మూలధన వ్యయంలో ఏపీ టాప్‌ | AP tops in capital expenditure | Sakshi
Sakshi News home page

మూలధన వ్యయంలో ఏపీ టాప్‌

Aug 9 2023 3:54 AM | Updated on Aug 9 2023 10:40 AM

AP tops in capital expenditure - Sakshi

సాక్షి, అమరావతి: ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రి­ల్‌ నుంచి జూన్‌ వరకు మూలధన వ్యయంపై కాగ్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్‌లో మూలధన వ్య­యం కేటా­యింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి.

దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్‌ గణాంకాలు పేర్కొ­న్నా­యి. పలు రాష్ట్రా­లు బడ్జెట్‌­లో మూ­లధన వ్య­యం కేటాయింపుల్లో ఎంత మే­ర ఖర్చు చేశా­య­నే అంశా­న్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రం­లోనూ చేయలేదని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. బడ్జెట్‌లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి కాగ్‌ గణాంకాలు కూడా మూల«­దన వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉ­న్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభు­త్వం బడ్జె­ట్‌­లో మూలధన వ్యయం కింద రూ.31,061 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.12,669 కోట్లు వ్యయం చేసిందని, ఇది కేటాయింపుల్లో 40.79 శాతమని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదే­శ్‌ తరువాత మూలధన కేటాయింపుల్లో ఎ­క్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. మూలధన వ్యయం అంటే నేరు­గా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement