తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ సతీమణి శోభ | CM KCR's Wife Kalvakuntla Shobha Visited Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శోభ

Oct 10 2023 8:00 AM | Updated on Oct 10 2023 8:43 AM

CM KCR Wife Kalvakuntla Shobha Visited Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె.. మంగళవారం వేకువజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహుకరించారు. అయితే, నిన్న తిరుమలకి చేరుకున్న కల్వకుంట్ల శోభ, రాత్రి తిరుమలలో బస చేశారు.

 

మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఐదు కాంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,828. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. సోమవారం తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,768గా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement