సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Fri, Mar 1 2024 9:25 AM | Last Updated on Fri, Mar 1 2024 4:26 PM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,114కు చేరింది. సెన్సెక్స్‌ 382 పాయింట్లు పుంజుకుని 72,888 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌ ఇండెక్స్‌ 0.17శాతం పెరిగి 104 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 0.1 శాతం తగ్గి 83.62 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25శాతానికి చేరాయి. 

స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది.

ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్‌ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్‌ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్‌ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్‌ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement