
సాక్షి, అమరావతి: జస్టిస్ వి.కనగరాజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనగరాజ్ వైఎస్ జగన్కు పుష్పగుచ్చం అందించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా జస్టిస్ వి.కనగరాజ్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా నియమితులైన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.అదనపు ఎస్పీ, అంతకంటే పై స్థాయి పోస్టులు కలిగిన అధికారులపై వచ్చే ఫిర్యాదులపై ఈ అథారిటీ విచారణ చేపడుతుంది.