సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ సర్కార్‌ చర్యలు | AP Govt Actions On Simhachalam Land Irregularities | Sakshi
Sakshi News home page

సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ సర్కార్‌ చర్యలు

Published Tue, Jun 29 2021 9:01 PM | Last Updated on Tue, Jun 29 2021 9:22 PM

AP Govt Actions On Simhachalam Land Irregularities - Sakshi

సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడిషనల్‌ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడిషనల్‌ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పని చేశారు.

సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్‌లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్‌ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement