గరిష్ఠాల వద్ద లాభాలు స్వీకరణ | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

గరిష్ఠాల వద్ద లాభాలు స్వీకరణ

Published Wed, Aug 28 2024 9:38 AM | Last Updated on Wed, Aug 28 2024 11:29 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు తగ్గి 24,981కు చేరింది. సెన్సెక్స్‌ 83 పాయింట్లు నష్టపోయి 81,629 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌ గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 100.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 80 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.82 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.16 శాతం, నాస్‌డాక్‌ 0.17 శాతం  లాభపడ్డాయి.

సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్‌ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వారాంతాన(30న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement