నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ! | Varma played key role in Pawans entry into assembly | Sakshi
Sakshi News home page

నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!

Published Tue, Mar 11 2025 4:50 AM | Last Updated on Tue, Mar 11 2025 4:50 AM

Varma played key role in Pawans entry into assembly

వర్మకు మోకాలడ్డింది పవనేనని జోరుగా ప్రచారం

ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం 

తనకు ప్రొటోకాల్‌ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు

రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనీ ఆందోళన

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

రెండు చోట్ల ఓడిన పవన్‌ను గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్‌ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీ­ఎస్‌ఎన్‌ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టా­రనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్‌ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

తనకు ప్రొటోకాల్‌ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్ర­బాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత  పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళన­లోనూ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లు చెబుతున్నారు. 

అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్‌ అంచనా వేస్తున్నట్లు సమాచారం.  

సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!
ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్‌ కళ్యాణ్‌ గెలవలేకపో­యిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజక­వర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. 

పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయ­నను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపో­యారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠా­పురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటు­ను తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళ­నకు దిగాయి. 

టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయ­నను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్‌ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతి­మిలాడి ఆయన పవన్‌ కోసం పని చేయించారు. 

పవన్‌ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర 
పవన్‌ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పి­నట్లు ప్రచారం జరిగింది. దీంతో  పవ­న్‌­ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పని­­చేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపో­యిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంప­డంలో కీలకపాత్ర పోషించారు. 

ఇప్పుడు ఆయనకే పవన్‌ అడ్డు­పడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీ­య భవి­ష్యత్తు ఇచ్చిన వర్మను పవన్‌ దెబ్బ­కొ­ట్ట­డం దారుణ­మని వాపోతున్నాయి. ఎమ్మె­ల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యా­యం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement