
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,223 కాగా, నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,549. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్లు.
శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో గత మూడు రోజులుగా చేపట్టిన జ్యేష్టాభిషేక మహోత్సవం గురువారంతో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత అర్చకులు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి అక్కడ వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం చేపట్టారు.
తర్వాత కవచాలకు పూజలు, హారతి సమరి్పంచి స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు తిరుచ్చిపై అధిరోహించి ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనుంజయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment