
జిల్లాలోని గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారని తెలిపారు.
సాక్షి, కడప సిటీ/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారని తెలిపారు. అలాగే ప్రొద్దుటూరు, పులివెందులలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
23వ తేదీ
►ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు
►12.00 – 1.25 గంట వరకు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అనంతరం బహిరంగ సభ
►మధ్యాహ్నం 2.00 గంటలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్ట్ కాలనీ-1 కు చేరుకుంటారు
►2.15 –2.20 బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్ధాపన
►2.20 – 2.50 గంటలకు మెస్సర్స్ సెంచరీప్లై పరిశ్రమకు శంకుస్థాపన
►3.20 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకోనున్న సీఎం
►3.35 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చి ప్రారంభం
►3.50 – 4.50 గంటలకు వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రారంభోత్సవం
►సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో రాత్రి బస
24వ తేదీ
►ఉదయం 9.05 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు
►ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇడుపులపాయలోని ప్రార్ధనా మందిరానికి చేరుకుని అక్కడ నిర్వహించే ప్రార్ధనల్లో పాల్గొంటారు.
►మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్కు చేరుకుంటారు
►2.10 – 2.35 మధ్య ఇండస్ట్రియల్ పార్క్లో ఆదిత్య బిర్లా యూనిట్కు శంకుస్ధాపన
►2.40 –3.25 గంటలకు వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖి
►3.35 గంటలకు మార్కెట్ యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు
►3.55 – 4.05 గంటలకు మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
►4.15 గంటలకు రాణితోపు సమీపంలో ఆక్వా హబ్ ప్రారంభోత్సవం
►సాయంత్రం 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో రాత్రి బస
25వ తేదీ
►ఉదయం 9.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.20 గంటలకు పులివెందుల చేరుకుంటారు
►9.35 – 10.55 గంటల మధ్య పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొంటారు
►11.00 గంటలకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో ఏర్పాటుచేసిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం
►11.35 గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు
►12.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం