సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Mon, Feb 12 2024 9:22 AM | Last Updated on Mon, Feb 12 2024 9:23 AM

Stock Market Rally Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 21,830 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 125 పాయింట్లు లాభపడి 71,724 వద్ద ట్రేడవుతోంది.

నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్‌ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్‌  పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్‌ హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్‌ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది.  

ఎఫ్‌ఐఐలు శుక్రవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.141.95 విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.421.87 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement