
బెంగుళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన అత్యుత్తమ సేవలతో ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ సృష్టించుకుంది. తాజాగా ఇన్పోసిస్ కోబాల్ట్తో సేవలు, సొల్యుషన్ష్ తదితర రంగాలలో డిజిటల్ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు పీఏఎస్, ఎస్ఎఎస్ తదితర సాఫ్టవేర్ ఉత్పత్తులలో క్లౌడ్ నేపుణ్యాలతో(డిజిటల్) సాంకేతికంగా నూతన ఒరవడి సృష్టించనుంది.
క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులను అందించేందుకు ఇన్ఫోసిస్ ప్రారంభిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు కోబాల్ట్ ఎంటర్ప్రైజస్తో 200 క్లౌడ్ ఉత్పత్తులను మొదటగా ప్రారంభించనున్నానారు. దిగ్గజ సంస్థ ప్రస్తుతం తన సేవలను అంతర్జాతీయంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. మార్కెట్కు అవసరమైన సాంకేతికత, సెక్యూరిటీల విషయంలో ఇన్ఫోసిస్ నూతన ఒరవడి సృష్టించనుంది.
చదవండి: ఒక్క గంటలో 50 వేల కోట్ల రూపాయలు