Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి | Boy Taking Selfie With Tractor Deceased In Tamil Nadu | Sakshi
Sakshi News home page

Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి

Published Sat, May 15 2021 7:19 AM | Last Updated on Sat, May 15 2021 11:46 AM

Boy Taking Selfie With Tractor Deceased In Tamil Nadu - Sakshi

వేలూరు: వానియంబాడి సమీపంలో బాలుడు ట్రాక్టర్‌పై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్‌తో పాటు బాలుడు బావిలో పడి మృతిచెందాడు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని చిన్నమోటూరుకు చెందిన సౌందర్‌రాజన్‌ తన ట్రాక్టర్‌ను తీసుకుని అదే గ్రామానికి రాజంద్రన్‌ పొలంలో దున్నేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లాడు.

క్రిష్ణన్‌ కుమారుడు సంజీవి(16) ట్రాక్టర్‌ నడుపుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో పాటు సంజీవి కూడా సమీపంలోని 60 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డాడు. గ్రామస్తుల సమాచారంతో వానియంబాడి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు వ్యవ సాయ మోటార్లను అమర్చి నీటిని బయటకు తోడి క్రేన్‌ సాయంతో ట్రాక్టర్‌ను, బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అంబలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   
చదవండి: ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్న కరోనా భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement