అంతరిక్ష రంగంలో పోటీ పడుతున్న దేశీయ ప్రైవేట్ కంపెనీలు | Top 4 Indian Companies in The Space Race | Sakshi
Sakshi News home page

అంతరిక్ష రంగంలో పోటీ పడుతున్న దేశీయ ప్రైవేట్ కంపెనీలు

Oct 10 2021 4:20 PM | Updated on Oct 10 2021 5:09 PM

Top 4 Indian Companies in The Space Race - Sakshi

గత దశాబ్ద కాలంలో అంతరిక్ష ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అమెరికాలో బ్యాక్ టూ బ్యాక్ రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తుంది. స్పేస్ ఎక్స్ నిజంగా యుఎస్ అంతరిక్ష చరిత్రకు పర్యాయ పదంగా ఉండే పేర్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి కంపెనీలు ఈ మధ్య కాలంలో ఈ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మన దేశంలో కూడా గత కొద్ది కాలంగా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. 

రాకెట్లు నిర్మించడం, లాంచింగ్ వెహికల్స్, ఉపగ్రహాలను ప్రయోగించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం లాంటి వాటిపై ప్రైవేట్ కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అంతరిక్ష రంగం వైపు చూస్తోన్న టాప్-4 కంపెనీలు ఏవో చూద్దాం.

స్కైరూట్ ఏరోస్పేస్
స్కైరూట్ ఏరోస్పేస్ అనేది 2018లో స్థాపించిన హైదరాబాద్ కు చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ. దీనిని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలిసి స్థాపించారు. ఈ సంస్థ తన 'విక్రమ్' శ్రేణి రాకెట్లపై పనిచేస్తోంది. 2022 మధ్యలో విక్రమ్-1 లాంచ్ చేయాలని చూస్తోంది. విక్రమ్-1ను వాణిజ్యీకరించడంతో పాటు ఇదే వరుసలో విక్రమ్-2, విక్రమ్-3ను రూపొందించాలని ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సంస్థ 11 మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించినట్లు తెలిపింది. ఈ సంస్థలో పెట్టుబడిదారులుగా వాట్సాప్ గ్లోబల్ బిజినెస్ ఛీఫ్ నీరజ్ అరోర్, మింత్రా వ్యవస్థాపకులు ముఖేశ్ బన్సాల్ కూడా ఉన్నారు.(చదవండి: టయోటా మరో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!)

అగ్నికుల్ కాస్మోస్
అగ్నికుల్ కాస్మోస్ అనేది శ్రీనాథ్ రవిచంద్రన్, మొయిన్ ఎస్‌పిఎమ్ 2016 లో స్థాపించిన చెన్నైకి చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ. 3డీ ప్రింటెడ్ ఇంజిన్లతో రెండు ప్రదర్శనల రాకెట్ అయిన 'అగ్నిబాన్' అనే రాకెట్లపై ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుతం స్మాల్-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అయిన అగ్నిబాన్ను డెవలప్ చేస్తోంది. ఇది 100 కిలోల పేలోడ్‌ను 700 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యంలో ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

పిక్సెల్
పిక్సెల్ సంస్థ అంతరిక్షంలో 30 కిలోమీటర్ల పై నుంచి భూమిని పరిశీలించే సూక్ష్మ ఉపగ్రహాలపై (మైక్రో శాటిలైట్లు) పరిశోధనలు చేస్తోంది. డేటాను సేకరించడానికి వ్యవసాయం, వాతావరణ మార్పు మొదలైనవాటిని అధ్యయనం చేయడానికి ఈ సంస్థ సుమారు 24 అల్ట్రా-హై రిజల్యూషన్ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెట్టింది. సాంకేతికతను అభివృద్ధి చేయడం, ఉపగ్రహాల కూటమిని నిర్మించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. ఈ స్టార్టప్ కు మెషిన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం కూడా ఉంది.(చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్‌ చేసుకోవద్దు!)

బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్
ఇది శాటిలైట్ ప్రొపల్షన్ లో ప్రత్యేకత కలిగిన భారతీయ ఏరోస్పేస్ ఆర్ అండ్ డి కంపెనీ. ఇది తమిళనాడులోని కోయంబత్తూరు కేంద్రంగా ఉంది. దీనిని రోహన్ ఎం గణపతి, యశస్ కరణం స్థాపించారు. బెల్లాట్రిక్స్ 'చేతక్' అనే రాకెట్ పై పనిచేస్తోంది. ఇది మీథేన్, ద్రవ ఆక్సిజన్ ను ఉపయోగించే ఇంజిన్లతో మొదటి రాకెట్ కావచ్చు. వారు తమ రాకెట్ ను ప్రయోగించడానికి 'మొబైల్ లాంచర్'ను ఉపయోగించాలని యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement