
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా: మున్నేరులో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: వరదను మించిన విపత్తు బాబే!
వరద ప్రభావిత గ్రామాలైన కంచల, ఐతవరం, దామూలూరుతో పాటు పలు గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు 65,000 క్యూసెక్కుల వరద చేరుకుంది. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.