ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటనున్న వాయుగుండం! | Rains across the state for the next two days | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటనున్న వాయుగుండం!

Published Sat, Aug 31 2024 4:23 AM | Last Updated on Sat, Aug 31 2024 4:23 AM

Rains across the state for the next two days

వచ్చే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగా­ళా­ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడు­తోందని, ఇది వాయుగుండంగా మారి 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ­లోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికా­రులు తెలిపారు. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళా­ఖాతంపై ఏర్పడిన ఈ అల్ప­పీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్యలో తీవ్ర అల్పపీడనంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని చెప్పారు. 

ఇది తీరాన్ని దాటిన అనంతరం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించి బలహీనపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో శని, ఆది వారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. 

తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement