మూడేళ్లుగా ప్రేమ..  మనస్సు మార్చుకున్న ప్రియుడు | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా ప్రేమ..  మనస్సు మార్చుకున్న ప్రియుడు

Published Sun, May 7 2023 10:20 AM | Last Updated on Sun, May 7 2023 11:06 AM

- - Sakshi

కరీంనగర్: ప్రేమించిన యువకుడి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మనోవేదనకు గురైన యువతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పోలంపల్లికి చెందిన రెడ్డి రజిత(19), మల్లాపూర్‌ గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్‌ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.

విషయ ం తెలిసిన రజిత కుటుంబసభ్యులు వెంకటేశ్‌ను పెళ్లిచేసుకోవాలని కోరారు. మొదట నిరాకరించగా.. రూ.10లక్షల కట్నం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నాడు. ఈ మాసంలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఏప్రిల్‌ 24న వెంకటేశ్‌, రజితలు పెళ్లిబట్టలు కొనుగోలు చేసేందుకు కరీంనగర్‌ వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనోవేదనకు గురైన రజిత ఏప్రిల్‌ 25న ఇంటివద్ద పురుగుల మందు తాగింది.

కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది. తన కూతురు ఆత్మహత్యకు పల్లె వెంకటేశ్‌, పల్లె రాములు, పల్లె సరవ్వ, గుండె కల్యాణి అలియాస్‌ రమ్య, గుండె రాజు కారణమని రజిత తల్లి అహల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement