వైఎస్‌ జగన్‌ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం | Security Failure At YS Jagan Gurla Visit, Serious Comments On Police Goes Viral | Sakshi
Sakshi News home page

YS Jagan Gurla Visit: వైఎస్‌ జగన్‌ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం

Published Thu, Oct 24 2024 1:56 PM | Last Updated on Thu, Oct 24 2024 3:25 PM

Security failure At Ys jagan Gurla Visit Serious On Police

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అయితే వైఎస్‌ జగన్‌ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు చిరిగిపోయాయి. 

జనాల తోపులాటతో వైఎస్ జగన్ మీడియా సమావేశానికి కొంత సేపు అంతరాయం ఏర్పడించింది. దీంతో పోలీసులు వైపల్యంపై  వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని మండిపడ్డారు. పోలీసుల నుంచి సహకారం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడుతుంటే.. కనీసం భద్రత కల్పించపోతే పోలీసులు ఎలా పనిచేస్తుస్తున్నారని ప్రశ్నించారు. 

గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
చదవండి: కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?: వైఎస్‌ జగన్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement