దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు | Hindupuram TDP leader arrested in road robbery case | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు

Published Tue, Feb 18 2025 4:57 AM | Last Updated on Tue, Feb 18 2025 4:57 AM

Hindupuram TDP leader arrested in road robbery case

చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు,  మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్‌ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్‌ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్‌పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అను­చరు­లు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అత­ని అకౌంట్‌లోని రూ.33 వేలు ఫోన్‌పే ద్వారా వా­రి ఖాతాలకు జమ చేసుకున్నారు.

ఈ విషయంపై బాధి­తుడు హిందూపురం రెండో పట్టణ పోలీ­సుస్టే­షన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగ­రాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్‌ఫో­న్‌లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసు­కు­న్నా­రు.

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..
దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నా­గరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్‌ను కూడా కలిశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement