లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 27 August 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Tue, Aug 27 2024 3:45 PM | Last Updated on Tue, Aug 27 2024 3:45 PM

Stock Market Closing Update 27 August 2024

మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.81 పాయింట్ల లాభంతో 81,711.30 వద్ద, నిఫ్టీ 7.20 పాయింట్ల లాభంతో 25017.80 వద్ద నిలిచాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్‌సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్ & టూబ్రో మొదలైన కంపెనీలు చేరాయి. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టైటాన్ కంపెనీ, హిందూస్తాన్ యూనీలివర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement