
లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మధ్యంతర బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్నింటిలోనూ, అందరినీ కలుపుకొని, సర్వవ్యాప్తి చెందే అభివృద్ధికి ఒక విధానంతో పని చేసిందని వెల్లడించారు.
మోదీ ప్రభుత్వ అభివృద్ధి దార్శనికత అన్ని కులాలు, అన్ని స్థాయిల ప్రజలను కవర్ చేస్తుందని పేర్కొన్న సీతారామన్ 2047 నాటికి భారతదేశాన్ని 'అభివృద్ధి చెందిన భారత్'గా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఈ విజన్కు అనుగుణంగా పేద, మహిళా, యువ (యువకులు), రైతులు అనే నాలుగు ప్రధాన కులాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
పేద ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగతి చెందుతుందని.. వారి జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తన మద్దతుని అందిస్తుంది వెల్లడించింది. వారి సాధికారత, శ్రేయస్సే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది కేంద్ర మంత్రి అన్నారు.