love affair
-
ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..?
జమ్మికుంట(హుజూరాబాద్): పరిపక్వతలేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. ఇరు కుటుంబాల్లో ఎలాంటి నిర్బంధాలు లేవని, వారి ఫిర్యాదులతో తెలుస్తోంది. అయినా ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో తేలాల్సి ఉందనే సందేహం కలుగుతోంది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై శనివారం రాత్రి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మెనుగు రాహుల్ (18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఏరుచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన రాహుల్ హైదరాబాద్లో ఎల్ఈడీ బల్బస్ ఈవెంట్ వర్క్స్ చేస్తుంటాడు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి వద్ద ఉంటున్నాడు. శ్వేత కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది. కాగా శనివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించినా పట్టాల పైనుంచి జరగకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ప్రేమ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలియదుగానీ, ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏదిఏమైనా ఇద్దరి ఆత్మహత్య ఘటన కారణాలు లేకుండా మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్, రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి ఆదివారం తెలిపారు. -
బీటెక్ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’
తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది.ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు.కర్నూలు: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.టూటౌన్ పోలీస్టేషన్లో మూడో రోజు..ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్, త్రీటౌన్ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన చిట్రా సూర్య (20) అనే యువకుడు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సూర్యకు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన యువకుడు యువతి చదువుతున్న కొవ్వూరులోని స్కూలుకి వెళ్లాడు. యువతిని పిలువమని అడుగగా ప్రిన్సిపాల్ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తాము ఎవరినీ పంపలేదని చెప్పడంతో యువతిని కలిసేందుకు పాఠశాల నిర్వాహకులు నిరాకరించారు. యువతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ వ్యవహారంపై యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. స్థానిక బ్యాంకులో యువకుడి సోదరుడు పనిచేస్తున్నారు. ఆ యువకుడి బ్యాంకు ఉద్యోగం తీయించి వేస్తామని యువతి తల్లిదండ్రులు హెచ్చరించారు. పైగా సూర్యని చంపుతామని బెదిరించడంతో మనస్థాపం చెంది సోమవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పక్క గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు యువకుడి తండ్రి శివ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు యువతి కుటుంబ సభ్యులైన హరి, వరలక్ష్మీ , పార్వతీ, లాయర్ నరసింహరాజు, సూర్యచంద్రం, సత్యవతిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కె.జగన్మోహన్రావు తెలిపారు. సూర్య ఆ కుటుంబంలో రెండో సంతానం అన్నారు. ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారని అన్నారు. మృతుడి తండ్రి తాపీ పనిచేస్తాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు నిరసన
మామిడికుదురు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించి, ఇప్పుడు పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదంటూ మొహం చాటేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. ఈ ఘటన మంగళవారం పాశర్లపూడిబాడవ చింతలమెరకలో చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం చెయ్యేరు పండువారిపేటకు చెందిన గుంట్రు ప్రమీల (25) కాకినాడలో నర్సింగ్ చదువుతోంది. పాశర్లపూడిబాడవ చింతలమెరకకు చెందిన అంబాజీపేట ఎంఈఓ–2 మోకా ప్రకాష్ తనయుడు మోకా ప్రవర్ష తనను ప్రేమించాడని ప్రమీల పేర్కొంది. నాలుగేళ్ల నుంచి ఇద్దరం ప్రేమించుకున్నామని, తమ మధ్య ప్రేమ విషయం అతని ఇంట్లో అందరికీ తెలుసని చెప్పారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటానని తనను నమ్మించాడని యువతి వివరించారు. ఈ విషయంపై రెండు, మూడు పర్యాయాలు పెద్దల సమక్షంలో చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నారు. రెండు నెలల నుంచి ప్రవర్ష తనకు అందుబాటులో లేకపోవడంతో గత నెల చివరి వారంలో కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ప్రవర్ష తండ్రి ఎంఈఓ మోకా ప్రకాష్ పోలీసుల సమక్షంలో పెళ్లికి అంగీకరించారన్నారు. ఈ ఒప్పందం జరిగిన తర్వాత మళ్లీ ప్రవర్షను కుటుంబ సభ్యులు కట్టడి చేశారని ఆమె ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని, అతనితో తనకు పెళ్లి చేయాలని, లేదంటే తాను పెట్రోలు పోసుకుని అతని ఇంటి ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రమీల హెచ్చరించారు. ప్రహర్ష ఇంటి ఎదుట తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో ఆందోళన చేపట్టారు. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ అక్కడకు చేరుకుని యువతికి, ఆమె కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. యువకుడిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పెళ్లి విషయం పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. ఈ దశలో ప్రమీల మద్దతుదారులు, ప్రహర్ష మద్దతుదారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఎస్సై చైతన్యకుమార్ రెండు వర్గాలను సముదాయించారు. మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెద్దలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని, నిరసన విరమించాలని కోరారు. సుదీర్ఘ మంతనాల అనంతరం యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు నిరసనను విరమించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. -
ట్రాన్స్జెండర్ పల్లవితో ప్రేమ..
గద్వాల క్రైం: ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రాన్స్జెండర్ను ప్రేమించి చివరకు పురుగుమందు తాగి బలవనర్మణానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. మృతుడి తల్లి శంకుతుల, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్(25) అనే యువకుడు, ట్రాన్స్జెండర్(రవి అలియాస్ పల్లవి) ఇద్దరు స్నేహితులు. కాగా వారిద్దరు ఇటీవలే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు గుర్తుగా నవీన్ తన చెస్ట్ (ఎడమ వైపు) ట్రాన్స్జెండర్ పల్లవి(రవి) టాటును సైతం వేయించుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా అందించినా పరిస్థితి మెరుగు పడకపోలేదు. చేసేదేమీ లేక గురువారం రాత్రి తిరిగి గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా.. ఇక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మృతుడి రెండు కాళ్లు, తోడలు, సున్నితమైన ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గాయాలను పరిశీలిస్తే వేడి చేసిన వస్తువుతో వాతలు పెట్టినట్లు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దీంతో మృతుడి తల్లి తన కుమారుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోలేదని, చిత్రహింసలు పెట్టారని అనుమా నం వ్యక్తం చేసింది. ఈమేరకు ట్రాన్స్జెండర్ పల్లవి అలియాస్ రవి, నరేష్ పై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. పక్కా వ్యూహ రచనతోనే? ట్రాన్స్జెండర్ (పల్లవి) రవి, నవీన్లు ఇద్దరూ గతంలో చింతలపేటకాలనీలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం రవి కాలనీ వదిలి వెళ్లిపోయి ట్రాన్స్జెండర్గా మారి పట్టణ శివారులో హమాలీ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకున్నాడు. నవీన్ జిల్లాకేంద్రంలోని ఓ ఫైనాన్సియర్ వద్ద కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవితో నవీన్ ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో పల్లవిని డబ్బులు యాచించేందుకు బయటికి వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 4న అర్ధరాత్రి వేళ నవీన్ను పల్లవి (రవి) తమ్ముడు నరేష్ ఇంటి వద్దకు వచ్చి స్కూటీపై ఎక్కించుకు వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో పక్కా వ్యూహరచనతోనే నవీన్ను చిత్రహింసలకు గురి చేసి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురి మధ్య సంబంధాలపై ఆరా.. నవీన్ మృతిపై అతడి తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశాం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తాం. ట్రాన్స్జెండర్ పల్లవిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తాం. ఈ నెల 4న జరిగిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుటాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ, గద్వాల Mettuguda Incident: అంతా కట్టుకథేనా! -
భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం!
హుబ్లీ: ఇన్స్టా గ్రామ్ ప్రేమ వలలో చిక్కి ధార్వాడలో రామదుర్గకు చెందిన శ్వేత (24) అనే వివాహిత యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆమెకు మూడున్నరేళ్ల క్రితం రామదుర్గకు చెందిన విశ్వనాథ్తో పెళ్లి అయింది. ఇన్స్టాలో శ్వేతకు ధార్వాడ తాలూకా శివళ్లి గ్రామానికి చెందిన విజయ్ నాయకర్తో స్నేహం మొదలై ప్రేమకు దారితీసింది. ఫలితంగా భర్తను వదిలేసి ఆమె శ్రీనగర్లోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం ప్రారంభించింది. శ్వేత కుటుంబ సభ్యులు విజయ్ ఇంటికి వెళ్లి ఇది సబబు కాదని మందలించారు. వీలైతే ఆమెను పెళ్లి చేసుకో, ఊరికే ఇలా తమ కుమార్తె సంసారాన్ని నాశనం చేయవద్దు అని బుద్ధిమాటలు చెప్పారు. విజయ్ తమనే బెదిరించినట్లు శ్వేత తల్లి శశి సావంత్ తెలిపారు. శ్వేత ఇటీవల భర్త విశ్వనాథ్కు విడాకుల నోటీసు కూడా పంపింది. అయితే శుక్రవారం నాడు విజయ్, శ్వేత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ శ్వేత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థలాన్ని ఉప నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు. సంసారంలో చిచ్చు పెట్టిన విజయ్ పరారీలో ఉన్నాడు. -
అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని..
అల్వాల్: అన్న కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువతి చిన్నాన్న ప్రేమించిన యువకుడి ఇంటిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాచ బొల్లారం గోపాల్నగర్ ఎరుకల బస్తీలో ప్రకాష్ హేమలత దంపతులు తమ కుమారుడు ప్రదీప్తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రదీప్ అదే ప్రాంతంలోని వివేకానందకు చెందిన బైక్ షోరూమ్లో పనిచేస్తున్నాడు. వివేకానంద అన్న కుమార్తెతో ప్రదీప్కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పలుమార్లు వివేకానంద ప్రదీప్ను హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరి మార్చుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన వివేకానంద ప్రదీప్, అతడి కుటుంబసభ్యులను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పెట్రోల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలతో పాటు ఇంటి తలుపులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో ప్రకా‹Ùకు తీవ్ర గాయాలు కాగా, పక్కింట్లో ఉండే దిలీప్ అనే వ్యక్తి కుమార్తె చిన్నారి చాందిని (4) రెండు కాళ్లకు మంటలంటున్నాయి. చిన్నారి చాందినిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రకాష్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వివేకానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ప్రేమ’ వేధింపులకు యువతి బలి
జవహర్నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ మహేష్కుమార్, జవహర్నగర్ సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం..దమ్మాయిగూడ పరిధిలోని న్యూ భవానీనగర్లో నివసించే పొనగంటి తానేష్, పద్మ దంపతుల కుమార్తె పూర్ణిమ (19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ట్యూషన్లు కూడా చెబుతుంది. ఈ నెల 24వ తేదీన కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన పూర్ణిమ..పిల్లలకు ట్యూషన్ చెబుతూ మధ్యలో బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్ తాగి పడుకుంది. యాసిడ్ తాగానని ట్యూషన్కి వచ్చిన పిల్లలకు చెప్పడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. నిఖిల్ అనే యువకుడి వేధింపుల కారణంగానే పూరి్ణమ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిఖిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
చెల్లికి ఫోన్ చేసి.. బావను చంపేసిన అన్న
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ప్రేమపెళ్లి వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ‘నిన్ను చూడాలని ఉంది చెల్లీ.. సద్దుల బతుకమ్మకు మీ ఇంటికి వస్తున్నా’అని తన చెల్లికి ఫోన్ చేశాడు ఓ అన్న. నిజమేనని నమ్మిన ఆ చెల్లి.. తన భర్తను ఎదురు పంపించింది. అయితే అన్నతోపాటే, ఆమె మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే చెల్లిని ఓ గదిలో బంధించిన అన్న.. బయట గడియపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చెల్లి భర్తపై దాడిచేసి చంపేశాడు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. యైటింక్లయిన్కాలనీలోని హనుమాన్నగర్కు చెందిన వడ్డాది వినయ్కుమార్(25) గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్కావెంజర్గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోగా, రెండు కుటుంబాలు అంగీకరించలేదు. వన్టౌన్ పోలీస్స్టేషన్లో పంచాయితీ సాగుతుండగానే వినయ్ ఆ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. యైటింక్లయిన్కాలనీ హనుమాన్నగర్లో ఇంట్లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే తమ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వినయ్ తల్లిదండ్రులు అద్దె ఉంటున్న ఇంటి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.చదవండి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడుఅయితే సద్దుల బతుకమ్మ వేడుకను సాకుగా తీసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ఆమెకు ఫోన్చేసి చూడాలని ఉందన్నాడు. అడ్రస్ తెలియదని, వినయ్ను తన వద్దకు పంపించాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన ఆమె వినయ్కు విషయం చెప్పి తన అన్నను తీసుకురమ్మని పురమాయించింది. వినయ్ వివాహిత అన్నను తీసుకొని ఇంటికొచ్చాడు. ఆయన వెంట మాజీ భర్త కూడా వచ్చాడు. ఇంటికి రాగానే వివాహిత అన్న, మాజీ భర్త వినయ్పై విచక్షణా రహితంగా దాడిచేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ ప్రసాద్రావుతో కలిసి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిన్నంటిన రోదనలుకాగా కాలనీలో ఒక వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా మరో వైపు హత్య జరగడంతో సంచలనంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమారుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రేమపెళ్లే తన కుమారున్ని పొట్టనబెట్టుకుందని మతుని తండ్రి కుమార్ రోధిస్తూ వెల్లడించారు. -
యువతి దారుణ హత్య
రాయగడ: ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఆనందమయమైన జీవితాన్ని కొనసాగిద్దామని ప్రేమికురాలిని ప్రియుడు ఒప్పించాడు. అయితే వీరిద్దరి పెళ్లికి ప్రేమికురాలి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించకపోవడంతో కోపోద్రేక్తుడైన ప్రేమికుడు పథకం ప్రకారం ప్రేమికురాలిని పిలిచి హత్య చేసిన అనంతరం ఒక అడవిలో మృతదేహాన్ని పారేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తన కూతురుని హత్య చేశాడంటూ బిసంకటక్ పోలీసుస్టేషన్లో ప్రేమికుడిపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేనని తెలిసి, సరాసరి జిల్లాలోని గుణుపూర్ పోలీసుస్టేషన్లో ప్రేమికుడు లొంగిపొయాడు.మనస్థాపంతో హత్యవివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బిసంకటక్లో నివాసముంటున్న నిటు నౌరి (23) అనే యువతితో గుణుపూర్లోని మరాటిగుడ గ్రామానికి చెందిన మేన్యూవ్ సబర్ (28) అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇదే క్రమంలో తన ప్రేయసిని కలిసేందుకు సరాసరి బిసంకటక్ వెళ్లి మాట్లాడి వస్తుండేవాడు. అయితే ఇక పెళ్లి చేసుకుందామని అందుకు తల్లిదండ్రులకు ఒప్పించమని ప్రేయసిని అడిగాడు. తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని యువతి తన ప్రియుడితో చెప్పడంతో మనస్థాపానికి గురయ్యాడు.ఈ నేపథ్యంలోనే సోమవారం తన ప్రేయసికి ఫోన్చేసి ఒకసారి మాట్లాడాలని రమ్మన్నాడు. అందుకు అంగీకరించిన ఆమె కలిసేందుకు వెళ్లింది. అప్పటికే బిసంకటక్లో ఉన్న సబర్ తన వ్యూహం ప్రకారం ప్రేమికురాలిని హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బిసంకటక్ సమీపంలోని కిరిబిరి అడవుల్లో పడేశాడు. తిరిగి ఏమీ తెలియని వాడిలా తన స్వగ్రామమైన గుణుపూర్ వెళ్లిపోయాడు. ఇంట్లో కుమార్తె లేకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న సబర్ సరాసరి గుణుపూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తానే హత్య చేసి మృతదేహాన్ని పారివేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో బిసంకటక్ పోలీసులు అడవిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్ మోసం చేశాడని ఓ యువతి..
కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన యువతిని కొడిమ్యాల మండలానికి చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేశాడు. దీంతో ఆ యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలిని పట్టణ ఎస్సై మన్మధరావు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవి చదవండి: పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. -
లవ్ బ్రేకప్ చెప్పడంతో ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్: లవ్ బ్రేకప్ చెప్పడంతో ఓ ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వన్ష్ (21) మౌలాలి ఎంజే కాలనీలో నివసించే యువతి (21) ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఒకే స్కూల్లో చదువుకున్న వారు చిన్ననాటి నుంచే స్నేహంగా ఉంటూ వస్తున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారి ప్రేమికులయ్యారు. ప్రస్తుతం వారు కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అమ్మాయి లవ్ బ్రెకప్ చెప్పింది. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న వన్ష్ ప్రియురాలిని చంపి తాను కూడా చనిపోవాలని పథకం వేసుకున్నాడు. శనివారం తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఒక్కసారి మాట్లాడుకుందా అంటూ నమ్మించి పిలిపించాడు. అలా ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు పార్కు చేసి కారు అద్దాలు వేసుకొని మాట్లాడుకున్నారు. ఎందుకు బ్రేకప్ చెబుతున్నావంటూ కొద్దిసేపు వాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కత్తి తీసి ప్రియురాలి, పొట్ట, మెడపై విచక్షణ రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వన్ష్ కూడా పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగులగొట్టి కారు డోర్ తెరిచారు. వారిని స్థానిక ఎన్ఎఫ్సీ సంజీవని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హాని లేదన్నారు. -
కటకటాల్లోకి నయవంచకులు
అనంతపురం క్రైం: ప్రేమ పేరుతో ఓ యువతి జీవితాన్ని నరకప్రాయం చేశాడో వంచకుడు. అదే యువతిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి తెగబడ్డాడు మరో దుర్మార్గుడు. ఎస్పీ ఆదేశాలతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి పంపారు. స్థానిక దిశ పోలీసు స్టేషన్లో శనివారం డీఎస్పీ ఆంథోనప్ప వెల్లడించిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన మొలకతాళ్ల్ల కృష్ణారెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. తను పట్టించుకోకపోవడంతో బ్లాక్ మెయిల్కు దిగాడు. బెంగళూరుకు పిలిపించుకొని స్నేహితుల గదికి తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం కృష్ణారెడ్డి క్లాస్మేట్, గుంతకల్లు పట్టణంలోని బెంచ్కొట్టాలకు చెందిన దివాకర్ బాబుకు తెలిసింది. సదరు యువతి కృష్ణారెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సేకరించి, ఆమెను వేధించడం ప్రారంభించాడు. బలవంతంగా ఆమెను గుంతకల్లుకు పిలిపించుకుని, స్థానికంగా ఉండే ఓ లాడ్జ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే మళ్లీ తెరపైకి వచ్చిన కృష్ణారెడ్డి.. దివాకర్తో సదరు యువతి కలిసి ఉన్న ఫొటోలను సంపాదించి, వాటిని సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టి బెదిరింపులకు దిగాడు. నరకయాతన అనుభవించిన బాధితురాలు ఎట్టకేలకు తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంది. ‘దిశ’ యాప్ ద్వారా బాధను గ్రామ మహిళా పోలీసుకు విన్నవించింది. ఈ విషయం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్కు తెలియడంతో సీరియస్గా పరిగణించారు. తక్షణమే కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ‘దిశ’ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఆంథోనప్పకు ఆదేశాలు చేశారు. ఈ విషయం తెలిసిన కృష్ణారెడ్డి, దివాకర్ బాబులు పరారయ్యేందుకు ప్లాన్ వేసుకున్నారు. శనివారం స్థానిక నగర శివారులోని నేషనల్ పార్కు వద్ద దాక్కుని ఉండగా, పక్కాగా అందించిన సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి పంపారు. -
బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి
హైదరాబాద్: స్టేట్హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లీశ్వరీ అనే యువతి గత కొంతకాలంగా మధురానగర్ డివిజన్ పరిధిలోని స్టేట్హోంలో ఉంటూ సమీపంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఇన్స్ట్రాగాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థరాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్హోం ఇన్చార్జి ముంతాజ్బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్ఫ్రెండ్తో మొద టిసారిగా డేటింగ్కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్కు వెళ్లాలంటూ అలోంగ్కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్ ఎంట్రీతో షాక్!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశి్చతార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్ను మధురానగర్కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు.. నావాడంటూ మరొకరు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఇరువురూ తమ ఆవేదను తెలియజేశారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు ఎగ్బాల్ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. -
బస్సులో ప్రేమికుడి వీరంగం... ‘నా లవర్ మోసం చేసింది’
పలమనేరు: బస్సులో ఎక్కి పూటుగా మద్యం సేవించి నానా హంగామా చేసి ప్రయాణికుల వద్ద దెబ్బ లు తిన్న యువకుని వ్యవహారం మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. తిరుపతిలో కర్ణాటక ఆర్టీసీ రాజహంసలో బస్సు ఎక్కి ఓ 26 ఏళ్ల యువకుడు బెంగళూరుకు టికెట్ తీసుకున్నాడు. బస్సు కొంతదూరం కదలగానే పూటుగా మద్యం సేవించాడు. బంగారుపాళెం వచ్చేసరికి కిక్కు ఎక్కువై ‘నా లవర్ మోసం చేసింది’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతన్ని ప్రయాణికులు చితకబాదారు. విధిలేక కండక్టర్, డ్రైవర్లు అతన్ని పలమనేరులోని అంబేడ్కర్ సర్కిల్లో బస్సు నుంచి దించేశారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు ఐలవ్యూ అంటూ గట్టిగా అరుస్తూ జనంపైకి మట్టిని చల్లడం ప్రారంభించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేక పోయింది. దీంతో అక్కడున్న స్థానికులు అతనిపై నీళ్లు పోసి మత్తు దింపారు. అదే బస్సులోకి అతన్ని ఎక్కించారు. -
‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’
చిత్తూరు: ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. ఆపై పెళ్లిమాట ఎత్తగా ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకోవడం ప్రారంభించాడు. గట్టగా నిలదీయగా.. ‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’ అంటూ ముఖంపై తెగేసి చెప్పేశాడు. పాపం.. అతనే జీవితమని నమ్ముకున్న ఆ ప్రియురాలి మనసు కకావికలమైంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. మిద్దైపె నుంచి ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మృతురాలి తల్లి భారతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతికి కుమారుడు, కుమార్తె కావ్య ఉన్నారు. కావ్య (25) బీటెక్ పూర్తిచేసి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి నిమిత్తం విధులు నిర్వర్తిస్తుండగా పెళ్లకూరు మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో తేజ పెళ్లి చేసుకుంటానని కావ్యను నమ్మించాడు. దీంతో కావ్య తేజకు దగ్గరైంది. అలా రెండేళ్ల వరకు గడిచాయి. కావ్య తేజాతో పెళ్లి విషయంపై మాట్లాడినప్పుడల్లా అతను ఏదో ఒకరకంగా మాట్లాడుతూ దాటవేసేవాడు. కావ్య అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో ‘మీది వేలే కులం.. మాది వేరే కులం.. నిన్ను పెళ్లిచేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను’ అంటూ యువతికి సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య శుక్రవారం రాత్రి ప్రియుడు తేజాకు చివరి సారిగా ఫోన్చేసి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. అతను ఒప్పుకోకపోవడంతో విఽధిలేని పక్షంలో ఆ యువతి ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ తన ఇంటి మిద్దైపెన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య ఎంతకీ కనిపించకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు మిద్దైపెకి వెళ్లి పరిశీలించగా.. ఆమె విగత జీవిగా ఉరితాడుకు వేలాడుతోంది. కావ్య ఫోన్ కాల్డేటా ఆధారంగా మృతురాలి తల్లి భారతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మలేషియా యువతిని మోసం చేసిన యువకుడి అరెస్టు
తిరుత్తణి: ప్రేమ పేరుతో విదేశీ యువతిని మోసం చేసిన యువకుడిని తిరుత్తణి పోలీసులు అరెస్టు చేశారు. భగవతాపురం గ్రామానికి చెందిన వెంకట కుప్పరాజు కుమారుడు తిరుమలై కృష్ణన్ (28) బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మలేషియాకు చెందిన నాగజ్యోతి అనే యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మిత్రులయ్యారు. కొద్దికాలానికి ప్రేమికులుగా మారారు. ఫలితంగా నాగజ్యోతి తరచూ ఇండియాకు వచ్చి చైన్నెలో తిరుమలై కృష్ణన్ను కలిసేది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తనకు వేరొక యువతితో నిశ్చితార్థం జరిగిందని ఇకపై తనతో టచ్లో వద్దని తిరుమలై కృష్ణన్ చెప్పడంతో నాగజ్యోతి మలేషియా నుంచి తిరుత్తణి చేరుకుంది. తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. హత్యా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి తిరుమలై కృష్ణన్ను అరెస్టు చేశారు. -
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
హైదరాబాద్లో గ్రూప్–2 విద్యార్థిని ప్రవల్లిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేయడం వల్లనే ఆమె నిరాశకు గురై చనిపోయిందని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం శివరామ్ అనే మిత్రునితో ప్రవల్లిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది. అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యి, నిశ్చితార్థం చేసుకున్నాడు. అది ఆమె మనసును గాయపరిచింది. మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేక మైనదే అవుతుంది. వ్యక్తిగతం అవు తుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు. ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్ (1858 – 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మను షులు ఆత్మహత్యలు చేసుకుంటారని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ ఉద్గ్రంథాన్ని రాశాడు. మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొ క్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొన గాడైన భర్త, రాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం... ఇలా సాగుతుంది కోరికల జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్ కొట్టి పడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావాన్ని కోరుకుంటాడని చెబుతాడు. అదే మనిషి ప్రాథమిక కోరిక. సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మ హత్యలకూ విలోమానుపాత సంబంధం వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటే అక్కడ సంఘీభావం తక్కువగా వున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మ హత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కచ్చితమై నవని అనుకోలేము. అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామా జిక అవమానంగా భావిస్తాయి. జీవిత బీమా తదితర టెక్నికల్ కారణాల వల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు. కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాల వల్ల ఆత్మహత్యల గురించి కచ్చితమైన నివేదికలు రావు. అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థలో వున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేనివారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటారట! జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుద్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భాల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యి చని పోవాలనుకుంటారు. ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు. అనుబంధాల వల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షల వల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు. మను షుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులూ ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు(ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్) అంటాము. మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేన ప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు. బయటి నుండి సంఘీభావం అందక చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చావును అహంభావ ఆత్మహత్య (ఈగోయిస్టిక్ సూసైడ్) అంటారు. కొందరి మీద ఇంటాబయట ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరిని ఆఫీసులో పైఅధికారులు వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు మరణానికి సిద్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (ఫాటలిస్టిక్ సూసైడ్) అంటారు. కొన్ని సందర్భాల్లో ‘ప్రభుత్వం చేసిన హత్య’ అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి. ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమ శిక్షణ రహిత ఆత్మహత్యలు (అనామిక్ సూసైడ్) అనవచ్చు. ఆత్మహత్యల్ని నివారించడానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్లు కూడా వున్నాయి. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కను మరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. మను షుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూను కోవాల్సిన సందర్భం ఇది. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 90107 57776 -
ప్రేమ విఫలం.. మనసు కలత చెంది..
రామగుండం: ఇన్స్ట్రాగామ్లో పరిచయం యువకుడి, యువతి మధ్య ప్రేమగా మారింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువకుడు తిరస్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన కల్వల శార్వాణి(20) సోమవారం అతివేగంగా వస్తున్న రైలు ఎదుట పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అశోక్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ కల్వల ప్రదీప్కుమార్ కూతురు శార్వాణికి రెండేళ్ల క్రితం ఏపీలోని తిరుపతికి చెందిన యువకుడు గంగాధర్తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా ఇద్దరూ చాటింగ్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని గంగాధర్ను కోరింది. అయితే, తనకు ఇప్పటికే వివాహమైందని, పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువకుడు తిరస్కరించాడు. తీవ్రమనస్తాపం చెందిన శార్వాని.. సోమవారం ఆ యువకుడితో ఫోన్లో మాట్లాడుకుంటూనే.. రామగుండం రైల్వేస్టేషన్లోకి చేరుకుంది. వేగంగా వస్తున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలును చూసి పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకుంది. శార్వాణి ఎన్టీపీసీలోని హోండా షోరూంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జీఆర్పీ ఔట్పోస్ట్ ఇన్చార్జి వివరించారు. -
ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ఉరేసుకొని ప్రియురాలు ఆత్మహత్య
హైదరాబాద్: ఇద్దరు ఒకే బేకరీలో పని చేసేవారు.. వీరి మధ్య ఏర్పపడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి పెళ్లికి ప్రియుడి కుటుంబం నిరాకరించడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ప్రేమికురాలు ఉరి వేసుకొని తనువు చాలించిన విషాద ఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జేమ్స్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్కు చెందిన నేహ (19) ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్ కాలనీలో వైష్ణవి పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. నానక్రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్లోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్గా చేరింది. బాలాపూర్ పీఎస్ పరిధిలో వెంకటాపురంలో నివసించే సల్మాన్ ఆరు నెలల క్రితం సదరు బేకరీలో చేరాడు. వీరిరువురు మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో సల్మాన్ను బేకరీ నుంచి తొలగించారు. సల్మాన్ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సల్మాన్ ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు చనిపోయిన విషయం తెలియడంతో నేహ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు రూమ్ మేట్స్ డ్యూటికీ వెళ్లగానే తలుపు గడియ పెట్టుకుంది. ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ నిర్వాహకులు వెంటనే గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడు సల్మాన్ ఆత్మహత్యను జీరి్ణంచుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు..
ఇటీవలి కాలంలో లివింగ్ పార్ట్నర్స్ దారుణ హత్యకు గురవుతున్న వార్తలు చాలానే చూశాం. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం, దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఆమె డెడ్బాడీని సూటుకేసులో పెట్టి బయటపడేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సినీ మేకప్ ఆర్టిస్ నైనా మహత్(29)కు మనోహర్ శుక్లా(43)తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో శారీరకంగా కూడా వీరద్దరూ దగ్గరయ్యారు. అయితే, మనోహర్కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా క్రమంగా అతనికి దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమాయణం కొనసాగించారు. వీరి వ్యవహరం ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వీరు.. తన బంధాన్ని కొనసాగించారు. నైనా ఫోన్ ఆఫ్.. ఇదిలా కొనసాగుతున్న క్రమంలో.. నైనా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఆమె కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేసింది. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆఫ్ రావడంతో నైనా కుటుంబ సభ్యులు ఆగస్టు 12వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. నైనా ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నైనా ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్తో పాటు అతని భార్య సూట్కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు. గుజరాత్ సరిహద్దుల్లో డెడ్బాడీ.. ఇక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నైనా లవర్ శుక్లాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడించాడు. నైనాతో తన సంబంధం గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి ఆమెకు బ్రేకప్ చెప్పినట్టు తెలిపాడు. కానీ.. ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చిందన్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే శుక్లాపై అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన టార్చర్ భరించలేకనే నైనాను చంపేసిన్నట్టు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం, నైనా డెడ్బాడీ ఉన్న సూట్కేసును పోలీసులు గుజరాత్ బోర్డర్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Manohar Shukla (43) KiIIed LIVE-IN Partner Naina Mahat (28) stuffed her body in SUITCASE & dumped her body in Gujrat with the help of his wife Shukla visited Naina's society but left the place with suitcase. It created suspicion Shukla said: Naina was forcing him to marry her pic.twitter.com/QAZVzmHeNf — Mohammad Nawaj (@NawazJ78) September 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
పెళ్లికి నిరాకరించిందని బ్లేడ్తో ప్రేయసి గొంతు కోశాడు
విశాఖపట్నం: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలిపై బ్లేడ్తో దాడి చేసిన ప్రియుడి సంఘటన పారిశ్రామిక ప్రాంతంలో కలకం రేపింది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 59వ వార్డు నెహ్రూనగర్ ప్రాంతంలో లలితశ్రీ(19) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి సమీపాన నిందితుడు రామారావు(26) ఉంటున్నాడు. ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రామారావు పనీపాటా లేకుండా జులాయిగా కాలం గడిపేయడం లలితశ్రీకి నచ్చలేదు. ఈ కారణంగా అతను తీసుకొచ్చిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. కొన్ని రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నా ఆమె ససేమిరా అంది. దీంతో సోమవారం రాత్రి భోజనం చేసి మేడపై వాకింగ్ చేస్తున్న ఆమె వద్దకు మరోసారి వెళ్లి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో దాడి చేస్తానని భయపెట్టాడు. వాదనకు దిగాడు. అయినప్పటికీ అంగీకరించకపోవడంతో బ్లేడ్తో ఆమె కంఠం భాగంలో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమె కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు, బంధువులు అక్కడకు చేరుకుని గాయపడిన లలితశ్రీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును మల్కాపురం పోలీస్ స్టేషన్ సీఐ జి.డి.బాబు ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిపై దాడి, యువతి తమ్ముడి హత్య
షాద్నగర్/ కొందుర్గు: మానవత్వాన్ని మరిచి మృగాడిలా వ్యవహరించాడు.. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో కొట్టి హతమార్చాడు.. ఆదివారం ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. సీరియల్స్లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్ వ్యవహార శైలి ఇదీ. కొందుర్గుకు చెందిన ఇందిర, సురేందర్గౌడ్ దంపతులకు కూతురు సంఘవి కుమారులు పృథ్వీ(23), రోహిత్ ఉన్నారు. సంఘవి తమ్ముడు పృథ్వీతో కలిసి ఎల్బీనగర్ ప్రాంతంలో ఉంటూ హోమియోపతి వైద్యవిద్యలో నాలుగో సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా శివకుమార్ ప్రేమపేరుతో ఆమె వెంట పడుతున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత కొంత కాలంగా శివకుమార్ సైకోలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం తన తండ్రి శంకరయ్యను సుత్తెతో తలపై మోది హత్య చేశాడు. తాజా ఘటనతో శివకుమార్ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కొందుర్గులో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పరువు హత్య... కూతురిని దారుణంగా హత్య చేసిన తండ్రి
కోలారు : కోలారు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. పరువు కోసం ఓ తండ్రే కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. కోలారు తాలూకా తొట్లి గ్రామానికి చెందిన రమ్య (19) హత్యకు గురైన యువతి. వివరాలు... గ్రామానికి చెందిన వెంకటేష్గౌడ కుమార్తె రమ్య ఇంటర్ చదువుతోంది. రమ్య ఇదే గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. విషయం ఇంట్లో తెలిసి తండ్రి వెంకటేషగౌడ మందలించాడు. అయినా రమ్య వినలేదు. దీంతో ఆగ్రహించిన తండ్రి వెంకటేషగౌడ ఈనెల 25వ తేదీ రాత్రి రమ్యను హత్య చేసి తెల్లవారకనే తన సంబంధీకులతో కలిసి అంతిమ సంస్కారాలు కూడా ముగించాడు. చివరికి గుట్టు రట్టయ్యింది.. గ్రామంలో రమ్య మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం చివరికి విషయం పోలీసులకు చేరడంతో కోలారు రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేష్గౌడను స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు. పోలీసుల విచారణలో రమ్యను తానే హత్య చేసిన విషయం బయట పడడంతో రూరల్ పోలీసులు తహసీల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో రమ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి నిర్ణయించారు. తహసీల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేష్గౌడ అతని సమీప బంధువు చౌడగౌడను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాజల్ అనుమానస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం
సాక్షి, వరంగల్: హనుమకొండ బొక్కలగడ్డలో యువతి కాజల్ అనుమానస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అబ్బాస్ తో సహజీవనం చేసే యువతి కాజల్ జూలై 12న మృతి చెందగా కుటుంబసభ్యులు పూడ్చి పెట్టారు. ఆలస్యంగా మేల్కొన్న కాజల్ తల్లి షరనార్జన్ బిడ్డ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు 20 రోజుల క్రితం పూడ్చిపెట్టిన కాజల్ మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ వైద్య బృందం, తహశీల్దార్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. కూలీ పనితో కుటుంబాన్ని పోషించుకునే కాజల్ ను అబ్బాస్ లోబర్చుకుని హత్య చేసి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించాడని కాజల్ తల్లి ఆరోపించారు. (చదవండి: బావా కలవాలని ఉంది.. అని మెసేజ్ పెట్టి) -
కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి.. యువతి గల్లంతు
మాదాపూర్: తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గంచెరువులోకి దూకి గల్లంతైన ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక గుల్బర్గా చించోలిలోని సాధిపూరకు చెందిన పాయల్ (20) 6 నెలల క్రితం నగరానికి వచ్చి మాదాపూర్లోని డీమార్ట్ వద్ద స్నేహితురాలితో కలిసి ఉంటోంది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన పాయల్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి వరకూ ఆమె ఆచూకీ లభించలేదు. -
స్వాతి ఎందుకమ్మా ఇలా చేశావ్...
మిర్యాలగూడ: ప్రేమోన్మాది వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దామరచర్ల మండంలోని గణేష్పహాడ్లో చోటుచేసుకుంది. బుధవారం దామరచర్ల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్పహాడ్ గ్రామానికి చెందిన కొర్ర రెడ్యా, విజయ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. మూడో కుమార్తె కొర్ర స్వాతి(17) సూర్యాపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మెగావత్ హుస్సేన్ ఐటీఐ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. హుస్సేన్ గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో స్వాతిని వేధిస్తున్నాడు. తరచూ ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వాతి తన తల్లిదండ్రులకు చెప్పగా వారు హుస్సేన్ను మందలించారు. అయినా తీరు మారని హుస్సేన్ స్వాతిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. దీంతో విసుగు చెందిన స్వాతి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయి గణేష్పహాడ్ గ్రామ పరిధిలో కృష్ణా నది ఒడ్డున గల పంప్హౌజ్ పైనుంచి కిందకు నదిలోకి దూకింది. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం కృష్ణా నదిలో స్వాతి మృతదేహం లభ్యమైంది. నిందితుడు హుస్సేన్ పరారీలో ఉన్నాడని, అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని..
సాక్షి, హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడకు చెందిన నాయక్వడి రమేష్ (30) కల్యాణి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల కూతురు తన్విత సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్గా పనిచేస్తూ తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కల్యాణి కుషాయిగూడ మార్కెట్లో పని చేస్తూ.. సమీపంలో కూతురు తన్వితతో కలిసి ఉంటోంది. ఈ నెల 1న కల్యాణి కూతురు తన్వితకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అంతా కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే వైద్యులు తన్విత చనిపోయినట్లు ప్రకటించారు. రోజూ మాదిరిగానే స్కూల్కు వెళ్లి వచ్చిన కూతురు భోజనం చేసి పడుకుందని, నిద్రలోనే ఇలా జరిగిందని కల్యాణి అందరినీ నమ్మించింది. అనుమానంతో ఫిర్యాదు... భార్య తీరుపై అనుమానం కలిగిన తండ్రి రమేష్ తన కూతురు చనిపోలేదని, చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఊపిరాడకపోవడంతో చిన్నారి చనిపోయినట్టు వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. అడ్డు తొలగించుకోవాలని... కల్యాణికి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్కుమార్ (19) అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కల్యాణి వద్దను అతను తరచూ వచ్చేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. కల్యాణి భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు సాధ్యం కాకపోవడంతో కూతురు తన్వితను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1న స్కూల్ కు వెళ్లి వచ్చిన తన్విత నిద్రలో ఉండగా ముందే వేసుకున్న ఫ్లాన్ ప్రకారం ముఖంపై బెడ్షీట్ కప్పి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితులు కల్యాణి, నవీన్కుమార్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చిన్నారి హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్ఐ షేక్ షఫీలను డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్రెడ్డి అభినందించారు. -
ప్రేమ వ్యవహారం .. యువతి బంధువుల దాడితో మనస్తాపం?
ఖమ్మం: మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన బొల్లం రమేష్ (21) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం ఆమె వచ్చేసరికి గడియ పెట్టి ఉండడంతో కిటికీలో నుండి చూడగా రమేష్ ఉరి వేసుకుని ఉండడంతో స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. కాగా, రమేష్కు అదే గ్రామంలోని ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉండగా, ఆమె బంధువులు ఇటీవల ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతోనే మనస్తాపానికి గురైన రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తండ్రి లింగయ్య చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్కుమార్ తెలిపారు. -
ఆ బాలిక ఖరీదు.. రూ.13 లక్షలు?
సాక్షి, వరంగల్: ప్రేమపేరుతో నమ్మించి.. ఆపై వంచించిన నిందితుడిపై బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దలు గద్దలుగా మారారు. రూ.13 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేసి.. భారీగానే నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారి సమక్షంలోనే ఈ సెటిల్మెంట్ జరిగిందన్న విషయం నర్సంపేటలో చర్చనీయాంశమైంది. బాధితురాలిపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ను కలిసి న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు.. పట్టణానికి సమీపంలో ఉండే ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటుండడంతో ఈమె తరచూ వస్తూ, వెళ్తుండేది. ఈ క్రమంలోనే ప్రేమపేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు హైదరాబాద్కు వెళ్లి మరీ కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 ఆగస్టు 14న యువకునిపై పోక్సో కేసు నమోదైంది. అరెస్టయిన యువకుడు జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చాడు. తర్వాత అబ్బాయి బంధువులు, అమ్మాయి బంధువులతో కేసు సెటిల్మెంట్కు ప్రయత్నాలు చేశారు. రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయించి.. ముందు రూ.5 లక్షలు, కేసు కాంప్రమైజ్ అయ్యాక మిగిలిన రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం రాశారు. బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని పెద్దలే నొక్కేసినట్టు తెలు స్తోంది. ఈ వ్యవహారమంతా ఓ పోలీసు అధికారి సమక్షంలోనే జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బా లిక.. న్యాయం కోసం కమిషనర్ను ఆశ్రయించినట్టు సమాచారం. చదవండి: ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే! -
మొన్ననే వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
సాక్షి న్యూస్ వరంగల్: ప్రేమ... పెళ్ళి... ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి, చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదంటున్నారు మృతురాలి బంధువులు. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె. మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం జరిపించారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనలేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ప్రేమించిన విషయం చెప్పలేదని, చెప్పిఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కాదని తెలిపారు. - లింగయ్య, మృతురాలి తండ్రి కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. ప్రేమ గురించి మానస పెద్దలకు చెప్పినప్పటికీ యాదవ వర్గాని చెందిన అమ్మాయిని పద్మశాలి వర్గానికి చెందిన ప్రియుడికి ఇచ్చి వివాహం చేయలేకనే తమ కులానికి చెందిన మరో అబ్బాయితో పెళ్ళి జరిపించినట్లు ప్రియుడి బందువులు తెలిపారు. ప్రియుడు ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
జనగాం: ప్రేమ విఫలమై తొర్రూరులోని చర్చి బజారుకు చెందిన అల్లం శ్యామ్ (26) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి పస్తం స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..
అల్లిపురం (విశాఖ దక్షిణం): తనతో కాకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అక్కసుతో ప్రియురాలి ప్రాణం తీసిన హంతకుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన శనివారం విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. నగర శాంతిభద్రతల డీసీపీ విద్యాసాగరనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా, కొత్తవలస, కుమ్మరవీధికి చెందిన కోడి శ్రావణి (27) గాజువాక దరి తుంగ్లాంలో నివాసం ఉండేది. తర్వాత ఉపాధి నిమిత్తం విజయనగరం జిల్లా కొత్తవలసకు మకాం మార్చింది. అనంతరం ఆమెకు పెళ్లి జరగ్గా భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఒక గది అద్దెకు తీసుకుని జగదాంబ సమీపంలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె గతంలో తుంగ్లాంలో ఉన్నప్పుడు పరిచయమైన పెయింటర్ శ్రీపెరంబూరు గోపాలకృష్ణ అలియాస్ గోపాల్ను ప్రేమించింది. ఈ క్రమంలో గోపాలకృష్ణ అతని స్నేహితుడు వడ్లపూడికి చెందిన రాగిణి వెంకటేష్ అలియాస్ వెంకీని శ్రావణికి పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త శ్రావణి, వెంకీ మధ్య ప్రేమగా మారింది. దీంతో తాను వెంకటేష్ను ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణకు శ్రావణి చెప్పింది. వెంకటేష్ను శ్రావణి ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ.. వారిద్దరితో కలిసి శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆర్కే బీచ్కు చేరుకున్నాడు. అక్కడ వారిద్దరితో మాట్లాడిన తర్వాత.. శ్రావణితో వ్యక్తిగతంగా మాట్లాడాలని వెంకటేష్ను గోకుల్పార్కులో కూర్చోమని చెప్పి.. శ్రావణిని తీరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు గోపాలకృష్ణ తీసుకెళ్లాడు. కొంత సేపటికి గోపాలకృష్ణ ఒక్కడే వచ్చి మంచి నీరు తీసుకొస్తానని చెప్పి బైక్పై వెళ్లిపోయాడు. అనంతరం గోపాలకృష్ణ ఎప్పటికీ రాకపోవడంతో వెంకటేష్ అతని కోసం చూస్తున్నాడు. ఇంతలో గాజువాక పోలీసుల నుంచి వెంకటేష్కు ఫోన్ వచ్చింది. మీ స్నేహితుడు గోపాలకృష్ణ బీచ్లో ఎవరినో పీక నులిమి చంపేశానని చెబుతున్నాడని.. బీచ్లోకి వెళ్లి చూసి చెప్పమని పోలీసులు చెప్పారు. చదవండి: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ దీంతో తీరంలో వెతగ్గా ఒక చోట శ్రావణి చనిపోయి పడి ఉంది. విషయాన్ని వెంకటేష్ పోలీసులకు తెలియజేశాడు. దీంతో గాజువాక పోలీసులు మహారాణిపేట పోలీసులకు సమాచారం అందిచడంతో నైట్ రౌండ్స్లో ఉన్న క్రైం ఎస్ఐ నెమరంబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు నిందితుడు గోపాలకృష్ణ, అతని స్నేహితుడు వెంకటేష్ నుంచి వాగ్మూలం తీసుకున్న అనంతరం, మృతురాలి తల్లి కోడి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈస్ట్ ఏసీపీ రమణమూర్తి, మహారాణిపేట సీఐ బి.రమణమూర్తి పాల్గొన్నారు. -
పోలీస్ ఆఫీసర్తో ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్
సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల సినిమా విశేషాల కంటే పర్సనల్ లైఫ్పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక హీరో,హీరోయిన్ల ప్రేమ, పెళ్లిళ్లలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ ప్రేమలో పడిపోయిందనే గాసిప్ జోరుగా వినిపిస్తుంది. 'మా అబ్బాయి' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ చిత్రా శుక్లా. ఆ తర్వాత రాజ్ తరుణ్తో ‘రంగుల రాట్నం’, అల్లరి నరేష్ తో ‘సిల్లీ ఫెలోస్’, ‘తెల్లవారితే గురువారం’వంటి పలు సినిమాల్లో నటించిన మెప్పించింది. లేటెస్ట్గా గీతసాక్షిగా అనే సినిమాలోనూ నటించింది. తాజాగా ఆమె ప్రేమ వ్యవహారం నెట్టింట హాట్టాపిక్గా మారింది. వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ ఆఫీసర్తో చిత్రా కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతుందట. చదవండి: మెగా హీరోకు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్ తాజాగా ఆమె బర్త్డే సందర్భంగా వైభవ్ షేర్ చేసిన పోస్ట్ ఈ రూమర్స్కి మరింత బలం చేకూరుస్తుంది. హ్యాపీ బర్త్డే స్వీట్హార్ట్ అంటూ వైభవ్ పోస్ట్చేయడం, దానికి చిత్రా థ్యాంక్యూ నా వైభవ్ అంటూ కామెంట్ చేయడంతో ఈ అమ్మడి లవ్ మ్యాటర్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vaibhav Upadhyay (@realsupercop) -
మూడు నెలల క్రితం యువతికి మరో వ్యక్తితో పెళ్ళి.. మాట్లాడాలని పిలిచి
చోడవరం రూరల్ : ప్రేమ వ్యవహారంలో ఘర్షణ జరిగి కత్తితో ఓ యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఉదంతమిది. కేసు దర్యాప్తు చేస్తున్న చోడవరం ఎస్ఐ ఎ.సూర్యనారాయణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అడ్డూరు గ్రామానికి చెందిన శానబోయిన దేముడుబాబు(27) గవరవరం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతికి మూడు నెలల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఈ విషయమై మాట్లాడాలని యువతికి వరుసకు బావ అయిన నర్సాపురానికి చెందిన సబ్బి రమణ, యువతి సోదరుడు బోరా దేముడుబాబు అడ్డూరు మజ్జి గౌరమ్మ గుడి సమీపంలోని కొండ వద్దకు రావాలని యువతి ప్రేమికుడు దేముడుబాబుకు గురువారం మధ్యాహ్నం కబురు పంపారు. అక్కడ వీరి మధ్య మాటామాటా పెరగడంతో మేకలకు మేత కొమ్మలు కోయడానికి తెచ్చుకున్న కత్తితో ప్రేమికుడిపై దాడి చేశారు. దీంతో శానబోయిన దేముడుబాబుకు వీపుపై తీవ్రంగా గాయమైంది. గాయంతో విలవిలలాడుతున్న అతనిని వదలిపెట్టి వారిద్దరూ పరారయ్యారు. గాయపడిన దేముడుబాబు గ్రామానికి చేరుకోవడంతో బంధువులు అతన్ని విశాఖపట్నం విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు. -
పెళ్లికి ముందే ప్రేమ.. మరొకరితో వివాహం.. భర్తను అడ్డు తొలగించుకునేందుకు
ఎన్నో ఆశలతో అతను ఆమెను మనువాడాడు.. కానీ.. ఆమె మాత్రం అంతకుముందే మరొకరితో ప్రేమాయణంలో ఉంది.. ఈ మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చాలను కుంది. ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఇద్దరూ కలిసి అమలు చేశారు. ఆమె భర్తపై ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏమీ తెలియనట్లు ఆమె నటించింది. పోలీసుల దర్యాప్తులో ఈ దారుణం వెలుగు చూసింది. నిందితులిద్దరూ కటకటాల పాలయ్యారు. వైఎస్సార్ : ఓ యువతి ప్రియుడితో కలిసి ఏకంగా భర్తపైనే హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సిద్దవటం మండలంలోని కనుమలోపల్లె సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళళవారం సాయంత్రం సిద్దవటం పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన అవ్వరు జ్ఞానేశ్వర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మూడు నెలల కిందట కడప హనుమప్ప వీధికి చెందిన నవితతో వివాహం జరిగింది. గత నెల 19వ తేదీన శ్రీకాళహస్తి నుంచి తన భార్యను పిలుచుకొని కడపలోని అత్తగారి ఇంటి వద్దకు తీసుకొని వచ్చాడు. తిరిగి జ్ఞానేశ్వర్ శ్రీకాళహస్తికి వెళ్లాడు. అదే నెల 25వ తేదీన అత్తగారి ఇంటిలో ఉన్న తన భార్యను పిలుచుకొని వెళ్లేందుకు కడపకు వచ్చాడు. ఆరోజు రాత్రి అత్తగారి ఇంట్లోనే బసచేసి మరుసటిరోజు 26వ తేదీన ఉదయం తన భార్యను వెంటబెట్టుకొని కడప నుంచి కారులో శ్రీకాళహస్తికి బయలు దేరాడు. సిద్దవటం మండలంలోని కనుమలోపల్లె గ్రామ సమీపంలోకి రాగానే తనకు వాంతికి వస్తుందని కారు ఆపాలని భర్తతో చెప్పడంతో ఆయన కారును ఆపాడు. ఇంతలోనే అకస్మాత్తుగా కడపలోని హనుమప్ప వీధికి చెందిన జాహ్వారి కాపిష దుర్గేష్సింగ్ అక్కడికి వచ్చి జ్ఞానేశ్వర్పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. భార్య నవిత తనకేమీ తెలియనట్లు భర్తను వైద్యం కోసం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై జ్ఞానేశ్వర్ గత నెల 27వ తేదీన సిద్దవటం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్ఐ తులసీ నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 10 రోజుల్లోనే హత్యాయత్నం కేసును చేఽధించారు. నవితకు వివాహం జరగక ముందే పక్కింటికి చెందిన ఎంబీఏ చదువుతున్న జాహ్వారి కాపిష దుర్గేష్ సింగ్తో ప్రేమలో ఉంది. నవితకు వివాహం అయినప్పటికీ భర్త జ్ఞానేశ్వర్తో అయిష్టంగానే కాపురం కొనసాగించింది. ఏప్రిల్ 26వ తేదీన భర్తను హతమార్చాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. కనుమలోపల్లె గ్రామ సమీపంలో వాంతికి వస్తుందని భర్తను నమ్మించి కారును ఆపింది. భర్తపై ప్రియుడి చేత కత్తితో హత్యాయత్నం చేయించింది. ఈ విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటలకు కడప నగరం ఔటర్రింగ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నవిత ప్రియుడితో ఉండటంతో సమాచారం రావడంతో వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్యాయత్నానికి వినియోగించిన మారణాయుధం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని సిద్దవటం కోర్టులో హాజరు పరిచారు. అనతి కాలంలోనే కేసును చేధించిన సిద్దవటం ఎస్ఐ తులసీ నాగప్రసాద్ ను, ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్భూరాజన్ అభినందించారు. ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు, ఎస్ఐ తులసీనాగప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం.. ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు
బోయినపల్లి(చొప్పదండి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని గాం«దీనగర్ గ్రామానికి చెందిన అందె రవితేజ (23) డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఫోన్ వచ్చింది. భోజనం అనంతరం వాహనంలో పడుకుంటా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో స్తంభంపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటికి రవితేజ వచ్చాడు. అక్కడ గేటు వేసి ఉండడంతో గేటు దూకి లోపలికి వెళ్లాడు. తలుపులు తీయాలని బాదడంతో బంధువులు తీయలేదు. వారు బయటకు వచ్చి చూడగా అతడు అప్పటికే నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవితేజ మృతి విషయం అతడి తల్లి జ్యోతికి ఫోన్ చేసి చెప్పారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా స్తంభంపల్లిలో ఘటన జరిగిన ఇంటి పరిసరాల్లో ఆరిన రక్తపు మరకలు ఉన్నాయని మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదులో పేర్కొంది. తన కుమారుడు రవితేజకు బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని ఈ క్రమంలోనే తన కుమారున్ని కత్తితో పొడిచి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, బంధువుల యువతి, ఆమె తల్లి, మేనమామ, అల్లుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ బన్సీలాల్ పరిశీలించారు. బంధువుల ఆందోళన సిరిసిల్లటౌన్: స్తంభంపల్లిలో మృతిచెందిన రవితేజ బంధువులు సోమవారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించారు. ఈ కేసులో దోషులుగా ఆరోపిస్తూ సమీప బంధువులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్కుమార్ వచ్చి రవితేజ బంధువులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మూడేళ్లుగా ప్రేమ.. మనస్సు మార్చుకున్న ప్రియుడు
కరీంనగర్: ప్రేమించిన యువకుడి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మనోవేదనకు గురైన యువతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పోలంపల్లికి చెందిన రెడ్డి రజిత(19), మల్లాపూర్ గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయ ం తెలిసిన రజిత కుటుంబసభ్యులు వెంకటేశ్ను పెళ్లిచేసుకోవాలని కోరారు. మొదట నిరాకరించగా.. రూ.10లక్షల కట్నం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నాడు. ఈ మాసంలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఏప్రిల్ 24న వెంకటేశ్, రజితలు పెళ్లిబట్టలు కొనుగోలు చేసేందుకు కరీంనగర్ వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత వెంకటేశ్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనోవేదనకు గురైన రజిత ఏప్రిల్ 25న ఇంటివద్ద పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది. తన కూతురు ఆత్మహత్యకు పల్లె వెంకటేశ్, పల్లె రాములు, పల్లె సరవ్వ, గుండె కల్యాణి అలియాస్ రమ్య, గుండె రాజు కారణమని రజిత తల్లి అహల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
తిరువొత్తియూరు: అరియలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. పుదుకోటై జిల్లా కీరనూర్ ఎలిల్ నగర్కు చెందిన సేటు కుమారుడు ముత్తు ముహమ్మద్ (28) సెల్ఫోన్ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. తిరుపూర్ మన్నర్ బీవీనగర్కు చెందిన రాజారామ్ కుమార్తె దివ్యభారతి (21) తిరుపూర్లోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఐదేళ్లుగా ముత్తు మహమ్మద్, దివ్యభారతి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు వ్యతిరేకత తెలపడంతో ఈ నెల 26వ తేదీ నాగూర్ దర్గాలో వివాహం చేసుకున్నారు. అక్కడే వివాహ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జయంకొండం మహిళా పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఆరేళ్ల ప్రేమించుకున్నారు.. ఒకరి పేరు మరొక్కరు టాటూలు వేసుకున్నారు
కామారెడ్డి: ఆరేళ్ల పాటు ప్రేమించి.. పెళ్లి చేసుకొమ్మని అడగడంతో నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట యువతి బైఠాయించి నిరసన తెలిపిన ఘటన సోమవారం మండలంలోని తుజాల్పూర్లో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. దోమకొండకు చెందిన మెతుకు మౌనిక డిగ్రీ చేస్తున్న సమయంలో తుజాల్పూర్ గ్రామానికి చెందిన అందె నాగరాజ్గౌడ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఒకరి పేరు మరొక్కరు టాటూలు వేసుకున్నామని, హైదరబాద్లో కలిసి చాలా సందర్భాల్లో ఫొటోలు కూడా దిగామని మౌనిక చెప్పింది. తీరా పెళ్లి చేసుకొమ్మని అడగడంతో నిరాకరించడమే కాకుండా దుర్భాషలాడుతున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గత పది రోజుల క్రితం సైతం పోలీసుల వద్దకు వెళ్లి వివరాలు తెలిపామని, అయినా పెళ్లి చేసుకోవడం లేదని తెలిపింది. పెళ్లి చేసుకునే వరకు యువకుడి ఇంటి ముందు నుంచి కదిలేది లేదన్నారు. -
మేనమామ ప్రాణాలు తీసిన కోడలి ప్రేమ వ్యవహారం..
సాక్షి, విజయవాడ: ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తన మేనకోడలితో మాట్లాడదామని వెళ్లిన శ్రీనివాస్ అనే వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురయ్యాయి. ఈ ఘటన సత్యనారాయణపురంలోని ఖుద్దూస్ నగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నవీన్ అనే యువకుడికి ఒంగోలుకు చెందిన శ్వేత అనే యువతితో పరిచయం ఏర్పడింది. అయితే, వాళ్ళిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోవడంతో వివాదం తలెత్తింది. ఇంటినుంచి వెళ్లిపోయిన శ్వేతతో మాట్లాడేందుకు ఆమె మేనమామ శ్రీనివాస్ సహా పలువురు కుటుంబ సభ్యులు నవీన్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ఈ వివాదం మరింత ముదిరింది. శ్వేతను తమతో ఒంగోలుకు తీసుకుపోతామని శ్రీనివాస్ అనడంతో నవన్ అన్న జగదీష్ కోపోద్రిక్తుడయ్యాడు. శ్రీనివాస్పై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, దారిలోనే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. జగదీష్పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. జగదీష్ గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ -
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడు
మొగల్తూరు: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు బాధిత యువతి బుధవారం మౌనపోరాటానికి దిగింది. బాధిత యువతి మాట్లాడుతూ శ్రీరాంపురం పంచాయతీ శివనారాయణపురానికి చెందిన కొండేటి సాయి తాను నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామన్నారు. తనను వివాహం చేసుకోవాలని కోరగా తాను అగ్ర కులానికి చెందిన వాడినిని తమ ఇంట్లో పెళ్ళికి అంగీకరించరని నిరాకరించాడని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని తెలిపింది. ఆమె పోరాటానికి మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెన్నేటి కిశోర్లు మాట్లాడుతూ దళిత బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై రూరల్ సీఐ సురేష్ బాబు బుధవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాట్లు చేశారు. యువతి తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదని, అన్యాయం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
నాగచైతన్య-శోభిత డేటింగ్ చేస్తున్నారా? అఖిల్ ఏమన్నాడంటే..
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్పై ఇంతవరకు అటు చై, శోభిత దూళిపాళ స్పందించకపోయినా వారి ప్రేమ వ్యవహారం మాత్రం ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రీసెంట్గా లండన్లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరు కలిసున్న ఓ ఫోటో లీక్ అయ్యి ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చై-శోభితల రిలేషన్షిప్ నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై అఖిల్ అక్కినేని స్పందించారు. ఏజెంట్ మూవీ ప్రెస్మీట్లో భాగంగా పాల్గొన్న అఖిల్కు.. ''మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించి(శోభిత దూళిపాళను ఉద్దేశిస్తూ) నెట్టింట హాట్టాపిక్గా మారాడు. మరి మీ పరిస్థితి ఏంటి''?అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అఖిల్ బదులిస్తూ..'నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీని మెయిన్టైన్ చేయడమే సరిపోయింది. నా దృష్టి మొత్తం సినిమాలపైనే' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
-
ఒక అమ్మాయితో ప్రేమ.. మరో యువతితో నిశ్చితార్థం
చిత్తూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. పట్టణలోని ఆజాద్ రోడ్డుకు చెందిన మణి కుమార్తె నక్షత్ర బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. అలాగే స్థానిక జయప్రకాష్రోడ్డుకు చెందిన మూర్తి కుమారుడు ఆకాష్ తరచూ నక్షత్ర వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని చుట్టూ తిరిగేవాడు. కొన్నాళ్లకు అతడి మాటలు నమ్మిన యువతి ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబీకులు వారి వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దామని నక్షత్ర తల్లిదండ్రులు చెప్పడంతో, ముందు నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో ఏడాది నుంచి ఆకాష్ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు నక్షత్రకు తెలిసింది. దీనిపై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సమస్యలు పరిష్కరించుకుందామని ఒకరోజు ఆకాష్ తన వెంట నక్షత్రను బెంగళూరులో ఓ భవనం పైకి తీసుకెళ్లాడు. మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆమెను కిందకు తోసేశాడు. దీంతో నక్షత్ర తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వీల్చైర్కే పరిమితమైంది. ఇదే సాకుగా చూపుతూ ఆకా‹Ù, తల్లిదండ్రులు అడ్డంతిరిగారు. నడవలేని అమ్మాయిని పెళ్లి చేసుకోలేమని తేలి్చచెప్పేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
Samantha: సామ్ అంతమాట అనేసిందా?
సమంత- నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా వీరికి పేరుంది. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. తమ దారులు వేరంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే చై-సామ్లు ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లండన్లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ డేట్కు వెళ్లడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత నాగచైతన్య డేటింగ్ రూమర్స్పై స్పందించినట్లు వార్తలు వచ్చాయి.'ఎవరు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తను ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది' అంటూ సామ్ పేర్కొన్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ మాటలు తాను అనలేదంటూ స్వయంగా సామ్ ట్వీట్ చేసింది. కాగా 2017లో ప్రేమపెళ్లి చేసుకున్న చై-సామ్లు 2021లో విడాకులు తీసుకున్నారు. -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్స్టాగ్రామ్లో కూడా బ్రేకప్కు సంబంధించిన కొటేషన్స్ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్కు షాకిచ్చినట్లయ్యింది. -
Hyderabad: ప్రేమ వ్యవహారాలు, దావత్ల మోజులో చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: ఆట పాటలతో హాయిగా సాగాల్సిన బాల్యం పక్కదారి పడుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన చిన్నారులు దావత్ల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మద్యానికి బానిసలవుతున్నారు. ఫోన్లు, సినిమాల మాయలో పడి పసితనంలోనే ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్నారు. చిన్న వయస్సులో స్నేహితులతో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా నేటి చిన్నారులు, యువత భావిస్తున్నారు. తమ పనుల్లో బిజీగా మారిన తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదారులు పడుతున్నారు. తెలిసి తెలియని స్కూల్ వయస్సులోనే విద్యార్థులు ప్రేమ వలలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు ఫోన్లు కొనివ్వడంతో వారు చాటింగ్లు చేస్తూ బడి వయస్సులోనే ప్రేమ వలలో చిక్కి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి దాకా వెళ్తున్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం మద్యం, సిగరెట్లు తాగుతున్నారు. బర్త్డే పార్టీల పేరిట రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. కొందరు మద్యం తాగి సోషల్మీడియాలో ఫొటోలు సైతం పెడుతున్నారు. భయం లేకపోవడమేనా? గతంలో తల్లిదండ్రులు, గురువులు అంటే పిల్లలు భయపడేవారు. ప్రస్తుతం తల్లిదండ్రుల అతిగారాబంతో చిన్నారులకు వారంటే భయం ఉండడంలేదు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఏమన్నా అంటే తల్లిదండ్రులు గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంది. దీంతో వారు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి చేసిన తప్పిదానికి ఉపాధ్యాయుడు మందలిస్తే తల్లిదండ్రులు, బంధువులు సదరు ఉపాధ్యాయుడిపై గొడవకు దిగారు. తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు, బైకులు, డబ్బులిచ్చి పాఠశాలకు కళాశాలకు పంపితే సరిపోతుందని భావించడంతోనే విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. తాము పడుతున్న కష్టాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సి ఉంది. పిల్లలు ఎటు పోతున్నారో ఓ కంట కనిపెట్టాలి. పిల్లల బాగోగులను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. ఆలోచన విధానం మారాలి పిల్లలకు తల్లిదండ్రుల నుంచే క్రమశిక్షణ అలవాటు అవుతుంది. పిల్లలకు ఏమిస్తున్నాం. దాని అవసరం ఎంత ఉందని తల్లిందడ్రులు తెలుసుకోవాలి. చిన్న వయస్సులో అవసరానికి మించి బైకులు, ఖరీదైన ఫోన్లు ఇచ్చి కళాశాలకు, పాఠశాలకు పంపరాదు. సంస్కారం తల్లిదండ్రులు నుంచి వస్తుంది. వినయం విద్య ద్వారా వస్తుంది. తాము కూడా పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – రమేశ్కుమార్, ఎస్ఐ, దౌల్తాబాద్ -
రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో హీరో సిద్దార్థ్ డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసముద్రం అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు అప్పటినుంచి ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. సిద్దార్థ్-అదితి కలిసి విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమాలోని పాపులర్ ‘టమ్ టమ్’అనే పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను అదితి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వీరి డ్యాన్స్ రీల్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇంక లేట్ ఎందుకు త్వరలోనే మీ రిలేషన్షిప్ అనౌన్స్ చేయండి.. మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఆమె వయసు 39, అతనికి 21.. ‘సంబంధం’పై తండ్రి హెచ్చరించడంతో..
చిత్తూరు అర్బన్: పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు కన్న తండ్రిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరచా డు. తాను కొడుతున్న దృశ్యాన్ని ప్రియురాలికి వీడియోకాల్ చేసి తండ్రిని చితకబాదాడు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు.. ఢిల్లీబాబు అనే వ్యక్తి గాంధీరోడ్డులో కాపురముంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని కొడుకు భరత్ (21) ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న 39 ఏళ్ల ఓ మహిళతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఇది నచ్చకపోవడంతో కుమారుడిని పలు మార్లు ఢిల్లీబాబు హెచ్చరించాడు. ఈవిషయమై తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలున్నాయి. ఆదివారం ఇంట్లో భోజనం చేస్తున్న తండ్రి వద్దకు వచ్చిన భరత్.. మహిళకు వీడియోకాల్ చేసి తన తండ్రిని కొడుతున్న దృశ్యం చూడమంటూ ఫోన్ ఆన్లోనే ఉంచి దాడి చేశాడు. చింతకట్టెతో తలపై తీవ్రంగా కొ ట్టడంతో ఢిల్లీబాబుకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ ఢిల్లీబాబును కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరుణ్పై లావణ్య షాకింగ్ కామెంట్స్, మనసులో మాట ఇలా బయటపెట్టిందా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఇప్పటికే లావణ్య కొట్టిపారేసింది. తమ మధ్య ఏం లేదని, అవన్ని పుకార్లేనని చెప్పి రూమర్స్కి చెక్ పెట్టింది. అయితే తాజాగా తన కామెంట్స్తో మరోసారి డేటింగ్ రూమర్స్కు తెరలేపింది లావణ్య. ఇటీవల ఓ షోలో పాల్గొన్న లావణ్య వరుణ్ తేజ్పై ఉన్న క్రష్ను బయటపెట్టింది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం దీంతో మరోసారి లావణ్య వార్తల్లోకికెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లావణ్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పులిమేక’. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ‘మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు’ అని అడిగిన యాంకర్ సుమ వాటికి A-నాని, B-వరుణ్ తేజ్ఆప్షన్లు ఇచ్చింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన లావణ్య.. వరుణ్ తేజ్ పేరు చెప్పి తన మనసులో మాట బయటపెట్టింది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! దీంతో యాంకర్ సుమతో పాటు పులిమేక టీం కోనవెంకట్, సిరిలు కూడా అవాక్కయ్యారు. ఆమె సమాధానానికి అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా గట్టిగా అరవడంతో లావణ్య ముసిముసి నవ్వులు నవ్వింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వరుణ్ తేజ్పై తనకున్న క్రష్ని లావణ్య ఇలా బయటపెట్టిందా అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’,‘అంతరిక్షం’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లోనే వారిమధ్య ప్రేమ చిగురించిందనే పుకార్లు వచ్చాయి. -
మజిలీ బ్యూటీతో నాగచైతన్య పెళ్లా? హీరోయిన్ ఏమందంటే..
సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్కు సంబంధించి తరుచూ గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శోభిత దూళిపాళతో చై డేటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాయి. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వినిపించింది. అంతేకాదు మజిలీ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాంశకు హీరోయిన్గా ఛాన్స్ రావడానికి కూడా నాగ చైతన్యనే కారణమని, ఆయనే దివ్యాంశ పేరును రికమెండ్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్పై స్వయంగా దివ్యాంశ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐ లవ్ నాగచైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రామారావు ఆన్ డ్యూటీలో నాకు ఛాన్స్ రావడానికి చై కారణమంటూ వచ్చిన రూమర్స్లో కూడా నిజం లేదు' అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. -
ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని
సీనియర్ నటి జయమాలిని.. నిన్నటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన స్పెషల్ సాంగ్లో నటించి అలరించారు. అలనాటి నటి, డాన్సర్ జ్యోతిలక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జయమాలిని అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. బెసిగ్గా సినిమాల్లో డాన్సర్ అయిన ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. దాదాపు రెండు దశబ్దాలకు పైగా వెండితెరపై డాన్సర్గా అలరించిన ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. చదవండి: పవన్ కల్యాణ్తో అసలు నటించను! ఎందుకంటే.: హీరోయిన్ ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానళ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తిర విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో తనకు చాలామంది ప్రపోజ్ చేశారని చెప్పారు. ‘అప్పట్లో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. పెళ్లి కూడా చేసుకుంట అని వెంటపడ్డారు. ఇక నాకు వచ్చే లవ్ లెటర్స్ చూడటానికి ప్రత్యేకంగా ఒక మేనేజర్ ఉండేవారు. ఇంక కొందరైతే బ్లడ్తో రాసేవారు. ఓ మిలిటరి ఆఫీసర్ కూడా నాకు లవ్ లెటర్ రాశారు. పెళ్లి గురించి మా అమ్మ-నాన్నతో కూడా మాట్లాడతా అన్నారు. ఇంక కొందరు మాత్రం మా అమ్మను అడిగే ధైర్యం లేక మా అక్క(జ్యోతి లక్ష్మితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేవారు’ అంటూ నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఇక తన వెంట అంత మంది పడితే తాను మాత్రం ఓ స్టార్ హీరోని ప్రేమించానంటూ సీక్రెట్ బయటపెట్టారు. ‘నేను ఓ స్టార్ హీరోను ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించారు. కానీ ఇద్దరం బయటక పడలేదు. ఫస్ట్ ఆయన లవ్ చేశారు. ఓ సారి షూటింగ్లో రాత్రి నా దగ్గరి వచ్చి చెప్పడానికి చూశారు. చదవండి: భారత ఆటగాళ్లతో తారక్ సందడి, ఫొటో వైరల్! కానీ ధైర్యం లేక గొంతు సవరించి చెప్పకుండానే వెళ్లిపోయారు. నేను కూడా ధైర్యం లేక ఈ విషయం ఆయనకు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ నాది రియల్ లవ్. నాకు వయసై చనిపోయేలోపు ఆ హీరో కలిసి ఈ విషయం చెబుతాను. ఆయన ఇప్పటికి బతికే ఉన్నారు. ఆయనకు పెళ్లయింది, భార్య పిల్లలు కూడా ఉన్నారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో ఎవరూ, ఏ భాషకు చెందినవారనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే తనకు పెళ్లయిందని, తన భర్త తనని బాగా చూసుకుంటారని ఆమె పేర్కొంది. -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
మన్ననూర్: గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ చెంచు యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాచారానికి చెందిన దాసరి లింగస్వామి (24) అచ్చంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాడు. లింగస్వామి అచ్చంపేట నుంచి స్వగ్రామం మాచారం కాలనీకి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి ఇంటి ముందు బైక్ నిలిపే క్రమంలో అకస్మాత్తుగా కొందరు దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా లింగస్వామిని పొడిచారు. ఈ ఘటనలో అతనిపై 34 కత్తిపోట్లు పడగా.. గుండెపై 3 అంగుళాల మేరకు గాయం కావడంతో లింగస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వీరబాబు పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. హత్య జరిగిన ప్రదేశం నుంచి అమ్రాబాద్ వైపు రోడ్డు మార్గంలో కొంతదూరం వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి తల్లి, నలుగురు అక్కలు ఉన్నారు. లింగస్వామి హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రేమ వ్యవహారమే కారణమా..? లింగస్వామి హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనికి గతంలో ఓ యువతితో పెళ్లి కుదిరింది. అయితే ఇదివరకే మరో వ్యక్తితో నిశ్చితార్థం అయిన అమ్రాబాద్ మండలానికి చెందిన ఓ యువతితో లింగస్వామి కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో యువతితో నిశ్చితార్థం జరిగిన యువకుడు, లింగస్వామి గతంలో ఒకసారి సెల్ఫోన్లో వాదులాడుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ఎవరితో శత్రుత్వం లేదని, ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా.. -
Eluru: లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడు.. గర్భం విషయం తెలియగానే..
నూజివీడు: మండలంలోని రావిచర్లకు చెందిన దేవరపల్లి సురేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి రూరల్ పోలీస్స్టేషన్ శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడని.. తనకు గర్భం విషయం తెలిపి పెళ్లి చేసుకోమని అడగగా, పథకం ప్రకారం జ్యూస్లో మందు కలిపి తాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి గర్భస్రావం అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సురేష్ పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు ఆమెను అవమానించి, గ్రామమంతా చెప్పి అల్లరిపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తలారి రామకృష్ణ తెలిపారు. చదవండి: (పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య) -
మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లవ్ ఎఫైర్లు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ విలువలను మంటగొలిపి మహిళలు, పురుషుల అన్న సంబంధం లేకుండా ఇరువురు చేస్తున్న పనులు యావత్తు కుటుంబం తలెత్తుకోలేని స్థితిని ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్లోని రాట్లం గ్రామంలో 30 ఏళ్ల మహిళ భర్త, అత్తమామాలతో కలిసి ఉంటుంది. ఐతే ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేయమని పిలిచినప్పటికీ ఆమె రానని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఆమె భర్త అత్తమామలు ఆ గ్రామంలో ఉండలేక ఆ ఇంటికి తాళం వేసి మరో ఊరు వెళ్లిపోయారు. ఐతే సదరు మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్త ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ ఇంటికే మకాం మార్చి అక్కడే ఉంటోంది. ఈ విషయం ఇరుగుపొరుగు వారి సాయంతో తెలుసుకున్న ఆమె భర్త అత్తమామలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో ఆ మహిళ ఇంటి వద్దకు వచ్చి ఆమెను చెట్టుకు కట్టి.. ఘోరంగా కర్రలతో దాడి చేశారు ఆమె భర్త, అత్తమామలు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. సమయానికి పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలికి రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం సదురు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సదరు మహిళ భర్త, అత్తమాహాలు, మరో ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్..) -
క్లాస్మేట్ అని జాబ్ ఇప్పించి.. లవ్యూ అంటూ సహజీవనం.. తర్వాత..
జమ్మికుంట: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తోంది. ఈ ఘటన జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆస్మాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన రాచపల్లి మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి చెల్పూర్ గ్రామానికి చెందిన ఎండీ.ఆస్మాబేగం కలిసి 2017 వరకు వర్ధన్నపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఈ సమయంలో మధు, ఆస్మాబేగం ప్రేమించుకున్నారు. తరువాత హైదరాబాద్లోని మధు స్నేహితుడి రియల్ ఎస్టేట్ అఫీస్లో ఆస్మాబేగంకు ఉద్యోగం ఇప్పించాడు. ఈ సమయంలో రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది రోజుల క్రితం వ్యవసాయం చేసుకుంటానని బీజిగిరిషరీఫ్కు వచ్చిన మధు మరో యువతితో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన ఆస్మాబేగం ముడు రోజులుగా మధు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేసింది. కాగా.. మధు కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి పరారీలో ఉన్నారు. -
ప్రేమపేరుతో టీవీ యాంకర్కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్కు తీసుకెళ్లి..
సాక్షి, చెన్నై: ఓ టీవీ యాంకర్ను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోడ్ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. ఈరోడ్కు చెందిన 26 ఏళ్ల యువతి లోకల్ టీవీలో యాంకర్గా పనిచేస్తోంది. ఈమెకు ఈరోడ్ ముత్తంపాలయానికి చెందిన రాహుల్ (29)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. 2018 కోవైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లిన సమయంలో హోటల్కు తీసుకెళ్లిన రాహుల్ తనను వివాహం చేసుకుంటానని చెప్పి బలాత్కారం చేశాడని, అలాగే తన వద్ద 750 గ్రాముల సవర్ల బంగారు నగలు మోసం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆగస్టులో ఈరోడ్ మహిళాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో రాహుల్ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. చదవండి: (పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..) -
విశాఖ: పెళ్లి వేడుకలో హైడ్రామా.. భగతే నా ప్రియుడు అంటూ..
సాక్షి, విశాఖపట్నం: నగరానికి చెందిన యువకుడు.. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేశాడు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. తాజాగా మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడంతో కల్యాణ మండపం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ప్రేయసి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వివరాల ప్రకారం.. షీలానగర్లోని ఓ కల్యాణ మండపం వద్ద ప్రియాంక అనే యువతి పెట్రోల్ బాటిల్తో హడావుడి చేసింది. తన ప్రియుడు భగత్.. తనను మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భగత్ వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడని కల్యాణ మండపం వద్ద పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, అక్కడున్న వారు ఆమెను అడ్డుకున్నారు. అయితే, భగత్పై ఆరు నెలల క్రితమే ప్రియాంక.. దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. భగత్ను రిమాండ్కు పంపించారు. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత భగత్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం, ఈరోజు భగత్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక కల్యాణ మండపం వద్ద హడావుడి చేసింది. -
పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి?
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని.. కన్న కూతురిని తండ్రే హత్య చేసినట్టు బయటపడింది. వివరాలు.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ (19) తల్లి చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎగువరెడ్డివారిపల్లిలోని తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు. మోహన్కృష్ణ ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో నాగయ్యగారిపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వేరే కులం యువకుడిని ప్రేమించడాని జీర్ణించుకోలేకపోయిన తండ్రి.. కూతురిని హత్య చేశాడు. ఆపై కడుపునొప్పి తాళలేక మోహనకృష్ణ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించాడు. పోలీసులకు కూడా ఆ విధంగానే ఫిర్యాదు చేశాడు. అయితే, పోస్టుమార్టంలో అమ్మాయిది హత్య అని తేలడంతో తండ్రి మునిరాజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్ బృందంతో వెళ్లి.. -
ప్రియుడిపై అనుమానం.. ఫుల్గా తాగి ఇంటినే తగలెట్టేసింది
బ్యాంకాక్: ఓ బంధమైనా నమ్మకం, విధేయత ఉంటే కలకలం కొనసాగుతుంది. చిన్న అనుమానమనే నిప్పు రవ్వ పడితే క్షణాల్లో మాడిపోతుంది. ఓ మహిళ తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మరో ఆలోచన లేకుండా బాయ్ఫ్రెండ్ గదినే తగలెట్టేసింది. ఈ సంఘటన థాయ్లాండ్లో వెలుగుచూసింది. పట్టాయా ప్రాంతానికి చెందిన డొన్లాయా నాలీ అనే మహిళ.. తన బాయ్ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని అనుమానం పెంచుకుంది. అదే ఆలోచనతో రగిలిపోయింది. అది నిజమేనా, కాదా? అనే ఆలోచన కూడా చేయలేదు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తన ప్రియుడి ఇంటికి వెళ్లి అతడు ఉండే గదికి నిప్పంటించింది. ఈ సంఘటన నవంబర్ 26న జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గది మొత్తం కాలిపోయింది. ఇతర రూముల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడిన బాధితుడు ‘మరో మహిళతో సంబంధం ఉందనే కోపంతోనే ఇలా చేసింది. నిప్పంటించే ముందే నాపై దాడి చేసింది.’ అని తెలిపాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? అనేది తెలపలేదు. ఇదీ చదవండి: శత్రు డ్రోన్లకు చెక్ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..! -
షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని నంది నగర్లో నివాసం ఉంటున్న మహిళ సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తోంది. 2018 లో ఆమెకు సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తున్న మన్మధ రావు అలియాస్ మహేష్తో పరిచయం ఏర్పడింది. మన్మథ రావు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో తాను ఇప్పటికే రేప్ కేసులో బాధితురాలిగా ఉన్నానని, తనకు కొద్ది రోజులు గడువు కావాలని కోరింది. ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒకటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా, మహేష్ ఆమెను దూరంగా పెడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ సైతం బ్లాక్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణానగర్లో కనిపించిన మన్మథ రావును పెళ్లి విషయమై ప్రశ్నించగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..) -
ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..
కొందరు వ్యక్తులు ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా తమ దాంపత్య జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న చిన్న కలహాలు, అనుమానాల కారణంగా బయట వ్యక్తులవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో, ఆ అడుగులు వివాహేతర సంబంధానికి దారితీస్తున్నాయి. చివరకు అవే తమ ప్రాణాల తీసుకునేందుకు, హత్య చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్లో చోటుచేసుకుంది. భార్య చేసిన పని.. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం.. బార్మర్ జిల్లాలోని మోతిసర గ్రామానికి చెందిన విష్ణారం సింధారి అనే వ్యక్తితో బాధితురాలికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో కొద్దిరోజులు వీరి వివాహ జీవితం సంతోషంగానే సాగింది. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆమెకు పక్కింటి వారితో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే తమ ఇంటి పక్కనే ఉండే జోగారమ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొత్తలో ఎక్కవ మాట్లాడకపోయిన కాలం గడుస్తున్న కొద్దీ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదే తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా వివాహేతర సంబంధం కొద్దిరోజుల పాటు కొనసాగింది. దీంతో, ఆమెకు అతడిపై ప్రేమ మరింతగా పెరిగింది. అతడు లేకుండా ఆమె ఉండలేకపోయింది. దీంతో ఎలాగైన ఆ యువకుడిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా నవంబర్ 14 నుంచి ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడు కూడా కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఎంత వెతికినా వారి జాడ కనిపించలేదు. కట్ చేస్తే తాజాగా అదే గ్రామంలోని ఓ బావిలో వీరిద్దరు శవాలై కనిపించారు. వారి మృతితో కుటుంబ సభ్యులు షాకయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆ హీరోతో డేటింగ్.. దుబాయ్కు పారిపోయానన్నారు : శివానీ రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్సిరీస్లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్ను నాకు తగిలేసి శివానీ బాయ్ఫ్రెండ్తో దుబాయ్కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు. దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్ఫ్రెండ్తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరో రాజ్తరుణ్తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది. -
భర్తతో గొడవలు.. అతడితో ఫేస్బుక్లో లవ్ట్రాక్.. చివరకు..
బాన్సువాడ టౌన్(బాన్సువాడ): ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో ఓ వివాహిత మోసపోవడమే కాకుండా దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని గౌలీగూడలో నివాసముంటున్న ముఖీద్కు నిజామాబాద్కు చెందిన ఉస్మా బేగం(32)కు 18ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లులున్నారు. పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. నిజామాబాద్లోనే ఉన్న ఉస్మాబేగం ఇటీవల బాన్సువాడలోని భర్త ఇంటికి వచ్చింది. ఇటీవల ఆమెకు ఫేస్బుక్లో యూపీకి చెందిన షెహజాద్ అనే యువకుడు పరిచయమవగా.. ఇద్దరిమధ్య ప్రేమ మొదలైంది. ఈ క్రమంలో ఉస్మాబేగం ప్రియుడి సూచన మేరకు బాన్సువాడ నుంచి యూపీలోని గజరౌలాకు చేరింది. షెహజాద్ను కలుసుకున్న ఉస్మాబేగం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో, షెహజాద్ ఆమెను కట్టేసి ఇటుకతో తలపై చితకబాదాడు. ఆమె మృతిచెందడంతో ఓ కంపెనీ ఆవరణలో మృతదేహాన్ని పడేసివెళ్లిపోయాడు. కంపెనీ ఆవరణలో మహిళ మృతిదేహం ఉన్నట్లు గుర్తించిన గజరౌలా పోలీసులు కంపెనీలో పని చేసే షెహజాద్ను విచారించారు. దీంతో అతడు ఫేస్బుక్ ప్రేమకథ బయటపెట్టాడు. అక్కడి పోలీసులు నిజామాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 6న తన భార్య కనిపించడం లేదని ముఖీద్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు మృతురాలి కుటుంబీకులు యూపీకి వెళ్లారు. -
బ్యాంకు ఉద్యోగంపై బదిలీ.. ఇద్దరు పిల్లలున్నా అక్కడ మరో వ్యక్తితో..
చైతన్యపురి: కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో మనస్తాపానికి లోనైన ఆమె భర్త పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ పీఅండ్టీ కాలనీకి చెందిన శేఖర్ (36)కు మల్కాజ్గిరికి చెందిన నాగాంజలితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. హైదరాబాద్లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న నాగాంజలి ఏడాది క్రితం డీజీఎంగా ఆదిలాబాద్కు బదిలీపై వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు నాబార్డ్లో పనిచేసే తేజ స్వరూపరెడ్డితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ ఫోన్లో వీడియోకాల్తో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన ఆమె భర్త శేఖర్ నిలదీయగా తప్పు ఒప్పుకుని మరోసారి తప్పుచేయనని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చింది. అయితే, అందుకు భిన్నంగా ఆదిలాబాద్లో నాగాంజలి, స్వరూపారెడ్డి సహజీవనం చేస్తున్నారు. ఆదిలాబాద్ వెళ్లినప్పటి నుంచి తనను పట్టించుకోవటం లేదని, పిల్లలను కూడా చూపించటం లేదని భర్త శేఖర్ మనస్తాపానికి లోనయ్యాడు. ఫోన్ చేస్తే నీచంగా మాట్లాడింది. అంతేకాక ఆదిలాబాద్లో శేఖర్పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత భర్తను దుర్భాషలాడటంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కాగా,అంతకు ముందుకు అతను భార్య ప్రవర్తనపై సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి మృతుడి తండ్రి శరభయ్య ఫిర్యాదు మేరకు సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమైన కోడలు నాగాంజలి, ఆమె తల్లిదండ్రులు, ప్రియుడు స్వరూపరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఆదిలాబాద్ పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియుడి మైకంలో దారుణానికి ఒడిగట్టిన తల్లి..
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను హత్య చేసిన మహిళతోపాటు ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కాగా, ఈ దారుణంపై పోలీసుల కథనం మేరకు.. కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని ఓడంపట్టి గ్రామానికి చెందిన మాదేశు (27) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడికి భార్య జ్ఞానమలర్ (21), ప్రకాష్ (3), ఆదిరా (9 నెలలు) పిల్లలున్నారు. మాదేశు రోజూ కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జ్ఞానమలర్కు అదే గ్రామానికి చెందిన రైతు సాయి తంగరాజ్ (28)తో పరిచయం ఏర్పడి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. మాదేశు పనికి వెళ్లిన అనంతరం సాయితంగరాజ్, జ్ఞానమలర్ ఇంట్లో ఉల్లాసంగా గడిపేవారు. ఈ క్రమంలో ఈ సంగతి మాదేశుకు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన జ్ఞానమనర్ ఈ విషయాన్ని తంగరాజ్కు తెలిపింది. బిడ్డ ఉండడంతో వివాహేతర సంబంధం కొనసాగడం కష్టమని, బిడ్డలను హత్య చేయమని జ్ఞానమలర్ తెలిపింది. దీంతో, తంగరాజు ఇచ్చిన పథకం ప్రకారం జ్ఞానమలర్ కన్న పిల్లలు ప్రకాష్, ఆదిరాకు ఎలుక మందు పేస్టును ఇచ్చింది. ఇది తిన్న చిన్నారులు వాంతులు చేసుకుని, స్పృహ తప్పారు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు ఆ బిడ్డలకు విషం ఇచ్చినట్టు గుర్తించి, కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. వీరిలో ఆదిరా గత ఐదో తేదీ ఉదయం మృతి చెందాడు. ఈ విషయమై మాదేశు రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, జ్ఞానమలర్, ఆమె ప్రియుడు తంగరాజును అరెస్టు చేశారు. నిందితులను వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక..
తిరుపతి క్రైం/కొవ్వూరు: ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి తిరుపతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని షాపూర్కు చెందిన అనూష(21)కు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గుడ్ల పోసిబాబుతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొవ్వూరు ఆంధ్రా షుగర్స్లో పని చేస్తున్న పోసిబాబు తన భార్యతో కలిసి కొంతకాలంగా కొవ్వూరులోనే నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. భార్య అనూష కనిపించడం లేదంటూ పోసిబాబు ఈ నెల 5న కొవ్వూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 4వ తేదీ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లి 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించ లేదని పేర్కొన్నారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులకు తెలిపాడు. పోసిబాబు ఇంట్లో అనూష రాసిన లేఖ లభించింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక, హైదరాబాద్ షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావు (23) అనే యువకుడు, అనూష గతంలో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అనూషకు, పోసిబాబుకు వివాహం చేశారు. కృష్ణారావును మరచిపోలేని ఆమె.. అతడితో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 5న ఇద్దరూ కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని త్రిలోక్ లాడ్జిలో దిగారు. అక్కడే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం రూము ఖాళీ చేయాల్సిన వీరు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. లాడ్జిలో లభించిన ఫోన్ ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..
సాక్షి, కర్నూలు: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పట్టణానికి చెందిన మోహన్ ఉరఫ్ యోహానుపై ఓ యువతి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలిలా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని తెలిపింది. తరువాత గర్భం తీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా టాబ్లెట్లు మింగించి గర్భస్రావం చేయించాడని, చివరికి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. నమ్మించి మోసం చేసిన తన ప్రియుడిని, వేరే అమ్మాయితో పెళ్లికి ప్రేరేపిస్తున్న అతడి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు మోహన్, అతనికి సహకరిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. చదవండి: (Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు') -
లవ్ ఎఫైర్.. అమ్మాయి కోసం నడిరోడ్డుపై తన్నుకున్న స్టూడెంట్స్
కాలేజ్ డేస్లో లవ్ వ్యవహరం పెద్ద రచ్చే చేసింది. ఒకే అమ్మాయిని ఇద్దరు స్టూడెంట్స్ ప్రేమించడంతో వారి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వారిద్దరూ రెండు గ్రూపులను ఏర్పాటుచేసి అమ్మాయి నాదంటే నాది అని చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. కుడ్డలూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీలో వరుణ్, సుధాకర్ అనే ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. కాగా, అనూహ్యంగా వీరిద్దరూ అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించారు. ఈ ప్రేమ విషయంలో వారి మధ్య పెద్ద తగాదానే నడిచింది. సినిమా రేంజ్లో ఒకరికి ఒకరు వార్నింగ్ సైతం ఇచ్చుకున్నారు. సినిమాలో హీరో స్టైల్లో తనే నా హీరోయిన్ అంటూ మాటల వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహరంలో వారిద్దరూ రెండు గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బస్సు కోసం బస్స్టాప్లో వేచిచూస్తుండగా.. వారిద్దరూ ప్రేమించిన అమ్మాయి అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రెండు గ్రూపుల సపోర్టర్లు అక్కడికి చేరుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై చిత్తుగా తన్నుకున్నారు. ఇక, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్పై స్పందించాడు. మూవీలో హీరోయిన్తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత లవ్ ట్రాక్.. చివరకు భలే ట్విస్ట్
తిరువణ్ణామలై (వేలూరు): వివాహేతర సంబంధాలు పచ్చిన కాపురంలో చిచ్చురేపుతున్నాయి. చిన్న చిన్న కోరికలు, ఆనందాల కోసం తప్పటడుగులు వేస్తున్న వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. నలుగురు పిల్లలున్న వ్యక్తితో వివాహిత వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా కనకూరు పంచాయతీ కేకే నగర్ గ్రామానికి చెందిన తంగరాజ్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య ఉమ. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. చెన్నై మాంగాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య నిత్య(30). వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఇదిలా ఉండగా తంగరాజ్కు నిత్యతో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. తర్వాత తంగరాజ్ పని నిమిత్తం చెన్నై వెళ్లే సమయంలో నిత్యను కలిసి మాట్లాడి వచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నిత్య భర్త పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో మూడురోజుల క్రితం నిత్య ఇద్దరు కుమార్తెలు, భర్తను వదిలి పెట్టి తిరువణ్ణామలైలోని తంగరాజ్ ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న తంగరాజ్ భార్య భర్తతో పాటు నిత్యను ఇంటిలో చేర్చకుండా బయటకు పంపించి వేసింది. దీంతో తంగరాజ్ నిత్య వద్ద చర్చించి చెన్నైకి పంపేందుకు యతి్నంచాడు. ఇందుకు నిత్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈక్రమంలో తంగరాజ్ నిత్య కట్టుకున్న చీరను ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. స్థానికులు స్థానికులు గుర్తించి కొండ ప్రాంతానికి వెళ్లగా.. తంగరాజ్ అక్కడ నుంచి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై పోలీసులు నిత్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ప్లాన్ ప్రకారమే ప్రాణం తీశారు.. ఆనంద్ భార్య లీల ఎక్కడ?
పటాన్చెరు టౌన్: కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం హత్య చేశారు. శుక్రవారం పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ భీంరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్ అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. భారతి వాట్సాప్లో శివకుమార్తో చాటింగ్ చేసింది. చాట్ విషయం చిన్నాన్న ఆనంద్కు తెలిసింది. భారతిని తండ్రి బాలపీరు ఎదుటే మందలించాడు. అయినా పరిస్థితి మార్పు రాలేదు. దీంతో తండ్రి బాలపీరు, బాబాయి ఆనంద్ కలసి పథకం వేశారు. ప్రణాళికలో భాగంగా కూతురు భారతితో ఈనెల 7వ తేదీ రాత్రి ఫోన్ చేయించారు. అమీర్పేట్కు రమ్మని చెప్పించారు. డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో యువతికి వరుసకు బావ అయిన బాలకృష్ణతో రూ.200 ఆన్లైన్లో వేయించారు. శివకుమార్ అమీర్పేట్కు వచ్చాక అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. హుస్సేన్సాగర్ దిగువనున్న గోశాల దగ్గరలో గల శ్మశాన వాటికకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న హుస్సేన్సాగర్ నుంచి మూసీ నదికి వెళ్లే కాలువలో పడివేశారు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతదేహం కొట్టుకుపోయింది. పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ డేటా ఆధారంగా ముషీరాబాద్ బొలక్పూర్కు చెందిన భారతి బాబాయి ఆనంద్, తండ్రి బాలపీరు, తల్లి బాలకిష్టమ్మ, బావ బాలకృష్ణను గురువారం అదుపులోకి తీసుకొని విచారించారు. యువకుడిని హత్య చేసి కాలువతో పడేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ఆనంద్ భార్య లీలను త్వరలో పట్టుకుంటామన్నారు. కాగా శివకుమార్ మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలతో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కీలక పాత్ర పోషించిన పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి, క్రైం సీఐ బీసన్న, ఎస్ఐలు రామానాయుడు, ప్రసాద్ను ఎస్పీ రమణకుమార్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్ -
మరో యువతితో భర్త షికార్లు.. ఫొటోలు భార్యకు పంపించి..
చిక్కబళ్లాపురం: భార్యను పుట్టింటిలో వదిలేసిన భర్త, ప్రియురాలితో టూర్లు వేశాడు, పైగా ఆ ఫోటోలను పంపించడంతో భార్య విరక్తి చెంది ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెణ్ణూరు కదిరేనహళ్లిలో నివాసమున్న మునిరాజు, దేవమ్మల కుమార్తె మోనిక (20)కు, చిక్కబళ్లాపురం నగరం ప్రశాంతనగరలో నివాసమున్న భార్గవ్ (25)తో 8 నెలల కిందట ఘనంగా పెళ్లి చేశారు. ఇద్దరూ సఖ్యతగానే ఉండేవారు. దసరా పండుగకు భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. తరువాత మళ్లీ తీసుకెళ్లడానికి రాలేదు. డెత్నోట్ రాసి ఉరి.. మోనిక భర్తకు ఫోన్ చేసి నన్ను తీసుకెళ్లు అని అడిగితే అతడు పట్టించుకోలేదు. మరో యువతితో షికార్లు చేస్తున్న ఫోటోను బుధవారం అతడు పంపించడంతో మోనిక నిర్ఘాంతపోయింది. ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన మోనిక ఇంటి పై అంతస్తు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త భార్గవ్ కారణమని డెత్ నోట్ రాసింది. చిక్కబళ్లాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. డిగ్రీ చదివించి, ఘనంగా పెళ్లి చేస్తే విధి మాకు ఇలా చేసిందా అని తల్లిదండ్రులు విలపించారు. కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్ను శిక్షించాలని కోరారు. -
ఆమెకు 5 నెలల క్రితమే పెళ్లి.. వావివరుసలు మరిచి వదినతో..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. క్షణకాలం తప్పిదాల కోసం మానవ సంబంధాలను మరిచిపోయి కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు. అన్న భార్య అని కూడా చూడకుండా ఓ తమ్ముడు వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో, దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ధనంజయ్ (అలియాస్ పింటూ యాదవ్)కు ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. అనంతరం, ఇంట్లోనే వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో ధనంజయ్ తమ్ముడు శివ బహదూర్.. అన్న భార్యతో చనువు పెంచుకున్నాడు. కాగా, అప్పుడప్పుడు శివ.. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో అన్న పలుసార్లు మందలించాడు. ఇదిలా ఉండగా.. అన్న మాటలను మాత్రం తమ్ముడు పట్టించుకోలేదు. దీంతో, ఆగ్రహంతో రగిలిపోయిన అన్న.. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో తమ్ముడిని హత్య చేశాడు. ఈనెల 10న తన తమ్ముడు నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా తన భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే అనుమానంతో అతడిని అంతమొందించానని అంగీకరించాడు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న బాధితురాలు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ఇదీ చదవండి: ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం -
ఫిట్నెస్ ట్రైయినర్తో స్టార్ హీరో కూతురు ప్రేమాయణం, త్వరలో పెళ్లి!
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తండ్రి ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పండగలు, స్పెషల్ డేస్ను సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అయితే దీనిపై ఎప్పుడూ ఐరా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా తమ రిలేషన్పై ఐరా అధికారిక ప్రటకన ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఎస్ చెప్పానంటూ ఐరా ఓ క్యూట్ వీడియో షేర్ చేసింది. చదవండి: టీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి ఇందులో నుపుర్ ఐరాకు రింగ్ తొడుగుతూ ప్రపోజ్ చేసినట్లు కనిపించాడు. సైక్లింగ్ పోటీలో భాగంగా నుపుర్ ఇటీవల విదేశాలకు వెళ్లాడు. అతనికి తోడుగా ఐరా కూడా వెళ్లింది. ఇక పోటీలు ముగిసిన వెంటనే ప్రియురాలి వద్దకు వచ్చిన నుపుర్ ఆమెను హత్తుకుని ముద్దాడాడు. అనంతరం మోకాలిపై కూర్చొని ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఉంగరం తొడుగుతూ ప్రపోజ్ చేశాడు. ఇక వెంటనే ఐరా మురిసిపోతూ ప్రియుడికి తన చేయి అందించింది. ఇక ఈ వీడియో ఆమె షేర్ చేస్తూ ‘నేను ఎస్ చెప్పాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: కొడుకు చంద్రహాస్పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ తన పోస్ట్పై పలువురు బాలీవుడ్ సినీ సెల్రబెటీలు స్పందిస్తూ ఈ లవ్ బర్డ్స్కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదంత చూస్తుంటే త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. కాగా కొన్నేళ్లకు ఆమీర్కు నుపుర్ ఫిట్నెస్ ట్రెయినర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలోనే నుపుర్తో ఐరాకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహితులు ఉన్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2020 నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉండగా.. తాజాగా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు ఈ లవ్బర్డ్స్. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
కంపెనీలో అతడితో పరిచయం.. ప్రియుడి కోసం ఏం చేసిందంటే?
యశవంతపుర: ప్రియుని కోసం భర్తలను చంపే సంఘటనలు కర్నాటకలో పెరుగుతున్నాయి. ఒక టీవీ సీరియల్ ప్రేరణతో వివాహిత తన భర్తను పరలోకానికి పంపిన వైనం మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో జరిగింది. మళవళ్లి ఎన్ఇఎస్ లేఔట్లో నివాసం ఉంటున్న శశికుమార్ (30)ని భార్య నాగమణి (28), ప్రియుడు హేమంత్ (25)లు కలిసి ఆదివారం రాత్రి హత్య చేశారు. గార్మెంట్స్లో పరిచయమై కనకపురలో గార్మెంట్స్కు వెళ్తున్న నాగమణికి హేమంత్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి భర్త ఆమెను పలుసార్లు మందలించాడు. మొబైల్ఫోన్ను లాక్కుని పనికి వెళ్లవద్దని కట్టడి చేయడంతో ఆమె భగ్గుమంది. భర్తను తప్పిస్తే ఏ అడ్డూ ఉండదని నాగమణి నిశ్చయించుకుంది. టీవీలో వచ్చే కన్నడ సీరియల్ శాంతం పాపం చూస్తూ అందులో మాదిరిగానే హత్యకు పథకం వేసింది. ప్రియునితో కలిసి హత్య ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్ని పిలిపించుకుంది. నిద్రిస్తున్న పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో బట్టలు కుక్కారు. తరువాత మద్యం మత్తులో నిద్రిస్తున్న శశికుమార్ను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఎవరో దుండగులు చొరబడి చంపేశారని నాగమణి ఏడుపు అందుకుంది. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి తాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం నుంచి అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుంది. జంటను రిమాండ్కు తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలూ అనాథల్లా మారారు. -
హోటల్ రూమ్లో లవర్తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్ రివర్స్!
వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకిడుస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి క్రమంలో కుటుంబ సభ్యులకు దొరికిపోయి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వేరే మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది. వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు చెప్పారు. దీంతో, భర్తకు తన ప్రవర్తన మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ భర్త మారకపోవడంతో విసుగుచెందింది. ఈ క్రమంలో ఆమె భర్త సదరు మహిళతో కలిసి హోటల్ రూమ్లో ఉన్నాడన్న విషయాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్న భార్య అక్కడికి వెళ్లింది. అక్కడ వారిద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకుని తన చెప్పుతో చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా, ఈ ఘటనపై భార్య ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రేమ పేరుతో దగ్గరై మూడు సార్లు అబార్షన్.. చివరకు పెళ్లి..
సాక్షి, తిరుత్తణి (చెన్నై): యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తిరుత్తణి సమీపంలోని బుచ్చిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బాలనాగమ్మ(29) తిరుత్తణి పోలీస్స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పళ్లిపట్టు మండలం ఎగువ నెడిగళ్లు కాలనీకి చెందిన ఆదిమూలం(30)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పడంతో అతని మాటలు నమ్మిన బాలనాగమ్మ మూడుసార్లు అబార్షన్ చేయించుకుంది. చివరికి తనకు వేరొక అమ్మాయితో పెళ్లి కుదిరిందని చెప్పాడు. దీంతో న్యాయం కోసం తిరువళ్లూరు ఎస్పీ కల్యాణ్ను ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు తిరుత్తణి డీఎస్పీ విగ్నేష్ సూచనలతో తిరుత్తణి మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం ఇరు కుటుంబాలను పిలిపించారు. పోలీస్స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన యువతి, బంధువులు చదవండి: (ఆ యువతితో ఉన్న 10 రోజులు మరుపురానివి.. తల్లిదండ్రులు..) ఈ క్రమంలో ఆ యువకుడు తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో యువతి బంధువులతో కలిసి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తిరుత్తణి–పొదటూరుపేట రోడ్డులో వాహనాలు ఆగిపోవడంతో డీఎస్పీ ఇరు వర్గాలతో చర్చించారు. అయినా పెళ్లికి యువకుడు అనాసక్తి వ్యక్తం చేయడంతో అతన్ని న్యాయస్థానంలో హజరుపరిచి జైలుకు తరలించారు. యువతిని కించపరిచేలా వ్యవహరించిన డీఎస్పీ తనకు న్యాయం చేయాలని నిరసన తెలిపిన యువతిని డీఎస్పీ కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఉన్నత పదవుల్లో ఉంటూ బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారి ఏకవచనంలో అసభ్య పదజాలంతో మాట్లాడడం విమర్శలకు దారి తీసింది. -
నాకెందుకు అన్యాయం చేశావ్.. కరెంట్ పోల్కు కట్టేసి చితకబాదింది!
సాక్షి, పెద్దపల్లి: తన భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అతడికి దేహశుద్ధి చేసింది. భర్తను ఓ కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన మంథనిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి వివాహం చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అఖిల పేరెంట్స్ శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. అయితే, వీరిద్దరికీ కొడుకు జన్మించిన అనంతరం.. శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతరం, వరంగల్లో మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం, శ్రీకాంత్ను కరెంట్ పోల్కు కట్టేసి.. భార్య అతడిని చితకబాదింది. చెప్పులతో కొట్టింది. ఈ క్రమంలో చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. -
సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్.. అర్ధరాత్రి 15 మంది ఇంట్లో దూరి..
అర్ధరాత్రి ఓ మహిళను 15 మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు గేటు బద్దలుకొట్టి మరీ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందుతులను పట్టుకుని మహిళను కాపాడారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మైలాడుతురైలో చెందిన ఓ యువతి(24)తో నిందితుల్లో ఒకరైన విఘ్నేశ్వరన్కు కొద్ది రోజుల కిత్రం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో విఘ్నేశ్వరన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతరం.. వ్రాతపూర్వకంగా లేఖ రాయించుకుని విఘ్నేశ్వరన్కు విడుదల చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన విఘ్నేశ్వరన్.. యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో, నిందితుడు మరో 14 మందితో కలిసి మహిళను కిడ్నాప్ చేశారు. 15 మంది కలిసి ఆమె ఇంటి గేటును బద్దలుకొట్టి మరీ.. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను సిటీ దాటిస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు వెంబడించి హైవేపై వారిని పట్టుకున్నారు. ఆమెను విడిపించి.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. Fifteen men kidnap woman from her residence in Mayiladuthurai, Tamilnadu! pic.twitter.com/WCK1AFdW7l — karthik gopinath (@karthikgnath) August 3, 2022 -
ఆమె లేకుంటే బతకలేనన్నాడు.. లవరే కదా అని ఆమె దగ్గరైంది.. తర్వాత..
నువ్వుంటే ఇష్టమంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమ పేరుతో ఆమెను వంచించాడు. శారీరకంగా ఆమెకు దగ్గరై.. గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి విషయం ఎత్తడంతో అతడి గురించి అసలు విషయం తెలిసి.. ఆమె షాకైంది. పేరు మార్చుకుని తనను మోసం చేశాడని గుర్తించి ఆవేదనకు లోనైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలో ఉన్నావ్ చెందిన బాధితురాలికి.. మోనూ పేరుతో ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమె అంటే ఇష్టమన్నాడు. ఆమె లేకుంటే బ్రతకలేనంటూ నమ్మించాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇవన్నీ నమ్మిన బాధితురాలు ఓ తప్పు చేసింది. కాబోయే భర్తే కదా అని.. పలుమార్లు శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. దీంతో కంగారుపడిన మోనూ.. ఆమెను మళ్లీ మోసం చేసి.. గర్భాన్ని తొలగించేశాడు. అనంతరం, పెళ్లి చేసుకోవాలని మోనూను కోరింది. కాగా, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి బాధితురాలి వద్ద నుంచి రూ.2 లక్షలు నొక్కేశాడు. ఇక లాభం లేదని బాధితురాలు.. పెళ్లి విషయమై నిలదీయడంతో కనిపించకుండా పోయాడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. అతడి పేరు మోనూ కాదని.. అసలు పేరు షెహ్నవాజ్ కబాడీ అని తెలియడంతో ఖంగుతింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Unnao, Uttar Pradesh: Arti met Monu, they fell in love, had a physical relationship, she got pregnant then he terminated her pregnancy. He even took 2 lakh rupees from her promising marriage, now goes missing ever since his true name 'Shehnawaz Kabadi' came to light. See: pic.twitter.com/q1XemSyoTK — Subhi Vishwakarma (@subhi_karma) September 9, 2022 -
ఒకే యువతిపై ఇద్దరు మనసుపడ్డారు.. పేస్టులో పటాస్ మందు కలిపి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఇద్దరు యువకుల మధ్య ప్రేమ వివాదం కొన్ని ప్రాణాలను బలి తీసుకునే యత్నానికి దారి తీసింది. అయితే అందుకు ప్రయత్నించిన యువకుడు ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పటంతో అతడు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చూశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన పాసపు నాగేంద్రకుమార్, వంకా నాగేశ్వరరావు స్నేహితులు, ఇద్దరూ రోల్డుగోల్డు పనులు చేస్తుంటారు. ఒకే కాలనీకి చెందిన వారిరువురూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై మనసు పడ్డారు. చదవండి: (అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే..) సదరు యువతి మొదట నాగేశ్వరరావుతో చనువుగా మెలిగింది. అయితే ఇటీవల నాగేంద్రకుమార్తో మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు ఎలాగైనా నాగేంద్రకుమార్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం సుమారు 15 రోజుల క్రితం తెలిసిన రోల్డుగోల్డు దుకాణంలో పటాస్ ముక్కను కొనుగోలు చేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున నాగేంద్రకుమార్ బాత్రూంలో ఉన్న టూత్బ్రెష్లపై నిందితుడు నాగేశ్వరరావు పటాస్ కలిపిన పేస్టును పెట్టి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అలా నాగేంద్రకుమార్ను అంతమొందించేందుకు పూనుకున్న నాగేశ్వరరావు తాను చేసిన ప్రయత్నాన్ని తన సోదరుడి చెవిన వేశాడు. నాగేశ్వరరావు సోదరుడు ఆ బ్రెష్లను అక్కడి నుంచి తీసి దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తరువాత ఆ నోటా ఈ నోటా విషయం కాస్తా బయటికి పొక్కటంతో విషయం తెలుసుకున్న నాగేంద్రకుమార్ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరచగా సొంత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే..
అతనో పోలీస్.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఐ లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఫిరోజాబాద్కు చెందిన యువతి(24)తో కానిస్టేబుట్ అమిత్ యాదవ్కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతిని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని అమిత్ తెలిపాడు. ఈ క్రమంలో కాబోయే భర్తే కదా అని ఆమె శారీరకంగా దగ్గరైంది. కాగా, పెళ్లి విషయం ఎత్తగానే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు.. అమిత్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడుగగా.. 2021లో పెళ్లి చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ, కట్నం కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్ను నిలదీయగా అదనపు కట్నం కావాలని కోరినట్టు తెలిపింది. ఈ సందర్బంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేసింది. అతని కుటుంబం రూ. 14 లక్షల కట్నం డిమాండ్ చేసింది. అమిత్తో నా వివాహం ఆగస్టు 2021కి నిర్ణయించారు. కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ. 19 లక్షల ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుకు తెలపడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫిరోజాబాద్ రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. -
పాక్ యువతి చొరబాటు.. అది ‘హద్దు’లెరుగని ప్రేమే
సాక్షి, హైదరాబాద్: నేపాల్ మీదుగా ఇటీవల సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన ఓ పాక్ యువతి వ్యవహారంలో ఎటువంటి కుట్ర కోణం లేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న హైదరాబాద్ యువకుడు అహ్మద్తో సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయంతో ప్రేమలో పడిన పాక్ యువతి ఖాదియా నూర్... అతను వేసిన పథకం ప్రకారమే మహ్మద్ (అహ్మద్ సోదరుడు), జీవన్ (నేపాల్ జాతీయుడు)లతో కలసి అక్రమంగా సరిహద్దు దాటి బిహార్లో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సేనలకు చిక్కిందని నిఘా, పోలీసు విభాగాలు గుర్తించాయి. దీన్ని ప్రేమ వ్యవహారంగానే అభివర్ణించాయి. తొలుత దీని వెనుక భారీ కుట్ర ఉండి ఉండొచ్చని భావించిన ఎస్ఎస్బీ... నిందితులను బిహార్లోని సీతామర్హి జిల్లా పోలీసులకు అప్పగించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిఘా వర్గాలు వారిని వివిధ కోణాల్లో విచారించాయి. హైదరాబాద్లోని బహదూర్పురతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరా తీశాయి. అలాగే రాష్ట్ర నిఘా వర్గాలతోపాటు ప్రత్యేక పోలీసు బృందం బిహార్ వెళ్లి వారిని విచారించి ఇదే విషయాన్ని తేల్చింది. అయితే నూర్ అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రేరేపించి అందుకోసం ఏర్పాట్లు చేసిన అహ్మద్తోపాటు జీవన్లను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సీతామర్హి పోలీసులు భావిస్తున్నారు. చదవండి: జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర/నిర్మల్/డిచ్పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్పాస్ట్ చేశాడు. అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి చికిత్స చేశారు... గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్నోట్ విడుదల చేశారు. సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు. తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్కు ట్విట్టర్లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన రాథోడ్ సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండా. రాథోడ్ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (డ్యామిట్ కథ అడ్డంతిరిగింది.. రేవంత్కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) -
పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
(నెల్లూరు) ఉలవపాడు: ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాడుకు చెందిన కుంచాల భార్గవి (19) దర్గా సెంటర్లో నివాసం ఉంటోంది. అదే కాలనీకి చెందిన మాల్యాద్రి, భార్గవి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తర్వాత మాల్యాద్రి పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, బలవంత పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి లేఖ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తర్వాత కుటుంబసభ్యులు గుర్తించారు. ఎమ్మెల్యే దృష్టికి.. ఈనెల 10వ తేదీన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి భార్గవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువతి సమస్యను తెలియజేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏఎస్సై సుబ్బారావును పిలిచి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంతలోనే యువతి ఆత్మహత్య చేసుకుంది. -
ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..
దొడ్డబళ్లాపురం: దారితప్పిన మహిళ ప్రవర్తన ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. ఒకరితో పెట్టుకున్న అక్రమ సంబంధం.. మరో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తికి తెలుస్తుందనే భయంతో మహిళ ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నెలమంగల తాలూకాలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. జూలై నెల 2న తుమకూరు జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నెలమంగల పోలీసులు లక్ష్మి, వెంకటేశ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు ఇద్దరూ దొడ్డలింగప్ప అనే వ్యక్తిని తుమకూరులో హత్య చేసి నెలమంగల తాలూకా కళలుఘట్ట బ్రిడ్జి వద్ద శవాన్ని పారవేసి పరారయ్యారు. అందరిదీ రాయచూరు నిందితులు లక్ష్మి, వెంకటేశ్, హతుడు దొడ్డలింగప్ప అందరూ రాయచూరుకు చెందినవారే. వీరంతా తుమకూరు వద్ద ఉన్న గోశాలలో పనిచేసేవారు. లక్ష్మి మొదటి భర్త మృతి చెందగా, రెండవ భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో లక్ష్మి.. దొడ్డలింగప్ప, వెంకటేశ్ అనే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే దొడ్డలింగప్పతో అక్రమ సంబంధం గురించి వెంకటేశ్కు తెలుసు. కానీ, వెంకటేశ్తో అక్రమ సంబంధం ఉన్న సంగతి దొడ్డలింగప్పకు తెలీదు. దొడ్డలింగప్పకు లక్ష్మి రూ.30 వేలు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వెంకటేశ్తో ఉన్న సంబంధం తెలిస్తే గొడవ చేస్తాడని భావించిన లక్ష్మి జులై 2న అతడ్ని ఇంటికి పిలిపించి మద్యం తాగించి తలపై బండరాయితో బాది హత్య చేసింది. ఇందుకు వెంకటేశ్ సహకరించాడు. శవాన్ని తీసుకువచ్చి నెలమంగల వద్ద బ్రిడ్జి కింద పారవేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
పెళ్లికి ముందే అతడితో ఎఫైర్.. ప్రియుడి కోసం ప్రియురాలు కిరాక్ ప్లాన్
తిరువొత్తియూరు: తెన్కాశి సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న దంపతులు రాత్రి సమయంలో ఇంటికి బైక్లో వస్తుండగా కారులో వచ్చిన ఓ ముఠా అడ్డుకుంది. తర్వాత భర్తను హత్య చేసి, భార్య మెడలో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లింది. అయితే పోలీసుల విచారణలో అదంతా హైడ్రామా అని తేలింది. భార్యే ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించినట్లు తెలిసింది. వివరాల ప్రకారం.. తెన్కాశి జిల్లా, సెందామరం సమీపంలోని వెండ్రిలింగాపురానికి చెందిన వైరస్వామి (31). ఇతనికి వీర శిఖామణికి చెందిన ముత్తుమారి (25)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ వెండ్రిలింగాపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. వీర శిఖామణిలో ఉన్న ఓ హోల్సేల్ ఫర్నీచర్ దుకాణంలో దంపతులిద్దరూ పని చేస్తున్నారు. రోజూ ఉదయం ద్విచక్ర వాహనంలో వెళ్లి రాత్రి ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి వైరస్వామి, అతని భార్య ముత్తుమారి వీరశిఖామణి నుంచి బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో వీర శిఖామణికి, నడుంకురిచ్చికి మధ్య వస్తుండగా వారిని వెంబడిస్తూ వచ్చిన నలుగురు సభ్యుల ముఠా బైక్ను అడ్డుకుంది. ఆ తర్వాత ముత్తుమారి మెడలో ఉన్న మూడున్నర సవర్ల నగను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీన్ని వైరస్వాసామి అడ్డుకోవడంతో అతన్ని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి దాడిచేసి, పారిపోయారు. అడవి ప్రాంతంలో దిక్కుతోచక నిలబడిన ముత్తుమారి భర్తను లాక్కొచ్చిన ప్రాంతంలోకి వెళ్లి చూడగా అక్కడ వైరస్వామి తీవ్ర గాయంతో మృతదేహంగా కనిపించాడు. దీంతో ముత్తుమారి ఏడుపు విన్న వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైరస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శంకరన్ కోయిల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. కేసు నమోదు చేసి ముత్తుమారిని ప్రశ్నించారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమెపై పోలీసులకు సందేహం కలిగింది. ఖాకీ స్టైల్లో దర్యాప్తు చేయడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించినట్లు తేలింది. వివాహానికి ముందే ముత్తుమారికి మరో యువకుడితో సంబంధం ఉందని ఈ సంగతి వైరస్వామికి తెలియడంతో భార్యను తీవ్రంగా మందలించాడు. దీంతో, భర్తను హత్య చేయడానికి పథకం వేసిన ముత్తుమారి రాత్రి సమయంలో బైక్లో వస్తున్న సమయంలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు నాటకమాడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ప్రియుడు, మరో ఇద్దరు హంతకుల కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణరాజు, పులికుడి డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన యువతి.. మాటలు కలిపి.. -
పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు..
సాక్షి, బళ్లారి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం తీరని విషాదాంతమైంది. పెద్దల మందలిపుతో విరక్తి చెంది ఇద్దరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. బెంగళూరులో నివాసం ఉంటున్న చరణ్ (23), అక్కడే వివాహిత అయిన నాగరత్నతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. ఈ విషయం నాగరత్న భర్త ప్రసన్నకుమార్కు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయినా వారు తమ గాఢప్రేమను కొనసాగించారు. ఇద్దరూ కలిసి చనిపోదామనుకుని నిర్ణయించుకుని నాలుగు రోజుల క్రితం పల్సర్ బైక్ తీసుకుని ఇళ్లు వదిలి పారిపోయి వచ్చారు. చరణ్ తన స్నేహితునికి ఫోన్ చేసి తాము దావణగెరె జిల్లా బెంకికెరె గ్రామ సమీపంలోని చెరువులో దూకి చనిపోతున్నామని చెప్పాడు. ఈ ఘటనపై చెన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చెరువులో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. చదవండి: (బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..?) -
భద్రాద్రిలో దారుణం: ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. గర్భవతి అయ్యాక..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిని ట్రాప్ చేశాడు. అతడి మాటలు నమ్మిన సదరు యువతి.. శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. అతడి వల్ల చివరకు ప్రాణాలు విడిచింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నందు ట్రాప్ చేశాడు. ప్రేమ పేరిట ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి కావడంతో అబార్షన్ కావడానికి మాత్రలు ఇచ్చాడు. కానీ, ఆమెకు అబార్షన్ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధితురాలు, నందు, మరో మహిళ కలిసి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తన భార్యకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్ చేశాడు. కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో, నందుతోపాటు ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో బాధితురాలు మృతిచెందింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తన బిడ్డను నందు బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే.. -
చనిపోయి నాలుగు నెలలు దాటింది.. ఇంకెన్నాళ్లు ఈ కథలు!
ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్ థాయిలాండ్లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్కు ప్లేబాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్.. వార్న్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఎఫైర్ అని పేర్కొంది. ''వార్న్ థాయిలాండ్లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఆ ఎఫైర్ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది. అలా అతనితో డేటింగ్ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్ తెలిపింది. కాగా గినా స్టివార్ట్ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్ తనను తాను ''వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఇక 2018లో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా వార్న్ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది. ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది. ఇక క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్ వార్న్ తన లెగ్స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. OnlyFans star Gina Stewart has made a startling revelation about the late great Shane Warne, five months after his tragic death > https://t.co/qc6mpq2Wty pic.twitter.com/Wzbg06oiw2 — Herald Sun (@theheraldsun) August 16, 2022 చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్మ్యాన్ Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు.. -
సివిల్స్ కోచింగ్ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఉన్నత లక్ష్యంతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య(22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్కు వెళుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత స్నేహితులుగా వ్యవహరించిన వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. వివిధ అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది. ‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్ చేసి రూ.లక్ష కావాలని కోరింది. అయితే అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చారు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల వద్ద అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది. బుధవారం ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో పాటు తనకు వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్లో రాసి సూసైడ్ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్ సందేశం పంపించింది. ‘కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య) మిస్సింగ్ కేసుతో వెలుగులోకి.. దివ్య రాసిన సూసైడ్ నోట్తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గురువారం రాత్రి సాగరతీరంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులు ఊహించినట్లుగానే దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. అయితే తొలి నుంచి వెంకటేశ్వరరెడ్డికి జల్సాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసిగిపోవడంతో పాటు అతని అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితంలో ఒకటికాలేక.. మరణంతో ఒక్కటయ్యారు!
సాక్షి, చెన్నై: మేనమామ ఇంటికి కోడలిగా వెళ్లాలన్న ఓ యువతి ఆశలు అడియాశలయ్యాయి. తాను ఎంతగానో ప్రేమించిన మేనమామ కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించక పోవడంతో ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన ఆర్ముగం , సరస్వతి దంపతులకు సుధా(22), ఉదయ శంకర్(20) అనే పిల్లలు ఉన్నారు. సుధా ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తన మేనమామ పెరియస్వామి కుమారుడు సుబయ్య(24)ను ప్రేమించింది. సుబయ్య కూడా సుధను ఇష్టపడ్డాడు. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అయితే వీరి ప్రేమకు కుటుంబ సభ్యులే అడ్డంకిగా మారారు. చదువుకునే వయస్సులో ప్రేమ వద్దంటూ వారించారు. దీంతో మనస్థాపం చెందిన సుబ్బయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి సమయంలో మరణించాడు. ఈ సమాచారంతో సుధా తల్లడిల్లి పోయింది. జీవితంలో ఒకటి కాకున్నా, మరణంలోనైనా ఒక్కటి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. గురువారం ఓ వైపు సుబయ్య మృతదేహానికి అంత్యక్రియలు జరగగా, మరో వైపు ఇంట్లో ఉరివేసుకుని సుధా ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన సుధా తల్లిదండ్రులు కుమార్తె మృత దేహాన్ని చూసి రోదించారు. ప్రేమను పక్కన పెట్టి చదువుకోవాలని సూచించినందుకు బలవన్మరణానికి పాల్పడి తమకు కడుపు కోత మిగిల్చారని వాపోయారు. చదవండి: (ప్రేమ జంట ఆత్మహత్య) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అప్పటికే రెండు పెళ్లిలు.. మరో మహిళతో ఎఫైర్.. లవర్ కోసం ఆమె..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. క్షణ కాలం సుఖాల కోసం కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఓ ప్రియుడి కోసం ప్రియురాలు.. ఎవరూ చేయని పనిచేసింది. తన లవర్ రెండో భార్యను హత్య చేసి కటకటాల్లోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దేవాస్ జిల్లాకు చెందిన బబ్లూకి 14 సంవత్సరాల కిందటే నీలం అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, బబ్లూ.. తన మొదటి భార్యకు తెలియకుండా ఈ ఏడాది మే నెలలో రాణి అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన నీలం.. అతడిని నిలదీసింది. పెళ్లి విషయం తెలిసి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఓ రోజు బంగారం కొనేందుకు బబ్లూ.. జ్యుయలరీ షాపునకు వెళ్లాడు. ఈ క్రమంలో రీతూ గౌర్తో పరిచయం ఏర్పడింది. అయితే, రీతూ గౌర్కు వివాహమై ఓ పాప కూడా ఉంది. ఇక, వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధాన్ని దారి తీసింది. ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెళ్లేవాడు. కాగా, ఓరోజు తన రెండో భార్యతో ఉన్న సమస్యలను రీతూకు చెప్పాడు. తన పోరు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. లవర్ ఆవేదనను అర్థం చేసుకున్న రీత్.. తనను ఓదార్చింది. అనంతరం, ఇద్దరూ కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. రీత్.. రాణిని చంపేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది. మరో మహిళతో కలిసి జాకెట్ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లి.. గొంతు నులిమి హత్య చేసింది. ప్లాన్లో భాగంగా బబ్లూ ఏమైందో తెలియనట్టు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం, పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులు.. బబ్లూను గట్టిగా ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో, ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: క్లబ్లో యువతులతో అనుచిత ప్రవర్తన.. తాకరాని చోట టచ్ చేసి.. -
బాలీవుడ్ హీరోయిన్కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్
ప్రేమకు ఎవరు అతీతులు కారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఏదో ఒక దశలో ప్రేమలో మునిగి తేలిన వాళ్లే. క్రికెటర్లు అందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్తో క్రికెటర్లు నడిపిన ఎఫైర్స్కు లెక్కే లేదు. కొన్ని పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోతే.. మరికొన్ని ప్రేమలు మాత్రం సక్సెకు దారి తీసి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. షర్మిలా ఠాగూర్- మన్సూర్ అలీఖాన్ పటౌడీ, విరాట్ కోహ్లి- అనుష్క శర్మ, హర్భజన్ సింగ్-గీతా బస్రా, యువరాజ్ సింగ్- హాజెల్కీచ్, రవిశాస్త్రి- అమృతాసింగ్, మమ్మద్ అజారుద్దీన్-సంగీతా బిజలాని ఈ కోవకు చెందిన వారే. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కల్పిత కథలు అల్లి క్రికెటర్లతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా చెప్పుకుంటారు. కొన్నిసార్లు అవి కలిసొచ్చినా.. కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. తమ పేరు, ప్రఖ్యాతలు పెంచుకోవడానికే ఇలాంటివి చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా- టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం ఇదే అంశాన్ని గుర్తుచేస్తుంది. గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్ పంత్ ఎయిర్ పోర్ట్లో 16 గంటల పాటు ఎదురుచూశాడంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న ఊర్వశి రౌతేలా పంత్తో ప్రేమ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేసింది. తనను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడని.. నేనంటే పడి చచ్చిపోతున్నాడంటూ.. నన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాడని... అతని పేరు చెప్పను గానీ షార్ట్ఫామ్లో మాత్రం ''ఆర్పీ(RP)'' అని పేర్కొంది. దీంతో ఊర్వశి మరోసారి రిషబ్ పంత్ పేరు ప్రస్తావించిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొన్నారు. ''ఆర్పీ'' అంటే కచ్చితంగా రిషబ్ పంత్ అయి ఉంటాడని చెవులు కొరుక్కున్నారు. దీనికి ఊతమిస్తూ.. ''గతంలో నేను వారణాసిలో షూటింగ్ ముగించుకొని ఒక షో కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ దాదాపు 10 గంటల పాటు షూటింగ్ జరిగింది. దీంతో చాలా అలిసిపోయి ఇంటికెళ్లాను. అప్పటికే మిస్టర్ ఆర్పీ(RP) మా ఇంటికొచ్చి నాకోసం లాబీలో వెయిట్ చేస్తున్నాడని తెలిసింది. దీంతో అతని కోసం రెడీ అవ్వాలనుకున్నా. కానీ రోజంతా పని చేయడంతో బాగా అలిసిపోయిన నాకు వెంటనే నిద్ర పట్టేసింది. ఈ సమయంలో నా ఫోన్కు చాలా కాల్స్ వచ్చాయి. కానీ ఫోన్ లేపలేకపోయా. లేచి చూస్తే దాదాపు 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి'' అంటూ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది. ఊర్వశి రౌతేలా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తనపై వస్తున్న తప్పుడు వార్తలపై స్వయంగా రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. తన ఇన్స్టాగ్రామ్లో పోస్టును షేర్ చేస్తూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ''ఇంటర్య్వూల్లో కొంతమంది తమ పేరు, ప్రఖ్యాతల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతుంటారు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. దేవుడు వారిపై కాస్త కరుణ చూపించాలి.. #merapichachorhoBehen #jhutkibhilimithotihai.. ప్లీజ్ అక్క.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అబద్దాలు ఆడడానికైనా ఒక లిమిట్ ఉంటుంది'' అంటూ కాప్షన్ జత చేశాడు. మరి పంత్ చేసిన వ్యాఖ్యలపై ఊర్వశి రౌతేలా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022 చదవండి: హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్ చేసిన రిషబ్ పంత్ ! నలుగురు పిల్లలున్న ఆ సింగర్ పెళ్లికి ప్రపోజ్ చేశాడు: హీరోయిన్ -
'లవర్ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్బాలర్పై ఆరోపణలు
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఫుట్బాలర్.. వేల్స్ ఫుట్బాల్ మేనేజర్ రియాన్ గిగ్స్ చిక్కుల్లో పడ్డాడు. మాజీ గర్ల్ఫ్రెండ్ కేట్ గ్రీవెల్లిని నగ్నంగా హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేట్ కోర్టుమెట్లను ఆశ్రయించడంతో ప్రస్తుతం రియాన్ గిగ్స్ యునైటెడ్ కింగ్డమ్ కోర్టులో ట్రయల్లో ఉన్నాడు. విషయంలోకి వెళితే.. వేల్స్ ఫుట్బాల్ మేనేజర్.. రియాన్ గిగ్స్ కేట్ గ్రీవెల్లిని ఇష్టపడ్డాడు. మొదట్లో అతని ప్రవర్తన నచ్చి ఆమె అతన్ని ఇష్టపడింది. ఆ తర్వాత రియాన్ కేట్పై వేధింపులకు దిగేవాడు. దాదాపు మూడేళ్లుగా ఆమెను శారీరకంగా వేధించడమే గాక ఆమె ఫోన్కు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ప్రతీరోజు సెక్స్ చేయాలని.. లేకుంటే తనతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. గతంలో చాలాసార్లు కేట్తో గొడవపడి కొట్టిన సందర్బాలు ఉన్నాయి. దీంతో కేట్ గ్రీవెల్లి రియాన్ గిగ్స్తో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రియాన్ గిగ్స్.. కేట్కు ఫోన్ చేసి హోటల్కు ఆహ్వానించాడు. అయితే కేట్ తన సోదరి ఎమ్మాతో కలిసి హోటల్కు వచ్చింది. ఆమె వచ్చే సమయానికి గిగ్స్ మరొక మహిళతో రిలేషిన్షిప్లో ఉన్నాడు. ఇది చూసిన కేట్స్కు విపరీతంగా కోపమొచ్చింది. వెంటనే లోపలికి వెళ్లిన కేట్స్.. మాట్లాడుకుందామని పిలిచి ఏం చేస్తున్నావు ? అంటూ నిలదీసింది. అయినా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.. మనిద్దరం విడిపోవడమే బెటర్ అని తన వెంట తెచ్చుకున్న సూట్కేసు తీసుకొని బయలుదేరుతుండగా.. గిగ్స్ కోపంతో ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కేట్స్ తలను గట్టిగా నేలకేసి కొట్టాడు గిగ్స్. ఈ క్రమంలో ఆమె పెదవులు చిట్లి నోటి నుంచి రక్తం వచ్చింది. అనంతరం ఆమెను వివస్త్రను చేసి హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడు. అడ్డువచ్చిన కేట్స్ చెల్లి ఎమ్మాను కూడా కొట్టి బయటకు తోశాడు. కేట్ సోదరి ఎమ్మా సమాచారంతో గిగ్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఆదివారం(ఆగస్టు7న) కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా వాదనలు విన్న కోర్టు గిగ్స్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గిగ్స్ ట్రయల్పై రిమాండ్లో ఉన్నాడు. చదవండి: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్రౌండర్.. ఫొటోలు వైరల్ -
ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం
నల్లగొండ క్రైం: తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రేమోన్మాది విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుదామని పిలిచి అందరూ చూస్తుండగానే కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. దగ్గరలోనే ఉన్న యువతి స్నేహితులు అది చూసి గట్టిగా అరవడంతో పారిపోయాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. స్నేహితులను కలిసేందుకు వెళ్లగా.. నల్లగొండ పట్టణ శివార్లలోని పానగల్కు చెందిన గుండెబోయిన నవ్య ఇక్కడి ఎన్జీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన మీసాల రోహిత్ కూడా ఇదే కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కొంతకాలం నుంచి తనను ప్రేమించాలంటూ నవ్య వెంట పడుతున్నాడు. ఆమె తిరస్కరించడంతో కోపం పెంచుకున్నాడు. మంగళవారం కాలేజీకి సెలవు ఉండటంతో నవ్య తన స్నేహితురాలు శ్రేష్ఠతో కలిసి మరో స్నేహితుడు తాయిని కలిసేందుకు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ బైక్పై అక్కడికి చేరుకున్నాడు. ఒకసారి మాట్లాడాలని నవ్యను దగ్గరికి పిలిచాడు. ఆమె దగ్గరికి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నవ్య గొంతు, పొట్ట, పెదవులు, చెయ్యి మణికట్టు, కాలుపై తీవ్ర గాయాలయ్యా యి. నవ్య స్పృహ తప్పింది. అప్పటికే స్నేహితులు తాయి, శ్రేష్ఠ గట్టిగా అరవడంతో.. రోహిత్ బైక్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందిన వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన నవ్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. చంపుతానని ఇంతకుముందే బెదిరింపు తనను ప్రేమించకుంటే చంపేస్తానంటూ రోహిత్ గత నెల 27న నవ్య గొంతుపై పగిలిన బీరు సీసా పెట్టి బెదిరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాధితురాలి తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఐ రౌతు గోపి తెలిపారు. దాడి ఘటనపై ఎస్పీ రెమా రాజేశ్వరి ఆరా తీశారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి ఫోన్ కాల్ డేటా ఆధారంగా రోహిత్ను అదుపులోకి తీసుకున్నారు. -
విడాకులు తీసుకుని ఒంటరి జీవితం.. అతడితో క్లోజ్గా ఉంటూ..
తిరువళ్లూరు: ఓ మహిళను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు తాలుకా వలర్పురం గ్రామానికి చెందిన కార్తికేయన్ (45) దుబాయ్లోని ప్రింటింగ్ ప్రెస్లో తనతో పాటు పని చేసే శ్రీలంకకు చెందిన రోహిణివసంతి(41)ని 2005లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం తరువాత తమ సొంత గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే రోహిణి పలువురు పురుషులతో సన్నిహితంగా మెలుగుతుండడంతో పాటు ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2017 నుంచి నెలకు రూ.50 వేలు పిల్లల పోషణ కోసం కార్తికేయన్ చెల్లిస్తున్నాడు. కాగా, తిరువళ్లూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆమె టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో టైలర్షాపులోనే ఆమెను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇన్స్పెక్టర్ పద్మశ్రీబబ్బి రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. విచారణలో ఈమె కమలకన్నన్తో సహజీవనం చేస్తూనే, మరో కొంతమందితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలింది. అక్రమ సంబంధాలే హత్యాయత్నానికి కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల క్రితమే భర్త మృతి.. అతడితో పరిచయం కాస్తా.. -
టీచర్ సులోచన కేసులో వీడిన మిస్టరీ.. గాయత్రి భర్తే కారణం!
మైసూరు: సుమారు 6 నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో జరిగిన వసతి పాఠశాల ఉపాధ్యాయురాలు సులోచన (45) హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. నంజనగూడు నగరసభ సభ్యురాలితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మొరార్జి దేశాయి వసతి పాఠశాల హిందీ టీచర్ సులోచన మార్చి నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది. అప్పటి నుంచి హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నగరసభ సభ్యురాలు గాయత్రి మురుగేశ్, ఆమె బంధువు భాగ్య, నాగమ్మ, కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడైంది. తన భర్తతో సన్నిహితంగా ఉందని.. సులోచన భర్త నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఇక గాయత్రి భర్త మురుగేష్ శ్రీకంఠేశ్వర దేవాలయంలో డి గ్రూప్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇతనికి, టీచర్కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఉండడం అనేకసార్లు గాయత్రి గమనించి కసితో రగిలిపోయింది. తన భర్తను కలవవద్దని గాయత్రి టీచరమ్మను హెచ్చరించినప్పటికీ తీరు మారలేదు. దీంతో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది. నంజనగూడులోనే అద్దె ఇంట్లో సులోచన ఉండేది. మరో ముగ్గురి సహకారంతో సులోచన ఇంటికి వెళ్లి ఆమెను గొంతు పిసికి చంపి హత్య చేసినట్లు గాయత్రి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనకు ఒక పెళ్లయిన కూతురు, బెంగళూరులో ఉద్యోగం చేసే కొడుకు ఉన్నారు. ఇది కూడా చదవండి: అర్పిత 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ! -
ప్రియురాలు ఎంత పని చేసింది.. లవర్స్ ఇలా కూడా ఉంటారా!
యశవంతపుర: ప్రేమికులంటే తిరగటం కామన్, జల్సాలు చేయడానికి ప్రియుడి వద్ద డబ్బులు లేక పోవటంతో ప్రియురాలు చోరీలు చేయించిన ఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బెంగళూరుకు చెందిన దీక్షితా, మధులు ప్రేమించుకున్నారు. అయితే, మెడిసిన్ చదువుతున్న మధు వద్ద డబ్బులు లేక పోవటంతో దీక్షిత ఒక ప్లాన్ చెప్పింది. బెంగళూరు ఉత్తర తాలూకా నెలగదిరినహళ్లి గ్రామంలోని తన పెద్దప్ప తిమ్మేగౌడ ఇంటిలో చోరీ చేయాలని చెప్పింది. అదే ఇంటిలో మధు అద్దెకు ఉంటున్నాడు. దీంతో మధు తిమ్మేగౌడ ఇంటిలో రూ. 90 వేల నగదు, 200 గ్రాముల బంగారు చోరీ చేశాడు. చోరీ విషయం గుర్తించిన తిమ్మేగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి మధును విచారించగా అసలు విషయం వెల్లడించాడు. ప్రేమికురాలి పథకంతోనే చోరీ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాదీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం.. -
మేనత్త కూతురిని ఇష్టపడ్డాడు.. నో చెప్పడంతో అర్ధరాత్రి కీర్తనను..
సాక్షి, చెన్నై: మేనత్త కూతురిపై మనస్సు పడ్డ ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. తనతో మాట్లాడటం లేదనే ఆగ్రహంతో ఆ యువతిని నరికి చంపేశాడు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని తిరుబువనం సన్యాసి కుప్పానికి చెందిన నాగరాజ్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మయిల్ మరణించడంతో అంబికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు, ఇందులో కీర్తన(19) మూడో కుమార్తె. ఈమె డిగ్రీ చదువుతోంది. కీర్తనపై మయిల్ అన్న కుమారుడు ముఖేష్ మనస్సు పడ్డాడు. అయితే ముఖేష్కు మద్యం అలవాటు ఉండడంతో అతడి ప్రేమను కీర్తన తిరస్కరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో కీర్తనను ముఖేష్ అడ్డుకున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె తల వెంట్రుకల్ని కత్తరించేశాడు. తర్వాత ఉడాయించాడు. ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి.. సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై 18 చోట్ల కత్తిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం, పరారీలో ఉన్న ముఖేష్ కోసం గాలిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఎస్పీ జిత్తన్ కోదండరామన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది. ఇది కూడా చదవండి: ఆయన నా భర్తే.. రచ్చకెక్కిన నవ్య శ్రీ ఉదంతం.. ఫొటోలు వైరల్ -
నెల రోజుల క్రితమే పెళ్లి.. ఫ్యామిలీకి షాకిచ్చిన నవ వధువు
యశవంతపుర: తమ ప్రేమను పెద్దలు భగ్నం చేశారని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట ఆస్పత్రిలో కన్నుమూసింది. ఉత్తర కన్నడ జిల్లా హళియాళలో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. హళియాళకు చెందిన జ్యోతి అంత్రోళకర (19), రికేశ్ సురేష్ మిరాశి (20)లు హళియాళ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీలో పెరిగిన పరిచయంతో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కాగా, నెల రోజుల కిందట తల్లిదండ్రులు జ్యోతికి మరో యువకునితో వివాహం చేశారు. అయితే, పెళ్లి అయిన్పటికీ ప్రియుడిని జ్యోతి మరిచిపోలేదు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ప్రేమికులు.. తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15వ తేదీన ముండగోడు రోడ్డులో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడి మంగళవారం మరణించారు. ఈ మేరకు హళియాళ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై..
భర్తకు దూరంగా ఉంటూ ఆమె(33) జీవనం సాగిస్తోంది. ఇంతలో ఆమెకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిచయమయ్యాడు. తనను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహాజీవనం సాగించాడు.ఈ క్రమంలో ఆమెకు శారీరకంగా దగ్గరై.. 14 సార్లు గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం ఎత్తాక.. 14 సార్లు అబార్షన్ చేయించాడు. ఇలా నమ్మిస్తూ మోసం చేయడంతో తీవ్ర మసస్థాపానికి గురైన బాధితురాలు చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జత్పూర్ ప్రాంతంలో ఓ మహిళ(33) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె డెడ్ బాడీ పక్కనే సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సూసైడ్ నోట్లో.. తనను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. కొన్నేళ్లుగా తనతో సహజీవనం కొనసాగించాడని పేర్కొంది. ఈ క్రమంలో శారీరకంగా దగ్గర అవడంతో 14 సార్లు తనకు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిలదీయంతో.. అతను పెళ్లికి నిరాకరించడంతో వేరే దారిలేక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. అయితే, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. ఆమెకు తన భర్త నుంచి విడిపోయే 8 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోందని తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆమె పేరెంట్స్ బీహార్లోని ముజఫర్పూర్లో నివాసముంటున్నారని అన్నారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. ఇక, ఈ ఘటనలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ట్యాక్సీ డ్రైవర్తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. -
సహోద్యోగినిపై కన్నేశాడు.. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని..
దేశంలో ప్రతీరోజు ఏదో ఒకచోట మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పనిచేస్తున్న చోట చూడా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువతిపై కదలుతున్న కారులో లైంగికయత్నం జరిగింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు బాధితురాలు కారులోని బయటకు దూకింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని ఓ హెటల్లో యువతి(21) పనిచేస్తోంది. ఈ క్రమంలో హోటల్లో పని చేసే ఓ వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన బంధువు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేస్తోందని.. తనకు సాయం చేయమని కోరాడు. ఇందుకు బాధితురాలు సరేనని చెప్పింది. అయితే, మంగళవారం హోటల్లో పనులు ముగించుకుని బాధితురాలు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమెను కారులో డ్రాప్ చేస్తానని కారు ఎక్కమని కోరాడు. అతడి మాటలు నమ్మిన ఆమె కారు ఎక్కింది. అనంతరం కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఖంగుతింది. బాధితురాలు కారు ఆపాలని కోరినా ఆపకపోవడంతో జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద ఎస్యూవీ కారు నుంచి ఆమె కిందకు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను వెంటనే మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు.. బాధితురాల వద్దకి వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నామని, కారును సీజ్ చేసినట్టు ఏఎస్సీ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే.. -
క్షమించండి నాన్నా...
కర్నూలు : ‘‘నాన్నా.. నాకు బతకాలని లేదు. మీకు తెలుసు నేను ఓ యువతిని ప్రేమించిన విషయం. ఆమె ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాను. కానీ ఆమె ఇప్పుడు లేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలియదు. నా ప్రేయసి ఎక్కడ ఉన్నా బాగుంటుందని ఇన్నాళ్లూ బతికాను. ఆమె బలవన్మరణం చెందిన విషయం తెలిసింది. ఇక నేను బతకను. సారీ నాన్నా’’ అంటూ సూసైడ్ నోట్ రాసి మంగలి శివప్రసాద్ (22) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బి.అగ్రహారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.అగ్రహారం గ్రామానికి చెందిన మంగలి రామచంద్ర, వసుంధర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రసాద్ కోడుమూరు పట్టణంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కోడుమూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అదే కళాశాలలో డిగ్రీ చదువుతోంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, వేరే చోటుకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గత ఏడాది కొంతకాలం వేరే చోటుకు వెళ్లిపోయారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికీ తెలియడంతో వారిని వెతికి పట్టుకుని తీసుకువచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ చేశారు. వీరికి మైనార్టీ తీరలేదు కాబట్టి కొంతకాలం దూరం పెట్టి మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు మాట్లాడుకొని, ప్రేమికులను ఎవరి ఇంటికి వారిని పంపించారు. అయితే వీరిద్దరూ దూరంగా ఉన్నా వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ యువతి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం శివప్రసాద్కు ఆ విషయం తెలిసింది. తను ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు తను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులకు వెళ్లిన అమ్మ తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్కు వేలాడుతున్న కుమారుడిని చూసి గుండెలు బాదుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్కిషోర్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తండ్రి కాబోతున్న పుతిన్.. సీక్రెట్ లవర్ ఎవరంటే..?
ఉక్రెయిన్లో రష్యా దాడుల కారణంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అప్పటికే పుతిన్.. ప్రపంచ శక్తివంతమైన నేతల్లో ఒకరుగా ఉన్నారు. కాగా, పుతిన్ కుటుంబం గురించి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. ఇక, ఉక్రెయిన్లో యుద్దం అనంతరం.. పుతిన్ వ్యక్తిగత విషయాలపై వరల్డ్వైడ్ చర్చ నడిచింది. ఇందులో భాగంగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా పుతిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 69 ఏళ్ల పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నారు.. ఆయనకు కుమార్తె పుట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. ఆమె గర్భం దాల్చిందని.. త్వరలో ఆమె.. మరోబిడ్డకు జన్మనివ్వబోతోందని జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానెల్ పేర్కొంది. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో.. ఆమెకు ఆడపిల్లగా తేలినట్లు వెల్లడించింది. అయితే, దీనిపై పుతిన్ మాత్రం.. సంతోషంగా లేరని టెలిగ్రాం ఛానెల్ చేసిన పోస్టుపై పుతిన్ అసహనం వ్యక్తం చేసినట్లు ది సన్ ఓ కథనంలో పేర్కొంది. ఇక, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రిథమిక్ జిమ్నాస్ట్ అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. 2015లో కబయెవాకు కుమారుడు జన్మించగా.. 2019లో మాస్కోలో రెండో కుమారుడు జన్మించాడని స్విస్ బ్రాడ్ షీట్ వార్తా సంస్థ ఓ కథనంలో రాసుకొచ్చింది. కాగా, వారి సంబంధం గురించి పుతిన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రతపడ్డారని పలు వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్ కొద్ది సంవత్సరాలు దాచిపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్లో రష్యా దాడుల నేపథ్యంలో కబయెవాను సైబీరియన్ అండర్ గ్రౌండ్ సిటీ బంకర్లో రహస్యంగా ఉంచినట్లు రష్యా మీడియా పలు కథనాల్లో పేర్కొంది. చివరిసారిగా కబయెవా.. గత నెలలో బ్లాక్ సీ రిసార్ట్ వద్ద రిథమిక్ జిమ్నాస్టిక్స్ శిక్షణా శిబిరంలో కనిపించడంతో వార్తల్లో నిలిచారు. ఇక, తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనివ్వనుండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. Vladimir Putin is 'expecting a daughter' with ex-gymnast 'lover' Alina Kabaeva despite the Russian President claiming he 'has enough children as it is', new report claims https://t.co/ntzOIcxJ63 — Merissa Hansen 🇺🇸 (@MerissaHansen17) July 10, 2022 ఇది కూడా చదవండి: రెస్టారెంట్పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్ -
రేపు నా పెళ్లి అంటూ లవర్కు ఫోన్.. ఆ తర్వాత సూపర్ ట్విస్ట్
వారిద్దరూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంతలో ప్రియురాలి ఫ్యామిలీ ఆమెకు మరోకరితో పెళ్లి నిశ్చయించారు. దీంతో, లవర్ను ఆమె తన పెళ్లికి రావాలని కోరింది. ఈ క్రమంలో పెళ్లి మండపానికి వచ్చి లవర్ చేసిన పనికి అతిథులంతా షాకయ్యారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నలందలోని ముబారక్పూర్ గ్రామానికి చెందిన ముఖేశ్, వధువు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెకు మరొకరితో పెళ్లికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన ప్రియుడికి ఆమె ఈ విషయం చెప్పింది. తన పెళ్లికి రావాలని.. అక్కడ ఏం చేయాలో వారిద్దరూ ముందే ప్లాన్ చేసుకున్నారు. కాగా, మంగళవారం వివాహం జరగుతుండగా ముఖేశ్ పెళ్లికి వచ్చాడు. వధువరూలు దండలు మార్చుకుంటుండగా వేదికపై వచ్చి.. వధువు మెడలో దండ వేసి బొట్టు పెట్టాడు. అనంతరం ఆమెను కౌగిలించుకున్నాడు. ఈ సందర్భంగా తాము ప్రేమించుకుంటున్నామని అన్నాడు. మా విషయం వారి ఇంట్లో తెలియడం వల్ల పెళ్లి నిశ్చయించారు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరిందని తెలిపాడు. అందుకే పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. కాగా, వధువు కుటుంబ సభ్యులు మాత్రం.. ముఖేశ్ చెప్పేవన్నీ అబద్ధం అంటూ కొట్టిపారేశారు. మరోవైపు.. పెళ్లి మండపంలో ఇంత జరుగుతున్నా.. వరుడు మాత్రం సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. అనంతరం.. పెళ్లి చేసుకోకుండానే మండపం నుంచి వెళ్లిపోయాడు. అయితే, ముఖేశ్ ఇలా చేసిన తర్వాత.. వధువు కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. వారి దాడిలో ముఖేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై వధువు పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో తిరస్కరించాడు. మూడేళ్ల క్రితం విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువకునికి పరిచయమై ప్రేమ ఏర్పడింది. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది. ప్రియుడు అబార్షన్ చేయించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి విజయనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గణేశ్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక నెల జైలు వాసం తర్వాత బెయిల్పై వచ్చిన నిందితుడు యువతికి మళ్లీ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. యువతి తిరిగి గర్భం దాల్చగా ఈసారైనా పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో అతడు కోపంతో ఆమె కడుపు మీద తన్నడంతో గర్భస్రావం కూడా జరిగింది. గణేశ్తో తనకు పెళ్లి చేయకపోతే బతకనని యువతి చెబుతోంది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఆ ఇంట్లో అద్దెకు దిగడమే వారి పాలిట శాపం) -
రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో మూడో భర్తతో పరారైంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తేని జిల్లా కూడలూరుకు చెందిన విజయ్బోస్ (32) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. విద్య (30) ను 2014లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగ నిమిత్తం భర్త మరో ఊరిలో ఉండేవాడు. కుమారుడి ఆలనాపాలన చూడకుండా విద్య అధిక సమయం సెల్ఫోన్లో గడుపుతుండేది. ఈ క్రమంలో కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విజయ్బోస్ ఇంటికి వచ్చి భార్యను మందలించాడు. మాట వినకపోవడంతో భార్య తరఫు బంధువులకు ఫిర్యాదు చేయగా విద్యకు గతంలో పెళ్లయినట్లు, విజయ్బోస్ రెండోభర్త అనే విషయం బయటపడింది. దీంతో, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కుమారుడిని భర్త వద్దే వదిలేసి విద్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎలాగోలా నచ్చజెప్పి భార్యను కాపురానికి తీసుకురావాలని విజయ్బోస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడా ది మేలో మురళి అనే వ్యక్తిని విద్య మూడో వివాహం చేసుకుంది. ఈ పరిణామంతో మరింత ఖంగుతిన్న విజయ్బోస్ తన అత్తింటివారిని నిలదీయగా, వరకట్న వేధింపుల కేసు పెడతాం అని బెదిరించారు. మహిళా పోలీస్ స్టేషన్లో విజయ్బోస్ ఫిర్యాదు చేయడంతో విద్య, ఆమె తండ్రి సుకుమారన్, తల్లి చిత్ర, తమ్ముడు శరణ్కుమార్, తాజా భర్త మురళి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. అతడితో జల్సాలు.. చివరకు..
మైసూర్: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారునపడేస్తున్నాయి. క్షణికావేశాల కారణంగా వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలున్న వ్యక్తి.. వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా ప్రాణాలను తీసింది. ఈ ఘటన కర్నాటకలో చేసుకుంది. వివరాల ప్రకారం.. మైసూర్కు చెందిన టి. నరసీపుర తాలూకాలోని తలకాడుకు చెందిన సుమిత్ర(26)కు రవిశంకర్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాగా, కుటుంబ కలహాల వల్ల సుమ్రిత.. తన భర్తకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మైసూర్కు చెందిన సిద్దిరాజుతో సుమిత్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి సంబంధం విషయం సిద్దిరాజు భార్యకు తెలియడంతో ఆమె.. భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంతో పంచాయితీ పెట్టించింది. అనంతరం.. విడాకులు ఇస్తానని బెదిరించింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా సిద్దరాజు.. సుమిత్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. సీక్రెట్గా సుమిత్రను కలుస్తూ.. వారిద్దరూ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో విహారయాత్రలకు వెళ్లి జల్సా చేశారు. ఇంతలో తలకాడు కావేరి నది సమీపంలోని నిసర్గధామా ప్రాంతంలో సుమిత్రా శవమై కనిపించింది. సుమిత్రా శవం పక్కనే ప్రియుడు సిద్దరాజు కూడా ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. అయితే, సిద్దరాజు చనిపోయే ముందు.. అతని స్నేహితుడికి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించాడు. మెసేజ్లో సుమిత్రా చనిపోయింది.. ఆమె లేని జీవితం నాకు వద్దు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు.. ఫొటోలు వైరల్
భువనేశ్వర్: ప్రేమ ముసుగులో వంచించాడని జగత్సింఘ్పూర్ జిల్లా తిర్తోల్ ఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు విజయశంకర దాస్కు వ్యతిరేకంగా సంచలనాత్మక ఆరోపణలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ప్రియురాలిగా పేర్కొని సోమాలిక దాస్(29) అనే యువతి జగత్సింఘ్పూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇక, ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే విజయశంకర దాస్, సోమాలిక ఇరువురి అంగీకారం మేరకు రిజిస్టర్ వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జగత్సింగ్పూర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో అనుబంధ దస్తావేజులతో వివాహం కోసం ఈ ఏడాది మే 17న దరఖాస్తు దాఖలు చేశారు. ఈనెల 17తో నెల రోజులు పూర్తి కావడంతో సోమాలిక రిజిస్టార్ ఆఫీసుకు సకాలంలో హాజరైంది. అక్కడ 3 గంటలకు పైగా ప్రియుడి కోసం నిరీక్షించింది. ఫోన్ చేసినా స్పందించక పోవడంతో నిరుత్సాహపడింది. ఎమ్మెల్యే వైఖరితో ఒక్కసారిగి షాకైంది. పూర్తి అంగీకారంతో వివాహం రిజిస్ట్రేషన్ ఖరారు చేసుకున్న సమయానికి హాజరు కాకపోవడం వెనక అపహరణ లేదా వంచన ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తాజాగా ఆదివారం మరో ఆరోపణను తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యే మరో ఐదుగురితో కలిసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపించింది. దివ్యశంకర దాస్కు వ్యతిరేకంగా పోలీసులు కఠిన చర్యలు చేపడతారని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రియుడితో చనువుగా కలిసి మెలిసి తిరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తొందరపాటు చర్య.. ఇదంతా తొందరపాటు చర్యగా ఎమ్మెల్యే దివ్యశంకర దాస్ కొట్టేశారు. ప్రకటించిన మేరకు సోమాలికను వివాహమాడతానని ఆదివారం మరోసారి బహిరంగంగా ప్రకటించారు. రిజిస్టర్ వివాహం దరఖాస్తు దాఖలు నుంచి 90 రోజుల గడువు లోగా పెళ్లి చేసుకునేందుకు వీలవుతుందని గుర్తుచేశారు. ప్రస్తుతం 30 రోజులు మాత్రమే పూర్తయ్యిందని, మరో 60రోజులు గడువు ఉందన్నారు. ఈలోగా మంచి ముహూర్తంలో రిజిస్టర్ వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమాలిక తనకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రి వివరించానని పేర్కొన్నారు. మరోవైపు తన తల్లి ఆరోగ్యం కూడ బాగోలేనందున వేచి చూస్తున్నట్లు వివరించారు. One Somalika Dash, aged 29 years has lodged a complaint with Jagatsinghpur police against Tirtol MLA Bijay Shankar Das for having ditched her despite both having applied for marriage at the Registrar of Marriage office in Jagatsinghpur.#OmmcomNews https://t.co/AugL71z5Ms — Ommcom News (@OmmcomNews) June 18, 2022 -
నెల క్రితమే వివాహం.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య
వివాహామైన నెల రోజులకే నవ వధువు.. భర్తకు ఊహించని షాకిచ్చింది. ఆమె చేసిన పనికి వరుడి కుటుంబ సభ్యులు అందరి ముందు తలెత్తుకోలేకపోయారు. చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాజ్గంజ్కుచెందిన ఓ వ్యక్తి.. నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఇంతలో నవ వధువుకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమెను పరిశీలించిన వైద్యులు.. నవ వధువు నాలుగు నెలల గర్బవతి అని చెప్పారు. ఈ క్రమంలో వరుడితో సహా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం.. తనకు నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని.. మరి నాలుగు నెలల గర్భవతి ఎలా అయిందని భర్త.. ఆమెను నిలదీశాడు. ఇక చేసేదేమీ లేక.. పోలీసులకు ఆశ్రయించాడు. వధువు కుటుంబం తనను మోసం చేశారని భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రవీణ్తో ప్రేమ వివాహం.. ఇడ్లీ భాషాతో సహజీవనం.. చివరకు దారుణంగా. -
హైదరాబాద్లో ఇంజినీరింగ్లో ప్రేమ.. నెల్లూరుకు వచ్చి వెళ్తూ..
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట వంచించాడని ఆర్ఎస్ఐపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులుగా పోలీసు అధికారులు రహస్య విచారణ సాగిస్తున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జిల్లాలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతను ఇంజినీరింగ్ చదివే సమయంలో హైదరాబాద్కు చెందిన సహచర విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇంజినీరింగ్ పూర్తయిన అనంతరం ఉద్యోగ నిమిత్తం అతను హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు పోలీసుశాఖలో ఆర్ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. నెల్లూరులో విధులు నిర్వహిస్తూ ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. తరచూ ఆ యువతి నెల్లూరుకు వచ్చి వెళ్లేది. గత కొంతకాలంగా ఆమెను దూరంగా పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వారి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన యువతిపై చేయిచేసుకోవడంతో ఆమె డయల్ 100కు కాల్ చేసింది. దర్గామిట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సదరు అధికారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం విచారించగా ప్రేమ పేరిట వంచించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్గామిట్ట పోలీసులు రెండు రోజులుగా గోప్యంగా విచారణ సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సదరు అధికారి వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఆర్ఎస్ఐగా విధుల్లో చేరిన కొత్తలో ఓ యువతి ఇతని వ్యవహార శైలిపై అప్పటి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తీవ్రస్థాయిలో అతన్ని వారు మందలించారని సమాచారం. చదవండి: (డాక్టర్ నీలిమపై ఎందుకంత ప్రేమ?) -
భర్తతో విడిపోయి బతుకుతోంది.. లవ్ యూ అంటూ సహోద్యోగి వచ్చి..
సమాజంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా పెళ్లై, ముగ్గురు పిల్లలున్న ఓ మహిళలను ప్రేమిస్తున్నానని వెంటపడి చివరకు ఆమెపై యాసిడ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగళూర్లోని అగర్బత్తి కంపెనీలో బాధితురాలు(32), అహ్మాద్(36) కలిసి పనిచేస్తున్నారు. కాగా, బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉండగా.. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని జీవనం కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. కంపెనీ పనిచేస్తున్న క్రమంలో బాధితురాలితో అహ్మద్ మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వారిద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే, కొద్దిరోజుల నుంచి బాధితురాలితో తనను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని అహ్మాద్ అడిగాడు. దీనికి ఆమె నిరాకరించింది. తన పిల్లలతో జీవిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ అహ్మాద్ ఆమెపై ఒత్తిడి చేశాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో కక్షగట్టిన అహ్మాద్ శుక్రవారం.. ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆమె కంటికి తీవ్ర గాయం కాగా.. వెంటనే బాధితురాలని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు అహ్మాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: గర్ల్ఫ్రెండ్ను దారుణ హత్య చేసిన ఫుట్బాలర్ -
ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..
రామభద్రపురం : ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి మోహం చాటేశాడు. తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే, గోపాలకృష్ణ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘ సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో.. -
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే హత్య
ఖమ్మం అర్బన్: కాపురంలో విభేదాలతో ఆ భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు యువకుడితో పలుమార్లు గొడవ పడిన మహిళ భర్త.. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడాన్ని జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా కత్తితో యువకుడిని పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, హత్య చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం అల్లీపురానికి చెందిన సంపంగి వీరబాబుకు వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సదరు మహిళ ఖమ్మం శివారు గోపాలపురం సమీపాన ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నాలుగేళ్లుగా ఉంటోంది. పోలీస్ కేసులు కూడా నమోదు.. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్పై పనిచేస్తున్న అల్లీపురానికి చెందిన నల్లగట్ల నవీన్తో ఆమెకు వివాహేతర సం బంధం ఏర్పడింది. ఈ విషయం వీరబాబుకు తెలియడంతో నవీన్తో పలుమార్లు గొడవ పడ్డాడు. ఇరువురు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. అయినా నవీన్, తన భార్య సన్నిహితంగా ఉండడాన్ని వీరబాబు తట్టుకోలేకపోయాడు. ఇంతలోనే నవీన్కు నిశ్చితార్థం జరగగా, వచ్చే నెల 9న పెళ్లి నిర్ణయించారు. కాగా, సదరు మహిళ ఇంటికి ఆదివారం రాత్రి నవీన్ వెళ్లాడని తెలుస్తోంది. అక్కడకు వీరబాబు వెళ్లి నవీన్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో నవీన్ పేగులు బయటకు వచ్చాయి. దాడిని అడ్డుకోబోయిన మహిళకు సైతం గాయాలయ్యాయి. నవీన్ను ఆమె ఆటో లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేర్పించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. అయితే, పెళ్లి కార్డు ఇచ్చేందుకే మహిళ ఇంటికి వెళ్లిన నవీన్పై వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి శ్రీను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి భర్తను చంపిన భార్య -
ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?
నర్సీపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హత్య చేయించింది. గతేడాది ఆగస్టు 7న ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలల తరువాత గొలుగొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబు భార్య రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మ, రామలక్ష్మి ప్రియుడు ఎర్రినాయుడు కలిసి కుట్రపన్నారు. సత్తిబాబును హత్య చేస్తే రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. గత ఏడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు,కృష్ణ నమ్మబలికారు. ఎర్రినాయుడు, కృష్ణ ఒక బైక్పై, సత్తిబాబు తన మోపెడ్పై బయలుదేరారు. మార్గం మధ్యంలో ఏటిగైరంపేట, పెద»ొడ్డేపల్లిల్లో సత్తిబాబుతో ఫుల్గా మద్యం తాగించారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గరలో ఏలేరు కాలువ పక్కన తోటలోకి తీసుకు వెళ్లారు. సత్తిబాబును ఎర్రినాయుడు కిందపడేశాడు. కృష్ణ గట్టిగా పట్టుకోగా ఎర్రినాయుడు అతని గొంతునొక్కి చంపేసి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు. మోపెడ్ను కూడా కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించకపోవడంతో అతని తండ్రి దేముడు, అక్క పైడితల్లి, ఆమె భర్త రమణమూర్తి గత ఏడాది ఆగస్టు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. రామలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఎర్రినాయుడు కలిసి సత్తిబాబును చంపేసి ఉంటారని గత నెల 19న హతడు తండ్రి దేముడు, కుటుంబ సభ్యులు గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందు పరారీ.. తరువాత లొంగుబాటు గొలుగొండ ఎస్ఐ ధనుంజనాయుడు, సిబ్బందితో కలిసి విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు. తరువాత ఈ నెల 27న గ్రామ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో కాలువలో గాలించగా మోపెడ్ లభ్యమైంది. సంఘటన జరిగి తొమ్మిది నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. హత్య కేసులో మరో నిందితుడు కృష్ణ ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. కృష్ణను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. -
ప్రేమజంట ఆత్మహత్య కలకలం.. ఊరి చివర చెట్టుకు వేలాడుతూ..
తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువజంట.. బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమంటూ ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ అధికారి బాబానంద ప్రధాన్, బాధిత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బరంపురం నగరానికి సమీపంలోని పత్రపూర్ బ్లాక్ జరడా పోలీసు స్టేషన్ పరిధిలో సమంతరాయ్పల్లి గ్రామానికి చెందిన సోను బెహరా(20), సునీత ప్రధాన్(18) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లగా.. వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోను బెహరా గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రేమికురాలు సునీత ప్రధాన్ ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, అక్కడే ఉన్న బాధిత కుంటుంబ సభ్యులు.. సునీతను తీవ్రంగా దూషించారు. దీంతో ఇంటికి వెళ్లిపోయిన ఆమె, కొద్ది సమయం తరువాత తిరిగి వచ్చి, పక్కనే ఉన్న మరో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రేమజంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ బాబానాంద తెలిపారు. -
తెల్లారితే పెళ్లి.. ఊహించని ట్విస్టు ఇచ్చిన వధువు
గౌరిబిదనూరు: తెల్లవారితే పెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులతో ఇళ్లంతా కలకలలాడుతోంది. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న వరుడికి.. ఇంటి సభ్యులకు వధువు ఊహించని షాకిచ్చింది. రాత్రికి రాత్రే తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9:30 గంటలకు విదురాశ్వత్థం చన్నరాయస్వామి కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉండగా ఆ పెళ్లి నిలిచిపోయింది. వధువు పరారు కావడమే ఇందుకు కారణం. నగర శివారులోని నాగరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22), కరేకల్లహళ్లివాసి సురేశ్కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం రాత్రి నిబ్బళం జరిపించి అందరూ నిద్రపోయారు. అప్పిరెడ్డిహళ్లికి చెందిన తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్ (25)తో గుట్టుగా పరారైంది. ఉదయం చూస్తే వధువు లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం ముందే చెప్పి ఉంటే మేనమామతోనే పెళ్లి చేసేవారమని వారిమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెళ్లి కొడుకు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇది కూడా చదవండి: భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే.. -
నా తమ్ముడిని కొట్టి చంపేశారయ్యా !
రొంపిచెర్ల : ‘నా తమ్ముడిని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ బోనంవారిపల్లెకు చెందిన చక్రధర్ జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల మేరకు.. మండలంలోని బోనంవారిపల్లెకు చెందిన సుధాకర్ రెండో కుమారుడు గౌతంరాజు(22), అదే గ్రామానికి యువతి ప్రేమించుకున్నారు. ఈ నెల 6వ తేదీ గౌతం రాజు అమ్మాయి తల్లిదండ్రులను కలిసి వివాహం చేయమని కోరారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు గౌతమ్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఉరి వేసుకుని చావాలంటూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన గౌతమ్ అదే రోజు రాత్రి 8 గంటలకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతి స్విమ్స్కు తరలించారు. దీనిపై ఈ నెల 8వ తేదీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్విమ్స్లో చికిత్స పొందుతున్న గౌతమ్ 19వ తేదీ మృతి చెందాడు. దీనికి అమ్మాయి బంధువులు సురేంద్ర, రఘునాథ, వీరశేఖర్, తరుణ్, చరణ్, అరుణ, భాగ్యమ్మ, రెడ్డెమ్మ, శ్రేష్ట కారణమని చక్రధర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణ హాణి ఉందని రక్షణ కల్పించాలని కోరారు. కొందరు టీడీపీ నాయకులు, పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ 9 మంది నిందితులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని ఎస్ఐ వెంకటేశ్వర్లను ఆదేశించినట్లు తెలిపారు. -
భార్యపై అనుమానం.. అర్ధరాత్రి దారుణం
చిక్కబళ్లాపురం: భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడో భర్త. చిక్కబళ్లాపురంలోని కొరచరపేటెలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ మిథున్కుమార్ వివరాలను వెల్లడించారు. అయితే, అరవింద్, భార్య మమత (30) భార్యభర్తలు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. కాగా, అరవింద్ పానీపూరి షాపులో పనిచేసేవాడు. ఇతడు భార్యపై అనుమానంతో తరచూ రగడపడేవాడు. శనివారం అర్ధరాత్రి కూడా భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమె తలను నేలకేసి పదేపదే కొట్టాడు. దీంతో నోట్లో నుంచి, చెవుల్లో నుంచి రక్తం కారి ఆమె మృత్యువాత పడింది. గొడవ విషయం తెలిసి పోలీసులు చేరుకుని నిందితున్ని పట్టుకున్నారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వారి పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు. ఇది కూడా చదవండి: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న ఏం చేశాడంటే..? -
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. ఎవరూ లేని సమయంలో..
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కవలలు కావడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న అన్న.. మరదాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకే రూపంతో ఉన్న అతడి విషయంలో మోసపోయిన ఆమె.. విషయం భర్తకు చెప్పడంతో అతడి సమాధానం విని షాకైంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబంలో ఇద్దరు కవలసోదరులు ఉన్నారు. వారిని ఎవరు అని గుర్తించడమే పేరెంట్స్కే కొన్నిసార్లు సాధ్యపడేది కాదు. ఇదిలా ఉండగా.. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల జంట కోసం వెతికారు. అలా దొరక్కపోవడంతో ఎవరో ఒకరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులు గడిచాక.. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. ఇప్పటి వరకు అంతా బాగానే సాగిన వ్యవహారం.. ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఓ సమయంలో అత్తారింట్లో కాపురానికి వచ్చిన మరదలిపై.. అన్న కన్నేశాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటంతో అతడికి అది వరమైంది. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పలేదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా.. అనుమానం వచ్చిన ఆమె.. అసలు విషయం తెలుసుకుని షాకైంది. ఈ విషయాన్ని వెంటనే.. తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. ఈ క్రమంలో భర్తతో సహా కుటుంభ సభ్యులందరూ అన్నకే మద్దతిచ్చారు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. వారి బెదిరింపులను లెక్కచేయని బాధితురాలు.. తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదుతో పోలీసులు కవల సోదరుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
‘లవ్ యూ’ అంటూ దగ్గరయ్యాడు.. శారీరకంగా ఒక్కటయ్యాక..
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల అధికారి అలోక్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్లోని అశోకనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిహల్ ఖాన్(30) అనే వ్యక్తి ఆసుపత్రిని రన్ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు(28) ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్ ఖాన్లో క్లోజ్నెస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. నిహల్ ఖాన్ తనను మోసం చేశాడని గుర్తించింది. అనంతరం అతడిని ఎందుకిలా చేశావని నిలదీయగా.. మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని నిహల్ చెప్పడంతో ఖంగుతింది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిహాల్ ఖాన్పై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం ఆరోపణలపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో -
HYD: ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. భర్త బయటకు వెళ్లగానే..
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. నగరంలోని రహమత్నగర్లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం షాక్ నుంచి తేరుకొని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిద్దరినీ ఇంట్లోనే ఉంచి తాళం వేసి.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో జవాన్ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తన భార్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని జవాన్ చెప్పాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడమేంటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి -
పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అట్లూరి వారి గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటి అనుశ్రీ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉంటోంది. ఫిట్నెస్ కోసం గతేడాది కల్యాణ్నగర్లోని ఏ–1 డాన్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో చేరింది. నిర్వాహకుడు అన్వేష్ ప్రపోజ్ చేయడంతో అంగీకరించింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించిన అన్వేష్ వేరే యువతితో చనువుగా ఉండటాన్ని గమనించిన అనుశ్రీ అతడిని నిలదీయగా మరోసారి అలా చేయనని చెప్పడంతో ఊరుకుంది. ఈ క్రమంలో ఓ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానని రూ.10 లక్షలు అవసరముందనడంతో అనుశ్రీ డబ్బులు ఇచ్చింది. ఓ రోజు వచ్చి పెళ్లి ప్రస్తావన తీయడంతో ఇప్పుడే చేసుకుందామని స్టూడియోలోనే దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా అన్వేష్ యువతులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించి మరోసారి గట్టిగా నిలదీయగా నువ్వు నా స్టూడియోకు రావొద్దని హెచ్చరించడంతో తనుశ్రీ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..) -
భార్యపై అనుమానం.. బ్యూటీపార్లర్లో రాజు ఏం చేశాడంటే..?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్కాలనీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీపార్లర్లో పనిచేస్తున్న తన భార్యపై అనుమానంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. దీంతో పార్లర్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో సుమతి(25) అనే మహిళ మూడు నెలలుగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా, తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే భర్త రాజు.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో, శనివారం పార్లర్కు వెళ్లిన రాజు.. సుమతిపై హత్యాయత్నం చేశాడు. రాజు చేతిలో కత్తి ఉండటంతో బ్యూటీ పార్లర్ సిబ్బంది అతడిని వారించారు. ఈ క్రమంలో రాజు.. భార్య సుమతిని తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతునొక్కి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. అనంతరం కత్తితో పార్లర్ సిబ్బందిని బెదిరించాడు. దీంతో, వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియో యజమాని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. రాజుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య.. విషయం ఏంటంటే..? -
బాలుడిపై మహిళ లైంగిక దాడి.. చివరకు భలే ట్విస్టు
బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
నటుడితో అమీ జాక్సన్ డేటింగ్.. లీకైన ఫోటోలు
వరుడు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్.. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో మరింత పాపులర్ అయింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే ఇటీవలె మరోసారి ప్రేమలో పడిన అమీ జాక్సన్ కొన్నాళ్లుగా బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ లండన్లో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎడ్ వెస్ట్విక్తో కలిసి అమీ జాక్సన్ చేతిలో చేయి వేసుకొని లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరి లవ్ ఎఫైర్ మరోసారి చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by D💋🎀 (@edwestwicks.wife) -
కాబోయే భర్తే కదా అని దగ్గరైంది.. ఆ తర్వాత సీక్రెట్ ఫొటోలు..
శృంగవరపుకోట రూరల్: ప్రేమ పేరుతో సహోద్యోగినిని లోబరుచుకుని.. పెళ్లికి నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో విజయనగరం ఏఎస్పీ అనిల్ పులిపాటి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన శీరెడ్డి నవీన్ మండలంలోని ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని ప్రేమిస్తున్నానంటూ చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా నవీన్ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాధిత యువతి అడిగితే, ఇంటి నిర్మాణం జరుగుతోందని.. పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకున్నాడు. అలాగే ఇంటి నిర్మాణానికి నగదు అవసరమని, కట్నం కావాలని యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి తండ్రి గట్టిగా నిలదీస్తే మొదట్లో మహిళా ఉద్యోగినితో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను అతని ఫోన్కు పంపించాడు. దీంతో నవీన్పై బాధిత యువతి ఎస్.కోట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు నవీన్ను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సీఐ ఎస్. సింహాద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు జె.తారకేశ్వరరావు, జి.లోవరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: విందు కోసం ఆహ్వానిస్తే.. ఆమె లవర్ ఎంత పని చేశాడు.. -
భర్తతో విడిపోయిన మీనా.. రెండో వివాహం చేసుకున్న తర్వాత..
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో రెండో వివాహం చేసుకున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై ఆమె తల్లి, అన్నతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా, సెయ్యంగనల్లూర్ సమీపంలోని కరుంగుళం, తాత్తాన్కుళంకు చెందిన సిడలై ముత్తు కుమార్తె మీనా (21). ఈమెకు ఐదేళ్ల క్రితం తాత్తాన్కుళం సమీపంలోని కాల్వాయ్ గ్రామానికి చెందిన ఇసక్కి పాండియన్తో వివాహమైంది. వీరికి కుమారుడు నిశాంత్ (04) ఉన్నాడు. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయిన మీనా నెల్లై జిల్లా పడపిల్లై పుదూర్కు చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతనితో 10 నెలలుగా కాపురం చేస్తున్నట్లు సమాచారం. నిశాంత్ తండ్రి వద్ద ఉన్నాడు. కాగా, కుమార్తె రెండవ వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన సుడలైముత్తు కుటుంబం మీనాపై తీవ్ర కోపంతో ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం తాత్తాన్కుళంలో జరిగిన ఆలయ ఉత్సవాలకు మీనా తన పిన్ని పార్వతి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సడలై ముత్తు, అతని భార్య ముప్పిదాతి, కుమారుడు మాయండి, సడలై ముత్తు అన్న తలవాయ్, అతని భార్య వీరమ్మాళ్, వీరి కుమారుడు మురుగన్ మీనాతో గొడవపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహం చెందిన సడలై ముత్తు తన వద్ద ఉన్న కత్తితో మీనా పైదాడి చేశాడు. దీంతో మీనా ఘట నా స్థలంలోనే దుర్మరణం చెందింది. సెంగనల్లూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని శవ పరీక్ష కోసం నెల్లై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది. -
కటకటాల్లోకి ఎస్ఐ విజయ్కుమార్
పామిడి/అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన సభావత్ తిరుపాల్నాయక్, సీతమ్మ దంపతుల కుమార్తె ఎస్.సరస్వతి (21) ఆత్మహత్యకు కారణమైన తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ రమావత్ విజయ్కుమార్ నాయక్ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పామిడి పోలీస్స్టేషన్లో తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గురుమాంజనేయ కొట్టాల గ్రామానికే చెందిన రమావత్ విజయ్కుమార్ నాయక్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చంద్రగిరిలో పనిచేస్తున్నాడు. వరుసకు మామ కూతురైన సరస్వతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతపురానికి చెందిన భారతితోనూ ప్రేమాయణం నడిపాడు. ఆమె అనంతపురం దిశ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కడంతో భారతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్కుమార్ తనను వంచించడంతో సరస్వతి మనస్తాపానికి గురై బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్కుమార్పై 420, 376, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పామిడిలో శనివారం అతన్ని అరెస్టు చేశారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. నాకు వేరే దారి లేదు
ఎచ్చెర్ల క్యాంపస్: కుమార్తెపైనే గంపెడు ఆశలు పెట్టుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. చదువులో ఎప్పుడూ ముందుండే తమ కుమార్తె ఇక లేదని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఎచ్చెర్ల మండలం అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం తండ్యాంమెట్ట (మన్నెపేట)కు చెందిన దంపతులు దుంగ భూలోక, భారతిలు విశాఖలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు నవీన్ ఓ షాపింగ్మాల్లో పనిచేస్తుండగా, కుమార్తె కరిష్మా(17) ఎచ్చెర్లలోని అంబేడ్కర్ గురుకులం (పాఠశాల/కళాశాల)లో ఇంటర్మీడియెట్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో చురుగ్గా ఉంటే కరిష్మా ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతూ త్వరలో జరిగే పబ్లిక్ పరీక్షలతో పాటు నీట్, అగ్రికల్చర్ సెట్లకు సైతం సిద్ధమవుతోంది. ఇటీవలే చెవి నొప్పి అంటూ ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆదివారం మళ్లీ పాఠశాలకు చేరుకుంది. స్టడీ అవర్స్లో భాగంగా ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి 5.30 గంటలకు తరగతి గదికి చేరుకుంది. కొద్దిసేపటికే ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు ఆరు గంటలకు తరగతి గదికి చేరుకోగా కరిష్మా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఎస్సై కె.రాము ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. విశాఖ నుంచి తల్లిదండ్రు లు, సోదరుడు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తహశీల్దార్ సనపల సుధాసాగర్ గురుకులాన్ని పరిశీలించారు. కారణం అదేనా.. గురుకులం పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విజయనగరం నుంచి కారులో రాకపోకలు సాగిస్తున్నారు. కారు డ్రైవర్ ఈ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినికి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వడం, డ్రైవర్ను ఉపాధ్యాయురాలు తొలగించడం జరిగాయి. ఈ క్రమంలోనే తోటి విద్యార్థులు కామెంట్లు చేయటం, విద్యార్థిని వ్యక్తిగతంగా రాస్తున్న డైరీ పరిశీలించి సోమవారం ఉపాధ్యాయురాలు మందలించటం వంటివి చోటుచేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో గురుకుల యాజమాన్యం తీరుపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించటం, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అనుమతించని గురుకులంలోకి డ్రైవర్ను రానివ్వడం, గతంలో వివాదం తలెత్తినప్పుడు డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. పోలీసులు మాత్రం తాము వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాకే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లేఖ.. విద్యార్థి రాసిన సూసైట్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదుకు భిన్నంగా నోట్ ఉండటం గమనార్హం. సూసైట్ నోట్ పరిశీలిస్తే.. ‘అమ్మా, నాన్నా, అన్నా.. నన్ను దయచేసి క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్లటం బాధగా ఉంది. నాకు వేరే దారిలేదు. మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను. దేవుడు ధృడమైన సంకల్పం ఇవ్వలేదు. నేను, డ్రైవర్ సాయి ఇద్దరం ఇష్టపడ్డాం. ఆయన నా వల్ల ఉద్యోగం కోల్పోయారు. నా మృతికి ఎవ్వరూ కారణం కాదు. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు..’ ఇదీ సూసైడ్ నోట్ సారాంశం. ముగ్గురిపై కేసు నమోదు.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురుకులం ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లీష్ టీచర్ భవానీ, ఈమె పూర్వపు కారు డ్రైవర్ సురేష్ (సాయి)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.రాము చెప్పారు. ముగ్గురు సస్పెండ్... శాఖాపరంగా సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లీష్ టీచర్ భవానీ, హౌస్ (క్లాస్ టీచర్) మంజులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త యశోధలక్ష్మి తెలిపారు. ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ రాధికకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఏడాది కాగానే భర్త అలా చేస్తూ.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహేతర సంబంధం.. మహిళను కరెంట్ పోల్కు కట్టేసి..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోహతాస్ జిల్లాలోని సింగపూర్కు చెందిన ఓ మహిళ గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆమె భర్త దీపక్రామ్, మామ, ముగ్గురు పిల్లలు బాధితురాలిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దీపక్ రామ్, అతని తండ్రి శివపూజన్ రామ్, ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు రోహాతస్ పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి తెలిపారు. -
నాకు ప్రియుడే ముఖ్యం.. భార్య ఏం చేసిందంటే..?
యశవంతపుర: వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్తను కాటికి పంపింది. వివరాలు .. ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పని చేస్తున్న శంకర్రెడ్డి (44) బెంగళూరులోని యశవంతపుర పీఎస్ పరిధిలోని మోహన్కుమార్ నగరలో నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్ 28న రాత్రి 12:30 గంటల సమయంలో శంకర్రెడ్డి హత్యకు గురయ్యాడు. ప్రియునితో కలిసి భార్యే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేతికి గాయాలతో ఉన్న శంకర్రెడ్డి భార్యను పోలీసులు విచారించారు. దుండగులు తమపైన దాడి చేశారని, తాళి లాక్కెళ్లారని కట్టుకథ చెప్పింది. అయితే తాళి మెడలోనే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి అంతమొందించినట్లు నిజం ఒప్పుకుంది. ప్రియుడు ఆమె సొంతూరికి చెందిన దూరపు బంధువని తెలిసింది. ఆమెను అరెస్టు చేసి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి పోయి, తల్లి జైలుకెళ్లి ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. ఇది కూడా చదవండి: వీడియో కలకలం.. నర్సుపై అత్యాచారం చేసి.. -
వివాహమైన మూడు నెలలకే దారుణం.. మాజీ ప్రియుడు అరెస్ట్
తిరువొత్తియూరు: పుదుక్కోట్టై æజిల్లాలో వివాహమైన 3 నెలలకే నవ వధువు ఆత్మాహుతి చేసుకుంది. దీనికి సంబంధించి మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుక్కొట్టై జిల్లా తిరుమయం సమీపం కొప్పరపు పట్టి, ఆరియన్కాడు గ్రామానికి చెందిన పుష్పరాజ్, అతని భార్య దీప (25). వీరికి మూడు నెలలకు క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గురువారం దీపా ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీప తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన వేలుసామి (35) అనే వ్యక్తితో వివాహానికి ముందే పరిచయం ఏర్పడి సంబంధం ఉందని, ఈ క్రమంలో పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా తాను వివాహం చేసుకోనని దీప తెలిపినట్లు తెలిసింది. దీంతో బంధువులు దీపను ఒప్పించి బంధువుకు వివాహం చేశారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న దీప బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన మాజీ ప్రియుడు వేలుసామిని అరెస్టు చేశారు. -
తల్లితో సహజీవనం.. ఆమె కూతురుపై కన్నేసి..
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఓ బాలిక అత్యాచారానికి గురైంది. రైడ్స్ సంస్థ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన బాలిక పట్టణంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవలే ఆ బాలిక తండ్రి చనిపోవడంతో ఆ బాలిక తల్లి నగరిగుట్టలోని మరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉంది. వరుసకు తండ్రి లాంటి ఆ వ్యక్తి నరరూప రాక్షసుడుగా మారి ఆ బాలికపై కన్నేసి అత్యాచారం చేశాడు. భయంతో ఆ బాలిక రైడ్స్ చైల్డ్లైన్ 1098కు జరిగిన అత్యాచారం గురించి సమాచారం అందించింది. వెంటనే పులివెందుల పోలీసులు, చైల్డ్లైన్ 1098 విచారణ చేయగా ఆ వ్యక్తి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే పులివెందుల పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అతన్ని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ జోసఫ్ పాల్గొన్నారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని..
సాక్షి, నస్రుల్లాబాద్ (బాన్సువాడ): ప్రేమించిన అమ్మాయి దక్కదన్న ఆవేదనతో మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బ్రహ్మం (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి ప్రేమించిన యువతి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు రక్షించారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకోక పోవడంతో బ్రహ్మం గతంలోను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందులో భాగంగానే శనివారం తన స్నేహితులకు ఫోన్ చేసి ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావంటూ స్నేహితులు తెలుసుకొని అక్కడకు వెళ్లేలోపు మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బ్రహ్మం వేలాడుతూ కన్పించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి..) -
ఖమ్మంలో ప్రియురాలిపై ప్రియుడు బంధువుల దాడి
-
కల్యాణ మండపానికి ప్రియురాలు.. వరుడి బంధువుల దాడి
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని గార్ల మండలంలో ఓ ప్రియురాలు ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకుంటానని యువతి రజినీకి మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడు శ్రీనాథ్ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. శుక్రవారం రోజున ఓ కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. దీంతో ప్రియురాలు రజినీ పెళ్లి మండపం వద్దకు వెళ్లి తనును ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు తరపు బంధువులు ప్రియురాలిని కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కల్యాణ మండపంలోనే విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే అక్కడే వున్న కానిస్టేబుల్ కనీసం ప్రయత్నం చేయలేదని రజినీ ఆవేదన వ్యక్తం చేసింది శ్రీనాథ్ తాను మూడేళ్ల నుంచి ప్రేమించు కుంటున్నామని, పెళ్లి విషయం గురించి అడిగే సరికి మొహం చాటేశారని చెబుతోంది. చదవండి: (ఈత.. కడుపుకోత! నీట మునిగితే కష్టమే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి) -
కోలీవుడ్ హీరోతో బిందు మాధవి ప్రేమలో ఉందా? ట్వీట్ వైరల్
తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్లో కంటే కోలీవుడ్లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆవకాయ బిర్యానీతో తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు సాధించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లు తెలుగుతెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ బిగ్బాస్ పుణ్యమా అని మళ్లీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తున్న బిందుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వోటింగ్ విషయంలోనూ ముందంజలో ఉంటూ టైటిల్ హాట్ ఫేవరేట్గా దూసుకుపోతుంది. అయితే తాజాగా బిందు లవ్ ఎఫైర్ గురించి ఓ వార్త సోషల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ చేసిన ట్వీట్ ఇందుకు కారణం. గతంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ కోలీవుడ్ హీరో బిందుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కాగా తమిళ సీజన్1లో బిందు మాధవి పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్లో మరో కంటెస్టెంట్గా ఉన్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu 🔥👌🤗#BiggBossNonStopTelugu #ShowStealerBindu — Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022 -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. వైద్య విద్యార్థిని అలా చేస్తూ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెరంబలూరుకు చెందిన ఇద్దరు బాలికలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. విడదీయలేని స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకునేందకు లింగమార్పిడికి సిద్ధపడ్డారు. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పెరంబలూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 5వ తేదీ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పెరంబలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పెరంబలూరుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారిని విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆరో తరగతి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. వీరిలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థినికి మగవారి చెప్పులు, దుస్తులు ధరించడం, క్రాఫ్ చేసుకోవడం వంటి లక్షణాలు అలవడ్డాయి. జీవితాంతం ఇద్దరం కలిసి ఉండాలంటే ఒకరు మగవారిగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముందుగా చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకుని ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడుతున్న తరుణంలో శుక్రవారం వీరు చెన్నై పోలీసులకు చిక్కారు. ఇద్దరు విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించి చైల్డ్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. -
బంధువుతో వివాహేతర సంబంధం.. భర్త బయటకు వెళ్లగానే..
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ.. బిడ్డలకు విషమిచ్చిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపం కులకాచి ప్రాంతానికి చెందిన జగదీష్ (34) తాపీ మేస్త్రీ. ఇతని భార్య కార్తీక (24). ఈ దంపతులకు కుమార్తె కాంచన (04), కుమారుడు చరణ్ (02) ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆడుకుంటున్న చరణ్, కాంచన హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో బంధువులు ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు విష పదార్థాలు తిని ఉన్నట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో భాగంగా కార్తీకకు బంధువు సునీల్ (21)తో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. ఈ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరు బిడ్డలకు కార్తీక పాయసంలో విషమిచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించింది. వీరిలో చరణ్ మృతి చెందగా కాంచన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మార్తాండం పోలీసులు కార్తీకను గురువారం అరెస్టు చేశారు. -
ప్రేమ పేరుతో షికార్లు.. ప్రియుడి బర్త్ డే రోజున ఆమె..
మైసూరు: వారిద్దరూ నాలుగేళ్లుగా డీప్గా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో షికార్లు సైతం కొట్టారు. పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. తీరా పెళ్లి అనే సరికి ఆమెను అందరి ముందే అవమానించాడు. ఈ క్రమంలో వేదన భరించలేక యువతి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన కర్నాటకలోని నంజనగూడు తాలూకాలోని కందెగాలలో జరిగింది. వివరాల ప్రకారం.. త్యాగరాజు, కావ్య అనే యువతి మధ్య నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన త్యాగరాజు ఆమెతో షికార్లు చేశాడు. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న త్యాగరాజును పెళ్లి గురించి కావ్య ప్రశ్నించగా అతడు అందరి ముందు అవమానించాడు. దీంతో ఆవేదనకు గురైన యువతి అక్కడే ఉన్న పురుగుల మందును తాగింది. దీంతో స్థానికులు ఆమెను మైసూరు కేఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
మొదటి రాత్రే భర్తకు మత్తుమందు.. ఆ తర్వాత..
ఛండీగఢ్: ఆమె తన అందంతో గాలం వేసి పరిచయం చేసుకుంటుంది.. ఈ తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఇక, ఫస్ట్ నైట్ రోజున వరుడికి మత్తుమందు ఇచ్చి.. డబ్బులు, నగలతో మాయమవుతుంది. ఇలా ఏకంగా ఏడుగురికి షాకిస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకుల్ని టార్గెట్ చేసింది. ముందుగా ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని.. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, తన పెళ్లి ఓ మధ్యవర్తితో జరిగిందని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. దీంతో వారి మధ్య ఉన్న సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రే మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో అక్కడి నుంచి ఉండాయించేది. ఇలా జరుగుతున్న క్రమంలో ఆమె వివాహం చేసుకున్న నాలుగో భర్త రాజేందర్ను మోసం చేసి డబ్బులు, నగలతో పారిపోయింది. దీంతో రాజేందర్ పోలీసులను ఆశ్రయించాడు. వారి పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పోలీసులకు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగానే సదరు మహిళ శనివారం ఏడో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. ఆమెను, ఆ ముఠా సభ్యులను పట్టుకున్నారు. విచారణలో భాగంగా.. ఆమె మొదటగా ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్లో జరిగింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్తో.. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్తో.. ఆరో వివాహం కర్నాల్కు చెందిన సందీప్తో జరిగింది. చివరగా ఏడో వివాహం మార్చి 26న (శనివారం) బుద్వాకు చెందిన సుమిత్తో జరిగింది. దీంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.