్మన్గా నిలేకని 2009 జూన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్కు పోటీ చేసేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయం దేవయానిపై అభియోగాల కొట్టివేత భారత దౌత్యవేత్త దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు మార్చి 12న కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ తీర్పు ఇచ్చారు. దేవయానిపై మార్చి 15 అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. దేవయాని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్కు 73వ స్థానం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది. స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళ పార్లమెంటేరియన్ల శాతం 21.8గా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్లో పార్లమెంటరీ లేదా మంత్రిత్వ పదవుల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు హైతీ, రువాండా, కాంగో, ఛాద్, జాంబియాలు భారత్ కంటే మెరగైన స్థానాల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా ఉక్రెయిన్లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది. ఉక్రెయిన్లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కంటే రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ పేర్కొన్నారు. ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్ ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు. ఆయుధాల దిగుమతుల్లో భారత్ టాప్ ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ల కంటే ముందుంది. ఆ దేశాల కంటే మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్కు చెందిన స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కంటే ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని సిప్రి ప్రస్తావించింది. వరల్డ్ వైడ్ వెబ్కు 25 ఏళ్లు వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్నెట్ కారణమైనా.. దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీడలు ఇండియన్ వెల్స్ విజేత జొకోవిచ్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్లో ఓవరాల్గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమెరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. విజయ్ హజారే విజేత కర్ణాటక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. మార్చి 16న కోల్కతాలో జరిగిన ఫైనల్లో రైల్వేస్ను ఓడించింది. ఈ విజయంతో కర్ణాటక ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్ను గెలుచుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీలలో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత రోస్బర్గ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్ విజేతగా నిలిచాడు. మాగ్నుసన్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. హాకీ జూనియర్ ఉమెన్స చాంపియన్షిప్ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్స చాంపియన్షిప్ను ఛత్తీస్గఢ్ గెలుచుకుంది. మైసూర్లో మార్చి 13న జరిగిన ఫైనల్లో కేరళను ఓడించింది. క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్ సచిన్ భారత మాజీ ఆటగాడు, మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ను ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డుకు ఈఎస్పీఎన్-క్రిక్ ఇన్ఫో సంస్థ ఎంపిక చేసింది. ఇతర అవార్డుల విజేతలు: టెస్టు బ్యాటింగ్ అవార్డు: శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 187 పరుగుల ఇన్నింగ్స్) వన్డే బ్యాటింగ్ అవార్డు: రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ); తొలి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన అవార్డు: షమీ (2013లో టెస్టులు, వన్డేలు కలిపి 47 వికెట్లు); ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డు: మిచెల్ జాన్సన్ (7/40, ఇంగ్లండ్పై); ఉత్తమ వన్డే బౌలింగ్ అవార్డు: షాహిద్ ఆఫ్రిది (7/12, వెస్టిండీస్పై). అవార్డులు జ్ఞాన్ కొర్రేకు గొల్లపూడి అవార్డు గొల్లపూడి శ్రీనివాస్ (జీఎస్) మెమోరియల్ ఫౌండేషన్ అందజేసే జీఎస్ జాతీయ అవార్డు- 2013కు దర్శకుడు జ్ఞాన్ కొర్రే ఎంపికయ్యారు. గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’కు దర్శకత్వం వహించినందుకుగాను కొర్రేను ఈ పురస్కారం వరించింది. భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఇంటెల్ అవార్డులు ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆనంద్ శ్రీనివాసన్(17), శౌన్ దత్తా(18) మార్చి 12న ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను వీరిద్దరూ కైవసం చేసుకున్నారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్ఎన్ఎన్స్కాన్’ అనే న్యూరల్ నెట్వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు. నలిమెల భాస్కర్కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ కవి, భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్కు ‘అనువాద సాహిత్యం’లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిలగళ్’ నవలను ‘స్మారక శిలలు’ పేరుతో 2010లో భాస్కర్ తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లోని అత్యున్నత అనువాదాలకు అందజేస్తోంది. టోమస్ హలిక్కు టెంపుల్టన్ ప్రైజ్ చెక్కు చెందిన మతగురువు, మేధావి టోమస్ హలిక్కు 2014 టెంపుల్టన్ ప్రైజ్ లభించింది. పురస్కారాన్ని అందజేసే జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ మార్చి 13న ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డు కింద 1.1 మిలియన్ పౌండ్లు బహూకరిస్తారు. -
www.పాతికేళ్లు.కామ్