మార్కెట్‌ రికార్డుల హ్యాట్రిక్‌ | Stock market: FMCG stocks up as market rises | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ రికార్డుల హ్యాట్రిక్‌

Jul 17 2024 3:46 AM | Updated on Jul 17 2024 9:13 AM

Stock market: FMCG stocks up as market rises

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్ల దన్ను 

24,600 స్థాయిపైకి నిఫ్టీ 

మొహర్రం సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు  

ముంబై: స్టాక్‌ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్‌ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.

⇒ మొహర్రం సందర్భంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్‌ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్‌ జరుగుతుంది.

వేదాంతా క్విప్‌ ధర రూ. 461 
వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్‌)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్‌ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్‌ ధర స్వల్ప ప్రీమియం.  

వేదాంతా షేరు బీఎస్‌ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement