చెట్లను కాదు.. మమ్మల్ని నరికేయండి! | TDP leaders cut down 115 mango and 50 teak trees | Sakshi
Sakshi News home page

చెట్లను కాదు.. మమ్మల్ని నరికేయండి!

Published Wed, Apr 16 2025 2:40 AM | Last Updated on Wed, Apr 16 2025 2:40 AM

TDP leaders cut down 115 mango and 50 teak trees

టీడీపీ నాయకుల దారుణంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆక్రోశం 

115 మామిడి, 50 టేకు చెట్లను నరికివేసిన టీడీపీ నాయకులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు  

గంగాధర నెల్లూరు: ‘చెట్లను నరకడం కంటే..  మమ్మల్ని నరికేయండి’ అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆక్రో­శం వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా కంటికి రెప్ప­లా.. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మామిడి, టే­కు చెట్లను అన్యాయంగా నరికివేశారంటూ కన్నీ­రుమున్నీరయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ వాపోయాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుప్పనపల్లికి చెందిన రైతు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి వరత్తూరులో సర్వే నం.840లో మూడు ఎకరాల 30 సెంట్ల భూమి ఉంది.

మూడేళ్ల క్రితం ఆ భూమిలో రూ.లక్షలు వెచ్చించి మామిడి, టేకు చెట్లను నాటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ­డంతో.. స్థానిక టీడీపీ నాయకులు యువరా­జురెడ్డి, గంగిరెడ్డి ఆ భూమిపై కన్నేశారు. దౌర్జన్యంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో 115 మామిడి, 50 టేకు చెట్లను నరికేశారు. ఈ దారుణంపై శంకర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కానిస్టేబుళ్లను పంపించి ప్రాథమిక విచారణ చేశారు. 

కానీ రెండు రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో  రైతుఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నియో­జక­వర్గ ఇన్‌చార్జ్‌ కృపాలక్ష్మి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నారా­యణస్వామి మంగళవారం కుప్పనపల్లికి చేరుకుని శంకర్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం అండతో ఎంతటికైనా దిగజారుతారా? అని మండిపడ్డారు. ఈ సమస్యపై జిల్లా ఎస్పీకి పలుమార్లు ఫోన్‌ చేసినా.. కనీస స్పందన లేదని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement