
జెడ్పీ ఛైర్మన్ ఎన్నికలపై మంతనాలు
కడప కార్పొరేషన్: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 27వ తేది నిర్వహించే జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు చర్చించారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన వారు సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు అకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment