
కొత్త డెరివేటివ్ సిరీస్ తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించింది. 207 పాయింట్లు పెరిగి 39,957కు చేరగా.. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 11,731 వద్ద ట్రేడవుతోంది. క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఆర్థిక వ్యవస్థ 33 శాతం పురోగమించడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆసియాలో అధిక శాతం మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత 39,636 వరకూ వెనకడుగు వేసిన సెన్సెక్స్ తదుపరి 39,980 వరకూ జంప్చేసింది.
మీడియా, రియల్టీ జోరు
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, రియల్టీ, మెటల్, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్ 1.6-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, కోల్ ఇండియా, విప్రో, హిందాల్కో, టాటా మోటార్స్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 2.4-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్గ్రిడ్, ఐషర్, మారుతీ, కొటక్ బ్యాంక్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ 1-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి.
ఐడియా అప్
డెరివేటివ్స్లో ఐడియా, ఆర్ఈసీ, టీవీఎస్ మోటార్, గోద్రెజ్ ప్రాపర్టీస్, అమరరాజా, నౌకరీ, జీ, హెచ్పీసీఎల్, పీఎఫ్సీ 5-2.2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమికల్స్, ఇండిగో, ఐసీఐసీఐ లంబార్డ్, గోద్రెజ్ సీపీ, బీవోబీ, బంధన్ బ్యాంక్ 3.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిఢ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం మధ్య పెరిగాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,177 లాభపడగా.. కేవలం 404 నష్టాలతో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment