top
-
ప్రేమ పెళ్లి చేసుకున్న టాప్ క్రికెటర్లు (ఫొటోలు)
-
New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్లో భారత్
మనమంతా మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం-2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇంతలో అమెరికా జనాభా బ్యూరో ఒక ఆసక్తిక నివేదికను వెలువరించింది. 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని, దీనిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని తెలియజేసింది.2024 చివరి నాటికి ప్రపంచ జనాభా(World population) 7.1 కోట్లు పెరిగిందని, కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని తాజాగా అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023నాటి జనాభాతో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గడంతోపాటు 0.9 శాతంగా నమోదైంది. 2025 విషయానికొస్తే జనవరిలో ప్రపంచ జనాభా మరో 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రపంచంలో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు నమోదవుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.2024లో అమెరికా జనాభా 26 లక్షల మేరకు పెరిగింది. 2025 నాటికి అమెరికా జనాభా(US population) 34.1 కోట్లకు చేరుతుందని బ్యూరో అంచనాలున్నాయి. నూతన సంవత్సరం జనవరిలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందనే అంచనాలున్నాయి. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగింది. ఈ పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అగ్రరాజ్యం జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 2024లో భారతదేశ జనాభా 144.17 కోట్లు. 2025 భారత జనాభా అన్ని దేశాలను మించి టాప్లో ఉండే అవకాశాలున్నాయని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం -
రిటైర్మెంట్ ప్లానింగ్లో అక్కడివాళ్లే టాప్
కోల్కతా: విశ్రాంత జీవనం (రిటైర్మెంట్ తర్వాత) కోసం సన్నద్ధతతో తూర్పు భారత్ ప్రజలు ఇతర ప్రాంతాల వారితో పోల్చితే ముందున్నారు. ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్లో సున్నా నుంచి నూరు వరకు స్కేల్పై ఉత్తర భారత్ 54 పాయింట్ల వద్ద ఉంది. అదే దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలు రిటైర్మెంట్ జీవితానికి సన్నద్ధతలో 48 పాయింట్ల వద్దే ఉన్నాయి. పశ్చిమ భారత్ 49 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు 49 పాయింట్లుగా ఉంది. కాంటార్తో కలసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం’ నాలుగో ఎడిషన్ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. పట్టణ వాసుల్లో రిటైర్మెంట్ సన్నద్ధత ఎలా ఉంది, దీనిపై వారిలో ఉన్న అవగాహన, ఆకాంక్షలు, రిటైర్మెంట్ సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, ప్రణాళికల గురించి ఈ అధ్యయనం తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 పట్టణాల్లో 25–65 ఏళ్ల వయసులోని వారి అభిప్రాయాలు తెలుసుకుంది.అధ్యయనం వివరాలు.. తూర్పు భారత్లో 72 శాతం మంది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతేడాది ఇది 67 శాతంగా ఉంది. ఇదే ప్రాంతంలో 82 శాతం మంది ఆరోగ్యం కాపాడుకుంటామని నమ్మకంగా చెప్పారు. 67 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ను రిటైర్మెంట్ భద్రత కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఎన్పీఎస్ ఖాతా ఉంది. ఈ ప్రాంతంలో జీవిత బీమాపై 97 శాతం మందికి, హెల్త్ ఇన్సూరెన్స్పై 90 శాతం మందికి అవగాహన ఉంది.పశ్చిమ భారత్లో 66 శాతం మంది, ఉత్తర భారత్లో 60 శాతం, దక్షిణ భారత్లో 58 శాతం మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు.తూర్పు భారత్లో 56 శాతం మంది 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టడాన్ని సమర్థించారు. 50 ఏళ్లకు పైబడిన వారిలో 94 శాతం మంది ముందుగా రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు ప్రారంభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కనీస అవసరాలను తీర్చుకునే విషయంలో 62 శాతం మంది, పిల్లల భవిష్యత్ విషయమై 64 శాతం మందిలో ఆందోళన కనిపించింది. 94 శాతం మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం విషయంలో విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, 64 శాతం మంది ఒంటరితనం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పర్యావరణం పట్ల 76 శాతం మందిలో ఆందోళన కనిపించింది. తూర్పు భారత్లో ప్రతి నలుగురిలో ఒకరు రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు వైద్య అవసరాలు, పిల్లల భవిష్యత్కూ తమ ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.పెరుగుతున్న ప్రాధాన్యత..జీవనకాలం పెరుగుతుండడంతో భారతీయులకు రిటైర్మెంట్ ప్రణాళిక అత్యంత కీలకంగా మారుతోంది. మా అధ్యయనంలో గుర్తించిన అంశాలు మారుతున్న రిటైర్మెంట్ అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ విషయమై సమగ్రమైన విధానాన్ని అనుసరించేందుకు ఈ అధ్యయనం స్ఫూర్తినిస్తుంది.– ఈవీపీ రాహుల్ తల్వార్,మ్యాక్స్లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్? (ఫోటోలు)
-
Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్.
సృష్టి దబాస్ ముంబై ఆర్.బి.ఐ.లో హెచ్.ఆర్.లో పని చేస్తుంది. ఉద్యోగానికి రానూ పోనూ సమయం పని ఒత్తిడి ఇవేవీ ఆమె ఐ.ఏ.ఎస్. లక్ష్యానికి అంతరాయం కలిగించలేదు. కేవలం సొంతంగా చదువుకొని యు.పి.ఎస్.సి. 2023లో టాప్ 6 వ ర్యాంక్ సాధించింది. ఆమె పరిచయం. ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ స్థాయిలో హెచ్.ఆర్.లో పని చేస్తున్న సృష్టి దబాస్ నెల జీతం 2,80,000. బహుశా ఒక జిల్లా కలెక్టర్కు కూడా అంతే ఉండొచ్చు. లేదా దరిదాపుల్లో ఉండొచ్చు. 25 ఏళ్ల వయసులో అంత జీతం వస్తున్న ఉద్యోగం (కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసి సాధించింది) వేరొకరికి ఉంటే చాలు ఈ జీవితానికి అనుకునేవారు. కాని సృష్టి అలా అనుకోలేదు. ముంబైలో తన రూమ్ నుంచి ఆఫీస్కు రోజూ తిరుగుతూనే, ఉద్యోగం చేస్తూనే ఐ.ఏ.ఎస్ కల నెరవేర్చుకోవాలనుకుంది. సాధించింది. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. ఆమె చెప్పినట్టుగా ‘దాని వెనుక చాలా కష్టం ఉంది’. అవును. కష్టం లేనిది ఏ విజయమూ దక్కదు. ముందు కుటుంబం ఢిల్లీలో పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి వెంటనే ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. పోటీ పరీక్ష రాసి ‘సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’మంత్రిత్వ శాఖ’లో ఉద్యోగం సంపాదించింది. మరో పోటీ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ‘నా కుటుంబం కుదురుకోవాలనుకున్నాను. అందుకే ఉద్యోగాలు చేశాను. నాకు చదువుకోవాలని ఉన్నా ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదివాను’ అని చెప్పిందామె. సృష్టి తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ.ఎస్.ఐ. స్థాయికి వచ్చిన మధ్యతరగతి ఉద్యోగి. తల్లి గృహిణి. సృష్టి బాల్యం నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేది. మొదటి అటెంప్ట్ టాప్ 10 ర్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే చాలామంది రెండోసారి, మూడోసారి ప్రయత్నించి సాధిస్తుంటారు. కాని సృష్టి తన మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించింది. అదీ ఉద్యోగం చేస్తూ. ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘ఉద్యోగం చేస్తూ చదవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మనసుకు తర్ఫీదు ఇచ్చుకున్నాను. నా ఉద్యోగం ఐదు రోజులే. శని, ఆదివారాలు పూర్తిగా చదివేదాన్ని. తెల్లవారు జామున లేవడం నాకు అలవాటు. అప్పుడు చదివేదాన్ని. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసట ఉన్నా చదివేదాన్ని. మా అమ్మ నా కష్టం చూసి సతమతమయ్యేది. కాని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. మా ఆఫీస్లో కూడా నాకు ్రపోత్సాహం దొరికింది. పనిలో కాసేపు విరామం దొరికినా ఆర్.బి.ఐ.లోని లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. నాకున్న సెలవులని పొదుపుగా వాడి ప్రిలిమ్స్కు, మెయిన్స్కు, ఇంటర్వ్యూకు ముందు ఉపయోగించుకున్నాను’ అని తెలిపింది సృష్టి. చట్ట ప్రకారం సృష్టి అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూల్లో ‘మీ నాన్న పోలీస్ కదా. నువ్వు పోలీసు వారి పని స్వభావంలో ఎటువంటి మార్పు తెస్తావ్’ అని అడిగితే ‘ముందు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఖాళీల వల్ల పని ఒత్తిడి పోలీసులకు ఎక్కువ. అలాగే సాంకేతికంగా వారికి ఆధునిక ఆయుధాలు, ఎక్విప్మెంట్ సమకూర్చాలి’ అని చెప్పింది. ‘ఉత్తర ప్రదేశ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లను ఎలా చూస్తావ్’ అనంటే ‘అది చట్టసమ్మతం కాదు. నేనైతే ఎన్కౌంటర్లను కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగిస్తాను’ అని తెలిపింది. ‘బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పై నీ అభి్రపాయం ఏమిటి?’ అనడిగితే ‘కూల్చడం కన్నా అక్కడ ఉన్నవారికి పునరావాసం కల్పించడం కీలకం’ అంది. అంతర్జాతీయల వ్యవహారాలను తన ప్రధాన ఆసక్తిగా చెప్పిన సృష్టి మన దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగి ఉంది. ఆమె కథక్ డాన్సర్ కూడా. ‘భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సులున్నాయి?’ అనే ప్రశ్నకు ‘మన సంగీత నాటక అకాడెమీ 8 డాన్సులను గుర్తించింది. కాని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చౌవ్ డాన్స్ను కూడా క్లాసికల్గా పేర్కొంది. కాబట్టి సరైన ఆన్సర్ 8 కావచ్చు. 9 కూడా కావచ్చు’ అంది సృష్టి. ఆమె సక్సెస్ స్టోరీ చాలామందికి తప్పకుండా స్ఫూర్తి అవుతుంది -
Indian Origin CEOs: టాప్ కంపెనీలు.. మనవాళ్లే సీఈవోలు (ఫొటోలు)
-
ఫ్రాన్స్ పాస్పోర్టు చాలా పవర్ఫుల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ పాస్పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంక్స్–2024’ ఈ మేరకు పేర్కొంది. ఇందులో భారత పాస్పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానం పడిపోయింది. గతేడాది ఇండియా పాస్పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది! అత్యంత శక్తివంతమైన ఫ్రాన్స్ పాస్పోర్టు కలిగి ఉంటే 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. పాకిస్తాన్ పాస్పోర్టు ఈసారి కూడా 106వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పాస్పోర్టు ర్యాంకు 101 నుంచి 102కు పడిపోయింది. చిన్నదేశమైన మాల్దీవుల పాస్పోర్టు ర్యాంకు 58. ఈ పాస్పోర్టు ఉంటే 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా పాస్పోర్టులకు ర్యాంకులు ఇస్తుంటారు. ఇందుకోసం గత 19 ఏళ్ల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 199 పాస్పోర్టులకు ర్యాంకులు ఇస్తారు. వీసా లేకున్నా తమ దేశంలో పర్యటించే అవకాశం కలి్పస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో సగటున 58 దేశాల్లో వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది. -
‘టాప్’లోకి జైపూర్ పింక్ పాంథర్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 27–22తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో పింక్ పాంథర్స్కిది 13వ విజయం కావడం విశేషం. ప్రస్తుతం పింక్ పాంథర్స్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి వచ్చింది. పుణేరి పల్టన్ 76 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 40–31తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్; హరియాణా స్టీలర్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
స్మార్ట్ఫోన్స్ ఆదాయాల్లో యాపిల్ టాప్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గతేడాది (2023) అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తొలిసారిగా ఆదాయాలపరంగా అగ్రస్థానం దక్కించుకుంది. అమ్మకాల పరిమాణంపరంగా శాంసంగ్ నంబర్వన్గా ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నెలవారీ స్మార్ట్ఫోన్ ట్రాకర్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో భారత్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ..దాదాపు అంతక్రితం ఏడాది స్థాయిలోనే 15.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. కొరియన్ దిగ్గజం శాంసంగ్, చైనా మొబైల్స్ తయారీ సంస్థలు వివో, ఒప్పో తమ మార్కెట్ వాటాలను పెంచుకోగలిగాయి. భారత్పై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా యాపిల్కి కలిసి వస్తోందని కౌంటర్పాయింట్ తమ నివేదికలో తెలిపింది. స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా గతేడాది ప్రథమార్ధం సవాళ్లతో గడిచిందని, డిమాండ్ పడిపోయి, నిల్వలు పెరిగిపోయాయని పేర్కొంది. 5జీ అప్గ్రేడ్లు, పండుగ సీజన్ అమ్మకాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో ద్వితీయార్ధంలో మార్కెట్ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టిందని వివరించింది. మొత్తం ఫోన్ల మార్కెట్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 52 శాతం దాటిందని, వార్షిక ప్రాతిపదికన 66 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మరోవైపు, 2023 నాలుగో త్రైమాసికంలో దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ 25 శాతం వృద్ధి చెందినట్లు కౌంటర్పాయింట్ తెలిపింది. మరిన్ని విశేషాలు.. ► స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు ప్రీమియం ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2023లో రూ. 30,000 పైన రేటు ఉన్న ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ స్కీములు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ఫైనాన్స్ మీదే కొన్నారు. ► ప్రీమియం సెగ్మెంట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు మరింతగా ఆదరణ పెరగవచ్చు. వాటి అమ్మకాలు 2024లో 10 లక్షలు దాటవచ్చని అంచనా. ► స్మార్ట్ఫోన్లలో ఆడియో–వీడియోపరంగా డాల్బీ అటా్మస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు మరింతగా పెరగవచ్చు. -
ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం!
సరిగ్గా వారం రోజుల్లో ఈ ఏడాది(2023) ముగియనుంది. కొత్త సంవత్సరం సోమవారంతో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎన్నో అనూహ్య పరిణామాలకు సాక్షిగా నిలిచింది. ఈ సంవత్సరంలో కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులు కనిపించాయి. 2023లో పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్) ఈ ఏడాది సెప్టెంబర్లో ఉదయ్ కోటక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్ణీత సమయం కంటే ముందే పదవిని వదిలిపెట్టి, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కోటక్ ఇంత హఠాత్తుగా ఎందుకు తన పదవిని విడిచిపెట్టారనే దానిపై ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే ఆయన రాజీనామా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2. రాజేష్ గోపీనాథన్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్/టీసీఎస్) దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్లో ఈ ఏడాది నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ మార్చిలో హఠాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు దశాబ్దాల కంపెనీ చరిత్రలో కేవలం నలుగురు సీఈవోలు మాత్రమే విధులు నిర్వహించారు. 3. వేణు నాయర్ (షాపర్స్ స్టాప్) రిటైల్ స్టోర్ చైన్ షాపర్స్ స్టాప్ సీఈఓ వేణు నాయర్ గత ఆగస్టులో రాజీనామా చేశారు. తన కుటుంబంతో సమయం గడిపేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వేణు షాపర్స్ స్టాప్లో చేరారు. కంపెనీని ఓమ్నిఛానల్ రిటైలర్గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రాజీనామా మార్కెట్ను ఆశ్చర్యపరిచింది. ఈ వార్త బయటకు వచ్చాక కంపెనీ షేర్లు 11 శాతం మేరకు పడిపోయాయి. 4. మురళీ రామకృష్ణన్ (సౌత్ ఇండియన్ బ్యాంక్) మురళీ రామకృష్ణన్ ఈ ఏడాది మార్చిలో ఇండియన్ బ్యాంక్ నుండి నిష్క్రమించారు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. 2020 జూలైలో బ్యాంక్లో సలహాదారుగా చేరిన రామకృష్ణన్ నాలుగు నెలల వ్యవధిలోనే ఎండీ, సీఈఓగా ఎదిగారు. 5. మాథ్యూ జాబ్ (క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్) క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ సీఈఓ మాథ్యూ జాబ్ ఈ ఏడాది ఏప్రిల్లో ఇతర కెరీర్ ప్రయోజనాలను కారణంగా చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామా కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు! -
ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..!
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియాలో అత్యధికంగా కనిపించే (విజిబిలిటీ) కార్పొరేట్ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వార్తల్లో కార్పొరేట్ల విజిబిలిటీని విశ్లేషించే విజికీ న్యూస్ స్కోర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023కి గాను రిలయన్స్ 96.46 స్కోరుతో నంబర్ వన్ స్థానంలో ఉంది. గతేడాది ఇది 92.56గా, 2021లో 84.9గా నమోదైంది. నివేదికలోని మిగతా సంస్థల స్కోరుకు, రిలయన్స్ స్కోరుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఎస్బీఐకి 85.81, హెచ్డీఎఫ్సీకి 84.06, ఐసీఐసీఐ బ్యాంక్కి 81.9, భారతి ఎయిర్టెల్కు 80.64 స్కోరు లభించింది. 4,00,000 పైచిలుకు ప్రచురణ సంస్థల్లో వార్తలు, హెడ్లైన్స్, సదరు పబ్లికేషన్ విస్తృతి, రీడర్షిప్ మొదలైన వాటి ఆధారంగా ఈ స్కోరు ఇచ్చారు. ఇందుకోసం కృత్రిమ మేథ, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించారు. విజికీ పరిశోధన ప్రకారం పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్)పరంగా కూడా రిలయన్స్ పటిష్టంగా ఉంది. నాలుగేళ్ల క్రితం విజికీ న్యూస్ స్కోర్ ప్రారంభమైనప్పటి నుంచి రిలయన్సే అగ్రస్థానంలో ఉంటోంది. కంపెనీ స్కోరు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. -
వైద్యరంగంలో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలినుంచీ ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛత, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగిన అత్యధిక ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపు పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆస్పత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు వంటి ఏడు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఆస్పత్రులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా 2022–23లో దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ అవార్డులను కేటాయించారు. ఇందులో 3,161 ఆస్పత్రులకు అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2,619 ఆస్పత్రులతో తమిళనాడు రెండో స్థానంలో, 2,414 ఆస్పత్రులతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 734, కర్ణాటకలో 371, కేరళలో ఆస్పత్రులకు మాత్రమే అవార్డులు లభించాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించే విభాగంలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022–23లో దేశవ్యాప్తంగా 2,041 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) లభించగా.. ఇందులో 18 శాతం ఆస్పత్రులు ఏపీ నుంచి ఉన్నాయి. -
అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి!
న్యూఢిల్లీ: ప్రధానిగా రెండో టర్ము చివరి దశకు వచ్చినా మోదీ చరిష్మా చెక్కు చెదరడం లేదు. ఇప్పటికీ భారత్లో మోదీని ప్రధానిగా 76 శాతం మంది ఆమోదిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.ప్రపంచంలోని పలు అగ్ర దేశాల ప్రధానుల్లోకెల్లా మోదీ యాక్సెప్టెన్సీ రేటు అత్యధికంగా ఉండటం విశేషం. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ చేసిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ సర్వేలో మోదీ ఇప్పటికీ నెంబర్ వన్ అని తేలింది. అయితే దేశంలో 18 శాతం మంది మాత్రం మోదీ ప్రధానిగా ఉండటాన్నివ్యతిరేకించగా 6 శాతం మంది ఎలాంటి అభిప్రాయం చెప్పలేమన్నారు. మోదీ తర్వాత మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మ్యాన్యువెల్ లోపెజ్ ఆ దేశంలో 66 శాతం మంది ప్రజల ఆమోదంతో రెండో స్థానంలో నిలిచారు. 58 శాతం మంది ఆమోదంతో స్విస్ ప్రెసిడెంట్ అలెయిన్ బెర్సెట్ మూడవ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడ్న్ 37 శాతం, కెనడియన్ పీఎమ్ జస్టిన్ ట్రూడో 31 శాతం, యూకే పీఎమ్ రిషిసునాక్ 25 శాతం, ఫ్రాన్స్ అధ్యకక్షుడు మార్కన్కు24 శాతం ఆమోదం లభించింది. గతంలోనూ మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేల్లో మోదీ ప్రపంచంలోని దేశాధినేతల్లో టాప్లో నిలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్,మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయఢంకా మోగించిన తర్వాత వెల్లడైన ఈ సర్వే ఆ పార్టీకి పెద్ద పాజిటివ్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏదే హవా అని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..‘మహువా’పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం -
చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే!
ప్రపంచంలో ఎక్కడైనా చాయ్ తాగాలంటే జేబులో డబ్బులుంటే సరిపోతుంది. చైనాలోని హువాషాన్ టీహౌస్లో చాయ్ తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు, తగినంత గుండెధైర్యం, సాహసం కూడా ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ చాయ్ తాగాలంటే, కొండ ఎక్కాల్సిందే! చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో ఉన్న హువా పర్వతం మీదకు వెళ్లే దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొండ దారుల్లో ఒకటిగా పేరుమోసింది. ఈ కొండ మీద ఉన్న హువాషాన్ ఆలయానికి అనుబంధంగా చాయ్ హోటల్ ఉంది. తావో మతస్థులకు ఇది పవిత్ర ఆలయం. భక్తితో పాటు ధైర్యసాహసాలు ఉన్న తావో మతస్థులు ఈ కొండపైకెక్కి, ఇక్కడ వేడి వేడి చాయ్ సేవించి, సేదదీరుతుంటారు. సముద్ర మట్టానికి 2,154 మీటర్ల ఎత్తున ఉన్న పర్వత శిఖరం మీద వెలసిన ఈ చాయ్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న హోటల్గా ప్రసిద్ధి పొందింది. (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్?
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం లోపల నుంచి డ్రిల్లింగ్ పనులు సాగుతున్నా, ఆటంకాలు తలెత్తుతుండటంతో సొరంగం పైనుంచి కూడా డ్రిల్లింగ్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని జియోఫిజికల్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను నిపుణులు నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్డీసీఎల్)కి సమర్పించారు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 13 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల నుండి బాధిత కార్మికులను చేరేందుకు మార్గం ఏర్పడని పక్షంలో సొరంగం పైనుండి కూడా డ్రిల్ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు కసరత్తు ప్రారంభించారు. డ్రిల్లింగ్ చేయాల్సిన స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిని జియోఫిజికల్ నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్సన్ కంపెనీకి చెందిన జియోఫిజికల్ నిపుణుడు బి భాస్కర్ మాట్లాడుతూ. ఆ స్థలాన్ని పరిశీలించామని, డ్రిల్కు ఆ ప్రాంతంలో ఎలాంటి నీటి వనరులు అడ్డురావని తేలిందన్నారు. కాగా డ్రిల్లింగ్ సమయంలో ఏదైనా నీటి వనరు అడ్డుపడితే మొత్తం ఆపరేషన్తో పాటు 41 మంది కూలీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇతర ఎంపికలలో భాగంగా సొరంగం పై నుండి డ్రిల్ చేయడానికి అతిపెద్ద డ్రిల్ యంత్రాన్ని సిద్ధం చేశారు. ఇది వివిధ భాగాలుగా తీసుకువచ్చారు. తరువాత దానిని అనుసంధానించారు. ఇతర డ్రిల్ యంత్రాలను కూడా ఇక్కడకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు -
ప్రపంచంలో బడా భూస్వామి ఎవరు?
ఆ ప్రముఖునికి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన మార్కెటింగ్ సముదాయాలు అతని సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా అతనికి ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతనికున్న భూములు, ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కంపెనీనే ఉంది. ఈ అపార ఆస్తిపాస్తులు బ్రిటన్ రాజకుటుంబానికి సొంతం. వీటికి యజమాని బ్రిటన్ రాజు చార్లెస్- III. అతని తల్లి క్వీన్ ఎలిజబెత్- II మరణం తరువాత కింగ్ చార్లెస్ ప్రపంచంలోనే భారీ ఆస్తిపాస్తులకు యజమానిగా మారారు. ఇతను బతికి ఉన్నంత వరకూ ఈ ఆస్తిని అతని సొంత ఆస్తిగా పరిగణిస్తారు. దీనికి అతను ప్రైవేట్ యజమాని కాదు. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రపంచవ్యాప్తంగా 6.6 బిలియన్ ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ భూములు గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం సంపదలో 16.6 శాతం ఈ బ్రిటిష్ రాజుకు చెందినదేని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ది క్రౌన్ ఎస్టేట్ అనే సంస్థ ఈ ఆస్తిపాస్తులను పర్యవేక్షిస్తుంది. ఈ బ్రిటీష్ రాజుకు ఒక లక్షా 15 వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూములున్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన భూములు, ఆస్తులు, బీచ్లు, మార్కెట్లు, నివాస స్థలాలు, కార్యాలయ సముదాయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో క్రౌన్ ఎస్టేట్ వివిధ షాపింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ రాజుకు ఇసుక, కంకర, సున్నపురాయి, గ్రానైట్, ఇటుక, మట్టి, బొగ్గు, స్లేట్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి. 2022 సెప్టెంబరులో కింగ్ చార్లెస్- III సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతను $46 బిలియన్ల సామ్రాజ్యానికి అధిపతి. (ఒక బిలియన్ అంటే రూ. 100 కోట్లు) ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్లో ఉంది. ఈ ఆస్తులను క్రౌన్ ఎస్టేట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. కింగ్ చార్లెస్- III తరువాత అత్యధిక భూముల కలిగిన వ్యక్తిగా సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా నిలిచారు. ఇతనికి ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఈ జాబితాలో తరువాతి పేరు సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా. ఇతనికి వ్యక్తిగతంగా ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
భారత వర్సిటీలకు అగ్రాసనం
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్లో భారత్ అత్యధిక విద్యా సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం 856 విద్యా సంస్థలతో క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో 148 వర్సిటీలతో భారత్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. గతేడాదితో పోలిస్తే కొత్తగా 37 భారతీయ వర్సిటీలు ర్యాంకులు పొందాయి. టాప్–100 ర్యాంకుల్లో ఏడు భారతీయ వర్సిటీలకు చోటు దక్కింది. క్యూఎస్ సంస్థ అంతర్జాతీయంగా ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు 11 సూచికల్లో విశ్లేషించి ర్యాంకులను ఇస్తోంది. దేశంలో ఐఐటీ బాంబే టాప్ ఆసియా క్యూఎస్ ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు మునుపటి ఎడిషన్తో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. ఐఐటీ–బాంబే గతేడాది మాదిరిగానే 40వ ర్యాంకులో కొనసాగుతూ భారత్లో ఉత్తమ వర్సిటీగా నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ–ఢిల్లీ (46), ఐఐటీ–మద్రాస్ (53) స్థిరంగా ఉన్నాయి. ఐఐఎస్సీ బెంగళూరు (58), ఐఐటీ ఖరగ్పూర్ (59), ఐఐటీ కాన్పూర్ (63), ఢిల్లీ వర్సిటీ(94) వందలోపు ర్యాంకులు సాధించాయి. 100–200 ర్యాంకింగ్స్లో ఐఐటీ గౌహతి 111, ఐఐటీ రూర్కీ 116వ ర్యాంకులో నిలిచాయి. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ 117, బెనారస్ హిందూ వర్సిటీలకు 199, గతేడాది 185 స్థానంలో ఉన్న ఛండీగఢ్ వర్సిటీ 149కి వచ్చింది. కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ 205 నుంచి 171కి, అమిటీ వర్సిటీ 200 నుంచి 186కి, వెల్లూరులోని విట్ పది స్థానాలు మెరుగుపర్చుకుని 163 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఆసియా టాప్ వర్సిటీ ‘పెకింగ్’ భారత్ తర్వాత క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో చైనా 133, జపాన్ 96 వర్సిటీలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన పెకింగ్ విశ్వవిద్యాలయం వరుసగా రెండవ ఏడాది టాప్ వర్సిటీగా నిలిచింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం 4వ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్) ఈ ఏడాది రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ (ఎన్టీయూ) ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. ఏపీ నుంచి ఐదు ప్రభుత్వ వర్సిటీలు తెలుగు రాష్ట్రాల నుంచి 12 వర్సిటీలకు క్యూఎస్ ఆసియా వర్సిటీల జాబితాలో స్థానం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జపాన్కు చెందిన కుమామోటో వర్సిటీతో సమానంగా 228 ర్యాంకును పంచుకుంటోంది. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ (301–350), ఉస్మానియా, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (451–500), అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ (551–600), గుంటూరులోని ఆచార్య నాగార్జున (601–650), విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, అనంతపురంలోని జేఎన్టీయూ (651–700), ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్లోని ఐసీఎఫ్ఏఐ, గుంటూరులోని కేఎల్యూ, విశాఖలోని గీతమ్, విజ్ఞాన్ వర్సిటీలు ఉన్నాయి. టాప్ 10 ఆసియా విశ్వవిద్యాలయాలివీ.. ♦ పెకింగ్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ హాంకాంగ్ విశ్వవిద్యాలయం (హాంకాంగ్ ఎస్ఏఆర్) ♦ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్) ♦ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్) ♦ సింగువా విశ్వవిద్యాలయం (చైనా) ♦ జెజియాంగ్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ ఫుడాన్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ యోన్సీ విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా) ♦ కొరియా విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా) ♦ చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ (హాంకాంగ్ ఎస్ఏఆర్) -
సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశవ్యాప్తంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు 10,018 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సాంకేతికతతో గుర్తించి, వాటిని తిరిగి యజమానులకు అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ సీఈఐఆర్ టెక్నాలజీ వాడటంతో 39 శాతం మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని, మరో 86,395 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్న సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ లావణ్య, ఇతర అధికారులను డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. -
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లలో శక్తి కాంతదాస్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ర్యాంక్ పొందారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ ఫై నాన్స్ మ్యాగజైన్ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక ర్యాంకును అందించింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రచురించిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్, 2023లో దాస్ ‘ఏ ప్లస్’ రేటింగ్ పొందారు. ‘ఏ ప్లస్’ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల జాబితాలో దాస్ అగ్రస్థానంలో ఉన్నారు. దాస్ తర్వాతి వరుసలో స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, వియత్నాం సెంట్రల్ బ్యాంక్ చీఫ్ న్గుయెన్ థి హాంగ్ ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటన ప్రకారం ద్రవ్యో ల్బ ణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేటు నిర్వహణలో విజయం తత్సంబంధ అంశాల స్కేల్పై ఆధారపడి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ వరకూ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ‘ఏ ప్లస్’ అద్భుత పనితీరు ను ప్రతిబింబిస్తే, పూర్తి వైఫల్యాన్ని ‘ఎఫ్’ సూచిస్తుంది. రెండవ ప్రతిష్టాత్మక గుర్తింపు లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్, 2023 జూన్లో దాస్కు ’గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేసిన నేపథ్యంలోనే ఆయనకు తాజాగా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం గమనార్హం. ద్రవ్యోల్బణంపై పోరు, డిమాండ్ పెరుగుదల, సప్లై చైన్కు అంతరాయం కలగకుండా చర్యలు వంటి పలు సవాళ్ల పరిష్కారానికి ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రభుత్వాలూ తమ సెంట్రల్ బ్యాంక్ల వైపు చూసినట్లు మ్యాగజైన్ పేర్కొంది. ‘ఏ’ గ్రేడ్ పొందిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో బ్రెజిల్కు చెందిన రాబర్టో కాంపోస్ నెటో, ఇజ్రాయెల్కు చెందిన అమీర్ యారోన్, మారిషస్కు చెందిన హర్వేష్ కుమార్ సీగోలం, న్యూజిలాండ్కు చెందిన అడ్రియన్ ఓర్ ఉన్నారు. కొలంబియాకు చెందిన లియోనార్డో విల్లార్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన హెక్టర్ వాల్డెజ్ అల్బిజు, ఐస్లాండ్కు చెందిన అస్గీర్ జాన్సన్, ఇండోనేíÙయాకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పెర్రీ వార్జియో ‘ఏ’ మైనస్ గ్రేడ్ పొందిన గవర్నర్లలో ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 1994 నుంచి గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ను ప్రచురిస్తోంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ సహా 101 దేశాలు, భూభాగాలు, జిల్లాల గ్రేడ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకుల ప్రకటన జరుగుతోంది. -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!
సెలబ్రెటీలు ధరించే డ్రెస్లు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. వాటి ధర కూడా ఖరీదుగానే ఉంటాయి. క్రికెటర్లనే పెళ్లి చేసుకున్న భాలీవుడ్ భామలు ఇద్దరూ ఒకేలాంటి స్లీవ్లె్లెస్ టాప్లు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్ని గత నెలలో పెళ్లిబంధంలో ఒక్కటయ్యారు. ఇక అనుష్కా క్రికెటర్ విరాట్ని కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి వామిక అను కూతురు కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు ఒకే బ్రాండ్ మాలీకి చెందిన దుస్తులు ధరించారు. అందులో ఇద్దరు తమ అందంతో చూపురులను కట్టిపడేశారు. అయితే వారు ధరించి ఆ షార్ట్ టాప్ల ధర వింటే షాకవ్వడం ఖాయం. సెలబ్రెటీలు దరించేవి చాలా ఖరీదైనవే అయినప్పటికీ..కొన్ని దుస్తులుకు ఇంతపెట్టారా అనే ఫీల్ వస్తుంది. అది సహజం. ఏ చీర లేదా లెహంగా అంత ధర ఉందంటే ఓకే చిన్న షార్ట్ లాంటి టాప్ ఏకంగా రూ. 18000/ అంటే నిజమేనా? అనిపిస్తుంది కదా! కానీ బ్రాండ్లకు పెట్టింది పేరు అయిన మలై బ్రాండ్ ధరలు ఎక్కువనే చెప్పాలి. ఆయా ఫ్యాషన్ కాస్ట్యూమ్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అతియా శెట్టి గూలాబీ రంగు స్లీవ్లెస్ టాప్, జీన్స్ ఫ్యాంట్లో అదర్సు అన్నట్లు ఉంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) చక్కటి ఈయర్ రింగ్స్, మ్యాచింగ్ లిప్స్టిక్తో మంచి లుక్తో ట్రెండీగా ఉంది అతియా. ఇక అనుష్క శర్మ కూడా సేమ్ అదే మాదిరి పసుపు రంగు టాప్లో చూడచక్కగా ఉంది. కంఫర్ట్ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే అనుష్క రెండు నెలల క్రితం ఈ టాప్ని ధరించిన ఫోటోని నెట్టింట షేర్ చేసింది. ఇప్పుడూ అతియా అదే టాప్ వేసుకోవడంతో నెలక్రితం నాటి అనుష్క ఫోటోతో కలిపి అతియా ఫోటో నెట్టింట సందడి చేయడం. దీంతో నెటిజన్లు మీ భుజాలను కవర్ చేసేలా డ్రస్లు వేయకూడదనుకుంటున్నారా అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్ట్లు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: పండుగ వేళ ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!) -
Women Behind Top Businessmen: బిజినెస్ టైకూన్ల సక్సెస్: ఈ విమెన్ గురించి తెలుసా?
-
AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. నిజానికి దేశవ్యాప్తంగా పెరిగిన ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2015–2020 మధ్య 3.81 కోట్లుండగా... 2020–23 మధ్య మాత్రం 1 కోటి మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, తక్కువ ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయాల కేటగిరీల్లోకి వెళుతున్నారని... ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లిస్తుండటంతో ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతోందని సంస్థ తెలియజేసింది. ఫలితంగా 2023లో ఐటీ రిటర్నుల దాఖల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆదాయం.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక మేరకు... 2014లో దేశంలో మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం రూ.4.4 లక్షలు. 2023 నాటికి అది రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గడిచిన పదేళ్లలో రూ.5 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.10 లక్షల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించే వారు ఏకంగా 8.1 శాతం పెరిగారు. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. ఇక రూ.20 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి చేరింది 1.5 శాతం. రూ.50 లక్షల కేటగిరీ నుంచి రూ.1 కోటి కేటగిరీకి 0.2 శాతం మంది, రూ.1 కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుదల ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. దేశ జనాభా 2023లో 140 కోట్లుండగా 2047 నాటికి ఇది 161 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 53 కోట్లు. 2047 నాటికి 72.5 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే.. మొత్తం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక వెల్లడించింది. 2023లో ఐటీ పరిధిలోకి 31.3 కోట్ల మంది ఉద్యోగులు రాగా 2047 నాటికి 56.5 కోట్లకు ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లలో ఉద్యోగుల వాటా ప్రస్తుతం 59.1 శాతం ఉండగా 2047 నాటికి ఇది 78 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. -
ఇదీ ఇండియన్స్ సత్తా! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో చరుగ్గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. అధిక సంఖ్యలో ఉండే తన ఫాలోవర్లకు ఆయా అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా విదేశాల్లో భారతీయుల అభ్యున్నతికి సంబంధించిన అంశంపై స్పందించారు. అమెరికాలో బిలియన్ డాలర్ల కంపెనీలను స్థాపించిన విదేశీ వ్యక్తుల్లో భారతీయులే టాప్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ‘వల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేయగా దాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఆశ్చర్యపరిచే గణాంకాలు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాలకు ఎంత చేస్తున్నారో.. ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఒక బిలియన్ డాలర్ అంత కంటే ఎక్కువ విలువైన అమెరికన్ కంపెనీలలో సగానికిపైగా విదేశాల్లో జన్మించి ఆ దేశానికి వలస వచ్చినవారే. వీరిలో భారత్ నుంచి వలస వెళ్లినవారే అత్యధికులు. విదేశీ వలసదారులు స్థాపించిన మొత్తం అమెరికన్ కంపెనీల్లో అత్యధికంగా భారతీయులు 66 కంపెనీలను స్థాపించారు. 54 కంపెనీలతో ఇజ్రాయిల్, 27 కంపెనీలతో యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. Astonishing figure. Demonstrates what value is brought by Indian Immigrants to a country of their adoption… https://t.co/TjcohqPsWP — anand mahindra (@anandmahindra) August 19, 2023 -
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు. -
మూలధన వ్యయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూలధన వ్యయంపై కాగ్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. పలు రాష్ట్రాలు బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేశాయనే అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయలేదని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి కాగ్ గణాంకాలు కూడా మూల«దన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.31,061 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.12,669 కోట్లు వ్యయం చేసిందని, ఇది కేటాయింపుల్లో 40.79 శాతమని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ తరువాత మూలధన కేటాయింపుల్లో ఎక్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. మూలధన వ్యయం అంటే నేరుగా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు. -
పేరు మార్చుకున్న ఈ టాప్ కంపెనీల గురించి తెలుసా?
-
అదరగొట్టిన రిలయన్స్ జియో
Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది. కొత్తగా 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు భారతీయ టెలికాం మార్కెట్పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో ఫీచర్ ఫోన్లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) -
టాప్ గేర్లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
టాప్ 30 హెడ్లైన్స్
-
టాప్ 30 ముఖ్యాంశాలు..!
-
టాప్ ఇండియన్ సెలబ్రిటీస్ ఏజ్డ్ ఇమేజెస్
-
డిస్నీ క్యారెక్టర్లుగా హాలీవుడ్ సెలబ్రిటీస్ వైరల్ ఫొటోస్
-
కోడిగుడ్డు.. ఏపీ రికార్డు.. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే..
సాక్షి, అమరావతి: కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత దేశంలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 1950లో ఏడాదికి 5 గుడ్లే 1950–51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. 1960–61లో కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే విశ్లేషించింది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశంలో 2021–22లో 129.60 బిలియన్ కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. వాణిజ్య పౌల్ట్రీల ద్వారా 109.93 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు, పెరటి పౌల్ట్రీల ద్వారా 19.67 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మూడేళ్లుగా (2019–20 నుంచి 2021–22) వరకు కోడిగుడ్ల ఉత్పత్తి పెరుగుతోందని సర్వే వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో పెరటి కోళ్ల సంఖ్య కూడా రెండేళ్లుగా పెరిగిందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70,740 ఉండగా.. 2021–22లో 1,31,69,200కు పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది. -
భారతదేశంలోని టాప్ 11 మిస్టీరియస్ టెంపుల్స్
-
రియల్టీ కింగ్.. డీఎల్ఎఫ్ సింగ్.. లిస్ట్లో తెలుగువారు!
న్యూఢిల్లీ: దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో మరోసారి నంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సంస్థ గ్రోహె, రీసెర్చ్ సంస్థ హురున్ ఇండియా సంయుక్తంగా ఈ లిస్టును రూపొందించింది. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కించుకున్నారు. జీఏఆర్ కార్పొరేషన్ వ్యవస్థాపక చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి కుటుంబం (రూ. 15,000 కోట్లు) పదో స్థానంలో నిల్చింది. మంగళవారం విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్ – లోధా గ్రూప్) రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్ఎంజెడ్ కార్ప్ అర్జున్ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దక్కగా, 36 మంది సంపద తగ్గింది. ఇతర వివరాలు.. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. ఢిల్లీ (23), కర్ణాటక (18) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు ఉన్నారు. నగరాలవారీగా చూస్తే ముంబై (29 మంది), న్యూఢిల్లీ (23), బెంగళూరు (18) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద 2017లో రూ. 3,350 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు ఎగిసింది. అలాగే టాప్ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు చేరింది. టాప్ 100 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ. 4,72,330 కోట్లుగా (57 బిలియన్ డాలర్లు) ఉంది. ఇందులో టాప్ 10 కుబేరుల వాటా 60%గా ఉంది. డీఎల్ఎఫ్కు చెందిన పియా సింగ్, రేణుకా తల్వార్ అత్యంత సంపన్న మహిళలుగా ఉన్నారు. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్టులు, ఇవే (ఫోటోలు)
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన పక్షులు
-
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...? -
కార్యాలయాలకు కేరాఫ్ హైదరాబాద్! ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్
పెద్ద కార్యాలయాలకు హైదరాబాద్ కేరాఫ్గా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ల లావాదేవీల జాబితాలో హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాలు టాప్లో ఉన్నాయి. ఇదీ చదవండి: కరూర్ వైశ్యా బ్యాంక్పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా.. మొత్తం ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 1 లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో లావాదేవీలు హైదరాబాద్, పుణేలలో 53 శాతం జరిగాయి. బెంగళూరులో ఈ లావాదేవీలు 51 శాతంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇక 50వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ల లావాదేవీలు కోల్కతాలో 70 శాతం, చెన్నైలో 57 శాతం జరిగాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబైలలో 50వేల నుంచి 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలకు ఈ విభాగంలో 30 శాతానికి పైగా లావాదేవీలు జరిగాయి. ఇదీ చదవండి: ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది! 2022లో ఆఫీస్ లీజింగ్ పరిమాణం 51 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు 2023లో మరింత ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్లకు సంబంధించి బెంగళూరులో 36 ఒప్పందాలు, హైదరాబాద్లో 15 డీల్స్, పుణెలో 13 ఒప్పందాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఈ నగరాల్లోని ఐటీ, తయారీ కంపెనీలు పెద్ద పరిమాణ కార్యాలయాలకు డిమాండ్ను పెంచాయని వివరించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్ఝున్వాలా ఎంట్రీ!సూపర్!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుడు బిలియనీర్, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చారు. 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 18 పరిశ్రమలు,99 నగరాల నుండి 176 మంది కొత్త ముఖాలు చోటు సంపాదించు కోగా రేఖా కుటుంబం జాబితాలోకి కొత్తగా ప్రవేశించిన 16 మంది సంపన్నుల జాబితాలో టాప్లో ఉంది. వీరి కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ లిస్ట్లోచేరింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 69 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, 26 మందితో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గినప్పటికీ, ఇండియా 16 మంది కొత్త బిలియనీర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖా నెలకు సుమారుగా రూ.650 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఆమె తన దివంగత భర్త నుండి భారీ సంపదను వారసత్వంగా పొందింది. టాటా గ్రూప్ టైటన్ టాప్లోఉండగా, మెట్రో బ్రాండ్స్ ,స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ , క్రిసిల్ రేఖ టాప్ పిక్స్గా చెప్పుకోవచ్చు. ట్రెండ్లైన్ డేటా ప్రకారం, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా పోర్ట్ఫోలియో ఇప్పుడు రేఖ నిర్వహిస్తున్నారు.మార్చి 22, 2023 నాటికి నికర విలువ రూ.32,059.54 కోట్లతో 29 స్టాక్లు రేఖ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. రేఖ ఝున్ఝున్వాలా ఎవరు? బిగ్బుల్గా పాపులర్ అయిన రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖ. రాకేష్ను 1987లో వివాహం చేసుకున్నారు రేఖా. వీరి అసెట్ కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ లో రాకేష్ 3.85 శాతం వాటా ఉండగా, రేఖకు 1.69 శాతం వాటా ఉంది. ఉమ్మడి బలం ఇప్పుడు 5 శాతానికి పైగా మాటే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: నిష్ఠ, ఆర్యమాన్ ., ఆర్యవీర్. తొలి కుమార్తె 2004లో జన్మించగా వారి కవల కుమారులు 2009లో జన్మించారు. కాగా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఆకాశ ఎయిర్ ప్రారంభించిన వారానికే (ఆగస్టు 2022) ఆయన కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఇపుడు పలు సర్వీసులతో విమానయాన రంగంలో స్పెషల్గా నిలుస్తోంది. అలాగే భర్త, 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా' పేరును నిలబెట్టేలా రేఖా కూడా సంపదలో దూసుకు పోతున్నారు. రాకేష్ ఝున్ఝున్వాలాకు పద్మశ్రీ మరోవైపు దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను ఉగాది ( 2023 మార్చి 22) మరణానంతరం పద్మశ్రీని ప్రదానం చేశారు. ఈ వేడుకకు హాజరైన రేఖ కుటుంబం ఆయన తరపున అవార్డును స్వీకరించింది. -
సమ్మర్ రష్: కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ జోరు
న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! వైట్గూడ్స్ తయారీ సంస్థలు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్కు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, బీర్ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి. ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) -
ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్ ఏదో తెలుసా?
సాక్షి, ముంబై: మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరి 2023 నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్ కొట్టేసింది. గత ఏడాది ఇదే కాలంలో 12,570 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో వార్షిక ప్రాతిపదికన పాజిటివ్ వాల్యూమ్ 48 శాతం పెరిగింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో మోడల్స్ను అధిగమించి మరి బాలెనో ఈ పాపులారిటీ సాధించింది. ఈ రెండు మోడల్స్ కార్లు ఒక్కొక్కటి 18,000 యూనిట్లకు పైగా సేల్ అయ్యాయి. అలాగే గత నెలలో ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ i20 , టాటా ఆల్ట్రోజ్లను వెనక్కి నెట్టేసింది బాలెనో. అప్డేటెడ్గా వచ్చిన బాలెనో మోడల్ రాక గేమ్ ఛేంజర్గా మారిందని. ప్రస్తుతం,మారుతి సుజుకి బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం నాలుగు వేరియంట్లలో,ఆరు రంగల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 6.56 లక్షలు- రూ. 9.83లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మారుతి సుజుకి బాలెనో ఇంజీన్ బాలెనోలోని 1.2-లీటర్ 4-సిలిండర్ DualJet VVT పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద గరిష్టంగా 90 PS పవర్ అవుట్పుట్ , 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 37 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం , 339 లీటర్ల బూట్స్పేస్ని కలిగిఉంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్మిషన్తో కూడి ఉంది. HUD, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్బ్యాగ్లు, రియర్ AC వెంట్స్, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, ఫాగ్ ల్యాంప్స్, UV కట్ గ్లాస్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం. -
టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా!
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారి తొలగింపు కథనాలు, కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో లింక్డ్ఇన్ వంటి సామాజిక వేదికలు నిండిపోయాయి. కొంతమంది ఇప్పటికే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోగా మరికొందరు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ, మంచి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మంచి నైపుణ్యాలు కావాలి. ఇంటర్వ్యూల్లో చూసేది ఇదే.. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ టాప్ సీక్రెట్ చెప్పారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో రిక్రూటర్లు అభ్యర్థులలో ఆశించే టాప్ స్కిల్ ఏంటో ఆమె బయటపెట్టారంటూ సీఎన్బీసీ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఓ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అభ్యర్థుల్లో రిక్రూటర్లు చూసే అత్యుత్తమ నైపుణ్యం స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్). ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! క్లైర్.. గూగుల్లో తన పదేళ్ల సుదీర్ఘ అనుభవంలో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు స్వీయ-అవగాహన ఎంత మేరకు కలిగి ఉన్నారో చేసేవారు. దాని ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. వారంలో 40 గంటలు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ఆమె వెచ్చించేవారు. ఈ సమయంలో తాను అభ్యర్థులలో అన్నింటికంటే ముందు చూసే ఒక నైపుణ్యం స్వీయ-అవగాహన అని ఆమె పేర్కొన్నారు. పని అనుభవం, ఇతర నైపుణ్యాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటిని నిదానంగా తెలుసుకోవచ్చన్నారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! క్లైర్ మాటల ప్రకారం.. ఇలా స్వీయ అవగాహన కలిగి ఉన్న వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపుతారు. చేయాల్సిన పని గురించి నిజాయితీగా ఉంటారు. సహోద్యోగులు, ఉన్నతోద్యోగులతో మెరుగైన సంబంధం కలిగి ఉంటారు. స్వీయ-అవగాహన అనేది ఒక 'అరుదైన' లక్షణం. ఓ పరిశోధన ప్రకారం.. 95 శాతం మంది అభ్యర్థులు తమకు స్వీయ-అవగాహన ఉందని భావిస్తారు. కానీ వాస్తవానికి 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. -
తలసరి ‘విద్యుత్’లో తెలంగాణకు ఐదో స్థానం..
సాక్షి, హైదరాబాద్: వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 3,137 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 2,200 యూనిట్లతో పంజాబ్, 2,131 యూనిట్లతో హరియాణా, 2,048 యూనిట్లతో గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది. 2019–20లో భారతదేశ తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లుకాగా.. 2020–21లో 1,161 యూనిట్లకు తగ్గిపోయింది. 2020–21 సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజాగా విడుదల చేసిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే.. 10,478 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దాద్రానగర్ హవేలీ తొలిస్థానంలో, 5,473 యూనిట్లతో డామన్ డయ్యూ రెండో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. కరెంటు మరణాలు ఎక్కువ విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలన్నింటిలోనూ కలిపి విద్యుత్ ప్రమాదాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2020–21లో రాష్ట్రంలో 4,676 ప్రమాదాలు చోటుచేసుకోగా, కర్ణాటకలో 2,935, రాజస్థాన్లో 2,726 ప్రమాదాలు జరిగాయి. ఇక రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 1,241 మంది మృతిచెందగా.. 219 మంది క్షతగాత్రులయ్యారు. 1,062 మరణాలతో మధ్యప్రదేశ్, 1,038 మరణాలతో మహారాష్ట్ర రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. విద్యుత్ ప్రమాదాలతో దేశంలో మొత్తంగా 9,021 మంది ప్రాణాలు కోల్పోగా, 3,750 మంది క్షతగాత్రులయ్యారు. విద్యుత్ ప్రమాదాల్లో మృతిచెందిన పశువుల సంఖ్య తెలంగాణలో (2,876 పశువులు) ఎక్కువగా ఉంది. మొత్తం ప్రమాదాల సంఖ్యలో మనుషులు, పశువుల మరణాలు/గాయాలు పాలైన ఘటనలు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్లో టాప్ ► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ► గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా.. 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ► వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో.. 128.81 యూనిట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. ► హెచ్టీ కేటగిరీ కింద పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో 1,163.99 యూనిట్లతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా.. తెలంగాణ 299.19 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం -
‘జలజీవన్ మిషన్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘జలజీవన్ మిషన్’ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకం అమలు జరుగుతుండగా.. రాష్ట్రాల వారీగా పథకం అమలు జరుగుతున్న తీరుపై కేంద్రం ప్రతినెలా పథకం అమలులో పురోగతిపై జిల్లాల వారీగా ర్యాంకుల్ని ప్రకటిస్తూ వస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగం ‘జలజీవన్ మిషన్ సర్వేక్షణ్ బులెటిన్’ పేరుతో విడుదల చేస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలు జరిగిన తీరుపై కేంద్రం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో మన రాష్ట్రంలోని విశాఖపట్నం దేశంలోనే రెండవ ర్యాంక్ కైవసం చేసుకోగా.. మరో రెండు జిల్లాలు టాప్–10 ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఐదవ స్థానం దక్కగా, అనకాపల్లి జిల్లా దేశంలోనే టాప్–10 జిల్లాల జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుంది. మూడు అంశాల ఆధారంగా.. ప్రతినెలా జిల్లాల వారీగా ఆయా గ్రామాల్లో కొత్తగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వటం.. తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.. అందుకు గ్రామ స్థాయిలో కలి్పస్తున్న వసతులు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా కేంద్రం ప్రతినెలా దేశంలోని జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. డిసెంబర్ నెలలో తమిళనాడులోని సేలం జిల్లా 91.79 మార్కుతో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించగా.. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా 86.85 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా 81.83 మార్కులతో 5వ ర్యాంక్, అనకాపల్లి జిల్లా 72.55 మార్కులతో పదో ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల వారీగా వివిధ అంశాలపై ప్రతినెలా జిల్లాల వారీగా పథకం పురోగతిపై మార్కులను కేటాయిస్తూ ర్యాంకులు ఇస్తోందని.. ప్రతినెలా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వివరించారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోనే సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీకి 2020, 2021 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒక లక్ష హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏపీలో 1,44,465 హెక్టార్లు సేంద్రీయ వ్యవసాయం కిందకు వచ్చినట్లు తెలిపారు. 2020–21లో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద 8 రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో లక్ష హెక్టార్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదవండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ 2019–20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల కింద సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు శిక్షణ, సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుల క్లస్టర్ల ఏర్పాటు, సామర్ధ్యం పెంపునకు హెక్టార్కు రూ.12,200 సాయాన్ని అందించినట్లు చెప్పారు. హ్యాండ్ హోల్డింగ్, సర్టిఫికేషన్, అవశేషాల విశ్లేషణ్కు హెక్టారుకు మూడేళ్లలో రూ. 2 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. సహజ సేద్య ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం, విలువ జోడింపునకు రైతులకు హెక్టార్కు మూడేళ్లలో రూ.8,800 డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ వరకు, ధృవీకరణ, మార్కెటింగ్, పంటకోత తర్వాత నిర్వహణకు పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. -
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్లోని వెలెన్సియా టాప్లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్తో మోదీ టాప్
-
రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్ ద్వారా సర్వే నంబర్ల వారీగా సాగవుతున్న పంటల గుర్తింపులో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించిందన్నారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభు త్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఈ–క్రాప్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. చదవండి: అతి త్వరలో గడపగడపకు వైద్యం జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ–క్రాప్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ–క్రాప్ అమలులో ఏపీని కూడా భాగస్వామిని చేయడం గర్వకారణమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా వంటి అన్ని పథకాలు ఈ–క్రాప్ ప్రామాణికంగానే అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ–క్రాప్ నమోదు చేసిన రైతులందరికీ ఈ–కేవైసీ (మీ పంట తెలుసుకోండి) నమోదు ప్రారంభించాలన్నారు. ‘వైఎస్సార్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్ల మంజూరుకు రైతు గ్రూపుల ఎంపికను సత్వరమే పూర్తి చేయాలన్నారు. -
పిల్లలను ఇలా పంపించగలమా?...ఏకంగా ఆటోపై కూర్చోబెట్టి..:వీడియో వైరల్
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందకు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న నిబంధనలను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు చాలా మంది వాహనదారులు. కళ్లముందే ఘోరమైన రోడ్డుప్రమాదాలు జరుగుతున్న కనువిప్పు కలగకపోవడం దురదృష్టం. ఏయే వాహనాల్లో ఎంతమంది ప్రయాణించాలానే రూల్ కూడా ఉంది. ఐతే డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది వాహనదారులు పరిమితికి మించి జనాలను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడొక ఒక ఆటో డ్రైవర్ అలాంటి పనే చేశాడు. విచిత్రమేమిటంటే అతను పోలీస్ కార్యాలయం నుంచి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఒక ఆటో డ్రైవర్ చిన్నారులను ఏకంగా ఆటోపైన కూర్చోబెట్టి తీసుకువెళ్లాడు. సుమారు ముగ్గురు చిన్నారులను ఆటో పైన కూర్చొబెట్టాడు. ఆ ముగ్గురు చిన్నారులు సుమారు 11 నుంచి 13 ఏళ్ల వయసు లోపు వాళ్లే. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేస్తూ "ఎవరైనా తమ పిల్లలను ఇలా పాఠశాలకు పంపగలారా?" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. పైగా ఆ ఆటో సమీపలోని ఆర్టీవో ఆఫీస్, నకిటీయా పోలీస్ ఔట్పోస్ట్ నుంచి వెళ్లినప్పటికీ ఎవరు చర్యలు తీసుకోకపోవడ విచిత్రం అని పేర్కొన్నాడు. బహుశా అందరూ నిద్రపోతున్నారంటూ... కామెంట్ చేశాడు. దీంతో బరేలీ పోలీసులు ఈ వైరల్ వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ...పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని, పైగా ఇలాంటి డ్రైవర్లను అనుమతించకుండా పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతామని చెప్పారు. How can someone send their children to school with such a careless auto driver. Visuals from UP's Bareilly. This auto crossed office of RTO, Nakatia police outpost on Friday but everyone seemed to be sleeping. No action taken with registration no. UP25ET8342 by@Uppolice pic.twitter.com/hcfidtIJFS — Raj Kumar Bhim Army (@Rajkuma79883678) August 28, 2022 (చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్) -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
ICC T20 Rankings: టీమిండియా నెంబర్వన్.. ఆరేళ్ల తర్వాత
దుబాయ్: ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం వెస్టిండీస్తో సిరీస్ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్వన్గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్వన్గా ఉన్న ఇంగ్లండ్ను రెండో స్థానానికి పడేసి రోహిత్ సేన ముందంజ వేసింది. ఇంగ్లండ్కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్వన్గా నిలిచింది. రెండు నెలల పాటు ఆ స్థానంలో ఉన్న జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. ప్రస్తుత ర్యాంకింగ్స్ పీరియడ్లో 5–0తో న్యూజిలాండ్తో, 2–1తో ఆ్రస్టేలియాపై, 3–2తో ఇంగ్లండ్పై, 3–0తో న్యూజిలాండ్పై, 3–0తో వెస్టిండీస్పై సాధించిన విజయాల కారణంగా భారత్కు టాప్ ర్యాంక్ లభించింది. -
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 7PM 19 January 2022
-
దేశంలో.. సింగరేణి ఆ ఘనత సాధించి నెంబర్ వన్గా నిలిచింది
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021–22లో డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నంబర్వన్గా నిలిచింది. అత్యధిక సామర్థ్యం(పీఎల్ఎఫ్)తో విద్యుదుత్పత్తి జరపడం తో ఈ ఘనత సాధించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ర్యాంకింగ్లో సింగరేణి విద్యుత్ కేంద్రం 2021 ఏప్రిల్– డిసెంబరు మధ్యకాలంలో 87.18% పీఎల్ఎఫ్ సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) 73.98% తో రెండో, 70.29 % తో పశ్చిమ బెంగాల్ జెన్కో మూడో స్థానంలో నిలిచాయి. 29% వృద్ధి.. 2020–21లో డిసెంబర్ నా టికి సింగరేణి కేంద్రం 5,335 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, 2021–22 డిసెంబర్ నాటికి 29% వృద్ధి తో 6,904 ఎంయూల విద్యు దుత్పత్తి చేసింది. విద్యుత్ అమ్మకాలు రూ.2,386 కోట్ల నుంచి 20% వృద్ధితో రూ.2,879 కోట్లకు పెరి గాయి. మంగళవారం ఆయన ఇక్కడ సమీక్షించా రు. శ్రీరాంపూర్ రైల్వేలైన్ విద్యుదీకరణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లోయర్ మానేర్ డ్యాంపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సర్వే పనులను నెలాఖరులోగా, డీపీఆర్ను ఫిబ్రవరిలోగా పూర్తి చేసి మార్చి లో టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. -
జైభీమ్: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్ను దాటేసింది
సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
Jai Bhim IMDB Rating: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్ను దాటేసింది
-
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్పైనే మృతదేహం తరలింపు) -
ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ
సాక్షి, విజయవాడ: ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లో భాగంగా ఏపీలో ఈ-సంజీవని టెలీకన్సల్టేషన్ ఏర్పాటయ్యిందన్నారు. 13 జిల్లాల్లోని వైద్యకళాశాల్లో 13 టెలీమెడిసిన్ హబ్ల ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టెలిమెడిసిన్ హబ్లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్పెషలిస్టులు సేవలందిస్తున్నారన్నారు. 1145 పీహెచ్సీలు, 2914 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లకు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్లు, వైద్యులు సూచించిన మందులు పేషెంట్ల ఇంటికే పంపిణీ వంటి సేవలు అందించామన్నారు. 20,13,248 మందికి టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలందించి దేశంలోనే టాప్లో ఏపీ నిలిచిందని ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. -
పొదుపు సంఘాల మహిళల రికార్డు
-
మారుతీ దూకుడు: టాప్ సెల్లింగ్ కారు ఇదే!
సాక్షి, ముంబై: కార్ల విక్రయాల్లో వరుసగా నాలుగో ఏడాది మారుతీ సుజుకీ సత్తా చాటింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2020–21)లో జరిగిన కార్ల అమ్మకాల్లో తొలి ఐదు స్థానాలను మారుతీ కంపెనీ మోడళ్లే దక్కించుకున్నాయి. ఈ ఐదు మోడళ్లలో స్విఫ్ట్ కారు అత్యధికంగా అమ్ముడై తొలి స్థానాన్ని దక్కించుకుంది.(రెండో దశకు ఎయిరిండియా విక్రయం) 2020–21 ఏడాదిలో మొత్తం 1.72 లక్షల స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ తర్వాత స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన బాలెనో(1.63 లక్షలు), వేగనార్(1.60 లక్షలు), ఆల్టో(1.59 లక్షలు), డిజైర్(1.28 లక్షలు) మోడళ్లు నిలి చాయి. 5 మోడళ్లు మొత్తం అమ్మకాలు ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ.., మారుతీ సుజుకీ చెందిన ఐదు ప్యాసింజర్ వాహన మోడల్స్ తొలి ఐదు స్థానాలను దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు) -
అమ్మకాల్లో దుమ్ము లేపిన హ్యుందాయ్
సాక్షి, ముంబై: భారత్లో తయారు చేసిన ఎస్యూవీలు పది లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు సోమవారం కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది. ఈ మొత్తం విక్రయాల్లో క్రెటా ఎస్యూవీ సింహభాగాన్ని ఆక్రమించినట్లు కంపెనీ పేర్కొంది. 2005లో విడుదలైన క్రెటా ఇప్పటి వరకు 5.9 లక్షల అమ్మకాలు దేశీయ మార్కెట్లోనూ, 2.2 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్లో అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక 2019లో విడులైన వెన్యూ ఎస్యూవీ మొత్తం అమ్మకాలు 1.8 లక్షలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్యూవీ రంగంలో విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో ఈ ఘనతను సాధించామని కంపెనీ డెరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్లోనే ఎస్యూవీలను తయారీ చేస్తున్న సంగతి గార్గ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మస్క్కు షాక్: దూసుకొచ్చిన బెజోస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం బెజోస్ అపర కుబేరుడి టైటిల్ను దక్కించుకున్నారు. జెఫ్ ఆస్తుల విలువ 191.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఇటీవలి కాలంలో టాప్ బిలియనీర్గా అవతరించిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను వెనక్కు నెట్టారు బెజెస్. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన బెజోస్ ఇటీవల నెంబర్ 2 స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్ దాదాపు ఆరు వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ బిలియనీర్ స్థానంలో కొనసాగారు. (ఎలాన్ నెంబర్ 1 ఎలా అయ్యాడు?) టెస్లా షేర్ల విలువ విలువ పడిపోవడంతో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 4.6 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది. మంగళవారం టెస్లా షేర్లు 2.4 శాతం కుప్పకూలింది. జనవరి 26న ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న టెస్లా షేర్ల విలువ, ఆపై దాదాపు 10 శాతం వరకూ పతనమైంది. ఈ కారణంతోనే ఎలాన్ మస్క్, కుబేరుల జాబితాలో మరోసారి రెండో స్థానానికి పరిమిత మైనారని బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఎలాన్ మస్క్ కన్నా 955 మిలియన్ డాలర్ల ఎక్కువ ఆస్తి బెజోస్ సొంతమని పేర్కొంది. మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిట్ కాయిన్తో పాటు, మరో క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించిన తరువాత, బిట్కాయిన్ విలువ 50 వేల డాలర్ల రికార్డు స్థాయిని దాటేసింది. (మెగా బూస్ట్: చెన్నైలో అమెజాన్ ) -
యాక్సెంచర్కు షాకిచ్చిన టీసీఎస్
సాక్షి, ముంబై: భారతీయ సాఫ్ట్వేర్ సేవలసంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోసారి అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) న మరో ఐటీసంస్థ యాక్సెంచర్ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ సోమవారం ఉదయం169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు. కాగా మార్కెట్ క్యాప్కు సంబంధించి టీసీఎస్ ఇంతకుముందు రెండుసార్లు యాక్సెంచర్ కంపెనీని అధిగమించింది. 2018 లో ఒకసారి, గత ఏడాది అక్టోబర్లో మరోసారి టీసీఎస్ యాక్సెంచర్ను దాటేసింది. అయితే 2020 అక్టోబరులో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థ టైటిల్ను దక్కించుకుంది. 2018 లో, యాక్సెంచర్ కంటే టీసీఎస్ ముందంజలో ఉన్నప్పటికీ, అప్పటికి ఐబీఎం 300 శాతం ఎక్కువ ఆదాయంతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. కాగా ఇటీవల ప్రకటించిన 2020 , డిసెంబరు త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాలను ప్రకటించింది. దీంతో 3,224 రూపాయల వద్ద జనవరి 11 న, కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయిని సంగతి తెలిసిందే. -
జెఫ్ బెజోస్ టాప్ : మరో రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు వాతావరణ మార్పులపై పోరాటానికి మద్దతుగా భూరి విరాళాన్ని అందించిన బెజోస్ 2020లో అతిపెద్ద విరాళం ఇచ్చిన వ్యక్తిగా నిలిచారు. ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.73 వేల కోట్లు)భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వితరణ చేశారు. తద్వారా సంపాదన ఆర్జనలోనే కాదు విరాళాలివ్వడంలో కూడా తానే మేటి అని నిరూపించుకున్నారు. ‘ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ’ ప్రకటించిన వార్షిక జాబితాలో అమెజాన్ సీఈఓ ముందు వరసలో నిలిచారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ఉద్దేశించి ఆయన ఈ విరాళాలను అందజేశారు. ఈ విరాళంతో బెజోస్ ఎర్త్ ఫండ్ను ప్రారంభించినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ ప్రకటించింది. 2020లో బెజోస్ విరాళం కాకుండా మిగిలిన టాప్ 10 విరాళాల మొత్తం కేవలం 260 కోట్ల డాలర్లు మాత్రమే. 2011 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో విరాళాలు రావడం ఇదే తొలిసారి. 2020లో బెజోస్ సంపద కూడా 2020, మార్చి 18 నుంచి డిసెంబర్ 7 మధ్య ఏకంగా 60 శాతం పెరిగింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం 18800 కోట్ల డాలర్ ల(సుమారు రూ.13.75 లక్షల కోట్లు) సంపద బెజోస్ సొంతం. బెజోస్ తర్వాత గత సంవత్సరం భారీ మొత్తంలో విరాళాలిచ్చిన వారి జాబితాలో నైక్ వ్యవస్థాపకుడు ఫిల్నైట్ అతని భార్య పెన్నీ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. లాక్డౌన్ సమయంలో ( మార్చి-డిసెంబర్ ) వీరి సంపద 77 శాతం పుంజుకుంది. వీరిద్దరూ నైట్ ఫౌండేషన్కు 900 మిలియన్లు డార్లు, ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి 300 మిలియన్ల డాలర్లు డొనేట్ చేశారు. ఇక ఈ జాబితాలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, భార్య ప్రిస్కల్లా చాన్ నాల్గవ స్థానంలో ఉన్నారు. వీరు 250 మిలియన్ డాలర్లను సేవ కార్యక్రమాల కోసం అందించారు.మరోవైపు గత సంవత్సరం స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళం ఇచ్చిన ఇద్దరు బిలియనీర్లు బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్, ట్విటర్ కో ఫౌండర్జాక్ డోర్సే క్రానికల్ ఈ సారి జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఫిబ్రవరిలో, క్రానికల్ 50 అతిపెద్ద దాతల జాబితాను ప్రచురించనుంది. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
సాక్షి, ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... (జనవరి నుంచి కార్ల ధరలు మోతే!) మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్లో 137 కోట్ల డాలర్లు, మారిషస్లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్డీఐలను ఆకర్షించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
టాప్లో అజీం ప్రేమ్జీ : రోజుకు ఎన్ని కోట్లంటే
సాక్షి,ముంబై: పారిశ్రామిక వేత్త, ప్రముఖ దాత, దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాతృత్వంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2020వ సంవత్సరంలో విరివిగా దానాలు చేసి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. హురున్ రిపోర్ట్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రోజుకు 20 కోట్లు ఏడాదికి 7,904 కోట్లు చొప్పున, విరాళంగా ఇచ్చారు. గత ఏడాది హురున్ రిపోర్ట్ ఇండియా రూపొందించిన జాబితా ప్రకారం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ టాప్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శివ నాడార్ను అధిగమించిన అజీం ప్రేమ్జి టాప్లో నిలిచారు. నాడార్ ఈ ఆర్థిక సంవత్సరంలో 795 కోట్లు రూపాయల విరాళమివ్వగా అంతకుముందు ఏడాది కాలంలో 826 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్జీ 426 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు అధినేత, బిలియనీర్ ముకేశ అంబానీ 458 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా మూడో స్థానంలో నిలిచారు. ఏడాది క్రితం అంబానీ 402 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కార్పొరేట్ రంగం భారీగా విరాళాలిచ్చింది. ప్రధానంగా టాటా సన్స్ 1500 కోట్ల నిబద్ధతతో, ప్రేమ్జీ 1125 కోట్లు, అంబానీ 510 కోట్లు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు పీఎం కేర్స్ ఫండ్కు రిలయన్స్ 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 400 కోట్లు, టాటా గ్రూపు 500 కోట్ల విరాళంగా ఇచ్చాయి. దీంతో కలిపి ఈ ఏడాది ప్రేమ్జీ మొత్తం విరాళాలను 175శాతం పెరిగి 12,050 కోట్లకు చేరుకుంది.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వ్యక్తుల సంఖ్య అంతకుముందు కాలం 72 నుండి 78 కు స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 27 కోట్ల విరాళంతో, ఏటీఈ చంద్ర ఫౌండేషన్కు చెందిన అమిత్ చంద్ర, అర్చన చంద్ర ఈ జాబితాలో ప్రవేశించిన తొలి, ఏకైక ప్రొఫెషనల్ మేనేజర్లు. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. నందన్ నీలేకని 159 కోట్లు, ఎస్ గోపాల కృష్ణన్ 50 కోట్లు, షిబులాల్ 32 కోట్లు డొనేట్ చేశారు. మరోవైపు 5 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన 109 మంది వ్యక్తుల జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో రోహిణి నీలేకని 47 కోట్ల రూపాయలతో టాప్లో ఉన్నారు. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ (37) 5.3 కోట్లతో అతి పిన్నవయస్కుడిగా ఉండటం విశేషం. -
స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో షావోమి దూకుడు
న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమీకి చెందిన ఎంఐ ఇండియా గత వారం పండుగ అమ్మకాల్లో భాగంగా 50 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు ఈ నెల 16 నుంచి 22 వరకు పండుగల ప్రత్యేక అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘‘ఎంఐ అభిమానులు తమకు ఇష్టమైన స్మార్ట్ఫోన్ను పండుగల తగ్గింపులు, ఆఫర్లను ఉపయోగించుకుని 15,000కుపైగా రిటైల్ భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోగలిగారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోర్టళ్లతోపాటు ఎంఐ డాట్ కామ్ సాయంతో దేశవ్యాప్తంగా 17వేల పిన్కోడ్ల పరిధిలోని కస్టమర్లను చేరుకోగలిగినట్టు’’ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. -
షావోమికి షాకిచ్చిన శాంసంగ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, ఇండో -చైనా ఆందోళనల నడుమ చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమికి భారీ షాక్ తగిలింది. భారతీయ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ లో రారాజులా దూసుకుపోయిన షావోమికి చైనా బ్యాన్ సెగ తాకింది. దీంతో మొత్తం భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్ ప్లేస్ ను కోల్పోయింది. పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ డేటా (ఐడీసీ) ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తిరిగి అగ్రభాగానికి దూసుకొచ్చింది. (శాంసంగ్ 5జీ గెలాక్సీ స్మార్ట్ఫోన్: అంచనాలు) ఐడీసీ డేటా ప్రకారం దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. జూన్-ముగిసిన త్రైమాసికంలో 29.1 శాతం మార్కెట్ వాటాను సాధించగలిగింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 15.6 శాతం మాత్రమే. ప్రధానంగా గెలాక్సీ ఎం 21 స్మార్ట్ఫోన్ టాప్ 5 మోడళ్లలో ఒకటిగా ఉందని తెలిపింది. 29 శాతం మార్కెట్ షేర్ తో షావోమి, 17.5 శాతంతో వివో ఆ తరువాతి స్థానాలో ఉన్నాయి. అయితే ఫీచర్ ఫోన్ ప్లస్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 24 శాతం వాటాతో షావోమి, వివో కంటే వెనక బడి వుంది. అలాగే ఆన్ లైన్ వ్యాపారంలో శాంసంగ్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. (రెడ్మీ 9 ప్రైమ్ లాంచ్ : అందుబాటు ధరలో) షావోమి ఎగుమతులు 48.7శాతం తగ్గి (2 క్యూ 20 లో) 5.4 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. నాల్గవ స్థానంలో ఉన్న రియల్మీ 37శాతం క్షీణించి 1.78 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. ఐదవ స్థానంలో ఉన్న ఒప్పో ఎగమతులు క్యూ 2లో 51శాతం పడిపోయి 1.76 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. మార్కెట్ లీడర్ గా శాంసంగ్ ఉండటం తాత్కాలికమే కావచ్చని ఐడీసీ ఇండియా పరిశోధనా డైరెక్టర్ నవకేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. చైనా వ్యతిరేక సెంటిమెంట్ కు తోడు, చైనా స్మార్ట్ ఫోన్ అమ్మకం దారుల వద్ద స్టాక్ కొరత శాంసంగ్ లాభాలకు దోహదపడిందన్నారు. లేదంటే వివో సులభంగా రెండవ స్థానానికి చేరుకునేదన్నారు. మొత్తంగా ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2020 రెండవ త్రైమాసికంలో గత ఏడాదితో 36.8 మిలియన్ యూనిట్ల పోలిస్తే 50.6శాతం క్షీణించి 18.2 మిలియన్ యూనిట్లకు పడిపోయిందని ఐడీసీ తెలిపింది. ఫీచర్ ఫోన్ ఎగుమతులు 2 క్యూ 20 లో సంవత్సరానికి 69 క్షీణించి 10 మిలియన్ యూనిట్లకు తగ్గాయని అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో 2020 ద్వితీయార్ధంలో మార్కెట్ రికవరీ సంకేతాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మార్కెట్ లీడర్గా వన్ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్ప్లస్ టాప్ లో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 29.3 శాతం మార్కెట్ వాటాతో ఇండియన్ మార్కెట్ లీడర్గా నిలిచిందని తాజా నివేదిక తెలిపింది. (వన్ప్లస్ నార్డ్ వచ్చేసింది..ధర ఎంతంటే) కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం వన్ప్లస్ 8 5 జీ మొబైల్ రెండవ త్రైమాసికంలో (క్యూ 2) ప్రీమియం విభాగంలో (30వేల రూపాయలు అంతకంటే ఎక్కువ) టాప్ స్మార్ట్ఫోన్ మోడల్గా అవతరించింది. ఒక బ్రాండ్గా, తమ విశ్వాసం ఉంచిన భారత సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వన్ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ప్రకటించారు. అసమానమైన నాణ్యతతో పెద్దగా భారం లేని అనుభవాన్ని అందించే ఉత్పత్తులను రూపొందించే కృషి కొనసాగుతుందన్నారు. (భారత్లో వన్ప్లస్ 8, వన్ప్లస్ 8 ప్రో లాంఛ్) కాగా ఏప్రిల్లో లాంచ్ చేసిన వన్ప్లస్ 8 సిరీస్ 5 జీ వన్ ప్లస్ 8 ప్రో వన్ ప్లస్ 8 స్మార్ట్ఫోన్లకు భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు స్మార్ట్ఫోన్లలో వన్ప్లస్ 8 ప్రో ఒకటి. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్ప్లస్) -
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు
అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ సంపదలో మరోసారి రికార్డు సాధించారు. గత సంవత్సరం మెకెంజీతో విడాకుల పరిష్కారంలో భాగంగా అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకున్న తర్వాత కూడా బెజోస్ సంపద 172 బిలియన్ డాలర్ల వద్ద మళ్లీ తారాస్థాయిని తాకింది. అమెజాన్ షేర్లు బుధవారం 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుడి బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయిని తాకింది. తాజాగా తన రికార్డును తనే బ్రేక్ చేశారు. కరోనా మహమ్మారి, మహామాంద్యం పరిస్థితులున్న ఈ ఏడాదిలోనే 56.7 బిలియన్లను ఆర్జించడం విశేషం. కరోనా సంక్షోభ సమయంలో ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకు వన్ టైం బోనస్ కింద 500 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యవస్థాపకుడి రికార్డు సంపదపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. మరోవైపు విడాకుల తర్వాత అమెజాన్లో 4 వాతం వాటాను సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ సంపద నికర విలువ 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. తద్వారా బ్లూమ్బెర్గ్ ర్యాంకింగ్లో 12వ స్థానాన్ని సాధించారు. అంతేకాదు ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా నిలిచారు. లోరియల్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ మొదటి మహిళగా ఉన్నారు. మిగిలిన బిలియనీర్లలో ఎక్కువ మంది టెక్ రంగానికి చెందినవారున్నారు. వీరిలో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ సంపద జనవరి 1 నుండి 25.8 బిలియన్ డాలర్లు పెరిగింది. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13.1 బిలియన్ డాలర్లుకు చేరింది. కాగా కరోనా కాలంలో ప్రపంచ కుబేరుల సంపద స్వల్పంగా పెరిగింది. మరికొంత మంది భారీగా నష్టపోయారు. స్పెయిన్ కు చెందిన అమాన్సియో ఒర్టెగా 19.2 బిలియన్ డాలర్లను కోల్పోగా, బెర్క్షైర్ హాత్వే సంస్థ చైర్మన్ వారెన్ బఫ్ఫెట్ 19 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 17.6 బిలియన్ డాలర్లు సంపదను పోగొట్టుకున్నారు. 500 మంది ధనవంతుల మొత్తం సంపద ఈ సంవత్సరం ప్రారంభంలో 5.91 ట్రిలియన్ల డాలర్లతో పోలిస్తే స్పల్పంగా పుంజుకుని 5.93 ట్రిలియన్ డాలర్లకు చేరింది. -
ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా టాప్లోనే!
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్లో జూమ్ యాప్ మొదటిస్థానంలో నిలిచింది. యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ సెన్సార్ టవర్ విడుదల చేసిన దాని ప్రకారం ఏప్రిల్ నెలలో జూమ్యాప్ని 131మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో భారతీయులే ఎక్కువ మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. భారత్ తరువాత అమెరికా ఈ యాప్ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంది. ఈ యాప్తో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వమే హెచ్చరించినప్పటికి ఇంత మంది డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. (నయా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’) లాక్డౌన్ సమయంలో గ్రూప్ కాలింగ్ కోసం చాలా కంపెనీలు, ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడం కోసం చాలా విద్యాసంస్థలు విద్యార్ధులు, వీరితో పాటు సామాన్యులు సైతం తమకి ఇష్టమైన వారితో మాట్లాడుకోవడానికి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ అధికారులెవ్వరు ఈ యాప్ని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక జూమ్ యాప్ తరువాత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న లిస్ట్లో టిక్టాక్ నిలిచింది. ఈ లాక్డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 107 మిలియన్ల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వీటిలో 22 శాతం భారతదేశం నుంచే డౌన్లోడ్ చేసుకున్నారు. (కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’) -
ఫాస్ట్ ట్యాగ్స్: టాప్లో పేటీఎం
సాక్షి, న్యూఢిల్లీ: చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబి) ఫాస్ట్ ట్యాగ్ల జారీలో రికార్డు క్రియేట్ చేసింది. మూడు మిలియన్ ఫాస్ట్ ట్యాగ్లను జారీ చేశామని సంస్థ సోమవారం ప్రకటించింది. తద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన సంస్థగా నిలిచామని ప్రకటించింది. 'డిజిటల్ ఇండియా' లో భాగంగా తాము ఈ మైలురాయిని అధిగమించామని పేటీఎం సీఈవో సతీష్ గుప్తా వెల్లడించారు. దేశంలో డిజిటల్ టోల్ చెల్లింపులకు తమ వంతుగా చేస్తున్న కృషి కొనసాగుతోందని తెలిపారు. మార్చి నాటికి 5 మిలియన్ల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ జారీని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైవేలపై టోల్ ప్లాజాల వద్ద చార్జీలు కట్టేందుకు గంటల తరబడి క్యూలు, చిల్లర చికాకులకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫాస్ట్ ట్యాగ్ అంటే జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేయడం. ప్రీపెయిడ్ లేదా పొదుపు ఖాతా నుండి నేరుగా లింక్ చేయబడిన పేటీఎం వాలెట్నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ చెల్లింపులకు పేటీఎం బ్యాంకు మద్దతునిస్తుంది. దేశవ్యాప్తంగా 110 టోల్ ప్లాజాలలో ఆటోమేటిక్ నగదు రహిత చెల్లింపులను అనుమతిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 10వేల వ్యాపార కరస్పాండెంట్ల ద్వారా ఫాస్ట్ ట్యాగ్లను విక్రయిస్తోంది. అలాగే నగదు రహిత చెల్లింపు సౌలభ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాణిజ్య వాహన యజమానులకు ట్యాగ్లను కొనుగోలులో సహాయపడటానికి, పేటీఎం బ్యాంక్ భారతదేశం అంతటా టోల్ ప్లాజాలలో 300 కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసింది. టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఫాస్ట్ట్యాగ్ ఉండాల్సిందే. లేకపోతే రెండింతలు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. వేర్వేరు బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాలు, ఆర్టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. అలాగే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, అమెజాన్లో కూడా ఫాస్ట్ట్యాగ్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఈ ట్యాగ్ల కొరత కారణంగా దీనిని జనవరి 15, 2020 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
మరోసారి దూసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్కెట్క్యాప్ పరంగా దేశంలో అతిపెద్ద మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు ఇంట్రా-డే 3 శాతానికి పైగా లాభపడి బీఎస్ఇలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి (రూ.1,508.45)ని తాకింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .9.50 ట్రిలియన్లను దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. అతి త్వరలోనే పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ను సాధించే దిశగా సాగుతోంది. అర్ధ శతాబ్దం క్రితం 1966లో ఒక ఉద్యోగితో, కేవలం రూ.1000 మూలధనంతో (అప్పటికి130 డాలర్లతో) రిలయన్స్ను స్థాపించారని, రిలయన్స్ను ప్రపంచ స్థాయి భారతీయ వ్యాపార సంస్థగా నిర్మించాలన్నది తన తండ్రి కల అని, అది తన జీవితకాలంలో సాకారం కావడం తన అదృష్టమని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గత ఏడాది మార్చిలో గుర్తు చేసుకున్నారు. అక్టోబర్ 18న, 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ను దాటిన మొదటి సంస్థగా ఆర్ఐఎల్ నిలిచింది. 2019 క్యాలెండర్ సంవత్సరంలో ఆర్ఐఎల్ స్టాక్ ధర 34 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పటివరకు రూ .2.3 ట్రిలియన్లు పెరిగింది. కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ .7.91 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ కాప్ ఇటీవల రూ .7 లక్షల కోట్ల మైలురాయిని దాటి 3 వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
టాప్లోకి దూసుకొచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా అతిపెద్ద మూడవ భారతీయ సంస్థగా నిలిచింది. తాజాగా బ్యాంక్ రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. తద్వారా రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత మూడవ భారతీయ కంపెనీగా అవతరించింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొదటి బ్యాంకుగా నిలిచింది. ఇప్పటివరకూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), టీసీఎస్ మాత్రమే ఈ మైలురాయిని సాధించాయి. రూ .9.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో, ఆర్ఐఎల్ అత్యధిక విలువైన సంస్థ, టిసిఎస్ తరువాత రూ.8.28 లక్షల కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ .7,01,730.21 (7.01 లక్షల కోట్లు)ను తాకింది. 1285 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని చేరిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 0.7 శాతం పెరిగి బాంబే స్టాక్ ఎక్సేంజ్లో రూ .1283.40 వద్ద ట్రేడవుతున్నాయి. -
స్మార్ట్ఫోన్ విక్రయాల రికార్డు, టాప్ బ్రాండ్ ఇదే
సాక్షి, ముంబై : దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంతో ఆన్లైన్, ఆఫ్లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. అన్ని ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు కొత్త లాంచ్లు, డిస్కౌంట్లు, పండుగ ప్రత్యేక ఆఫర్లతో ఈ వృద్ధి నమోదైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లు ఈ పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు అన్షిక జైన్ చెప్పారు. ఒకవైపు దేశీయంగా ఆటో, రియల్టీ సహా పలురంగాల్లో మందగమనం కొనసాగుతోంటే..స్మార్ట్ఫోన్ మార్కెట్ మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ 2019 త్రైమాసికంలో రెండంకెల (10 శాతం) వృద్దితో అత్యధికంగా 49 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఫలితంగా ఈ విభాగంలో మందగమనం ఆందోళనలను అధిగమించిందని ఇటీవల వెల్లడించిన ఒక నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈ విక్రయాల్లో చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో వివిధ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ భారతీయ స్మార్ట్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కౌంటర్ పాయింట్ వెల్లడించిన వివరాల ప్రకారం షావోమి మార్కెట్ వాటా 26 శాతంటాప్లో నిలిచింది. 20 శాతం వాటాతో శాంసంగ్ , 17 శాతంతో వివో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా రియల్ మీ 16 శాతం, ఒప్పో వాటా 8 శాతంగా సాధించాయి. అయితే ఇటావల ధరలను తగ్గించిన నేపథ్యంలో ఆపిల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఐఫోన్ 11 తో పాటు ఎక్స్ఆర్ మోడల్లో ధరల తగ్గింపు కారణంగా ఆపిల్ టాప్ 10 స్మార్ట్ఫోన్ బ్రాండ్లలోకి ప్రవేశించింది. అయితే నెంబర్ వన్ ప్రీమియం స్మార్ట్ఫోన్ బ్రాండ్గా వన్ ప్లస్ నిలిచింది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ అమ్మకాలు రెండింతలు పెరిగాయి. క్షీణించిన ఫీచర్ ఫోన్ మార్కెట్ స్మార్ట్ ఫోన్ల కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు అంతంతమాత్రమే. మూడో త్రైమాసికంలో దాదాపు 37 శాతం తగ్గిపోయాయి. ఫీచర్ ఫోన్ విభాగంలో శాంసంగ్ మార్కెట్ వాటా 22 శాతం, ఐ టెల్ వాటా 16 శాతం, లావా వాటా 16 శాతం, నోకియా 12 శాతం, కార్బన్ 7 శాతంగా నమోదైంది. అయితే ఇటెల్, లావా కార్బన్ కంపెనీలు సానుకూల వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. వాస్తవానికి, 2019 మూడవ త్రైమాసికంలో ఇటెల్ రెండవ ఫీచర్ ఫోన్ బ్రాండ్గా అవతరించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. -
నేత్ర పరీక్షల్లో నంబర్ వన్
సాక్షి ప్రతినిధి విజయనగరం: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. చూపు ఉంటే చక్కగా చదువుకోవచ్చు.. నచ్చిన రంగంలో రాణించవచ్చు. అన్ని పనులూ చకచకా పూర్తిచేయవచ్చు. అందుకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేత్ర సంరక్షణకు పెద్దపీట వేసింది. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో నేత్ర సమస్యలను తొలగిస్తోంది. వారు చదువుకునే పాఠశాలకే వైద్యులను పంపించి పరీక్షలు చేయిస్తోంది. ఉచితంగా మందులు అందజేస్తోంది. చిన్నవయస్సులోనే కంటి సమస్యలను దూరం చేసేందుకు కృషిచేస్తోంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా.. దృష్టిలోపాలను సరిదిద్దుతోంది. వైఎస్సాఆర్ కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని ముందువరుసలో నిలుస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషిస్తున్నారు. పథకం సత్ఫలితాలనిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు. పరీక్షలు ఇలా... జిల్లాలో 3,03,819 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 2,34,993 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 77.34 శాతం పరీక్షలు పూర్తి చేసిన జిల్లాగా విజయనగరం జిల్లా రికార్డు సృష్టించింది. పరీక్షలు చేయించుకున్న విద్యార్థుల్లో 10,909కి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో సాధారణ కంటి అద్దాలు ధరించిన వారు 2,239 మంది మాత్రమే కాగా దృష్టిలోపం ఉండి కూడా అద్దాలు ధరించని వారు 1750 మంది. 9,159 మందికి కంటి అద్దాలు అవసరమని పరీక్షల్లో నిర్ధారించారు. జిల్లాలో 3,396 పాఠశాలలు ఉండగా ఇంతవరకు 3,209 పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఇంటర్ కళాశాలలు ప్రభుత్వ– 24, ప్రైవేటు–56, డ్రిగ్రీ ప్రభుత్వ– 6, ప్రైవేటు–16 కళాశాలల్లో చదువుతున్న సుమారు 66 వేలమంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయనున్నారు. అందరికీ కంటి వెలుగు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సలు, కళ్లద్దాల పంపిణీ వేగంగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ కావడానికి కంటి సమస్యలు కూడా కారణం. గిరిజన పాఠశాలల్లో ఎక్కువ మంది కంటి సమస్యల కారణంగా సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారు. దీనిపై దృష్టి సారించాలని ఐటీడీఎ కొత్త పీఓకి కూడా చెప్పాం. కంటి సమస్యలతో ఏ విద్యార్థీ బాధపడకూడదు, అవకాశాలను పోగొట్టుకోకూడదన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా వెలుగులు నింపుతున్నారు.. మా అమ్మాయి భీమవనం యూపీ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల కంటి పరీ క్షలు నిర్వహించారు. సమస్యలు గుర్తించి మందు లు అందజేశారు. మాలాంటి నిరుపేదల పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వెలుగులు నింపుతున్నారు. – తొత్తల సత్యవతి, విద్యార్థిని తల్లి, చినభీమవరం, బాడంగి కంటివెలుగయ్యాడు.. ముఖ్యమంత్రి జగనన్న విద్యార్థుల పాలిట కంటివెలుగయ్యాడు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలు ఒక్కొక్కటి అమలుచేస్తూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడు. కంటివెలుగు పథకంతో విద్యార్థులకు చూపు ప్రసాదిస్తున్నాడు. నేత్ర సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఆయన మేలు మరువలేం. – గొంప ఉమా, రామలింగపురం, విద్యార్థి తల్లి చదువుకు సాయం.. పిల్లల్లో కంటి సమస్యలు పరిష్కరించడం వల్ల పిల్లలు చక్కగా చదువుకునేందుకు అవ కాశం కలుగుతుంది. సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే అన్నిరకాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారు. నేత్ర సంరక్షణకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషదగ్గ అంశం. – భవాని, వీబీపురం, విద్యార్థి తల్లి ముందు‘చూపు’ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వైఎస్సార్ కంటివెలుగు పథకం అమలు చేయడం ఆనందదాయకం. విద్యార్థులకు చిన్న వయస్సులోనే కంటి సమస్యలు తెలుస్తాయి. పరిష్కారమవుతాయి. మంచి కార్యక్రమం. – బొద్దాన దేముడు, వేపాడ ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మంచి కార్యక్రమం.. సీఎం జగన్మోహన్రెడ్డి విద్యార్థుల్లో అంధత్వ నివారణ కోసం అమలుచేసిన కం టివెలుగు కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. పైసా ఖర్చులేకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సంతోషకరం. పేదలకు కంటి వెలుగు నివ్వడం దేవుడిచ్చిన వరం లాంటిది. – ఎలకల రాంబాబు, జోగులడుమ్మ నేత్ర సమస్యలకు చెక్.. ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల కళ్లను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తుండడం ఆనందం గా ఉంది. చిన్నవయస్సులోనే నేత్ర సమస్యలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం అమలు చేయడం మంచి నిర్ణయం. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాం. – రాయగడ సూర్యశేఖర్, జియ్యమ్మవలస -
వోడాఫోన్ ఐడియానా, జియోనా కింగ్ ఎవరు?
సాక్షి, ముంబై : భారతీయ టెలికాం పరిశ్రమలో వోడాఫోన్ ఐడియా అతిపెద్ద కంపెనీగా అవతరించింది. 380కి పైగా చందాదారులతో వోడాపోన్ ఐడియా ఈ ఘనతను సాధించింది. జులై మాసానికి సంబంధించి గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తాజాగా విడుదల చేసింది. 38 కోట్ల మంది సభ్యులతో వొడాఫోన్ ఐడియా దిగ్గజం కంపెనీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా రిలయన్స్ జియో 33.98 కోట్ల వినియోగదారులతో రెండవ స్థానంలోనూ, 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్టెల్ తొలి మూడవ స్థానంలోనూ నిలిచాయి. దీంతో ఇవాల్టి బేర్ మార్కెట్లో కూడా వోడాఫోన్ ఇండియా కౌంటర్ ఏకంగా 16శాతం ఎగియడం విశేషం. జూలై చివరి నాటికి మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,168.3 మిలియన్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. జూలై 31, 2019 నాటికి, ప్రైవేట్ యాక్సెస్సర్వీస్ ప్రొవైడర్లు వైర్లెస్ చందాదారుల మార్కెట్ వాటాను 89.73 శాతం కలిగి ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎమ్టిఎన్ఎల్ మార్కెట్ వాటాను కేవలం 10.27 శాతం మాత్రమే కలిగి ఉన్నాయని ట్రాయ్ తన నివేదికలో రాసింది. అలాగే జూన్ చివరి నుంచి జూలై చివరి నాటికి అన్ని కంపెనీలు చందారులను కోల్పోతుండగా, వోడాఫోన్ ఐడియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా ఇదే ధోరణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం క్రియాశీల చందాదారుల విషయానికొస్తే ఎయిర్టెల్ టాప్లో ఉంది. 94.95 శాతం చందాదారులు యాక్టివ్గా ఉన్నారు. ఆ తరువాత జియో 83.07 శాతం, వోడాఫోన్ ఐడియా 81.9 శాతంతో ఉన్నాయి. -
టైమ్స్ టాప్ 100లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’
సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ ఏటా రూపొందించే ‘వరల్డ్ టాప్ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ కాగా మరొకటి ముంబైలోని ‘సోహో హౌస్’. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల క్రితం ఒకే రోజు 34000 మంది టూరిస్టులు ఈ విగ్రహాన్ని సందర్శించడం విశేషం. ఈ రెండు అంశాలను పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సోహో హౌస్ ఐరోపా, అమెరికా ఖండాల బయట, ఆసియాలోనే మొదటిది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అరేబియా సముద్ర తీరంలో పదకొండు అంతస్థులతో నిర్మితమైంది. ఇందులో లైబ్రరీ, ఓపెన్ రూఫ్ టాప్ బార్తో పాటు 34 మందికి సరిపోయే సినిమా థియేటర్ కూడా ఉంది. దీని నిర్మాణంలో వాడిన ఫర్నిచర్, నిర్మాణ శైలి, భవనంలోని కళాకృతులతో ఈ భవనం ప్రత్యేకత కలిగి ఉంది. వాస్తవికత, ఆవిష్కరణ, కొత్తదనం, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజీన్ ఏటా ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రదేశాలను ఎంపిక చేస్తుంది. -
జియో జైత్రయాత్ర
భారత టెలికాం రంగంలో కాలిడిన మూడేళ్లలోనే రిలయన్స్ జియో టాప్లోకి దూసుకొచ్చింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఎంట్రీతోనే ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో గుబులు రేపిన జియో వినియోగదారుల ఆదరణతో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 331.3 మిలియన్ల చందాదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించింది. తద్వారా వోడాఫోన్ ఐడియాను వెనక్కి నెట్టేసింది. 2019 జూన్ (మొదటి త్రైమాసికం) నాటికి వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య 320 మిలియన్లకు క్షీణించిందని వోడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాల సందర్భంగా శుక్రవారం నివేదించింది. మార్చి త్రైమాసికంలో 334.1 మిలియన్ల మంది ఖాతాదారులు నమోదయ్యారు. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకారం, అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 2019 జూన్ నాటికి 331.3 మిలియన్ల వినియోగదారులు ఉన్నట్టు ప్రకటించింది. ఈ తాజా లెక్కల ప్రకారం అత్యధిక వినియోగదారులతో అతిపెద్ద సంస్థగా జియో నిలిచింది. టెలికాం రంగ నియంత్రణ మండలి ట్రాయ్ డేటా ప్రకారం..మే నెలలో జియో 32.29 కోట్ల మంది కస్టమర్లు, 27.80 శాతం మార్కెట్ వాటాతో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది. భారతి ఎయిర్టెల్ 32.03 కోట్ల యూజర్లు, 27.6 శాతం మార్కెట్ వాటాతో మూడోస్థానానికి పడిపోయింది. మే నెలలో జియో నెట్వర్క్లోకి నికరంగా 81.80 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరగా.. వొడాఫోన్ ఐడియా 56.97 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 15.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. కాగా గత ఏడాదిలో వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ వొడాఫోన్ ఐడియా 400 మిలియన్లకు పైగా సభ్యులతో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా కస్టమర్లను కోల్పోతూ వచ్చిన వొడాఫోన తాజాగా రెండో స్థానంతో సరిపెట్టుకోగా, వొడా, ఐడియా విలీనానికి ముందువరకు దిగ్గజ కంపెనీగా కొనసాగిన ఎయిర్టెల్ ప్రస్తుతం మూడో స్థానానికి జారుకుంది. -
‘విద్యుత్’లో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వాడకం విషయంలో అత్యధిక వృద్ధి శాతం నమోదు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) ప్రకటించింది. విద్యుత్ వినియోగంలో 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం.. దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అదే సమయంలో దేశ సగటు వృద్ధి 6.11 శాతమే ఉంది. ఉత్తరప్రదేశ్ 11.92 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో, 7.43 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 7.40 శాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచాయి. 2016–17లో తెలంగాణ రాష్ట్రంలో 53,017 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2017–18లో 60,237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. దేశ సగటు వృద్ధి 6.11 శాతమే ఉంది. 2016–17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 11,35,334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. 2017–18లో 12,04,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయింది. 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగ వార్షిక వృద్ధి రేటు సగటు 6 శాతమే ఉండేది. చిమ్మచీకట్ల నుంచి వెలుగుల వైపు: కేసీఆర్ విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోనే రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందని అన్నారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో తెలంగాణ ఇప్పటికే యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణ పురోగమనాన్ని సూచిస్తోందని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన ప్రణాళికా, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వల్ల విద్యుత్ సంస్థలు ఈ విజయం సాధించగలిగాయని అన్నారు. ప్రస్తుత డిమాండుకు తగిన సరఫరా చేస్తూనే రాబోయే కాలంలో వచ్చే డిమాండుకు అనుగుణంగా సరఫరా కోసం ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ విద్యుత్ రంగంలో సాధిస్తున్న విప్లవాత్మక విజయాలు అన్ని రంగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంలోనూ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా పాత్ర ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు గర్వకారణం: ప్రభాకర్రావు విద్యుత్ రంగంలో సాధిస్తున్న ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సూచికని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ చాలా విషయాల్లో అగ్రగామిగా ఉండటం హర్షనీయమన్నారు. తెలంగాణకు ఇది గర్వకారణమని అన్నారు. ప్రగతికి, విద్యుత్ వినియోగానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూనే, ఎక్కువ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తూ రైతు సంక్షేమానికి విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. -
టీసీఎస్ మళ్లీ టాప్
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాప్పరంగా ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మళ్లీ టాప్కు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మరో మైల్స్టోన్నుకు చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవలికాలంలో ఈ టాప్ ర్యాంక్కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మధ్య తీవ్రమైనపోటీ నెలకొంది. తాజాగా మార్కెట్ క్యాప్ పరంగా భారత్లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ని వెనక్కి నెట్టి ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.8 లక్షల కోట్లను అధిగమించింది. రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లల కొనుగోళ్ల హవా నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు టిసిఎస్ స షేరు 54.6 శాతం పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబరు 6 వ తేదీన జరగనున బై బ్యాక్ ఆఫర్ కారణంగా రోజువారీ లాభాలనే నమోదు చేస్తోంది. టీసీఎస్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ రూ.8 లక్షల కోట్ల (రూ.8,00,478 కోట్లు) కంపెనీగా అవతరించింది. కాగా ఈ మార్క్ను తొలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిగమించింది. అయితే రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ 3.05 శాతం, మైండ్ట్రీ 2.45 శాతం, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85 శాతం లాభపడ్డాయి. ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ 23న రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను సాధించి భారత్లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా రికార్డ్ సాధించింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,86,943 కోట్లుగా ఉంది. ఇటీవలే 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,329ని తాకిన షేరు ప్రస్తుతం రూ.1,242 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,263 వద్ద ట్రేడవుతున్నప్పుడు కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు అధిగమించింది. -
దేశాభిమాన బ్రాండ్గా ఎస్బీఐ
ముంబై: దేశాభిమానాన్ని అత్యధికంగా ప్రతిబింబించే బ్రాండ్స్ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అగ్రస్థానంలో నిల్చింది. బ్రిటన్కి చెందిన ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యూగవ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 16 శాతం మంది.. ఈ విషయంలో ఎస్బీఐకి ఓటేశారు. ఇక ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, పతంజలి సంస్థ చెరి 8 శాతం ఓటింగ్తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ చెరి 6 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. రంగాల వారీగా చూస్తే అత్యధిక దేశాభిమాన బ్రాండ్స్తో ఆర్థిక రంగం అగ్రస్థానం దక్కించుకుంది. ఆటోమొబైల్, కన్జూమర్ గూడ్స్, ఫుడ్, టెలికం రంగాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 8 మధ్యలో.. మొత్తం 11 రంగాలు, 152 బ్రాండ్స్పై యూగవ్ ఈ సర్వే నిర్వహించింది. బ్యాంకుల పరిస్థితేమీ బాగులేదు: ఫిచ్ పేరుకుపోయిన మొండిబాకీల భారం, పేలవ పనితీరును అధిగమించి మూలధన పరిమాణాన్ని మెరుగుపర్చుకునే దాకా భారత బ్యాంకుల పరిస్థితి ప్రతికూలంగానే ఉండనుందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నెగిటివ్ రేటింగ్ తప్పదని విశ్లేషించింది. -
టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒకేచోట...
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్లో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సోమవారం రాత్రి పార్టీని నిర్వహించగా, అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్లతోపాటు అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ వంగవీటి, వంశీ పైడిపల్లి ఇలా అంతా ఒక్కచోట చేరారు. వీరంతా కలిసి ఓ ఫోటో దిగగా, ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వంశీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం చెర్రీ-తారక్ల మల్టీస్టారర్ కోసం కథ సిద్ధం చేస్తుండగా, సుకుమార్ మహేష్ కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్, వంశీ పైడిపల్లి మహేష్ బాబు 25వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్ ఎఫ్ 2 రెగ్యులర్ షూటింగ్కు సిద్ధం అయ్యాడు. కొరటాల, సందీప్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్లు తమ తర్వాతి ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్లు సిద్ధం చేసుకుంటున్నారు. A memorable evening with these Amazing people at home... Thank You @ssrajamouli Sir, @aryasukku, @sivakoratala , @harish2you, @DirKrish, @AnilRavipudi , #SandeepReddyVanga, #NagAshwin for making this evening happen.. :) pic.twitter.com/9qxHoCA2xo — Vamshi Paidipally (@directorvamshi) 4 June 2018 'FUN'tastic..😀😀....it's great evening...thanks for hosting this amazing meet ..Vamshi Anna.... https://t.co/h6OBG80qhY — Anil Ravipudi (@AnilRavipudi) 4 June 2018 -
టాప్లో టీసీఎస్: రూ. 7లక్షల కోట్ల మార్కెట్ క్యాప్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో మైలురాయిని తాకింది. మార్కెట్ క్యాప్లో ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచిన టీసీఎస్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో రికార్డ్ స్థాయితో మొదటి స్థానంలో నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ. 7లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో టీసీఎస్ షేరు రూ.3674 వద్ద ఆల్ టైంహైని టచ్ చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 7.01 లక్షల కోట్లను తాకింది. కేవలం నెలరోజుల్లో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7 లక్షల కోట్లను సాధించడం విశేషం. ఏప్రిల్ 16 నుంచి టీసీఎస్ షేరు 16 శాతం దూసుకెళ్లింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 5.81 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో రెండవ స్థానంలో ఉంది. టీసీఎస్ ఇటీవల క్యూ4లో మెరుగైన ఫలితాలు ప్రకటించడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ఊపందుకుని షేరు జోరుకి కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషించారు. అలాగే డాలరు మారకంలో రూపాయి బలహీనత, గత రెండేళ్లలోలేని విధంగా డాలర్ ఆదాయంలో రెండంకెల వృద్ధిని సాధించడం , ఇటీవలి ఒప్పందాలు దాహదపడినట్టు తెలిపారు. దీనికితోడు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రతిపాదించడం కూడా సానుకూలం అంశమని పేర్కొన్నారు. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి ఐటీ షేర్లు భారీగా మద్దతునిస్తున్నాయి. టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్ కూడా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
సన్నీని దాటేసిన ప్రియా ప్రకాష్
సాక్షి, న్యూఢిల్లీ : కంటిబాసలతో కుర్రకారును ఫిదా చేసిన మళయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఆన్లైన్ హల్చల్ కొనసాగుతోంది. గూగుల్ సెర్చ్లో ఇప్పటివరకూ అత్యధికంగా బాలీవుడ్ హాట్బ్యూటీ సన్నీలియోన్ను టాప్లో ఉండగా, తాజాగా సన్నీని ప్రియా ప్రకాష్ దాటేసింది. ఓ సాంగ్లో కన్నుమీటుతూ ప్రియా ప్రకాష్ చేసిన అభినయం సోషల్ మీడియాను ఊపేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ప్రియా ధాటికి కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్లూ గూగుల్ సెర్చ్లో వెనుకపడ్డారు. కేరళలోని త్రిసూర్కు చెందిన 18 ఏళ్ల ప్రియా వైరల్ వీడియాలో కట్టిపడేసే ఎక్స్ప్రెషన్స్లో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. త్వరలో విడుదల కానున్న మళయాళం మూవీ ఒరు ఆధార్ లవ్లోని క్లిప్ ప్రియా పలికించిన హావభావాలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
శాంసంగ్ను బీట్ చేసి మరీ జియో సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్లో సునామీ సృష్టించిన రిలయన్స్ ..ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లోకూడా దూసుకుపోతోంది. తాజా నివేదికల ప్రకారం జియో లాంచ్ చేసిన ఇండియా కా స్మార్ట్ఫోన్ టాప్ ప్లేస్ కొట్టేసింది. స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ను బీట్ చేసి మరీ ఫీచర్ఫోన్ మార్కెట్లో అదరగొట్టింది. 27శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ ‘జియోఫోన్’ బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2017 నాలుగో త్రైమాసికంలో తయారీ సంస్థల నుంచి సరఫరా (షిప్మెంట్)లను పరిగణనలోకి తీసుకుని, ఈ నివేదికను సంస్థ రూపొందించింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్గా నిలిచిందని పేర్కొంది. అంతేకాదు సౌత్ కొరియన్ బ్రాండ్ శాంసంగ్ను వెనక్కి నెట్టేసింది. శాంసంగ్ మార్కెట్వాటా 17శాతంతో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 9శాతంతో మైక్రోమాక్స్ మూడవ స్థానంలో నిలిచింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం చివర్లో రూ.1,500 విలువైన జియో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయాలు అధికంగా జరిగాయని, గిరాకీ-సరఫరాల మధ్య అంతరాయాన్ని నివారించగలిగిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఫోన్కు 60 లక్షల ముందస్తు బుకింగ్లు లభించాయని నివేదించింది. ముఖ్యంగా సాధారణ ఫీచర్ఫోన్ వాడే వినియోగదారులు, ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్ ద్వారా 4జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ కావాలని భావించడమే జియోఫోన్ గ్రోతఖ్కు కారణాలని కౌంటర్పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. నగదు వాపసు పొందడం ద్వారా, జియోఫోన్ను ఉచితంగా వినియోగించుకునే వీలు దక్కడం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే జియో 4జీ ఫీచర్ ఫోన్లో 153 రూపాయల రీచార్జ్ ప్లాన్లో 1 జీబీ డేటాను ఆఫర్ చేయడం కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుందని తెలిపారు. -
శాంసంగ్కు షాకిచ్చిన షావోమి
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత్లో తన హవాను చాటుకుంది. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అప్రతిహతంగా దూసుకుపోతూ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 17శాతం వార్షిక వృద్ధితో 27శాతం మార్కెట్ వాటాను కొల్లగొట్టి శాంసంగ్ను వెనక్కి నెట్టేసింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే తన సత్తా చాటిన షావోమి ర్యాంకింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ ఎండ్ డివైస్ల ధరలు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ, మిడ్ రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లో ఆకర్షణీయమైన డివైస్లతో భారతీయ వినియోగదారులను మెప్పించింది. ముఖ్యంగా రెడ్ మి సిరీస్ స్మార్ట్ఫోన్లతో స్టార్ ప్లేయర్గా నిలిచింది. మూడవ త్రైమాసికంలో శాంసంగ్, షావోమి రెండూ 23.5 శాతం మార్కెట్ వాటాతో టాప్ ర్యాంక్కు నువ్వానేనా అన్నట్టు పోటీపడినా, క్యూ4లో మాత్రం షావోమి శాంసంగ్ను అధిగమించింది. పరిశోధనా సంస్థ కానల్స్ నివేదిక ప్రకారం, 2017 నాలుగో త్రైమాసికంలో శాంసంగ్ ను షావోమి ఓడించింది. 2017 క్యూ4లో 8.2 మిలియన్ యూనిట్లు (27 శాతం మార్కెట్ వాటా) చేరువలో ఉంది. వార్షిక వృద్ధి 17 శాతంగా ఉంది. అయితే ఇప్పటివరకు భారత్లో అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్ తన ర్యాంక్ను నిలుపుకోవడంలో విఫలమైంది. కేవలం 7.3 మిలియన్ స్మార్ట్ఫోన్లతో (25 శాతం వాటా) రెండవ స్థానంలో నిలిచిందని తెలిపింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లు మాత్రమే కాకుండా.. దేశంలోఇటీవల షావోమి షోం రూంలను ప్రారంభించడం కూడా కీలకమైన పరిణామమని పేర్కొంది. స్వయంప్రతిపత్తితో స్థానికంగా వ్యాపారాలను ప్రారంభించడంతో షావోమి వృద్దికి దోహదపడిందని కానల్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఇషాన్ దత్ చెప్పారు. మొత్తంమీద భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ 6 శాతం పుంజుకోగా మొత్తం యూనిట్లు 30 మిలియన్లుగా నమోదయ్యాయి. అలాగే వివో, ఒప్పో, లెనోవో ఈ జాబితాలో తరువాత స్థానాల్లో నిలిచాయి. -
టీసీఎస్ మళ్లీ టాప్కు
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో మైలురాయిని అధిగమించింది. మార్కెట్ క్యాప్లో మళ్లీ టాప్ ప్లేస్ను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువలో రూ. 6 లక్షల కోట్ల రూపాయలను క్రాస్ చేసింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత ఈ మైలురాయిని తాకిన రెండో కంపెనీగా నిలిచింది. ఉదయం ట్రేడింగ్లో టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) రూ. 6,12,696.46 కోట్లుగా నమోదైంది. అంతేకాదు కంపెనీ విలువలోరిలయన్స్ ఇండస్ట్రీస్ను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్ షేర్లు 4.88 శాతం పెరిగి రూ. 3,254 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. అయితే ఆర్ఐఎల్ షేర్ 1.89 శాతం నష్టపోయింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ 6,11,096.56 కోట్లుగా నిలిచింది. -
ప్రపంచ సరికొత్త అపర కుబేరుడు ఈయనే..
అమెజాన్ వ్యవస్థాకుడు, సీఇవో జెఫ్ బెజోస్(53) మరోసారి దూసుకుపోతున్నారు. ప్రపంచపు సరికొత్త 100 బిలియన్ డాలర్ల మొఘల్గా జెఫ్ బెజోస్ అవతరించారు. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నేపథ్యంలో బెజోస్ సంపద భారీ పెరుగుదలను నమోదు చేసింది. అమెజాన్ శుక్రవారం నాటి బంపర్ సేల్ తో 100బిలియన్ల డాలర్లకు చేరుకుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే బలమైన విక్రయాల గణాంకాల తర్వాత బెజోస్ నికర సంపద శుక్రవారం నాటికి 100.3 బిలియన్ డాలర్లకు ఎగిసి 12 అంకెల గ్రోత్ సాధించారు. దీంతో ఈ మోడరన్ ఎరాలో 100 బిలియన్ డాలర్ల సంపదను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 1999లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఈ మార్క్ను అధిగమించారు. ఆన్లైట్ రీటైలర్ అమెజాన్ ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ షేర్ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాదిలో 18.4 ఎగియగా ఈ ఒక్క వారంలోనే 5 శాతం జంప్ చేసింది. బెజోస్ సంపదకు మరో 1.7 బిలియన్ డాలర్లు జతచేరాయి. ఏడాది మొత్తంలో 32.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ అపరకుబేరుడి ఆస్తి విలువ మొత్తం 100 బిలియన్ డాలర్ల మైల్స్టోన్ను టచ్ చేసింది. అంతేకాదు 500 ప్రపంచ కుబేరుల రోజువారీ ర్యాంకింగ్లో హై జంప్ చేసింది. అమెజాన్లో బెజోస్కు 78.9మిలియన్ షేర్లు ఉన్నాయి. కాగా బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ సంపద 86.8 బిలియన్ డాలర్లు. దాదాపు 700మిలియన్ల మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ షేర్లను, 2.9 బిలియన్ డాలర్ల నగదు, ఇతర ఆస్తులను స్వచ్ఛంద సంస్థలకు విరాళాలిచ్చారు. లేదంటే ఇప్పటికే బిల్గేట్స్ సంపద 150 బిలియన్ డాలర్లను అధిగమించి ఉండేదని నివేదించింది. -
అదరగొట్టిన ఆల్టో.. మళ్లీ టాప్ గేర్లో
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఆల్టో మరోసారి అదరగొట్టింది. అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ఆల్టో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్ఐఏఎం) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబరు నెలలో మారుతికే చెందిన డిజైర్ను వెనక్కి నెట్టి టాప్ప్లేస్ను దక్కించుకుంది. గత ఆగస్టు, సెప్టెంబరు మాస అమ్మకాల్లో ఆల్టోను వెనక్కి నెట్టి.. మారుతి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం అక్టోబర్ లో 19,447 యూనిట్లు అమ్ముడుపోయాయి కాగా డిజైర్ 17,447 యూనిట్లకు పరిమితం కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆల్టో రికార్డును డిజైర్ బద్దలు కొట్టింది. ఆల్టో మోడల్ 21,521 యూనిట్లు విక్రయమవ్వగా, డిజైర్ ఏకంగా 26,140 యూనిట్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ మోడల్ గ్రాండ్ ఐ 10 అమ్మకాలు 14,417 యూనిట్లుగా నమోదయ్యాయి. 2016 అక్టోబర్లో ఇది 14,530 యూనిట్లు విక్రయించింది. అలాగే అక్టోబరులో నమోదైన అమ్మకాల్లో టాప్ 10 కార్లలో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ)కు చెందినవి ఏడు మోడల్స్ ఉన్నాయి. మిగిలిన మూడు హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాలు. ఇక బాలెనో 14,532 యూనిట్లతో మూడో స్థానంలో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 14,417 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలవగా, వ్యాగన్ ఆర్ 13,043 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెలెరియో(12,203), సిఫ్ట్(12,057), వితారా బ్రెజా(11,684), హ్యుందాయ్ ఇలైట్ ఐ20(11,012), ఎస్యూవీ క్రెటా(9,248)లు ఉన్నాయి. -
పన్నుఎగవేతదారుల్లో హైదరాబాద్ టాప్
సాక్షి, చెన్నై: నల్లధనం వెల్లడిలో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ తాజాగా పన్ను ఎగవేత దారుల జాబితా నగరాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. దేశంలోని నగరాల్లో తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ ఐటీ డిఫాల్టర్స్ లో మొదటి స్థానంలోఉంది. ఇక్కడ 25మంది భారీ పన్ను ఎగవేతదారులున్నారని తాజా నివేదికలు తేల్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 96మంది భారీ పన్ను ఎగవేత దారులుగా తేలగా..20 మందితో అహ్మదాబాద్ రెండవ స్థానంలో ఉంది. 1980 నుంచి ప్రారంభించిన అంచనా సంవత్సరానికి ఆదాయపు పన్ను బకాయిలు రూ. 3,614.14 కోట్లు. మొత్తం 96 ఐటీ డిఫాల్టర్లలో వ్యక్తులు, సంస్థలు, కంపెలు ఉండగా..వీరినుంచి ఒక్కపైసా కూడా వసూలు కాలేదుట. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం, సెక్షన్ 222, 227, 229, 232 సెక్షన్ల కింద ఆదాయపన్ను బకాయిలను వసూలు చేసే అధికారం ఆదాయపన్ను శాఖకు ఉంది ట్టడానికి అధికారం ఉంది. కానీ పన్ను ఎగవేతదారులను గుర్తించడంలో ఆదాయపన్ను విభాగం చాలా కేసుల్లో విఫలమవుతోంది. ముఖ్యంగా ముంబైకి చెందిన ఉదయ్ ఆచార్య (చనిపోయారు) రూ. 779.04 చెల్లించాల్సిఉంది. కానీ అనంతరం దివాలా ప్రకటించడం గమనార్హం. -
కాలుష్య మరణాల్లోనూ మొదటి స్థానం
న్యూఢిల్లీ : భారతదేశంలో వాయు, జల, వాతావరణ కాలుష్యాలు పతాకస్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలో రోజు రోజుకు పెరగుతున్న కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారని, ఈ మరణాల్లో భారత దేశమే అన్ని దేశాలకన్నా అగ్రస్థానంలో ఉందని కాలుష్యం, ఆరోగ్యంపై లాన్సెట్ కమిషన్ గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క 2015 సంవత్సరంలోనే 90లక్షల మంది మరణించగా, భారత దేశంలో అదే సంవత్సరం 25 లక్షల మంది మరణించారని ఆ నివేదిక పేర్కొంది. 18 లక్షల మంది మృతితో చైనా రెండవ స్థానంలో ఉందని తెలిపింది. హృదయ సంబంధిత రోగాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోసంబంధిత వ్యాధుల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని సర్వే ప్రకటించింది. భారత్, చైనా దేశాల తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, హైతీ దేశాలు అధిక కాలుష్యంతో బాధ పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా వాసిగెక్కిన ఢిల్లీతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ దీపావళి అనంతరం కాలుష్యం తీవ్రంగా పెరిగింది. లాన్సెట్ జర్నల్ సర్వే ముఖ్యాంశాలు 2015లో ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 50 వేల మంది కేవలం వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. నీటి కాలుష్యం వల్ల లక్ష 80 వేల మంది, ఇతర కాలుష్యాల వల్ల 8 వేల మంది మృతి చెందారు. అల్ప, మధ్యాదాయ దేశాల్లో కాలుష్యం కారణంగా 92 శాతం ప్రజలు మరణించారు. అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతున్న భారత్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మడగాస్కర్, కెన్యా వంటి దేశాల్లో కాలుష్య మరణాలు అధికంగా ఉంటున్నాయి. 2015లో కాలుష్యం వల్ల అత్యధికంగా 2 లక్షల 50 వేల మంది భారత్లో మరణించారు. రెండో స్థానంలో ఉన్న చైనాలో లక్ష 80 వేల మంది చనిపోయారు. ప్రపంచ జనాభాలోని ప్రతి ఆరుగురులో ఒకరు కాలుష్యం కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కాలుష్యం వల్ల 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల సంఖ్య పెరగడానికి ప్రధానంగా గాలి, నీరు, నేల, రసాయన కాలుష్యాలే కారణమని సర్వే పేర్కొంది. -
షార్జా మాస్టర్స్ టోర్నీ: హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక... అదే జోరును షార్జా మాస్టర్స్ టోర్నీలోనూ కనబరిచింది. షార్జాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లు సాధించింది. మూడు గేముల్లో గెలిచిన హారిక, మరో ఆరు గేమ్లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది. భారత్కే చెందిన శ్రీజ శేషాద్రి, మేరీ ఆన్ గోమ్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ఆదిబన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆదిబన్తోపాటు మరో ఐదుగురు క్రీడాకారులు కూడా ఏడు పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్లను వర్గీకరించగా ఆదిబన్కు రెండో స్థానం లభించింది. వాంగ్ హావో (చైనా) విజేతగా నిలువగా... మార్టిన్ క్రాట్సివ్ (ఉక్రెయిన్) మూడో స్థానాన్ని పొందాడు. హరికృష్ణ గేమ్ ‘డ్రా’... చైనాలో జరుగుతున్న షెన్జెన్ గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. యు యాంగి (చైనా)తో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్ను హరికృష్ణ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే చివరిదైన పదో రౌండ్లో లిరెన్ డింగ్ (చైనా)తో హరికృష్ణ ఆడతాడు. లిరెన్ డింగ్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... అనీశ్ గిరి (నెదర్లాండ్స్) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. -
మెసూరుకు మున్సిపల్ చైర్మన్లు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ ర్యాకింగ్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన మైసూర్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనానికి 13, 14 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 27 పట్టణాల మున్సిపల్ చైర్మన్లు, అధికారులు ఆ నగరంలో పర్యటించనున్నారు. పర్యటనకు అనుమతిస్తూ గురువారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆపిల్ టాప్.. శాంసంగ్ ఔట్
టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఫార్చ్యూన్ వరల్డ్ మోస్ట్ ఎడ్మైర్డ్ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా పది ఏడాది తన హవా చాటింది. సెకెండ్ ప్లేస్లో అమెజాన్ నిలవగా, మూడవ స్థానాన్ని స్టార్ బక్స్ దక్కించుకుంది. అయితే సౌత్కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ఈ జాబితాలో చోటును కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించబడే సంస్థల వార్షిక జాబితాను ఫార్చ్యూన్ ప్రకటించింది. ఇందులో ఆపిల్ వరుసగా పదవ సంవత్సరం టాప్ లో నిలిచింది. గత సంవత్సరం మూడో స్థానంలో అమెజాన్ మరో స్థానం ఎగబాకి సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. మరోవైపు గూగుల్ కు చెందిన అల్ఫాబెట్ గత ఏడాది సాధించిన రెండవ స్థానం నుంచి దిగజారి 6వ స్థానంలోకి పడిపోయింది. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఈ ర్యాంకింగ్లో భారీ పురోగతి సాధించాయి. ఫేస్బుక్ 14వ ర్యాంక్ నుంచి ఎగిసి 8వ, మైక్రోసాఫ్ట్ 17వ స్థానం నుంచి ఎగబాకి 9వ ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే గత ఏడాది 35వ ప్లేస్లో ఉన్న శాంసంగ్ ఏడాది అసలు జాబితాలొ లేకుండా పోయింది. గత సంవత్సరం గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణంగా ఇబ్బందుల్లో పడ్డ సంస్థ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలాగే దక్షిణ కొరియా కుంభకోణంలో చిక్కుకుని శాంసంగ్ ప్రతినిధి అరెస్ట్ కావడం కంపెనీకి భారీ షాక్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పరిశ్రమకు చెందిన దాదాపు 3,800 మంది ఎగ్జిక్యూటివ్లు, డైరెక్టర్లు, ఎనలిస్టులు, ఇతర మేధావులునుంచి సేకరించిన డాటా ఆధారంగా ఫార్చ్యూన్, భాగస్వామి కార్న్ ఫెర్రీ హే గ్రూపు తో కలిసి ఈ సర్వే నిర్వహించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 డేటాబేస్ కోసం 10 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఉన్న అమెరికా, అమెరికాయేతర 1,000 సంస్థలను పరిశీలించినట్టు ఫార్చ్యూన్ ప్రకటించింది. -
యాపిల్.. మళ్లీ నంబర్ వన్
• గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానం కైవసం: గార్ట్నర్ • రెండో స్థానానికి శాంసంగ్... న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెకీ యాపిల్ తాజాగా మళ్లీ గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్ రారాజుగా అవతరించింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 17.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తన నివేదికలో పేర్కొంది. కాగా శాంసంగ్ 17.8 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్ఫోన్ విక్రయాలు 7 శాతం వృద్ధితో 43.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయని పేర్కొంది. గతేడాది మొత్తంగా చూస్తే విక్రయాలు 150 కోట్ల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. 2015తో పోలిస్తే విక్రయాల్లో 5 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ‘శాంసంగ్ స్మార్ట్ఫోన్ విక్రయాలు తగ్గుతూ రావడం ఇది వరుసగా రెండో త్రైమాసికం. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్మార్ట్ఫోన్ విక్రయాలు 8% తగ్గాయి. దీంతో శాంసంగ్ మార్కెట్ వాటా 2.9% క్షీణించింది’ అని గార్ట్నర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్సూల్ గుప్తా తెలిపారు. గతేడాది జూలై–సెప్టెబంర్ త్రైమాసికం నుంచే శాంసంగ్ స్మార్ట్ఫోన్ విక్రయాలు తగ్గడం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక గెలాక్సీ నోట్ 7 ఫోన్ను నిలిపివేయాలనే నిర్ణయంతో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలోనూ అమ్మకాలు క్షీణించాయని వివరించారు. ప్రారంభ, మధ్య స్థాయి స్మార్ట్ఫోన్ల విభాగంలోనూ హువావే, బీబీకే, ఒప్పొ, జియోనీ వంటి కంపెనీల నుంచి శాంసంగ్ గట్టి పోటీని ఎదుర్కొంటోందన్నారు. ఎనిమిది త్రైమాసికాలు ఆగాల్సి వచ్చింది.. యాపిల్ నెం.1 స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం 8 త్రైమాసికాలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రెండు కంపెనీల మార్కెట్ వాటా మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రం చాలా స్పల్పంగా (2,56,000 యూనిట్లు– కేవలం ఒక శాతం ) ఉంది. -
కాకినాడ పోర్ట్ నుంచి భారీ ఆదాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టు 2020 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ ఎస్.కె. రెహ్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సహా పలు పోర్టుల్లో ఎగుమతి, దిగుమతులకు కేంద్ర బడ్జెట్ మరింత ఊపునిస్తోందన్నారు. సాగరమాలలో కాకినాడ పోర్టు ఆణిముత్యంగా నిలుస్తుందన్నారు. ప్రపంచ పోర్టుల ప్రగతి జాబితాలో గతంలో 54వ స్థానంలో ఉన్న మన దేశం ప్రస్తుతం 37వ స్థానానికి చేరుకుందన్నారు. గంట, రెండు గంటల్లోనే అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతులు, దిగుమతులు పెరుగుతున్నాయన్నారు. కాకినాడ కస్టమ్స్ గత ఏడాది రూ.1208 కోట్ల ఆదాయం సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1390 కోట్లు లక్ష్యంగా నిర్ణయించామని రెహ్మాన్ చెప్పారు. -
తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ!
ముక్కతోనే.. ముద్ద దిగుతోంది ► నాన్వెజ్ వినియోగంలో దేశంలో నగరమే నంబర్వన్ ► మటన్, చికెన్, బీఫ్, చేపలు, ► రొయ్యలు అన్నింటికీ యమ డిమాండ్ ► రోజూ 8.66 లక్షల కిలోల మాంసం అమ్మకాలు ► నెలకు సగటున తలసరి 2.6 కిలోల మాంసం లాగించేస్తున్న నగర వాసులు ► పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్ల సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకే ప్రత్యేకమైన బిర్యా నీతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్.. మాంసాహారం వినియోగంలో మన దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. మొఘ లాయి, దక్కన్, ఇరానీ, పర్షియన్ వంటకాలకు నెలవుగా మారిన నగరంలో మటన్, చికెన్, బీఫ్, చేపలు, రొయ్యలు వంటి మాంసాహార వినియోగం బాగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 31 కిలోలు వినియోగిస్తున్నట్లు తేలింది. పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా బిర్యానీతో.. కుతుబ్షాహీలతో హైదరాబాద్ గడప తొక్కిన బిర్యానీ ఇప్పుడు ప్రపంచంలోని 80శాతం దేశాల్లో నాన్వెజ్ కేటగిరీల్లో ప్రధాన వంటకంగా మారింది. హైదరాబాద్ లో బిర్యానీ కోసమే వెలిసిన హోటళ్లు, రెస్టా రెంట్లు ఎన్నో ఉన్నాయి. మటన్, చికెన్, బీఫ్ల తో పాటు ఫిష్ బిర్యానీ కూడా బాగా అమ్ముడ వుతోంది. దీనికితోడు ఇళ్లలో చికెన్ వినియోగం బాగా పెరగడంతో... నిత్యం మాంసాహార వినియోగం లక్షల కిలోలకు చేరుకుంది. కోటి జనాభా.. నెలకు సగటున 2.6 కిలోల మాంసం రాజధాని గ్రేటర్ నగరం జనాభా సుమారు కోటికి చేరువైంది. నగరంలో రోజువారీగా చికెన్ వినియోగం 6.66 లక్షల కిలోలుగా ఉంది. మటన్, బీఫ్ అమ్మకాలు కలిపి సుమారు లక్ష కిలోల మేర, చేపల విక్రయాలు మరో లక్ష కిలోల మేర ఉంటాయి. అంటే మొత్తంగా రోజుకు 8.66 లక్షల కిలోల మేర మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన నెలకు 2,59,80,000 కిలోల మాంసం వినియోగమవుతోంది. అంటే సగటున ఒక్కొక్కరి మాంసం వినియోగం నెలకు 2.6 కిలోలుగా, ఏడాదికి 31 కిలోలుగా తేలింది. అదే దేశవ్యాప్తంగా సగటు మాంసం వినియోగం ఏడాదికి 5 కిలోలే కావడం గమనార్హం. అంటే దేశవ్యాప్త సగటు కంటే సుమారు 6 రెట్లు మాంసం వినియోగం అధికమన్న మాట. చికెన్.. అదిరెన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో నెలకు నాలుగు కోట్ల కిలోల మేర కోడి మాంసం ఉత్ప త్తవుతుండగా.. అందులో రెండు కోట్ల కిలోల మేర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వినియోగమవుతున్నట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో చికెన్ విని యోగంలో హైదరాబాద్ తర్వాత ముంబై రెండో స్థానంలో నిలిచినట్లు తేలింది. చేపా.. చేపా.. నిన్నొదలా! చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తులనూ గ్రేటర్ వాసులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. కొవ్వుశాతం తక్కువగా ఉండడం, శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయన్న వైద్యుల సూచనల మేరకు చేపల విని యోగం పెరుగుతోంది. వీటితోపాటు రొయ్యలు, పీతలు, ఇతర సముద్ర ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా నగరం పరిధిలో రోజూ సుమారు లక్ష కిలోల మేర చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయని మత్స్యశాఖ అంచనా వేసింది. మటన్కూ ఫుల్ గిరాకీ హైదరాబాద్లో ఇటీవల చికెన్ వినియోగం బాగా పెరిగినా.. మటన్కు మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఇళ్లలో వినియోగానికితోడు హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్ కబాబ్లు, పత్తర్కా ఘోష్, బోటి, పాయా, లివర్ఫ్రై, బిర్యానీ తదితర వంటకాలు విస్తృతంగా విక్రయమవుతున్నాయి. పాత నగరం సహా పలు ప్రాంతాల్లో బీఫ్ వినియోగం కూడా అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ సగటున సుమారు లక్ష కిలోల మేర మటన్, బీఫ్ అమ్మకాలు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. అవగాహన పెరగడమే కారణం ‘‘ప్రొటీన్స్ అధికంగా ఉండడం, పోషకాహార లేమిని చికెన్ దూరం చేస్తుందన్న అవగాహన పెరగడంతో చికెన్, గుడ్ల వినియోగం ఎక్కువైంది. చికెన్, గుడ్లలో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి, కొవ్వు శాతం తక్కువే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చికెన్, గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టడం పౌల్ట్రీ రైతులకు భారంగా పరిణమించింది..’’ – రంజిత్రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిర్యానీతో పెరుగుతున్న డిమాండ్ ‘‘వందల ఏళ్ల కిందటి నుంచే మాంసాహార వంటకాల్లో అనేక వెరైటీలు రుచి చూసిన చరిత్ర హైదరాబాదీలది. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ మొఘలాయి, దక్కనీ మటన్, చికెన్ బిర్యానీ, పాయ, పత్తర్కా ఘోష్ వంటి అరుదైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది కూడా..’’ – ఎండీ రబ్బానీ, షాగౌస్ బిర్యానీ -
విరాళాల సేకరణలో శివసేన ‘టాప్’
న్యూఢిల్లీ: 2015–16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ప్రాంతీయ పార్టీలు 2015–16 సంవత్సరంలో సేకరించిన విరాళాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ల సంయుక్త నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం రూ.107.62 కోట్లు. ఇది విరాళాల వివరాలను బహిర్గతం చేసిన పార్టీలకు సమకూరిన మొత్తం మాత్రమే. 26 ప్రాంతీయ పార్టీలు తమకొచ్చిన విరాళాల వివరాలను చెప్పలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం పార్టీలు 100 శాతం పన్ను మినహాయింపు పొందాలంటే రూ.20 వేలు, ఆపై మొత్తంలో వచ్చే విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. నివేదిక ప్రకారం 2015–16లో శివసేనకు రూ.86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 6.6 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం విరాళాల్లో శివసేన వాటా 81 శాతం ఉంది. 1,187 మంది వ్యక్తులు/కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన ఆప్..ఎక్కువ సంఖ్యలో విరాళాలు వచ్చిన పార్టీగా నిలిచింది. విరాళాల వివరాలను ప్రకటించని పార్టీల్లో ఏఐఏడీఎంకే, బీజేడీ, జేఎంఎం, ఎన్పీఎఫ్, ఆర్ఎల్డీ తదితరాలు ఉన్నాయి. -
ఈ ఆఫీస్లో భీమవరం టాప్
సెప్టెంబర్ 12 నుంచి అమలులో ఉన్న కాగితరహితపాలన ఫైళ్ల క్లియరెన్స్లో ముందంజలో భీమవరం పురపాలక సంఘం ఆ వెనుక ఏలూరు కార్పొరేషన్.. సమీపంలో లేని ఇతర మునిసిపాలిటీలు భీమవరం టౌన్ : కాగిత రహితపాలన (ఈఆఫీస్)లో భీమవరం పురపాలక సంఘం జిల్లాలో ముందంజలో ఉంది. ప్రభుత్వం ప్రతి పనిని ఈఆఫీస్లో చేపట్టాలని ఆదేశించడంతో సెప్టెంబర్ 12 నుంచి మునిసిపాలిటీల్లో కాగితరహిత పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఫైల్ను కాగితాల్లో కాకుండా ఆఫీస్లోనే పరిశీలించి అందులోనే కమిషనర్లు డిజిటల్ సంతకాలు చేస్తున్నారు. దీంతో పాటు డీఎంఏ ఆదేశాల మేరకు రెవెన్యూపరమైన యాజమాన్య హక్కుల బదిలీ, డీఅండ్వో ట్రేడ్స్, కొత్త అసస్మెంట్స్, ఖాళీస్థలాల పన్నులు తదితర పనులు కూడా ఈఆర్పీ సిస్టంలో ప్రవేశపెట్టి సంతకాలు చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీతో పాటు మిగిలిన ఏడు పురపాలక సంఘాల్లో ఈఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ ఇప్పటివరకు ఇలా ఉంది. పురపాలక సంఘం ఫైళ్ల క్లియరెన్స్ 1. ఏలూరు (కార్పొరేషన్) 1,275 2. భీమవరం 2,016 3. నరసాపురం 242 4. నిడదవోలు 38 5. పాలకొల్లు 224 6. తణుకు 413 7. తాడేపల్లిగూడెం 479 8. కొవ్వూరు 51 9. జంగారెడ్డిగూడెం 77 -
సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు
-
టాప్లో తెలుగురాష్ట్రాలు
న్యూఢిల్లీ. తెలుగు ప్రజలు మరోసారి వార్తల్లోనిలిచారు. సులువుగా వ్యాపార నిర్వహణలో తెలుగురాష్ట్రాలు తమ సత్తా చాటుకున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) సోమవారం విడుదల చేసిన జాబితాలో అగ్రస్థానాన్ని అక్రమించాయి. ఇరు రాష్ట్రాల మధ్య పోటాపోటీగా సాగిన ఈ పోటీలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు 340 కేటగిరీల్లో 98.78 శాతం దక్కించుకున్నాయి. కాగా గుజరాత్ తన మొదటి స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంతో సరిపెట్టుకోగా, ఛత్తీస్ గఢ్ నాలుగవ స్థానాన్ని నిలుపుకుంది. ఆ తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. కాగా కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ "వర్ధమాన నాయకులు" కేటగిరీలో ఉత్తమంగా నిలిచాయి. త్వరితగతిన అభివృద్ధి చెందాల్సిన గ్రూప్ లో తమిళనాడు, డిల్లీ నిలిచాయి. -
మళ్లీ యాక్టివానే టాప్
ముంబై: జూలై నెల టూవీలర్ అమ్మకాల్లోనూ హోండా ‘యాక్టివా’ వరుసగా ఏడవసారి టాప్లో నిలిచింది. అలాగే ఇదే సమయంలో పరిశ్రమలోని మొత్తం ఇన్క్రిమెంటల్ అమ్మకాల్లో (1,62,703 యూనిట్లు) యాక్టివా 38 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీంతో కంపెనీ ఈ ఏడాది స్కూటర్ విక్రయాల టార్గెట్ను 24 శాతంపైకి సవరించుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ ప్రకారం.. జూలైలో యాక్టివా విక్రయాలు హీరో స్ల్పెండర్ అమ్మకాల కన్నా 58,413 యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. -
దేశంలో పదేళ్లలో 17 శాతం ఐటీ పెట్టుబడుల వృద్ధి
♦ రూ.53,396 కోట్లతో కర్ణాటక టాప్ ♦ ఏపీ వాటా 12 శాతం; తెలంగాణ వాటా 4 శాతం ♦ రూ.46,200 కోట్ల నుంచి రూ.2.2 లక్షల కోట్లకు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలో 2005-06లో ఐటీ పెట్టుబడులు రూ.46,200 కోట్లుగా ఉంటే.. 2015-16 నాటికది రూ.2.2. లక్షల కోట్లకు పెరిగింది. పదేళ్లలో 17% వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో వంతు పెట్టుబడులు కర్ణాటక రాష్ట్రమే ఆకర్షించిందని అసోచాం నివేదికలో వెల్లడైంది. 2005-06లో రూ.14,337 పెట్టుబడులను ఆకర్షించిన కర్ణాటక.. 14% వృద్ధి రేటుతో 2015-16 నాటికి రూ.53,396 కోట్లకు చేరింది. 48% వృద్ధి రేటుతో రూ.35,300 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. 2005-06లో ఈ పెట్టుబడులు రూ.700 కోట్లు. 2015-16లో రాష్ట్రాల వాటాలను పరిశీలిస్తే.. కేరళ 13%, ఆంధ్రప్రదేశ్ 12%, తమిళనాడు 7%, హరియాణా 5%, మహా రాష్ట్ర 5%, వెస్ట్ బెంగాల్ 4.5%, తెలంగాణ 4%, ఒడిశా 3%, ఉత్తర్ ప్రదేశ్ 2%, మధ్యప్రదేశ్ 1.5% పెట్టుబడులను ఆకర్షించాయని అసోచాం నివేదిక వెల్లడించింది. ‘‘రొబోటిక్స్, సెమీ కండక్టర్ చిప్ డిజైన్, నానో టెక్నాలజీ వంటి విభాగాల్లో కర్నాటక హబ్గా మారింది. మెరుగైన పరిపాలన, లా అండ్ ఆర్డర్, పన్ను రాయితీల వంటివి ఐటీ కంపెనీలు కర్నాటక వైపు మొగ్గు చూపడానికి కారణమని’’ అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. మానవ వనరుల సమృద్ధి, ఐటీ నిపుణులు, ప్రతిభావంతులు, నైపుణ్యమైన ఉద్యోగులు, స్నేహపూరిత విధానాలూ కలిసొస్తున్నాయన్నారు. -
పొంగి పొర్లుతున్న ఏడూర్ ప్రాజెక్ట్
కౌలాస్ నాలాలోకి వచ్చి చేరుతున్న నీరు జుక్కల్ : కౌలాస్నాలా ప్రాజెక్ట్ ఎగువభాగంలో గల ఏడూర్ ప్రాజెక్ట్ నిండి పొంగి పొర్లుతోంది. కర్నాటక, మహరాష్ట్రలకు చెందిన ప్రధాన వాగులు ఒకేచోట కలిసే ఏడూర్ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 2009లో నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం ఒక టీఎంసీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టుకు 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. నిండుకుండలా కౌలాస్ నాలా కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటిమట్టం ప్రస్తుతం 457.20 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా పూర్తిస్థాయికి కేవలం అరమీటరు నీటిమట్టం మాత్రమే మిగిలి ఉంది. ఏడూర్ ప్రాజెక్ట్ నుంచి 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. -
అంగలూరు చరిత్రకెక్కింది
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అంగలూరు (గుడ్లవల్లేరు): వందేళ్లు పైబడిన గ్రంథాలయంతోపాటు కవిరాజు రామస్వామి పుట్టినగడ్డగా అంగలూరు చరిత్రకు ఎక్కిందని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్, బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్(బ్రీడ్) సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కె. రామచంద్రమూర్తి అన్నారు. శుక్రవారం ఆయనతోపాటు ఆ సంస్థ సెక్రటరీ కాకాని రామ్మోహనరావు, జాయింట్ సెక్రటరీ వీ కేశవరావు, పార్టనర్ ఎన్ భాస్కరరావు బృందం అంగలూరు వచ్చారు. డైట్లో ఛాత్రోపాధ్యాయులు నారతో తయారు చేసిన క్యారీబ్యాగ్లను డాక్టర్ రామచంద్రమూర్తికి అందజేశారు. డైట్ గేటు రోడ్డు బురదమయంగా మారిందని, దానిని వెంటనే శ్రమదానంతో బాగు చేయాలని ఈడీ కోరారు. మట్టి ట్రాక్టర్ల రాకపోకలతో ఆ రోడ్డు వర్షానికి బురదగా మారిందని సిబ్బంది సమాధానమిచ్చారు. డైట్ కార్యాలయంలో ఛాత్రోపాధ్యాయులు సాధించిన బహుమతుల ను ఆయన పరిశీలించారు. రూ.30 లక్షలతో మరమ్మతులు జరుగుతున్న తరగతి గదులను చూశా రు. డైట్ ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గతంలో 226 మంది ఉన్న బాలికల సంఖ్య 186కు ఎందుకు పడిపోయిందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూళ్లతో పోటీగా మౌలిక వసతులు ఉన్న ఈ హైస్కూల్లో ఎందుకు విద్యార్థినుల సంఖ్య తగ్గిందన్నారు. అనంతరం గ్రామస్తుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి రూ.5 లక్షలు విరాళమిచ్చిన తరగతుల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. -
బెంగళూరు టాప్ మోడల్ అరెస్ట్..
బెంగళూరుః డ్రగ్ రాకెట్ కేసులో బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ మోడల్ పట్టుబడింది. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోఫిక్ కంట్రోల్ చట్టానికి చెందిన వివిధ సెక్షన్లకింద ఆమెపై కేసులు పెట్టినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్ సీ బీ అధికారులు వెల్లడించారు. కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన ప్రముఖ మోడల్.. 26 ఏళ్ళ దర్శిత్మిత గౌడ ను ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలను మంగుళూరు, బెంగళూరు, గోవాల్లోని విద్యార్థులతోపాటు ఇతరులకు సరఫరా చేస్తున్న ముఠాలో పనిచేస్తోందన్న అనుమానంతో ఆమెపై ఎన్ సీబీ అధికారులు నిఘా పెట్టారు. ఆమె నివసిస్తున్నఅపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించి 110 గ్రాముల కొకైన్, 19 గ్రాముల హషీస్, మరికొన్ని మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదాలు నిర్వహించిన సమయంలో దర్శిత్మిత ఇంట్లో లేదని... సమయానికి ఇంట్లోనే ఉన్న బాయ్ ఫ్రెండ్ నిశాంత్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. దర్శిత్మిత నిర్వహిస్తున్న అక్రమ డ్రగ్ సరఫరాకు నిశాంత్ సహకరిస్తున్నట్లు విచారణలో తెలుసుకున్న పోలీసులు.. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేసి, ఆమెనుకూడ కస్టడీలోకి తీసుకున్నారు. -
బ్రిటన్ సంపన్నుల్లో రూబెన్ సోదరులు టాప్
బ్రిటన్ సంపన్నుల్లో భారత సంతతికి చెందినవారు టాప్ ర్యాంక్ లో నిలిచారు. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రూబెన్, హిందూజా సోదరులు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైలో పుట్టిన వ్యాపార దిగ్గజాలు 77 ఏళ్ల డేవిడ్ రూబెన్, 74 ఏళ్ల సైమన్ రూబెన్ సోదరులు ఈసారి సండేటైమ్స్ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో యూకే సంపన్నుల జాబితాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది ఐదో స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద విలువ ఈసారి 3.4 బిలియన్ పౌండ్లు పెరిగింది. దాంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సోదరుల తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా గ్రూప్నకు చెందిన శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానాన్ని సంపాదించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో ముఖేశ్, అనిల్ అంబానీ కలసి 17.90 బిలియన్ పౌండ్ల సంపదతో 30వ స్థానానికి పరిమితమయ్యారు. స్టీల్ పరిశ్రమల సంక్షోభం, యూకే ధనవంతుల సంపద ర్యాంకింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. 2008 లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్ లో నిలిచిన ఆర్సిలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద ఈ సంవత్సరం 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950 సమయంలో బ్రిటన్ వెళ్ళి అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో భారీగా సంపదను ఆర్జించారు. సంపన్న ఇరాకీ జోయెషీ కుటుంబంలో పుట్టిన ప్రవాస భారతీయులైన ఈ హిందూజా సోదరులకు ఇండియాలో కూడ అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి మొదటి తరగతి కంపెనీలు ఉన్నాయి. -
లంచం కేసులో జైలుపాలైన నేవీ అధికారి
అమెరికా నౌకాదళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారి లంచం కుంభకోణంలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఓ మలేషియన్ ఢిఫెన్స్ కాంట్రాక్టరుకు విలువైన సమాచారం అందించిన కేసులో డానియల్ డుసెక్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఓ లగ్జరీ హోటల్లో వేశ్యల సేవలు అందుకునేందుకు గాను ఎక్స్చేంజి ఆఫర్లో సమాచారాన్ని అందించడంతో సదరు అధికారి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డుసెక్కు శిక్షలో భాగంగా 70,000 డాలర్ల జరిమానాతోపాటు నౌకాదళానికి 30,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ శిక్ష పడ్డ అమెరికాకు చెందిన సైనికాధికారుల్లో లంచం కుంభకోణంలో పట్టుబడ్డ డుసెక్ అత్యధిక ర్యాంక్ లో ఉన్న అధికారి. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 46 నెలల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జానిస్ సమ్మర్టినో ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లకు సమాచారం అందించి, వేశ్యల సేవలు అందుకోవడం కూడా లంచం పరిధిలోకి వస్తుందంటూ అనూహ్య తీర్పును ఇచ్చిన కోర్టు... డుసెక్ కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 49 ఏళ్ల డుసెక్.. జనవరి 2015న తాను లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తూ కోర్టు ముందు క్షమాపణలు కోరాడు. -
సంపన్న భారతీయుడు ముకేశ్ అంబానీ
♦ 19.3 బిలియన్ డాలర్లతో 36వ స్థానంA ♦ జాబితాలో మనోళ్లు 84 మంది ♦ అగ్రస్థానంలో బిల్ గేట్స్ న్యూయార్క్: ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితా-2016లో చోటుదక్కించుకున్న భారతీయులందరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్లో నిలిచారు. ఈయన 19.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచవ్యాప్త కుబేరుల్లో 36వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ జాబితాలో మొత్తం 84 మంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు. 75 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ ఎప్పటిలాగానే అగ్రస్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 1,826 నుంచి 1,810కి పడింది. వీరి మొత్తం సంపద 6.5 ట్రిలియన్ డాలర్లు. జాబితాలో స్థానం పొందిన భారతీయుల్లో లక్ష్మీ మిట్టల్ (135వ స్థానం), సునీల్ మిట్టల్ (219), గౌతమ్ అదానీ (453), సావిత్రి జిందాల్ (453), రాహుల్ బజాబ్ (722), ఎన్ఆర్ నారాయణ మూర్తి (959), ఆనంద్ మహీంద్రా (1,577) తదితరులు ఉన్నారు. -
ముంబై 12వ స్థానం, 20వ స్థానంలో ఢిల్లి
-
సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా?
ప్రపంచ అత్యంత సంపన్న దేశాల్లో నార్వే అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడోసారి నార్వే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. 2015 సూచీల ప్రకారం ఆర్థిక వ్యవస్థ, విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యం పనితీరు ప్రమాణంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో నార్వే అత్యధిక స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన అన్ని విషయాల్లో ముందున్న స్విట్జర్లాండ్.. విద్యావ్యవస్థలో బలహీనంగా ఉండటంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హెల్త్ కేర్ లో 16వ ర్యాంకులో ఉన్న డెన్మార్క్..మూడో స్థానం... యూఎస్ పదకొండో స్థానాన్ని దక్కించుకోగా.. యూకె 2014-15 తో పోలిస్తే రెండు స్థానాలు కిందికి పడిపోయింది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక సంబంధాల అంశాల్లో బలహీన పడటంతో సింగపూర్ కూడ 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామాజిక పెట్టుబడి, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్య వ్యవస్థలు బలంగా కలిగిన నార్వే ర్యాంకింగ్ విషయంలో 2009 నుంచి విజయ పథంలో దూసుకుపోతోంది. అయితే 2013 తో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పడిపోయిందని చెప్పాలి. నిరుద్యోగ సమస్యే అందుకు ప్రధాన కారణమౌతున్నట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. లెగటమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి నాథన్ గామ్ స్టర్ అందించిన ఉత్పత్తి సూచికల ఆధారంగా... నార్వే ఎక్కువ కాలంపాటు ముందు వరుసలో నిలవడానికి కారణం.. అక్కడ నిరుద్యోగులు... వైకల్యం, లేదా ఎర్లీ రిటైర్మెంట్ పెన్షనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో నార్వేలో 20-24 ఏళ్ళ మధ్య వయస్కులు మాత్రమే అధ్యయనాల్లో పాలుపంచుకున్నారు. దీంతో నార్వే అధికార నిరుద్యోగ స్థాయికంటే తక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనకారులు భావిస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పొరుగు దేశాలతో పోలిస్తే నార్వేలో అధికార నిరుద్యోగ స్థాయి కృత్రిమంగా తక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిజానికి అధిక శాతం దేశాల్లో నిజమైన నిరుద్యోగ స్థాయిని వెల్లడించడంలేదని లండన్ మార్కెట్ ఆర్థిక వేత్త నిమా సమందజి అంటున్నారు. 2008 నుంచి ఉపాధి రేటును అధ్యయనం చేసిన ఆయన... ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడంలో ముఖ్యంగా నిరుద్యోగ స్థాయి ఆధారంగా సూచికలు నిర్థారిస్తామని, అదే నార్వేలోని నిజమైన గణాంకాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆ దేశం వెనుకబడి ఉండేదని చెప్తున్నారు. చెప్పాలంటే వ్యాపారం ప్రారంభించడానికి బ్రిటన్ అత్యుత్తమ దేశం అని, వ్యవస్థాపకత విషయంలో బ్రిటన్ ఉత్తమ స్కోర్ సాధించిందని ఆయన చెప్తున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను అమలు చేస్తోందని, దీంతో గణాంకాల ప్రకారం 28లో ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థ 19 కి పడిపోయిందని చెప్తున్నారు. అయితే ఉపాధి విషయంలో మాత్రం అత్యధిక పెరుగుదల కనిపించిందని చెప్తున్నారు. అలాగే చైనా సంపన్నదేశాల వరుసలో 52వ స్థానంలో ఉన్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ విషయంలో ముందుంటుంది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛలో 120 స్థానంలో ఉండటం వల్లనే ర్యాంకింగ్ లో వెనుకబడుతోందంటున్నారు. సౌదీ అరేబియాలో కూడ అదే పరిస్థితి కొనసాగుతోందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఇటువంటి కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తే.. దేశాలు ఎలా విజయవంతం అవుతున్నాయో తెలుస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. -
ఫార్చూన్ లిస్టులో ఐవోసీ టాప్
న్యూఢిల్లీ: ఆదాయాలపరంగా ఈ ఏడాది ఫార్చూన్ 500 భారత కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో నిల్చింది. ఈ రెండు ఇలా టాప్ 2 స్థానాల్లో నిలవడం ఇది వరుసగా ఆరోసారి కావడం గమనార్హం. ఐవోసీ రూ. 4,51,911 కోట్ల వార్షికాదాయంతో నంబర్ వన్గా నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3,82,565 కోట్ల ఆదాయాలతో రెండో స్థానం దక్కించుకుంది. రూ. 2,67,025 కోట్లతో టాటా మోటార్స్ అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటిదాకా మూడో స్థానంలో నిల్చిన భారత్ పెట్రోలియం.. రూ. 2,40,367 కోట్ల ఆదాయంతో అయిదో స్థానానికి పడిపోయింది. మరోవైపు, ఎస్బీఐ రూ. 2,57,289 కోట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. బిజినెస్ మ్యాగజైన్ ఫార్చూన్ ఇండియా ఈ జాబితాను రూపొందించింది. దీని ప్రకారం జాబితాలోని 500 కంపెనీల ఆదాయాలు 2014తో పోలిస్తే 2015లో స్వల్పంగా 2.7% పెరగ్గా లాభాలు 5.9% తగ్గాయి. టాప్-10లో హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. -
'టాప్' నుంచి వైదొలిగిన అభినవ్ బింద్రా
న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా వైదొలిగాడు. రియో ఒలింపిక్స్ కు ఇంకా పది నెలలు సమయం మాత్రమే ఉన్నందున తాను టాప్ పథకం నుంచి తప్పుకుంటున్నట్లు బింద్రా ప్రకటించాడు. ఈ మేరకు 'టాప్' చైర్మన్ థాకూర్ కు ఓ లేఖ రాశాడు. 'నేను ఇప్పటికే ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉన్నాను. ఒలింపిక్స్ కు చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో నేను టాప్ లో సభ్యునిగా ఉండటం సరైన నిర్ణయం కాదనుకుంటున్నాను. ఆ కారణం చేత వైదులుగుతున్నాను' అని బింద్రా లేఖలో పేర్కొన్నాడు. ఒలింపిక్స్లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గత మే నెలలో మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. దీంతో బింద్రా ఒలింపిక్స్ కు ఐదోసారి అర్హత సాధించాడు. రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసేందే టాప్. ఇప్పటికే శిక్షణతో బిజీగా ఉన్న బింద్రా.. తాను టాప్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించి ఆ పథకం నుంచి తప్పుకున్నాడు. -
పేరుకే 'టాప్'?
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ఆశించిన దిశగా ముందుకు సాగడం లేదు. ఇందుకు 'టాప్' లో చోటు దక్కిన పలువురు ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురుకావడమే. తొలుత ఎంతో గొప్పగా టాప్ పథకంలో కొంతమంది ఆటగాళ్ల పేర్లను చేర్చినా.. వారికి అత్యుత్తమ శిక్షణ ఇప్పించేందుకు నిధులు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా టాప్ లో చోటు దక్కించుకున్నఆటగాళ్ల అత్యుత్తమ శిక్షణ కోసం భారీగా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇలా టాప్ లో చోటు దక్కిన తరువాత నలుగురు ఆటగాళ్ల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ పక్కకు పెట్టేసినట్లు సమాచారం. వారిలో షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్ సింగ్, రేస్ వాకర్ కుష్బీర్ కౌర్, బాక్సర్ పింకీ జంగ్రా, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ లు ఉన్నారు. ఆటగాళ్ల నైపుణ్యాన్ని మరింత పదును పెట్టేందుకు ఏర్పాటు చేసినదే టాప్ పథకం. దశల వారీగా 75 మంది ప్రతిభగలక్రీడాకారులను ఎంపిక చేసి వారికి అత్యుత్తమ శిక్షణ ఇప్పించడమే టాప్ పథకం యొక్క లక్ష్యం. వీరికి 40 నుంచి 45 కోట్ల వరకూ నిధులు కేటాయించాల్సి ఉంది. ఇటీవల టాప్ పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటంతో వారికి టాప్ లో స్థానం కల్పించారు. వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా చోటు దక్కిన సంగతి తెలిసిందే. -
‘టాప్’లోకి జ్వాల, అశ్విని
కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మేటి క్రీడాకారిణిలు జ్వాల-అశ్విని జోడిని ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) స్కీమ్లో చేర్చనున్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే జాబితాలో ఈ ఇద్దరి పేర్లను చేరుస్తామని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం డబుల్స్ కోచ్ ఉండాలని మేం ఆమోద ముద్ర వేశాం. కాబట్టి మేటి ఆటగాళ్లను టాప్లోకి తీసుకురావాలని నిర్ణయించాం. ప్రస్తుతం జ్వాల-అశ్విని కంటే మెరుగైన క్రీడాకారిణిలు లేరు. వాళ్లను టాప్లో చేరుస్తాం. గోపీచంద్పై వాళ్లు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. టాప్ సమావేశాల్లో కనీసం ఒక్కసారి కూడా గోపీ వాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం అతని వల్లే మేం డబుల్స్ కోచ్ను తీసుకునేందుకు అంగీకరించాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు. -
భారత్లో వృద్ధి రయ్య్ రయ్య్
ప్రపంచ బ్యాంక్ ‘గ్రోత్ చార్ట్’లో అగ్రస్థానం ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికను విడుదల చేసిన కౌశిక్ బసు వాషింగ్టన్: ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజ దేశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్ ‘గ్రోత్ చార్ట్’లో భారత్కు మొట్టమొదటిసారి అగ్రస్థానం లభించింది. చైనాను పక్కకుతోసి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. 2015 వృద్ధి వేగంలో చైనాను అధిగమించి దేశం 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న అంచనాలు దీనికి కారణం. చైనా భారత్కన్నా తక్కువగా 7.1 శాతమే వృద్ధి సాధిస్తుందన్నది ప్రపంచబ్యాంక్ అంచనా. ఈ మేరకు తాజా ప్రపంచ ఆర్థిక అంచనాల (జీఈపీ) నివేదికను ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనమిక్ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బసు విడుదల చేశారు. ముఖ్యాంశాలు... ♦ 2015లో అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు అంచనా 4.4 శాతం. 2016లో ఈ రేటు 5.2 శాతానికి పెరుగుతుంది. 2017లో 5.4 శాతానికి చేరే అవకాశం ఉంది. ♦ భారత్ విషయానికి వస్తే- చమురు ప్రధాన దిగుమతి దేశంగా ఆ కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశం. అలాగే కేంద్రం తీసుకుంటున్న సంస్కరణలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. 2015లో 7.5% వృద్ధి బాటన నిలబెట్టే వీలుంది. ♦ అంతర్జాతీయ ఆర్థిక రంగం వృద్ధి ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడి ఉండేది. అయితే ఈ పరిస్థితి ‘నెమ్మదిగా’ మారడం ఖాయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి చెందుతున్న దేశాలే ‘ఇంజన్లు’గా మారతాయి. ♦ ప్రధానంగా భారత్ రికవరీపై ఆధారపడి దక్షిణ ఆసియాలో వృద్ధి రేటు 2015లో 7.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఆదాయ దేశాల్లో డిమాండ్ క్రమంగా పటిష్టం అవుతుండడం కూడా దీనికి కారణం. ♦ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం దక్షిణ ఆసియా మొత్తానికి లాభిస్తున్న అంశం. అతిగా అంచనాలు..? చైనా మేధావివర్గం అభిప్రాయం ఇరు దేశాలను పోల్చి చూడటం తగదని వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు దూసుకుపోతోందంటూ ఇప్పుడే గొప్పగా అంచనాలు వేయడం తొందరపాటేనని చైనా మేధావివర్గాలు అభిప్రాయడుతున్నాయి. భారత్ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. షాంఘై ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్లో దక్షిణాసియా పరిణామాల అధ్యయన విభాగం డెరైక్టర్ ఝావో గాంచెంగ్.. ఒక పత్రికలో రాసిన వ్యాసంలో ఈ అభిప్రాయాలు వ్యక్తపర్చారు. వృద్ధి రేటులో చైనాను భారత్ మించిపోతుందంటూ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎకానమీని మందగమనం నుంచి గట్టెక్కించేసినట్లేనని భారత్ నమ్ముతోంది. అందుకే ఆ దేశం అంచనాలు సాధారణంగానే ఆశావహంగా ఉంటాయి. భారత్ మాత్రమే కాకుండా అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి’ అని గాంచెంగ్ తెలిపారు. అయితే ఈ గణాంకాలను నిర్ధారించుకోవడం కష్టసాధ్యమైనందున.. ఇవన్నీ అతిగా వేసుకుంటున్న అంచనాలే అయ్యుండవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతిసారి భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూసుకోవడం అర్థరహితమని, రెండింటికీ మధ్య అసలు పోలికే ఉండదని గాంచెంగ్ వ్యాఖ్యానించారు. కానీ ఒకవేళ భారత్ వృద్ధి రేటు గానీ చైనా స్థాయిని అందుకుందంటే.. అది కచ్చితంగా ఉన్న దానికన్నా ఎక్కువ చేసి చూపించడమే అవుతుందని పేర్కొన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్లో ఆర్థిక గణాంకాలను హైలైట్ చేస్తుంటారని తెలిపారు. భారత్లో ఏదైనా జరగొచ్చు.. భారత్కి అనుకూలతలు ఉన్నప్పటికీ.. భారీ స్థాయిలో సమస్యలూ ఉన్నాయని గాంచెంగ్ వివరించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని లెక్కించే విధానాన్ని కొత్తగా మార్చడమన్నది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరిగిందా లేక దేశీయ ప్రమాణాలను బట్టి జరిగిందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వివరించారు. అయితే, భారత్లో ఏదైనా జరగొచ్చని, కాబట్టే దేశ ఎకానమీ గురించి ఇప్పుడే అతిగా ఊహించుకోవడం తొందరపాటే అవుతుందని గాంచెంగ్ పేర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే భారత జీడీపీని లెక్కించే విధానాన్ని, దాంతో పాటే దేశ ఆర్థిక స్వరూపాన్నీ సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. క్యూ1లో పటిష్ట వృద్ధి: ఓఈసీడీ న్యూఢిల్లీ: భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుందని ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, అమెరికా, జర్మనీ, కెనడాలు సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ క్యూ1లో మంచి పనితీరు కనబరచిందని సంస్థ తెలిపింది. జీ-20 దేశాల్లో జీడీపీ వృద్ధి మొత్తంగా జనవరి-మార్చిలో స్వల్పంగా 0.7 శాతం క్షీణించింది. 2014 డిసెంబర్ క్వార్టర్లలో 0.8 శాతం వృద్ధి జరిగింది. కెనడా (0.1 శాతం), అమెరికా(0.2 శాతం), బ్రెజిల్ (0.2 శాతం) ఆర్థిక వ్యవస్థల వృద్ధి ఏడాది మొదటి మూడు నెలల్లో క్షీణించాయి. ఈ ఏడాది వృద్ధి7.9%: సిటీ న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.9% ఉంటుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ సిటీగ్రూప్ అంచనావేస్తోంది. 2016-17లో ఈ రేటు ఏకంగా 8.1 శాతమని అంచనా వేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాపరమైన సంస్కరణలు, కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని సడలించడం వంటి అంశాలు దీనికి కారణమని తన తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడులు పెరగడం, వినియోగం మెరుగుదల వంటి అంశాలు సైతం వృద్ధి స్పీడ్కు దోహదం చేస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెపో రేటును ఆర్బీఐ మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వర్షాభావంతో జాగ్రత్త!: అయితే భారత్ వ్యవస్థకు తక్షణం పొంచి ఉన్న సవాలు వర్షాభావం అని వివరించింది. దీనివల్ల శీతాకాల పంటల్లో దాదాపు 10 శాతం నష్టం జరగడానికి అవకాశం ఉందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఇది ఒక పెద్ద సవాలని పేర్కొంది. -
బంగారుమయం అవుతున్న భారత్....
-
బంగారుతల్లుల ప్రతిభ
-
ఆస్తిపన్ను వసూళ్లలో అగ్రస్థానం
టవర్ సర్కిల్ : ఆస్తిపన్నుల వసూళ్లలో కరీంనగర్ నగరపాలక సంస్థ నాలుగేళ్లుగా వరంగల్ రీజియన్లోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. పక్కా ప్రణాళికతో పన్నులు వసూలు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్దేశిత లక్ష్యం సాధిస్తున్నారు. దీనికితోడు ఈఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలు వడ్డీమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ప్రజలు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లిస్తూ కార్పొరేషన్కు సహకరిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 94.5శాతం పన్నులు వసూలు చేశారు. ప్రభుత్వ సంస్థల బకాయిల వసూలు ఇబ్బందికరంగా తయారైనా ప్రజల సహకారంతో కార్పొరేషన్ ప్రథమస్థానంలో నిలుస్తోంది. మొదటి అర్ధ సంవత్సరం వసూళ్లు ఆశాజనకంగా లేకపోయినా ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలైన ఫిబ్రవరి, మార్చిలో వసూళ్లు ఊపందుకున్నారుు. బిల్కలెక్టర్లు ఇంటింటా తిరగకున్నా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారు. జోరందుకున్న నిర్మాణ రంగం.. నాలుగేళ్లుగా నగరంలో నిర్మాణ రంగం జోరందుకుంది. కార్పొరేషన్కు ఆదాయ వనరులు పెరిగాయి. అరుునా, వసూళ్లు తగ్గడంలేదు. అందుకు తగిన విధంగానే సిబ్బంది పనిచేస్తున్నారు. 2011-12లో కరీంనగర్ కార్పొరేషన్ 96శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రస్థాయి రికార్డు సొంతం చేసుకుంది. కరీంనగర్ బల్దియా పన్నుల వసూళ్లలో నాలుగేళ్లుగా వరంగల్ రీజియన్ స్థాయి మున్సిపాలిటీలు, కారొపరేషన్లలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.18 లక్షలు నగరపాలక సంస్థకు ఆరేళ్లుగా బకాయి పడ్డ రూ.18 లక్షల ఆస్తి పన్నును బీఎస్ఎన్ఎల్ అధికారులు మంగళవారం చెల్లించారు. అరుుతే, మిగతా ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు రూ.4కోట్ల పన్ను బకారుులు రాబట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. వడ్డీమాఫీ పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి పలు కార్యాలయాలకు పన్ను డిమాండ్తో పాటు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 1 నుంచి యథావిధిగా వడ్డీతో సహా పన్ను బకారుులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను వసూళ్ల వివరాలు ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు (శాతంలో..) 2014-15 94.5 2013-14 90 2012-13 92 2011-12 96 2010-11 93 2009-10 94 -
2016లో భారతే టాప్
వాషింగ్ టన్: 2015లో 6.3 శాతం అభివృద్ధితో, 2016లో 6.5 శాతం అభివృద్ధితో అభివృద్ధి సూచీలో భారత్ చైనాను అధిగమించబోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) తెలియజేసింది. ప్రస్తుత భారత ప్రభుత్వ ప్రణాళికలు అందుకు అద్దం పడుతున్నాయని, వాటిని చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉందని తెలిపింది. అయితే ఆ ప్రణాళికలను భారత ప్రభుత్వం ఏ మేరకు అమలుచేస్తుందో వేచి చూడాల్సి ఉందని ఐఎమ్ఎఫ్ అనుమానం వ్యక్తం చేసింది. 2014 లో భారత అభివృద్ధి 5.8 శాతంగా నమోదైతే, అదే ఏడాది చైనా 7.4 శాతం అభివృద్ధిని నమోదు చేసిందని ఐఎమ్ఎఫ్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదికలో పేర్కొంది. -
బానిసత్వ సూచీలో భారత్ అగ్రస్థానం
మెల్బోర్న్: అంతర్జాతీయ బానిసల సూచిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బానిసలు మనదేశంలోనే ఎక్కువని, లక్షలాది పిల్లలు సహా మొత్తం 1.43 కోట్ల మంది భారతీయులు ఆధునిక తరహా బానిసత్వం చిక్కుకున్నారని అంతర్జాతీయ బానిసత్వ సూచి(జీఎస్ఐ)-2014 పేర్కొంది. వీరు అక్రమరవాణా, వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీ బాధితులనని పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలో 3.5 కోట్ల మంది బానిసలు ఉండగా, వారిలో 45 శాతం భారత్, పాక్లో ఉన్నారని పేర్కొంది. -
కొవ్వుకేక
గ్రేటర్లోని ప్రతి ఆరుగురిలో ఒకరికి అధిక బరువు సమస్య ‘కొవ్వు కరిగింపు’లో సిటీ టాప్ ఒబెక్యూర్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: ఊబకాయం... మోసేవారికే కాదు... చూసేవారికీ ఇబ్బంది కలిగించేది. ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది. ఒబెక్యూర్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధ పడుతుంటే, గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఆరుగురు పెద్దవాళ్లలో ఒకరు, ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక రు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ప్రతి ఏడుగురు బాధితుల్లో ఒకరు 100 కేజీలకు పైగా బరువు ఉన్నవారే. బాధితుల్లో 65 శాతం మహిళలు ఉంటే, 35 శాతం పురుషులు ఉంటున్నారు. ఇక్కడే కరిగించుకుంటున్నారు తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జాలు, బర్గర్లు... వెరసి శరీరంలో కొవ్వు కొండలా పేరుకుపోతోంది. పీల గా ఉన్న వారిని సైతం పీపాలా తయారు చేస్తున్నాయి. దీంతో త్వరగా సన్నబడాలనే కాంక్షతో సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిష్ణాతులైన వైద్యులు, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య పరికరా లు హైదరాబాద్లో అందుబాటులో ఉ న్నా యి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వైద్య ఖర్చులు కూడా ఇక్కడ తక్కువ. దీంతో నగర వాసులే కాకుండా టాంజానియా, ఇథియోపియా, కెన్యా దేశీయులు సైతం గ్రేటర్ వైద్యులనే ఆశ్రయిస్తుండటం విశేషం. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2012-13లో దేశ వ్యాప్తంగా 6వేల శస్త్రచికిత్సలు జరిగితే, అందులో ఒక్క హైదరాబాద్లోనే 800కు పైగా నిర్వహించారు. ఢిల్లీలో నెలకు 50, ముంబైలో 40, గ్రేట ర్లో 70కిపైగా ఆపరేషన్లు జరుగుతున్నా యి. 1400 కేలరీలు చాలు అవసరమైన దానికంటే అధిక ఆహారం తీసుకోవడం, దాని ద్వారా లభించే కేలరీలు ఖర్చయ్యే స్థాయిలో శారీరక శ్రమ లేకపోవడం సమస్యగా మారింది. ప్రాసెస్డ్ ఆహారం, పిజ్జాలు, బర్గర్లు విరివిగా లభిస్తున్నాయి. వీటిని ఒకసారి తింటే చాలు.. ఆ రోజుకు సరిపడే కేలరీలు లభిస్తాయి. ఇవి ఎంత త్వరగా విడుదలవుతాయో అంతే త్వరగా జీర్ణమవుతాయి. ఇవి ఖర్చుకాకపోతే బరువు పెరుగుతుంది. రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2300-2500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారు 1400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్ఫుడ్ తీసుకుంటే శరీరంలో అదనంగా కేలరీలు పోగవుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయం ఓ తీవ్రమైన జబ్బు కాకపోయినా.. పరోక్షంగా ఇది మధుమేహం, గుండెపోటు, మోకాలి నొప్పులు, హైపర్టెన్షన్, మిహ ళల్లో సంతానలేమి, రొమ్ము క్యాన్సర్కు దారి తీస్తుంది. మితాహారమే ఉత్తమం సాధ్యమైనంత వరకు బరువు పెరుగకుండా చూసుకోవాలి. నిత్యం కనీసం అరగంటైనా వ్యాయమం చేయాలి. పరిమితికి మించి ఆహారం తీసుకోవద్దు. మాంసాహారం, మద్యంపై నియంత్రణ ఉండాలి. లైపోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. కాస్మోటిక్ సర్జరీల వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. - డాక్టర్ మహిధర్ వల్లేటి, బెరియాట్రిక్ సర్జన్, నోవా స్పెషాలిటీ ఆస్పత్రి లైపొసక్షన్ సర్జరీ శరీరంలోని కొవ్వును రెండు పద్ధతుల్లో తొలగిస్తారు. ఇందులో మొదటిది లైపొసక్షన్ సర్జరీ. ఇది కాస్మోటిక్ సర్జరీ. ఇంజక్షన్ సాయంతో శరీరంలోని కొవ్వును తొలగిస్తారు. ఈ చికిత్సలో ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత.. మళ్లీ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సినీ తారలు ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత కొవ్వును తీసేసిన ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెరియాట్రిక్ సర్జరీ రెండోది బెరియాట్రిక్ సర్జరీ. ఇది 1950 నుంచి అందుబాటులో ఉంది. గతంలో పొట్టను పూర్తిగా కోసి కొవ్వును తొలగించేవారు. తాజాగా ల్యాప్రోస్కోపిక్ విధానంతో పొట్టపై చిన్న కోతపెట్టి, జీర్ణకోశం సైజును తగ్గిస్తారు. శరీరంలోని కొవ్వునంతా ఒకేసారి తొలగింకుండా రోజు వారీ వ్యాయామం, ఆహార నియంత్రణతో నెమ్మదిగా బరువును తగ్గిస్తారు. తొమ్మిది నెలల్లో 60-70 శాతం కొవ్వు దానంతటదే శరీరంలో కరిగిపోతుంది. కేవలం బరువే కాకుండా బీపీ, షుగర్, నొప్పులు కూడా తగ్గుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
ఆత్మహత్యల్లో భారత్దే అగ్రస్థానం
సాక్షి, బెంగళూరు : ఆత్మహత్యల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని సమాధాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎస్.కృష్ణస్వామి వెల్లడించారు. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల వైపు వెళుతుండడంతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చదువులో వెనకబడుతున్నామనే కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే బలవన్మరణాల నిరోధానికి నగరంలో ర్యాలీని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈనెల 7న నగరంలోని కేఎల్ఈ కళాశాల నుండి 5 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాక ఈనెల 10న ‘అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవాన్ని’ సైతం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లోని పిల్లలకు జీవితం విలువను తెలియజేసేలా కౌన్సిలింగ్ను సైతం తమ సంస్థ అందించనుందని వెల్లడించారు. -
రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర అగ్రస్థానం
నాగపూర్: దేశంలో రైతుల ఆత్మహత్యలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. గతేడాది మహారాష్ట్రలో 3146 మంది రైతులు కరువుకాటకాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 1995 నుంచి మహారాష్ట్రలో 60,768 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలే ఈ దుస్థితికి కారణమని విదర్భ జన్ ఆందోళన్ సమితి చీఫ్ కిశోర్ తివారీ విమర్శించారు. -
సీమాంధ్ర పోలీస్కు బెజవాడే బాస్
*డీఐజీ స్థాయి నుంచి నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి * అడిషనల్ డీజీగా సురేంద్రబాబు? * కీలకం కానున్న జంటనగరాల పోలీసింగ్ *కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ పోలీసులు నంబర్వన్ కానున్నారు. ఇప్పటివరకు డీఐజీ స్థాయి క్యాడర్కే పరిమితమైన విజయవాడ కమిషనరేట్ను ఏకంగా అదనపు డీజీ స్థాయికి పెంచనున్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోం శాఖకు చేరినట్లు సమాచారం. దీంతోపాటు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గుంటూరు అర్బన్ పోలీసు జిల్లాను డీఐజీ స్థాయికి అప్గ్రేడ్ చేసి కమిషనరేట్గా మార్చనున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో ఏలూరును పశ్చిమగోదావరి జిల్లా నుంచి విభజించి ఏలూరు అర్బన్ జిల్లాగా మార్చే ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదముద్ర పడితే సీమాంధ్ర పోలీసింగ్కు బెజవాడ కీలకం అవుతుంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగర కమిషనరేట్కు హైదరాబాద్ మెట్రో నగరం స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తుప్రారంభించింది. రాష్ట్ర అవతరణ తేదీ అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కమిషనరేట్ను నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి చేయనున్నారు. ఇక్కడ కమిషనర్గా రెండో పోలీస్ బాస్ స్థాయిలో ఉన్న అడిషనల్ డీజీని నియమించనున్నారు. ఈ పోస్టింగ్ కోసం అప్పుడే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సీపీగా సమర్ధంగా పనిచేసిన నిమ్మగడ్డ సురేంద్రబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం కీలక కేడర్లో ఉన్న ఉమేష్ షరాఫ్, ఎ.బి.వెంకటేశ్వరరావుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. రెండేళ్లలో రెట్టింపు కానున్న స్టేషన్లు, సిబ్బంది.. కొత్త రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విజయవాడ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఇంద్రకీలాద్రి, విజయవాడ రైల్వే జంక్షన్ ఉన్నాయి. వీటికి ఇప్పటికే భద్రత పెంచాల్సిన అవరం ఉందనే ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నాయి. వీటితో రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా ఏర్పాటయ్యే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. వారందరి భద్రతకు రెట్టింపు పోలీసు సిబ్బంది అవసరం ఉంటుంది. కమిషనరేట్లో ఇప్పుడున్న రెండున్నర వేలమంది పోలీసులకు అదనంగా మరో రెండున్నర వేలమందిని పెంచనున్నారు. కమిషనరేట్లో 11 పోలీస్ స్టేషన్లు, రూరల్లో 9 స్టేషన్లు మొత్తం 20 ఉన్నాయి. ఇవిగాక కమిషనరేట్లో మరికొన్ని ప్రాంతాలను కూడా కలిపే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఇదంతా రానున్న రెండేళ్లలో జరగవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు పూర్తయితే విజయవాడ కమిషనరేట్ హైదరాబాద్ నగరం స్థాయిలో భద్రత ఉంటుందని చెబుతున్నారు. విభజనతో పోలీసుల శాఖలో అన్ని కేడర్లలో ప్రమోషన్లు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన కేడర్ల క ంటే సీఐలకు డీఎస్పీ ప్రమోషన్లు ముందుగా వచ్చే అవకాశాలున్నాయి. కొత్త సిబ్బంది నియామకం కూడా జరుగనున్నట్లు సమాచారం. విజయవాడ అర్బన్ జిల్లా విజయవాడ 1983 మే 18న అర్బన్ జిల్లాగా ఆవిర్భవించింది. అప్పట్లో ఐదు లక్షల జనాభా ఉండడంతో ఎనిమిది లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఒక మహిళా పీఎస్, 10 రూరల్ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లు, నాలుగు ట్రాఫిక్ పీఎస్లతో అర్బన్ జిల్లా కార్యకలాపాలను సాగించింది. తొలి ఐపీఎస్ అధికారిగా కె.ఎస్.వ్యాస్ పనిచేశారు. ఇప్పటికే కమిషనరేట్ను అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తాజా పరిణామాలతో విజయవాడ, గుంటూరు పట్టణాలు జంటనగరాలుగా అభివృద్ధి చెందనున్న దృష్ట్యా నేరుగా అడిషనల్ డీజీ కేడర్కు అప్గ్రేడ్ చేయనున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా గుంటూరు అర్బన్ జిల్లా 2010 సంవత్సరం జూన్లో ఏర్పాటైంది. అనంతరం నగర పరిసర ప్రాంతాలు విస్తరించడంతో జనాభా భారీగా పెరిగింది. వాస్తవానికి 2016లో అప్గ్రేడ్ కావాల్సిన గుంటూరు అర్బన్ జిల్లా రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందే అప్గ్రేడ్ కానుంది. డీఐజీ స్థాయి అధికారి కమిషనర్గా, ఐపీఎస్ అధికారులు ఇద్దరిని ఇక్కడ డీసీపీలుగా నియమించే అవకాశం ఉంది. -
ఇంటర్ ఫలితాల్లో కృష్ణా టాప్
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 8,68,744 మంది విద్యార్థులు హాజరవగా, 4,85,069 మంది ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలికలదే పైచేయి. బాలికలు 60.52 శాతం, బాలురు 51.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా 74 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇక రంగారెడ్డి జిల్లా 68 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానం దక్కించుకుంది. కాగా 38 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. మే 25న అడ్వాన్స్డ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. -
సకాల సూపర్బ్
సేవలతో పాటు సేవ్ .. సుమారు రూ.5 వేల కోట్ల ఆదా! లంచం కూడా కలుపుకుంటే మొత్తం రెండింతలు 12 రాష్ట్రాల్లో సకాల .. అమల్లో కర్ణాటక టాప్ తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలంటూ రాష్ట్రానికి ‘కేంద్రం’ వినతి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘సకాల’ంలో సేవలు అందించడంలో దేశంలోనే కర్ణాటక టాప్. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సేవలను నిర్ణీత వ్యవధిలో పొందడానికి ఉద్దేశించిన ఈ ‘సకాల’ వల్ల ప్రజలకు ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఆదా అయ్యాయని ఓ పరిశీలనలో తేలింది. లంచం కూడా కలుపుకొంటే ఈ మొత్తం రెండింతలకు పైగా ఉండవచ్చని అంచనా. సకాల కింద 45 శాఖల ద్వారా 447 రకాల సేవలను అందిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు లేదా సంస్థలకు వచ్చిన ప్రతి సారీ రూ.200 వరకు ఖర్చు అవుతుందనే అంచనాతో ఈ లెక్కలు వేశారు. గతంలో ఏదైనా శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని లేదా ఇతర సేవను పొందడానికి అర్జీదారు కనీసం ఆరేడు సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వరకు సకాల కింద అందిన, పరిష్కరించిన దరఖాస్తులను లెక్కగట్టి ఆదా అయిన మొత్తాన్ని తేల్చారు. సిబ్బంది వ్యవహారాలు, పాలనా సంస్కరణల శాఖ (డీపీఏఆర్) లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సకాల కింద నాలుగు కోట్ల దరఖాస్తులను పరిష్కరించారు. దరఖాస్తుల పరిష్కారంలో సగటు జాప్యం రెండు శాతం కాగా, తిరస్కృతుల సగటు నాలుగు శాతంగా నమోదైంది. సకాల పరిధిలోకి ప్రభుత్వం దశలవారీ అనేక సేవలను చేర్చింది. 12 రాష్ట్రాల్లో సకాల అమలవుతుండగా, కర్ణాటక సహా రెండు రాష్ట్రాల్లో మాత్రమే వందకు పైగా సేవలను సకాలలో చేర్చారు. కర్ణాటకలో సకాల ద్వారా 447 రకాల సేవలు అందిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ సేవల సంఖ్య వెయ్యికి పెరిగితే ప్రజలకు మరింతగా ఆదా అవుతుంది. ఇంకా పలు ముఖ్యమైన శాఖలు సకాల కిందకు రావడానికి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ, డీపీఏఆర్ తరచూ వాటికి గుర్తు చేస్తూనే ఉంది. ప్రజలకు లభించిన ఈ అపూర్వ సదుపాయాన్ని చూసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ పార్లమెంట్లో సిటిజన్స్ ఛార్టర్ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా సకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కోరింది. 2011లో సకాల రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. -
ఆదాయంలో ‘టాప్’
మాస్కో: రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా... అందంతో పాటు ఆదాయంలోనూ ‘టాప్’ అని నిరూపించుకుంది. వరుసగా తొమ్మిదోసారి అత్యధిక సంపాదన కలిగిన మహిళా అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ఈ జాబితాను తయారు చేసింది. జూన్ 2012 నుంచి జూన్ 2013 మధ్య ఏడాది కాలంలో... 26 ఏళ్ల షరపోవా 29 మిలియన్ డాలర్ల (రూ.176 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ప్రైజ్మనీ, వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 20.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా... నా లీ (చైనా-18.2 మిలియన్ డాలర్లు), విక్టోరియా అజరెంకా (బెలారస్-15.7 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.