Karnataka: Constable Wife Suicide Mystery, Details Inside - Sakshi
Sakshi News home page

ఏ కష్టం వచ్చిందోగానీ.. కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య  

Published Mon, Jan 31 2022 6:54 AM | Last Updated on Mon, Jan 31 2022 9:07 AM

Constable Wife Suicide Mystery In Karnataka - Sakshi

సాక్షి, తుమకూరు (కర్ణాటక): ఏ కష్టం వచ్చిందోగానీ పసిగుడ్డును వదిలేసి పోలీస్‌ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది. చిక్కనాయకనహళ్ళి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్‌ శశిధర్, భార్య లావణ్య (32)తో కలిసి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా, వీరికి ఆరునెలల మగ బిడ్డ ఉన్నాడు. ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే.

ఆదివారం ఉదయం శశిధర్‌ డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంట్లో లావణ్య ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన  శశిధర్‌ ఉరికి వేలాడుతున్న భార్యను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె కన్నుమూసింది.  

వేధింపులతో యువకుడు ఆత్మహత్య
మైసూరు: టి.నరసిపుర తాలూకా వ్యాసరాజపుర గ్రామానికి చెందిన రామనాయక కుమారుడు మను (19) అనే యువకుడు యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె తిరస్కరించింది.

ఈ విషయంలో యువతి బంధువులు సిద్దరాజు, ప్రతాప్, శాంతరాజు, భాగ్యమ్మ అనేక సార్లు పిలిచి మనును తిట్టడంతో అతడు ఆవేదన చెందాడు. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మను తల్లి బన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement