mystery
-
చేసింది నలుగురు.. సహకరించింది ఆరుగురు
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజ లింగమూర్తి హత్య కేసు మిస్టరీ నేటితో వీడనుంది. బుధవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురి కాగా, పోలీసులు మూడు రోజుల పాటు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు సమాచారం. వి శ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూరి్త(49) ఈ నెల 19న రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు మూడు రోజులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు పాల్పడింది, సహకరిచింది ఎవరనేది సాక్ష్యాధారాలతో నిర్ధారించుకున్నట్లు సమాచారం.మారణాయుధాలను చెరువులో పడేసి తప్పించుకునే యత్నం.. ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురు రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. రెడ్డికాలనీ మలుపు వద్ద హత్య చేసిన తర్వాత ఒక కత్తిని అక్కడే విసిరి, మరో కత్తి, రాడ్డు, రాయిని తమ వెంట ఆటోలో తీసుకెళ్లి భూపాలపల్లి మండలం కొంపె ల్లి చెరువులో పడేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు పట్టుకుని పూర్తి స్థాయిలో విచారించగా.. రాజలింగమూర్తి రాకపోకల సమాచారం ఇవ్వడం, నిందితులను తప్పించేందుకు సహకారం అందించామని ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో కొత్త హరిబాబు ? నిందితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నిందితులు.. హరిబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించి హైదరాబాద్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని శనివారం రాత్రి భూపాలపల్లికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య కేసులో సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నేడు నిందితుల అరెస్ట్ చూపించనున్న పోలీసులు.. రాజలింగమూర్తి హత్య కేసులో 8 మంది నిందితులను నేడు(ఆదివారం) ఉదయం 8.30 గంటలకు అరెస్ట్ చూపించనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి హత్య కేసు వివరాలు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించనున్నారు.హత్యకు పాల్పడింది నలుగురు.. భూపాలపల్లి పీఎస్ ఎదుట గల సర్వే నంబర్ 319లోని భూమికి సంబంధించి తలెత్తిన వివా దంతోనే రాజలింగమూర్తిని ప్రత్యర్థులు హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హత్యకు పాల్పడిన రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమాంత్(బబ్లూ), మోరె కుమార్, కొ త్తూరి కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1, ఏ–2, ఏ–3, ఏ–4 గా చేర్చినట్లు సమాచారం. -
జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు..!
కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(జేఏఎస్) అధికారిగా పనిచేస్తున్నారు.ఆమె పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి జేఏఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు. -
నిర్మలాను ఎవరు చంపారు?
2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్లోని కాంచన్పూర్ గర్ల్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్పూర్లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. -
భార్య వేరే వ్యక్తితో సంబంధమే భర్తకు శాపంగా మారింది..!
ఆమదాలవలస: మండలంలోని బొబ్బిలిపేట సమీపంలో గత నెల 25వ తేదీ రాత్రి జరిగిన గురుగుబిల్లి చంద్రయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసులో రాజకీయ కోణం లేదని, కేవలం వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని, ఇందులో ప్రమేయమున్న 10 మందిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకనంద తెలిపారు. ఈ మేరకు ఆమదాలవలస పోలీస్స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గరుగుబల్లి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళీకృష్ణకు కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. విషయం తెలుసుకున్న భర్త చంద్రయ్య భార్యను మందలించి సెల్ఫోన్ వాడకుండా కట్టుదిట్టం చేయడంతో పాటు బాలమురళీకృష్ణతో ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా నిలుపుదల చేశాడు.దీంతో కక్షపెంచుకున్న బాలమురళీకృష్ణ చంద్రయ్యకు తెలియకుండా మరొక ఫోన్తో ఈశ్వరమ్మతో రహస్య సంభాషణలు సాగించేవాడు. ఈ క్రమంలో తమకు అడ్డంగా ఉన్న చంద్రయ్యను చంపాలనే ఉద్దేశంతో తన సోదరుడు, శ్రీనివాసచార్యులపేటకు చెందిన గురుగుబిల్లి అరవింద్ సాయం తీసుకున్నాడు. అతను తన స్నేహితులైన బూర్జ మండలం ఉప్పినవలసకు చెందిన వంశీ, గణేష్లను కూడా రంగంలోకి దించాడు. వీరంతా కలిసి చంద్రయ్యను హతమార్చడానికి బొబ్బిలిపేట సమీపంలో చెరువు వద్ద రెండు రోజులు మాటువేసినా ఫలితం లేకపోయింది. ఈ 25న చంద్రయ్య ఇంటి వద్ద బయలుదేరిన వెంటనే భార్య ఈశ్వరమ్మ చెరువు వద్ద ఎదురుచూస్తున్న బాలమురళీకృష్ణకు ఫోన్ చేసి చెప్పింది. స్కూటీపై వస్తున్న చంద్రయ్యను వీరంతా అడ్డగించి బీరు సీసాలు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులోకి ఈడ్చుకెళ్లి తుప్పల చాటున పడేశారు. అదే రోజు రాత్రి భార్య ఈశ్వరమ్మ ముందుగా భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మళ్లీ అర్ధరాత్రి సమయంలో తన భర్త శవంగా పొలాల్లో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ, ఎస్ఐ ఎస్.బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో బొబ్బిలిపేటకు చెందిన చింతాడ బాలమురళీకృష్ణ ప్రథమ నేరస్తుడుగా, ఉప్పినవలసకు చెందిన గొల్లపల్లి వంశీ, సవలాపురం గణేష్, బొబ్బిలిపేటకు చెదిన చంద్రయ్య భార్య జి.ఈశ్వరమ్మలను తదుపరి నేరస్తులుగా, సవలాపురం ప్రవీణ్, బొమ్మాలి శ్రీవర్థన్(శివ), బొమ్మాలి ఉమామహేష్, ఈసర్లపేటకు చెందిన యర్లంకి కృష్ణ, శ్రీనివాసాచార్యులపేటకు చెందిన గురుగుబెల్లి అరవింద్లతో పాటు మరో మైనర్కు కూడా నేరంలో ప్రమేయమున్నట్లు గుర్తించారు. వీరందరినీ అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసిన తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, డీఎస్పీ వివేకానంద అభినందించారు. -
Meerpet Case: రోలును తిరగేసి.., పొత్రంతో పొడిచేసి!
సాక్షి, హైదరాబాద్: ‘భార్యను చంపి, ఉడకబెట్టిన’ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ముక్కలు చేశాక..ఉడకబెట్టడానికి కాస్టిక్ సోడాను, ఎముకలను పొడి చేయడానికి రోలు, పొత్రం వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ఓ సినిమాతోపాటు ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా లభించిన వీడియోలను చూసి ఈ ప్లాన్ అమలు చేశాడని గుర్తించినట్టు సమాచారం. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇదే పనిలో ఉన్నాడని తేల్చినట్టు తెలిసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్లోని మీర్పేట పరిధి జిల్లెలగూడలో జరిగిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. ఆధారాలు సేకరించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. బయటికెళ్లి సామగ్రి కొనుక్కొచ్చి.. ఈ నెల 14న రాత్రి గొడవ జరగడంతో గురుమూర్తి మాధవి తలను బలంగా గోడకేసి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, కాసేపటికే మరణించింది. గురుమూర్తి మరుసటి రోజున ఐదుసార్లు ఇంట్లోంచి బయటికి వెళ్లి వచి్చనట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలా వెళ్లి వస్తూ మాంసం కొట్టే మొద్దు, కత్తి, కాస్టిక్ సోడా, కొత్త వాటర్ హీటర్ కొనుక్కువచి్చనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బాత్రూమ్లోకి లాక్కుపోయిన గురుమూర్తి..అక్కడే మాంసం కొట్టే మొద్దుపై కత్తితో ముక్కలు చేశాడు. పెద్ద బకెట్లో హీటర్ పెట్టి నీళ్లు మరిగిన తర్వాత ముక్కల్ని అందులో వేశాడు. మాంసం పూర్తిగా ఉడికిపోయి విడిపోవడానికి అందులో కాస్టిక్ సోడా కలిపి ఉంటాడని.. ఉడికిపోయాక కమోడ్లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఇక ఎముకలను స్టవ్ మీద పెట్టి కాల్చి..తర్వాత రోలుపై పెట్టి పొత్రంతో కొట్టి పొడిగా మార్చాడని పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది. తర్వాత ఎముకల పొడి, కత్తిని జిల్లెలగూడ చెరువులో పారేసినట్టు సమాచారం.మృతదేహాన్ని మాయం చేయడం పూర్తయ్యాక ఆధారాలేవీ చిక్కకుండా రోలు, పొత్రం, మొద్దును, బాత్రూమ్ను పలుమార్లు కడిగేశాడని...పదే పదే నీటిని ఫ్లష్ చేస్తూ డ్రైనేజీలోనూ ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా చేశాడని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఫోరెన్సిక్ నిపుణులు స్టవ్పై చిన్న మాంసం ముక్క, వెంట్రుకలతోపాటు మాధవి తలను గోడకు కొట్టిన చోట రక్తపు మరకల్ని గుర్తించారని..డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారని సమాచారం. -
యూట్యూబ్లో ఫ్రీగా ‘మిస్టరీ’
ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకుడు థియేటర్స్కి వెళ్లడం తగ్గించాడు. సినిమాలో స్పెషల్ కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి వెళ్లడం లేదు. అందుకే రిలీజ్కు ముందే కొత్త కొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చిన్న చిత్రాలు బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి స్పందన లభిస్తుంది. అందుకే కొంతమంది చిన్న నిర్మాతలు ఓటీటీ కోసమే సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా అన్ని సినిమాలను కొనడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్లో మోస్తరుగా ఆడినా కూడా ఓటీటీకి అమ్ముడు పోవడం లేదు. అందుకే కొన్ని సినిమాలను డైరెక్టుగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రీగా ‘మిస్టరీ’తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను య్యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నేటి(జనవరి 13) నుంచి ఈ సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘మిస్టరీ’ కథేంటి?ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుందని, సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు. -
Mystery: రక్తబంధం
‘జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు. ఎన్ని నిజాలైనా దాచవచ్చు. ఏ తప్పయినా చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే!’ అన్నమాటకు ‘ఫాదర్ ఆఫ్ కాథలీన్ బెల్చర్’ గాథ అద్దం పడుతుంది. సాధారణంగా పుట్టుక తర్వాత కన్నవారి పరిచయంతోనే నమ్మకమనే జీవనప్రయాణం మొదలవుతుంది. కానీ, కాథలీన్ అనే అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత ఆ నమ్మకం ముక్కలైపోయింది. నాన్న ఒక అబద్ధమయ్యాడు. అమ్మ ఆ నిజానికి సాక్ష్యమైంది. చివరికి, రక్తపాశం కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. కాథలీన్ ఆనాడే గెలిచి ఉంటే, ఈ కథను ఈనాడు మనం చెప్పుకునే వాళ్లమే కాదు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవసంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది. కాథలీన్ బెల్చర్ డ్యూటీలో ఉండగా, ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వూ, అక్క మియా కలిసి వస్తారా?’ అంది మిరియం.‘సరే అమ్మా! నాన్నది ఏ బ్లడ్ గ్రూప్?’ అడిగింది కాథలీన్ . ‘ఓ’ అని చెప్పింది మిరియం. ‘నాది ‘‘ఏ’’ బ్లడ్ గ్రూప్ కదా?’ అని మనసులో అనుకుంటూ, ‘అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా?’ అని తల్లిని అడిగింది అనుమానంగా. ‘బీ’ అంది మిరియం. నిజానికి ఓ, బీ బ్లడ్ గ్రూప్లు కలిగిన తల్లిదండ్రులకు, ఆ రెండు గ్రూప్స్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు. కాథలీన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్తో కలవడం లేదంటే, తన పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించని చేదు నిజం తెలుసుకోవడానికి తల్లిని నేరుగా కలిసింది. సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ ‘నేను ఎవరి బిడ్డని?’ అంటూ నిలదీసింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తపిస్తోందో అదే ప్రశ్న కూతురు కాథలీన్ నోటి నుంచి రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తప్పించుకోలేని స్థితిలో నోరువిప్పింది. ‘35 ఏళ్లక్రితం ఆలివర్ బడ్తో నా జీవితం ముడిపడింది. అప్పట్లో బడ్ సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాతి నుంచి తాగుడికి బానిసై, ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్స్, అతణ్ణి ఒప్పించి, తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. నన్నూ, మీ అక్క మియాను కొన్నిరోజులు బాగా చూసుకునేవాడు, మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్యమధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్లిపోయేవాడు. నా జీవితం గురించి ఆలోచించిన బడ్ పేరెంట్స్ నన్ను మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా, కోవింగ్టన్ లోని బార్టెండర్ చెట్ నోరిస్ని నాకు పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత బడ్తో విడిపోవాలనే ఆలోచన మొదలైంది. చెట్తో చనువు పెరిగింది. అతడి కారణంగా తల్లినయ్యాను. అప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు. నీ తండ్రి చెట్ అని నాకు తెలియగానే, ఆ శుభవార్తను అతడితో పంచుకున్నాను. అయితే విడాకుల కోసం బడ్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు అతడు జైల్లో ఉన్నాడని తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడటంతో అతణ్ణి జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతణ్ణి కలసి విడాకులు కావాలని కోరాను. బడ్ అందుకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు కాని, మియాను తనకే పూర్తిగా ఇచ్చెయ్యాలని రూల్ పెట్టాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో మీ నాన్న చెట్ను దూరం పెట్టాను. అతడికి నేను గర్భవతిని కాదని, ఏదో పొరబడ్డానని అబద్ధం చెప్పాను. అయినా ఫర్వాలేదు మనం కలిసి జీవిద్దాం అన్నాడు. అతడితో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకే చెట్కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, బడ్ జైలు నుంచి విడుదలైన కొన్ని నెలలకు నువ్వు పుట్టావు. నిన్ను తన బిడ్డే అనుకున్నాడు బడ్’ అని జరిగిందంతా చెప్పుకొచ్చింది మిరియం. అంతా విని అక్కడే కూలబడింది కాథలీన్ . కన్నతండ్రి కోసం ఆమె ఏడవడం మిరియం మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రిని వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది.కాథలీన్ పుట్టాక బడ్ కొన్నాళ్లు భార్యాపిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతణ్ణి ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో కాథలీన్కి 19 ఏళ్లు వచ్చేనాటికి మిరియం అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించడంలో మిరియం బాధ్యతగా వ్యవహరించింది. ఏది ఏమైనా కాథలీన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు, గతంలో చెట్తో తాను దిగిన ఒక ఫొటోని కాథలీన్ చేతికి అందించింది మిరియం. పుట్టాక ఒక్కసారి కూడా కన్నతండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి కాథలీన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇప్పించింది. మీడియా సమక్షంలో పలు రివార్డులను ప్రకటించింది. తల్లి ఇచ్చిన ఏకైక ఫొటోను ఎన్నో ప్రింట్స్ వేయించి, విస్తృత ప్రచారం చేయించింది.1988లో ఈ నిజం కాథలీన్ కి తెలిసినప్పటి నుంచి, నేటికీ ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. ‘నీ గుర్తుగా నేను ఈ లోకంలో పుట్టాను నాన్నా!’ అని చెప్పడానికి తపించింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కాథలీన్ అనే కూతురుందన్న నిజం కూడా చెట్కి తెలియదు. ప్రస్తుతం చెట్కి 80 ఏళ్లు దాటి ఉంటాయని అంచనా. చెట్ 1940లో గోల్డెన్ గ్లోవ్స్ బాక్సర్ అనే సమాచారాన్ని కూడా కాథలీన్ వాడుకుంది. కానీ ఫలితం లేదు. మొత్తానికి ఒక తొందరపాటు, ఒక నిస్సహాయత, ఒక పేగుబంధం కలగలసి సృష్టించిన ఈ కథనంలో ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చెట్ ఏమయ్యాడో నేటికీ మిస్టరీగానే మిగిలింది! ∙సంహిత నిమ్మన -
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చుసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు కామారెడ్డి(Kamareddy) పోలీసులపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహగానాలే వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో వారి ఫోన్కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్లో ఏముందో..బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి(Shruthi), నిఖిల్తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.శ్రుతి, నిఖిల్ వాట్సాప్(Whatsapp) మెసేజ్లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
ఈతరాక.. ఊపిరాడక..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో యువకుడు మునిగి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. వారి మరణానికి గల కారణాలతో పాటు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు నీటిలో ముగ్గురు పడిపోవడంతో జాలర్ల సాయంతో గాలించి వారి మృతదేహాలను బయటకు తీసిన విషయం తెలిసిందే. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను పరిశీలించిన అధికారులు.. శ్రుతి, నిఖిల్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారని గుర్తించారు. తర్వాత వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయోనన్న దాని గురించి ఆరా తీస్తున్నారు. వారు చెరువు వద్దకు వెళ్లి అక్కడ చర్చించుకున్న సమయంలో, చెరువులో దూకినపుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన చెరువు కావడంతో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కడా లేవు. ఆ రోజు చేపల వేటకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో ఈ ఘటన ఎవరి కంటా పడలేదని భావిస్తున్నారు.ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్లో ఏముందో..వివిధ కోణాల్లో దర్యాప్తుముగ్గురి మరణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాల్డేటాను పరిశీలించిన అధికారులు వాట్సాప్ చాటింగ్లపై దృష్టి సారించారు. అయితే ఫోన్లు లాక్ అయి ఉండడంతో వాటిలో నుంచి సమాచారం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ సింధుశర్మ కేసు పరిశోధన గురించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా కేసు దర్యాప్తు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు కొలిక్కి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.నీరు మింగి..భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, అలాగే నిఖిల్ నీట మునిగింది లోతైన ప్రదేశంలో కావడంతో అందులో పడగానే లోపలికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలు దొరికిన ప్రదేశం దాదాపు పదిమీటర్ల లోతు ఉంటుందని అంటున్నారు. ముందు ఎవరో ఒకరు దూకి ఉంటారని, వారిని కాపాడే క్రమంలో మి గతా ఇద్దరూ ఒకరి వెంట ఒకరు దూకి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ముగ్గురికీ ఈత రాదని తెలుస్తోంది. లోతైన ప్రాంతంలో దూక డంతో ముగ్గురూ నీట మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టుల్లో నీళ్లు మింగే చనిపోయారని వెల్లడైంది.ఆత్మహత్యలా.. హత్యలా? -
కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఎస్ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.. కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్గా మారింది. -
ప.గో.: పార్శిల్ మృతదేహాం కేసులో వీడిన మిస్టరీ!
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్లే కనిపిస్తోంది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే ఆస్తి తగాదాల కోణంలోనూ ఈ కేసును విచారణ జరుపుతున్నారు.మృతదేహాన్ని కాళ్ల మండలం గాంధీనగర్కు బర్ల పర్లయ్యదిగా గుర్తించారు. అలాగే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ వర్మ కోసం గాలింపు ముమ్మరం చేశారు.సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది.. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. అందులో హత్య జరిగిందని తేలింది. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. విచారణలో కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన సిద్థార్థ వర్మపైకి అనుమానం మళ్లింది.మూడు పేర్లు.. ముగ్గురు భార్యలుఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నవ్యక్తికి ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ ఇస్కులంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకుని యండగండికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం సిద్ధార్థవర్మగా పేరు మార్చుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది.ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్వర్మకి రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు మృతదేహాన్ని పంపించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. బర్ల పర్లయ్య ఎందుకు చంపాడు?.. ఎలా చంపాడు? ఆ మృతదేహాన్ని తులసికి ఎందుకు పంపాడనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కంకాళాల కలకలం
అది 2009 ఫిబ్రవరి 2, ఉదయం 7 దాటింది. అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రంలోని, వెస్ట్ మేసాలో అల్బుకర్కీ ప్రాంతమంతా సందడిగా ఉంది. సమీపంలో నివాసముండే క్రిస్టీన్ రాస్ అనే అమ్మాయి ఎప్పటిలానే ఆరోజు ఉదయం తన పెంపుడు కుక్క రుకాను తీసుకుని వాకింగ్కి బయలుదేరింది. తిరిగి వచ్చేటప్పుడు రుకా నోట్లో మనిషి ఎముక చూసి క్రిస్టీన్ హతాశురాలై, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.వెస్ట్ మేసా అనే ప్రాంతం గురించి అప్పటి వరకూ ఆ దేశానికే కాదు, ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా తెలియదు. ఆరోజు తర్వాత ప్రపంచమే ఉలిక్కిపడి వెస్ట్ మేసా వైపు చూడటం మొదలుపెట్టింది.రుసా తెచ్చిన ఎముక ఎక్కడిది? ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అధికారుల దృష్టి సమీపంలోని విస్తారమైన మెట్ట ప్రాంతం మీద పడింది. న్యూ మెక్సికో, సౌత్ వ్యాలీలో బెర్నెలీయో కౌంటీకి ఉత్తరాన ఉన్న అరోయో అనే నదీ పరివాహక ప్రాంతమది. అయితే ఆ నది కొన్నేళ్ల క్రితమే ఎండిపోయింది. అలాంటి చోట ఎముక దొరకడంతో తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వగా తవ్వగా ఓ అస్థిపంజరం దొరికింది. ఇంతలో ఆ పక్కనే మరో అనుమానాస్పదమైన గుంత దర్శనమిచ్చింది. వెంటనే క్రైమ్ టేప్స్ వేలాడదీసిన అధికారులు, తమ బలగాలను దించారు. ఇంతలో మరో అస్థిపంజరం దొరికింది. దాంతో చుట్టూ విస్తృతంగా తవ్వకాలు జరిపించారు. ఈలోపు మీడియా చుట్టుముట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 11 అస్థిపంజరాలు దొరికాయి. అన్నీ ఆడవారివే! బాధితుల్లో 15 ఏళ్ల బాలిక దగ్గర నుంచి 32 ఏళ్ల మహిళ వరకూ చాలా వయసులవారు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మృతులలో నాలుగు నెలల గర్భవతి కూడా ఉంది. వీరంతా 2001 నుంచి 2005 మధ్య అదృశ్యమైనవారేనని తేలింది. దీని వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కొందరు, సెక్స్ రాకెట్ ఉందని మరికొందరు ఊహించడం మొదలుపెట్టారు. సీరియల్ కిల్లర్ అని భావించిన వారంతా ‘ది బోన్ కలెక్టర్’ అని పేరుపెట్టారు. మీడియా ఎక్కువ శాతం ఆ వాదనకే ఓటేసింది.ఇడా లోపెజ్ అనే మహిళా డిటెక్టివ్ అప్పటికే అల్బుకర్కీకి చెందిన సుమారు 19 మంది మహిళలు కనిపించడం లేదని లిస్ట్ తయారు చేసింది. వారంతా సెక్స్వర్కర్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగినవారే కావడంతో పోలీసులు పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే వెస్ట్ మేసా తవ్వకాల్లో బయటపడిన పదకొండు మందిలో, పదిమంది ఆ లిస్ట్లోని వారే కావడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఇడా లిస్ట్లో మరో తొమ్మిది మంది ఏమయ్యరో తెలియకపోవడంతో, లిస్ట్లో లేని అభాగ్యులు చాలామందే ఇలా ఖననమై ఉంటారని అంచనాకొచ్చారు. ఇక పదకొండో అమ్మాయి, ఓక్లహోమాకి చెందిన 15 ఏళ్ల సిలానియా టెరెన్ (ఆఫ్రికన్ అమెరికన్) అని తేలింది. ఆమె 2003లో ఇంటి నుంచి పారిపోయింది. దొరికిన అస్థిపంజరాలు ఎవరివో తేల్చారు కాని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరో గుర్తించలేకపోయారు.ఈ కేసులో అనుమానితులు చాలామందే ఉన్నా లోరెంజో మోంటోయా, జోసెఫ్ బ్లీ అనే నేరగాళ్లు ప్రధాన అనుమానితులుగా నిలిచారు. లోరెంజో అనే వ్యక్తి పదకొండు మందిని ఖననం చేసిన ప్రదేశానికి చాలా సమీపంగా నివసించేవాడు. సెక్స్ వర్కర్లపై హింసాత్మక దాడులకు తెగబడి రెండుసార్లు అరెస్టయ్యాడు. అతడు 2006లో 19 ఏళ్ల సెక్స్ వర్కర్ షెరికా హిల్ను చంపి, ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లబోతుంటే, షెరికా ప్రియుడు ఫ్రెడరిక్.. లోరెంజోను తుపాకీతో కాల్చి చంపాడు. అతడు షెరికాను చంపిన తీరు చూస్తే అది, అతడి మొదటì హత్య అయి ఉండదని అప్పట్లోనే చాలామంది డిటెక్టివ్స్ భావించారు. అయితే 2009లో వెస్ట్ మేసా తవ్వకాల తర్వాత ఆ రోజు షెరికా బాడీని లోరెంజో వెస్ట్ మేసాలో కప్పెట్టడానికే తీసుకెళ్లబోయాడేమో? అనే అనుమానం కలిగింది. నిజానికి లోరెంజో మరణం తర్వాతే వెస్ట్ మేసా హత్యలు ఆగిపోయి ఉంటాయని అధికారులు నమ్మారు.2010 డిసెంబర్ 9న అల్బుకర్కీ పోలీసులు.. గుర్తుతెలియని ఆరుగురు మహిళల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిలో కొందరు అపస్మారక స్థితిలో (ఎవరో కిల్లర్కి చిక్కినట్లుగా) ఉన్నారు. అయితే ఆ ఫొటోలు ఏ నేరగాడి కెమెరా నుంచి సేకరించారో అధికారులు చెప్పలేదు కాని, ఇదంతా వెస్ట్ మేసా కేసు దర్యాప్తులో భాగమని వివరించారు. ఆ ఆరుగురిలో ఇద్దరు అమ్మాయిలు సజీవంగా ఉన్నట్లు సమాచారం ఉందని, వారు దొరికితే కిల్లర్ వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే ఆ ఇద్దరమ్మాయిలూ దొరకలేదు. ఆ ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో కూడా తెలియలేదు.2015 నాటికి జోసెఫ్ బ్లీ అనే రేపిస్ట్ కూడా వెస్ట్ మేసా కేసులో అనుమానితుడిగా మారాడు. 1980–82 మధ్యకాలంలో అల్బుకర్కీ సమీపంలోని ఇళ్లలోకి దూరి, 13 నుంచి 15 ఏళ్ల బాలికలపై అత్యాచారాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బ్లీ.. 2015లో ఓ సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు. డీఎన్ఏ నమూనాతో నేరం నిరూపితమైంది. గత నేరాలను కూడా కలిపి బ్లీకి 36 ఏళ్లు జైలు శిక్ష పడింది. పైగా ఈ పదకొండు అస్థిపంజరాలు దొరికిన చోట, క్లూ మాదిరి ఒక నర్సరీ ట్యాగ్ లభించింది. ఆ నర్సరీని గుర్తించిన అధికారులు.. బ్లీ రెగ్యులర్గా అక్కడే మొక్కలు కొనేవాడని తెలుసుకున్నారు. అయితే ఒకసారి బ్లీ.. తన సెల్మేట్ ముందు వెస్ట్ మేసా బాధితులను ‘నేను వాడి పడేసిన చెత్త’ అని సంబోధించాడట. కానీ విచారణలో బ్లీ నోరువిప్పకపోవడంతో, కేసు తేలలేదు. మొత్తానికీ ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడా? లేక ఈ ఉదంతం వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనేది నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’
చరిత్ర మిగిల్చిన చీకటి రోజుల్లో అమెరికా వణికిన రోజు 2001 సెప్టెంబర్ 11. నాడు ఉగ్రవాదులు ట్విన్ టవర్స్పై చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. అయితే నిజానికి ఆ విధే పనికట్టుకుని, స్నేహా ఫిలిప్ అనే భారతీయ డాక్టరమ్మ కథను, నాటి అమెరికావాసుల వ్యథలతో ముడిపడేలా ముందే లిఖించింది కాబోలు!అది సెప్టెంబర్ 11, సాయంత్రం 5 అవుతోంది, రోడ్లపై లక్షల్లో జనాలు, వేలల్లో పోలీసులు. ఇంకా అమెరికా షాక్ నుంచి తేరుకోలేదు. ఒకవైపు బాధిత కుటుంబాల రోదనలు, మరోవైపు ఆగకుండా మోగుతున్న అంబులెన్స్ సైరన్లు. ఆ సమయంలో ఎటు చూసినా విలాపమే, ఏం విన్నా విషాదమే! చాలామంది అధికారులు కనిపించకుండా పోయిన వారి వివరాలను నమోదు చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడే అన్సు, ఫిలిప్ అనే కేరళ దంపతులు తమ అమెరికన్ అల్లుడు రాన్ లైబర్మాన్ని వెంటబెట్టుకుని కన్నీళ్లతో పోలీస్ స్టేషన్కి వచ్చారు. ‘పేరు స్నేహా ఫిలిప్, భారత మహిళ, ఆమె డాక్టర్, బ్లాక్ హెయిర్, బ్రౌన్ ఐస్, హైట్ 5.6, వయసు 31, గత ఏడాదే పెళ్లైంది, నిన్నటి (సెప్టెంబర్ 10) నుంచి కనిపించడం లేదు’ అంటూ వారు.. ఒక్కొక్కటిగా వివరాలిచ్చారు. స్నేహా కేరళలో పుట్టింది. తన చిన్నప్పుడే, ఆ కుటుంబం న్యూయార్క్లో సెటిల్ అయ్యింది. స్నేహా మెడిసిన్ చదువుతున్నప్పుడు రాన్ ఆమెకు జూనియర్గా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత, అతడి కోసం స్నేహా ఏడాది చదువు ఆపుకుని, రాన్తో కలసి పట్టభద్రురాలైంది. మెడిసిన్ ఇంటర్న్షిప్కి ఆహ్వానం అందుకోగానే, 2000 సంవత్సరంలో పెళ్లితో ఒక్కటయ్యారు. అదే ఏడాది ట్విన్ టవర్స్కి 5 నిమిషాల దూరంలో ఉన్న బ్యాటరీ పార్క్లో అపార్ట్మెంట్ కొనుక్కుని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇద్దరూ డాక్టర్స్, కావాల్సినంత డబ్బు, రోజుకో పార్టీ, వారానికో ట్రీట్. ఆనందకరమైన జీవితానికి తామే ఉదాహరణ అన్నట్లుండేది ఆ జంట. డ్యూటీకి వెళ్లాలంటే అరగంటలోపు.. బంధువులు, స్నేహితులతో పాటు ఫిలిప్ ఇంటికి వెళ్లాలన్నా గంటలోపు ప్రయాణం చేస్తే సరిపోయేది. షాపింగ్స్కి, పార్టీస్కి వెళ్లడాన్ని బట్టి ఎవరిల్లు దగ్గర్లో ఉంటే వాళ్లింట్లో రాత్రుళ్లు ఉండిపోవడం, మరునాడు డ్యూటీస్కి అటునుంచే వెళ్లడం స్నేహా, రాన్లకు అలవాటైపోయింది.సెప్టెంబర్ 10న స్నేహా డ్యూటీకి లీవ్ పెట్టింది. ‘ఎల్లుండి మనింట్లో ఫ్యామిలీ పార్టీ ఉంది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేస్తా. షాపింగ్ చేస్తా, అందుకే సెలవు పెట్టా’ అని భర్తతో చెప్పింది స్నేహా. ఆ రోజు ఉదయం భర్తతో కలసి బయటికి వెళ్లి, 11 అయ్యేసరికి అతడితో బ్రేక్ఫాస్ట్ చేసి, తిరిగి ఇంటికి బయలుదేరింది. రాన్ అటు నుంచి అటే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే అదే రాత్రి రాన్ డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి స్నేహా ఇంట్లో లేదు. అత్తింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లుంటుందిలే అనుకున్న రాన్.. ఆ రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాడు. మరునాడు (సెప్టెబర్ 11) ఉదయం ఆరు గంటలకే లేచి, రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు 8.40 దాటేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని నార్త్ టవర్ (ట్విన్ టవర్స్లో ఒక బిల్డింగ్)లో ఉగ్రవాదులు విమానాన్ని కూల్చారన్న వార్త అతడ్ని వణికించింది. వెంటనే స్నేహాకు కాల్ ట్రై చేస్తే, కలవలేదు. మరో పావుగంటలో పక్కనే సౌత్టవర్లో మరో విమానం కూలిందని తెలియగానే రాన్కు స్నేహా గురించి భయం మొదలైంది. అప్పుడు కూడా స్నేహా ఫోన్ కలవకపోయేసరికి ఆమె కోసం తెలిసినవారికి, అత్తింటివారికి వరసగా కాల్స్ చేశాడు. ముందురాత్రి స్నేహా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారంతా. దాంతో రాన్ కంగారుగా తమ అపార్ట్మెంట్కి వెళ్లాడు. అప్పటికే కుప్పకూలిన ట్విన్టవర్స్ నుంచి దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో వారిని రిక్వస్ట్ చేసి, అపార్ట్మెంట్ సెక్యూరిటీ సాయంతో బిల్డింగ్ సీసీ ఫుటేజ్ని పరిశీలించాడు. ముందురోజు ఫుటేజ్లో సాయంత్రం 5:30కి స్నేహా ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. మరో 2 గంటలకు ట్విన్ టవర్స్ సమీపంలోని డిజైనర్ స్టోర్లో స్నేహా తనకోసం షూస్, ఇన్నర్ వేర్స్ కొనుక్కొన్నట్లు పరిచయమున్న సేల్స్మన్ ఒకరు రాన్తో చెప్పాడు. ‘నిన్న రాత్రి ఏడున్నరకు స్నేహా మేడమ్ మరో భారతీయురాలితో కలసి మా స్టోర్కి వచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కనిపించారు. ఆ మహిళను అంతకు ముందెప్పుడూ నేను చూడలేదు’ అని వివరించాడు. వెంటనే రాన్.. ఫిలిప్స్ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. రాన్ మాటలకు స్నేహా తల్లి అన్సు షాక్ అయ్యింది. ‘అదేంటి నిన్న మధ్యాహ్నం ట్విన్ టవర్స్, హోటల్లో తింటూనే నాతో చాలా సేపు చాటింగ్ చేసిందిగా?’ అంది అయోమయంగా. ‘నిన్న రాత్రి వేరే ఇండియన్ మహిళతో కలిసి షాపింగ్ కూడా చేసిందట ఆంటీ, పోనీ రాత్రి ఆమెతో పాటు ఉందనుకుంటే, మరునాడైనా ఇంటికి రావాలి కదా? ఒకవేళ ట్విన్ టవర్స్ దాడిలో ఇరుక్కుని..?’ మాట పూర్తి చేయలేకపోయాడు రాన్. ఆ అనుమానమే స్నేహా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ దాకా రప్పించింది.స్నేహా డాక్టర్ కాబట్టి.. 11న జరిగిన మొదటి దాడిలో గాయపడిన వారికి సేవలు చేయడానికి వెళ్లినప్పుడు ఇతర దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని చాలామంది నమ్మారు. అయితే ఈ కేసు కోర్టుకెక్కినప్పుడు ఎన్నో అభిప్రాయాలు వినిపించాయి. రాన్తో స్నేహాకున్న పర్సనల్ తగాదాల దగ్గర నుంచి ఆల్కహాల్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు ఉన్నాయా? అనేంత వరకూ ప్రతిదీ ఆరా తీసిన అధికారులు.. స్నేహా లెస్బియన్ అయ్యుండొచ్చని అనుమానించారు.డిజైనర్ స్టోర్లో స్నేహాతో ఉన్న అజ్ఞాత భారతీయ మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, పేరు మార్చుకుని, మిస్సింగ్ డ్రామా ఆడుంటుందని భావించిన న్యాయస్థానం 2004లో.. 9/11 మిస్సింగ్ జాబితా నుంచి స్నేహా పేరును తొలగించేసింది. అయితే ఫిలిప్ దంపతులతో పాటు రాన్ కూడా ఆ తీర్పును ఖండించాడు. ‘స్నేహాను వెతికిపెట్టండి’ అనే పోరాటాన్ని పక్కన పెట్టి.. ‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’ అనే పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది ఆ కుటుంబానికి. నిజానికి ట్విన్ టవర్స్ దాడిలో కొన్ని వందల మంది క్షణాల్లో కాలి బూడిదైపోయారు. వారిలో చాలామంది వివరాలు నేటికీ తేలలేదు.చివరికి 2008లో న్యూయార్క్ కోర్టు స్నేహాపై వచ్చిన వదంతులను కొట్టి పారేస్తూ, 9/11 దాడుల బాధితురాలిగా స్నేహా పేరును ఆ జాబితాలో చేర్చింది. అయితే నేటికీ ఆమె అవశేషాలు దొరక్కపోవడంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు? ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూద్దాం’ అనుకుని మైకేల్ ఇంటి వైపు అడుగులేశాడు క్రిస్.క్రిస్ వెళ్లేసరికి మైకేల్ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. హాల్లో కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించిన తన ఓనర్ని మొదట ‘సార్.. సార్!’ అని బయట నుంచే పిలిచాడు. ఎంత పిలిచినా ఇంట్లో ఎవరూ పలుకకపోయేసరికి, దగ్గరకు వెళ్లి లేపుదామన్నట్లు ఇంటి లోపలికి అడుగులేశాడు. సోఫా దగ్గరకు వెళ్లేసరికి మైకేల్ ప్రాణాలతో లేడు. అతడి నుదుటిపైన తుపాకీతో కాల్చిన గాయం క్రిస్ని గజగజ వణికించేసింది. పైగా ఇల్లంతా ఆవహించిన నిశ్శబ్దం అతడ్ని మరింతగా భయపెట్టింది. వెంటనే బయటికి పరుగుతీసి, పోలీసులకు సమాచారమందించాడు.క్రైమ్ టేప్స్ చుట్టి, ఇల్లంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు. ఆ ఇంట్లో మైకేల్ మృతదేహంతో పాటు మరో శవాన్ని గుర్తించారు. అది మైకేల్ భార్య మేరీ షార్ట్ది. ఆమెను కూడా పైన బెడ్రూమ్లో నిద్రలో ఉండగానే ఎవరో కాల్చి చంపేశారు. అంటే ఒకేరాత్రి జంట హత్యలు జరిగాయి. మరి కిల్లర్ ఎవరు? అనే దిశగా విచారణ మొదలైంది. ఆ సమయంలో అధికారులకు క్రిస్ కీలక సాక్షిగా మారాడు.‘మైకేల్ సార్ది మొబైల్ హోమ్ మూవింగ్ బిజినెస్. నాలానే చాలామంది వర్కర్స్ అతని దగ్గర పనిచేస్తున్నారు. ముందురోజు రాత్రి పది దాటే వరకూ డెలివరీ పని మీద సార్ నాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే తొమ్మిదికిక్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు. ఎప్పుడూ పది నిమిషాలు ముందుండే మనిషి ఎంతకూ రాకపోయేసరికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్లాను’ అని క్రిస్ చెప్పాడు. నిజానికి మైకేల్ శవాన్ని మొదటిగా చూసిన వ్యక్తి, మైకేల్ సజీవంగా ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తి క్రిస్ మాత్రమే!‘అసలు రాత్రికి రాత్రి మైకేల్ ఇంట్లో ఏమైంది?’ అనే ప్రశ్నతో పోలీసులు తలలు పగలగొట్టుకుంటుంటే.. మైకేల్, మేరీల బంధువులంతా ‘జెన్నిఫర్ ఎక్కడ?’ అని ప్రశ్నించారు. విచారణ అధికారులంతా తెల్లబోయారు. వారి నుంచి ‘జెన్నిఫర్ ఎవరు?’ అనే ప్రశ్న అప్రయత్నంగానే వచ్చింది.జెన్నిఫర్.. మైకేల్, మేరీల ఏకైక కుమార్తె. తొమ్మిదేళ్ల పాప. లేకలేక పుట్టిన సంతానం. చాలా అందంగా, క్యూట్గా ఉండే తెలివైన పిల్ల. ‘జంట హత్యల తర్వాత పాప కనిపించడం లేదంటే, కిల్లర్ టార్గెట్ జెన్నిఫర్ని ఎత్తుకెళ్లడమేనా?’ అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.నిజానికి ఆ రాత్రి మైకేల్ పది దాటాక ఇంటికి వెళ్లాడని క్రిస్ చెప్పాడు. అదే రాత్రి పదిన్నరకు మేరీ డిన్నర్ ఐటమ్స్ కొని ఇంటికి తీసుకెళ్లిందని ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు చెప్పాడు. ‘సాధారణంగా రాత్రి సమయంలో తన గురక కారణంగా మేరీ నిద్ర చెడిపోకూడదని చాలాసార్లు అదే సోఫాలో నిద్రపోతుంటాడట మైకేల్. పైన బెడ్రూమ్లో మేరీ నిద్రపోతుంది. ఆ రాత్రి అదే జరిగినట్లుంది’ అని క్లారిటీ ఇచ్చింది మేరీ సోదరి.ఇంట్లో అంతా నిద్రపోయాక దుండగుడు.. మైకేల్, మేరీలను చాలా సులభంగా చంపి, పాపను ఎత్తుకుపోయాడనేది అప్పటికే స్పష్టమైంది. అంటే బహుశా ఆ కిల్లర్ ఆ ఇంటికి అతిథిగా వచ్చి ఉంటాడా? ఆ దంపతులకు సుపరిచితుడేనా? ఇలా చాలా అనుమానాలు తలెత్తాయి.మైకేల్ ఇంటి సమీపంలో ఆ రాత్రి ఎప్పుడూ చూడని తెల్లటి కారు ఒకటి చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. అదే తెల్లటి కారులో మరునాడు తెల్లవారుజామున (మృతదేహాలను చూసిన రోజు) 40 ఏళ్ల అపరిచిత వ్యక్తి వెళ్లడం చూశామని మరికొందరు ఇరుగు పొరుగువారు చెప్పారు. దాంతో కిల్లర్ ఊహాచిత్రాన్ని గీయించే పనిలో పడ్డారు అధికారులు. పాప కోసం దగ్గర్లోని అడవిని, చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు.2002 ఆగస్ట్ 15న వర్జీనియా, హెన్రీ కౌంటీలో జరిగిన ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యలు జరిగిన ఆరు వారాల తర్వాత మైకేల్ ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉన్న స్టోన్ విల్ క్రీక్ అనే ప్రాంతంలోని అల్బర్ట్ అనే వ్యక్తి ఇంటి ముందు కుళ్లిన దవడ భాగం దొరికింది. మొదట దాన్ని గమనించిన అల్బర్ట్ ఫ్యామిలీ ఏదో జంతు కళేబరాన్ని కుక్కలు తెచ్చి పడేసి ఉంటాయని భావించారు. పరిశీలనగా చూస్తే అది పిల్లల దవడ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎన్ఏ టెస్ట్లో అది జెన్నిఫర్దని తేలింది. వెంటనే మృతదేహం కోసం సమీపంలో వెతికించారు. పాడుబడిన ఒక వంతెన కింద కుళ్లిపోయిన పాప శవం కనిపించింది. అయితే స్టో¯Œ విల్ క్రీక్కి గతంలో మైకేల్ చాలా మొబైల్ హోమ్స్ డెలివరీ చేశాడని తేలింది. పైగా అక్కడ చాలామంది డీలర్స్తో అతడికి స్నేహ సంబంధాలున్నాయి.పాప మృతదేహం దొరికిన చోట క్షుణ్ణంగా పరిశోధన చేసినా, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయితే ఆ విచారణలో గ్యారిసన్ బౌమన్ అనే ఒక నేరచరిత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతణ్ణి విడిచిపెట్టారు. రాత్రికి రాత్రి ఎవరైనా సీరియల్ కిల్లర్ రహస్యంగా ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక నిజంగానే ఆ క్రూరుడు పథకం ప్రకారం మైకేల్ ఫ్యామిలీని మోసం చేసి మట్టుపెట్టాడా? అనేది తేలలేదు. దాంతో ఇరవై రెండేళ్లు గడచిపోయినా ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
అసలు ఈ కియా కారు కథేంటి..
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్స్టేషన్లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్గ్రేడ్ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.దిక్కుమొక్కు లేక..ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్స్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.అసలు ఈ కియా కారు కథేంటి..ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్లోనే మగ్గుతోంది.కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. -
అయ్యో గజరాజా.. 48 గంటల్లో ఎనిమిది అనుమానాస్పద మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో 48 గంటల్లో ఎనిమిది ఏనుగులు మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంగళవారం ఏడుగురు మృతి చెందగా, నిన్న (బుధవారం)మరో ఏననుగు మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఏనుగుల్లో ఏడు ఏనుగులు.. ఒక్కొక్కటి మూడు ఏళ్ల వయస్సు గలవి ఉన్నాయి. ఎనిమిదో ఏనుగ ఐదేళ్ల మగ ఏనుగుగా అధికారులు గుర్తించారు. మొత్తం 13 మంది ఏనుగుల్లో తొమ్మిదో ఏనుగు పరిస్థితి విషమంగా ఉందని వన్యప్రాణి అధికారులు పేర్కొన్నారు. వైద్యసేవలు పొందిన పదో కోలుకున్నట్లు తెలిపారు. ఇక.. మిగిలిన మూడు ఏనుగుల నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏనుగుల మృతిపై.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణను చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం విషంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు కళేబరాలు ఉన్న ప్రాంతంలోని ఐదుగురి వ్యక్తులను వన్యప్రాణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కోడో మిల్లెట్ గింజలను ఏనుగులు తిన్నాయా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కోడో మిల్లెట్ గింజలు ఫంగస్తో కలుషితమైతే సైక్లోపియాజోనిక్ యాసిడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందుకే.. మృతిచెందిన ఏనుగుల మలం నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. -
మిస్టరీ.. రసెల్ ఎవాన్స్
అర్ధరాత్రి పన్నెండున్నర దాటేసరికి జాన్ ఎవాన్స్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అనగానే, ‘డాడ్! ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, బయలుదేరుతున్నా. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తా’ అన్నాడు రసెల్. ‘సరే నాన్నా జాగ్రత్త!’ అని ఫోన్ పెట్టేశాడు జాన్. గంట దాటేసరికి, మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి కాల్ చేసింది సేక్రడ్ హాస్పిటల్ రిసెప్షనిస్ట్. తమ ఆసుపత్రి వివరాలన్నీ చెప్పి, ‘మీ అబ్బాయి రసెల్ పరిస్థితి సీరియస్గా ఉంది. త్వరగా రండి’ అంది. జాన్ కి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ‘ఏమంటున్నావ్?’ అని గట్టిగా అరిచాడు. వెంటనే రిసెప్షనిస్ట్ చేతిలోంచి ఫోన్ అందుకున్న రసెల్ స్నేహితురాలు శాండీ.. ‘అంకుల్! మన రసెల్ కోమాలోకెళ్లాడంటున్నారు త్వరగా రా అంకుల్’ అంటూ ఏడ్చేసింది. దాంతో జాన్ వెంటనే భార్య స్యూ ఎవాన్స్ని తీసుకుని ఆ ఆసుపత్రికి పరుగు తీశాడు.ఆసుపత్రిలో ఓ పక్క పోలీసుల ఫార్మాలిటీస్, మరో పక్క ఆసుపత్రి సిబ్బంది పరుగులు జాన్ దంపతుల్ని వణికించేశాయి. ఏం జరిగిందో చెప్పడానికి రసెల్ స్పృహలో లేడు. ఏమైందో తెలుసుకోవడానికి గుండెధైర్యం చాలట్లేదు. అయినా ఏడుస్తూనే పోలీసుల్ని ఆరా తీస్తే, హిట్ అండ్ రసెల్ కేసన్నారు. శాండీ మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. ‘అంకుల్! నేను ఇందాకే వ¯Œ అయ్యేసరికి పార్ట్టైమ్ జాబ్ ముగించుకుని నడుస్తూ ఇంటికొస్తుంటే, మన అపార్ట్మెంట్కి సమీపంలో రోడ్డు మీద రసెల్ కదల్లేని స్థితిలో పడున్నాడు. ‘బ్రియాన్! బ్రియాన్!’ అని గట్టిగా అరుస్తున్నాడు. దగ్గరకెళ్లి చూస్తే ఒళ్లంతా రక్తం, భయమేసి అంబులెన్స్ కి కాల్ చేసి, ఆసుపత్రికి తీసుకొచ్చాం. రాగానే కోమాలోకి వెళ్లిపోయాడు. కానీ నేను రసెల్ని గుర్తించిన సమయంలో అక్కడ పొదల్లో ఎవరో ఉన్నట్లనిపించింది. ఎవరా? అని నేను వంగి చూసేసరికి, తెల్ల చొక్కా వేసుకున్న ఒక అబ్బాయి మన అపార్ట్మెంట్స్ వెనకున్న కొండలవైపు పారిపోయాడు. కానీ మన రసెల్కి బ్రియాన్ అనే స్నేహితుడున్నాడు కదా. తను అప్పటిదాకా రసెల్తోనే ఉన్నాడేమోనని నా అనుమానం. ఇదంతా పోలీసులకు చెప్పినా, హిట్ అండ్ రసెల్ అనే రాసుకున్నారు’ చెప్పింది శాండీ.జాన్ కుటుంబానికి శాండీ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్సే. అంతా ఒకే బ్లాక్లో ఉండేవారు. రసెల్, శాండీలు మంచి స్నేహితులు. ఎనిమిదో తరగతి చదువుతున్న రసెల్కి 13 ఏళ్లు. శాండీ అతడికంటే రెండేళ్లు పెద్దది. రసెల్కి డయానా అనే ఐదేళ్ల చెల్లెలు కూడా ఉంది. చదువులో ముందుండే రసెల్ బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. టీన్స్లోకి వచ్చేసరికి స్నేహితులు పెరగడంతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ గడిపేవాడు. గతంలో స్యూ ఎవాన్స్ నర్స్గా, జాన్ కార్డియో పల్మనరీ టెక్నాలజిస్ట్గా పనిచేయడంతో వైద్యరంగంపై వారికి బాగానే అనుభవముంది. శాండీ మాటలు విన్న వెంటనే, తమ గత అనుభవాన్ని ఆ ఆసుపత్రి వైద్యులకు వివరించి, రసెల్ పరిస్థితిని గమనించడానికి చికిత్స జరుగుతున్న గదికెళ్లారు. రసెల్ని ఒక పెద్ద వాహనం ఢీ కొట్టినమాట నిజమే కాని, దానికంటే ముందు అతన్ని ఎవరో బ్యాట్లాంటి బలమైన వస్తువుతో కొట్టినట్లు అతడి ఒంటిపై ఆనవాళ్లున్నాయి. అదే విషయం పోలీసులకు చెప్పి వాపోయారు. అయినా అధికారుల్లో చలనం లేదు. దురదృష్టవశాత్తు ఉదయం తొమ్మిదయ్యేసరికి రసెల్ చనిపోయాడు. కొడుకు మరణంతో అల్లాడిపోతున్న ఆ దంపతులకు అప్పుడే ఆ ఆసుపత్రి రిసెప్షనిస్ట్ మరో క్లూ ఇచ్చింది. రసెల్ ఆసుపత్రిలో జాయిన్ అయిన ఒక గంటకే బ్రియాన్ అనే వ్యక్తి కాల్ చేసి, రసెల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడని చెప్పింది. వెంటనే రసెల్ స్నేహితుడు బ్రియాన్ని పిలిపించాడు జాన్. మొదటి నుంచి ‘నాకేం తెలియదు’ అన్నట్లే మాట్లాడాడు బ్రియాన్. జాన్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తూ, రసెల్పై దాడి జరిగిన రాత్రి వైట్ కలర్ షర్ట్ వేసుకున్నానని అసంకల్పితంగా చెప్పేశాడు. అదే విషయాన్ని జాన్ పోలీసులకు చెప్పాడంతో బ్రియాన్ని అదుపులోకి తీసుకుని నిలదీశారు. అయితే బ్రియాన్ తనకసలు వైట్ షర్టే లేదని మాట మార్చేశాడు. దాంతో రసెల్ కుటుంబం ఈ విషాదంలో ప్రత్యక్ష సాక్షి బ్రియాన్ అని నమ్మడం మొదలుపెట్టింది.ఈలోపు పోస్ట్మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. దానిలో రసెల్ని ఏదో వాహనం గుద్దేయడంతోనే మరణం సంభవించిందని అందులో ఉంది. ఇంతలో రసెల్ చనిపోయాడని తెలియగానే, ఆరోన్ అనే స్నేహితుడు ముందుకొచ్చాడు. ‘ఆ రాత్రి తొమ్మిది అయ్యేసరికి మేమిద్దరం దగ్గర్లోని పార్క్కి వెళ్లాం. అక్కడ నాకు గతంలో నా గర్ల్ఫ్రెండ్ని ఏడిపించిన ఒక అబ్బాయి కనిపించాడు. వాడికి వార్నింగ్ ఇచ్చేక్రమంలో నా పక్కనే ఉన్న రసెల్ వాడ్ని కొట్టాడు. అయితే ఆ అబ్బాయి కోపంగా తన వాళ్లని తీసుకొస్తానని పరుగెత్తాడు. పార్క్లో మా గొడవ చూసిన కొందరు పెద్దవాళ్లు ‘ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు. వాళ్లతో గొడవ మంచిది కాదు, ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి’ అని సలహా ఇచ్చారు. దాంతో మేము అక్కడి నుంచి వచ్చేశాం. రసెల్ తన బాస్కెట్బాల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాననడంతో నేను మా ఇంటికి వెళ్లిపోయా. బహుశా ఆ పార్క్లో అబ్బాయిగానీ రసెల్పై పగ తీర్చుకున్నాడేమో?’ అని తన మనసులో అనుమానాన్ని పోలీసుల ముందు బయటపెట్టాడు.దాంతో దేశంలోనే ప్రముఖ డాక్టర్ విలియం ఎకెర్ట్ని నియమించి, మరణానికి అసలు కారణం తేల్చమన్నారు జాన్ దంపతులు. విలియం మళ్లీ శవపరీక్ష చేసి, యాక్సిడెంట్కి ముందే రసెల్పై తీవ్రమైన దాడి జరిగిందని, అంటే ఎవరో కావాలనే ఆ యాక్సిడెంట్ చేశారని క్లారిటీ ఇచ్చాడు. రెసెల్ పడి ఉన్న ప్రదేశానికి 86 అడుగుల ముందే అతని షూస్, సాక్స్ రక్తం మరకలతో దొరికాయి. బహుశా మనిషిని కింద పడేసి, బండితో ఈడ్చి పారేసి ఉంటారని విలియం అంచనా వేశాడు.1996 జూన్ 3న అర్ధరాత్రి ఒంటిగంటకు వాషింగ్టన్, స్పోకాన్లో ర సెల్ అపార్ట్మెంట్కి చేరువలో రోడ్డుపై.. చావు బతుకుల మధ్య శాండీ అనే స్నేహితురాలికి కనిపించాడు. సుమారు 8 గంటలు కోమాలో ఉన్న రసెల్, జూన్ 4న ఉదయం 9 గంటలకు చనిపోయాడు.ఆ రాత్రి పార్క్లో గొడవపడిన కుర్రాడితో పాటు అతడి గ్యాంగ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ నిజాలు బయటికి రాలేదు. కొడుకు చనిపోయాడన్న బెంగతోనే జాన్ 1998లో మరణించాడు. మరో పదమూడేళ్ల న్యాయపోరాటం తర్వాత రసెల్ తల్లి స్యూ చనిపోయింది. ఇప్పటికీ అతని సోదరి డయానా తన అన్నను చంపిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఏది ఏమైనా, కొన ఊపిరితో ఉన్న రసెల్ తన స్నేహితుడు బ్రియాన్ పేరెందుకు పిలిచాడు? ఆసుపత్రికి కాల్ చేసింది ఎవరు? నిజంగానే పార్క్లో కుర్రాడికి, అతని గ్యాంగ్కి ఆ రాత్రి రసెల్ ఒంటరిగా దొరికేశాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
మైక్ ఎమర్ట్
వాషింగ్టన్ , రెడ్మండ్లో నివసించే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మైక్ ఎమర్ట్ 2001లో స్టీవెన్ అనే కస్టమర్కి వుడిన్విల్ శివార్లలో ఉన్న గెయిల్ ఇంటిని చూపించడానికి వెళ్లి, అక్కడే హత్యకు గురయ్యాడు. స్టీవెన్ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు ఉత్తర కాలిఫోర్నియా నుంచి మకాం మారుతున్నట్లు చెప్పాడట! 2011లో కీలక ఆధారాలు దొరికినా, ఫలితం లేకుండా పోయింది. న్యాయపోరాటం చేసీ చేసీ చివరికి మేరీ 2024 జనవరిలో ఈ కే సును క్లోజ్ చేయాలని అధికారులను కోరారు. ‘మైక్! మైక్! ఎక్కడున్నావ్? చాలాసేపటి నుంచి నీ ఫోన్ మోగుతోంది, ఏదో అన్నోన్ నంబర్’ అంటూనే అతడి ఫోన్ పట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చింది మేరీ. ‘హా వస్తున్నా మేరీ! టూ మినిట్స్. స్నానం అయిపోయింది’ అని బాత్రూమ్లోంచి బదులిచ్చాడు మైక్. ‘సరే అయితే ఫోన్ బెడ్ మీద పెడుతున్నా. బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్లు, రెడీ అయిపోయింది’ అని చెప్పి మళ్లీ కిచెన్లోకి వెళ్లిపోయింది మేరీ. వారిది ప్రేమ వివాహం. ఇరువురూ సంపన్నులే కావడంతో పెళ్లికి ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. పిల్లలు మేరీ తల్లి దగ్గర పెరగడంతో చాలా డీల్స్ ఇద్దరూ కలిసే చేస్తుండేవారు. మైక్ రెడీ అయ్యి ఫోన్ను మెడకు, భుజానికి మధ్య నొక్కిపెట్టి మాట్లాడుకుంటూ, చేతి షర్ట్ బటన్ పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో మేరీ తింటూనే అతడికీ బ్రేక్ఫాస్ట్ అందించింది. ‘అయ్యో, స్టీవెన్ గారు! మీకు నచ్చడమే మాకు కావాలి. మీరు కోరుకున్నట్లే అదే ఇల్లు, మళ్లీ ఒకసారి మొత్తం చూపిస్తా. నచ్చితే బయానా మాట్లాడుకుందాం. ఓనర్ ఎలాగో ఆఫీస్కి వెళ్లుంటారు, సెకండ్ కీ నా దగ్గరే ఉంది, సో మనం వెళ్లొచ్చు. ఇబ్బందేమీలేదు. మీరు కొనుక్కునేవాళ్లు, మేము అమ్ముకునేవాళ్లం. ఒకటికి పదిసార్లు చూసుకోవడం మీ హక్కు. ఓకే సార్! మీరు చెప్పిన∙టైమ్కి కిర్క్లాండ్ షాపింగ్ మాల్కి వచ్చేస్తా’ అనేసి ఫోన్ పెట్టేశాడు మైక్.అంతా విన్న మేరీ తింటూనే, ‘ఎవరు మైక్? స్టీవెనేనా? అంటే, ఆరోజు కుంటుకుంటూ వచ్చాడే అతనేనా?’ అంది ఆత్రంగా. ‘అవును మేరీ! అతనే, మళ్లీ వచ్చాడు. మనం చూపించిన అన్ని ఇళ్లల్లోనూ గెయిల్ ఇల్లు అతనికి బాగా నచ్చిందట. నన్ను కిర్క్లాండ్ మాల్కి రమ్మన్నాడు. ఇద్దరం కలసి ఆ ఇంటికి వెళ్తాం. ఈ బేరం కుదిరేలానే ఉంది’ అన్నాడు మైక్. మరి నేనూ రానా అంది మేరీ. ‘వద్దు. చూపించడమే కదా! బేరం ఓకే అయితే అప్పుడొద్దువుగానిలే’ అన్నాడు మైక్.అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యేసరికి గెయిల్ ఆఫీస్ నుంచి భోజనానికి తన ఇంటికి వచ్చింది. పైన బాత్రూమ్లో ఏకధారగా నీళ్లుపోతున్న శబ్దం విని, ఇంట్లో ఎవరో ఉన్నారనిపించింది. ధైర్యం చేసి మెట్లు ఎక్కి బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి నడుస్తుంటే, దారిపొడవునా రక్తం చారలు ఆమెను వణికించాయి. బాత్ టబ్లో మనిషి శవం నీళ్లల్లో మునిగి ఉంది, పైన షవర్ నుంచి నీరు ధారగా పడి, బాత్ టబ్ పొంగుతోంది. టబ్లో నిండిన నీళ్లు రక్తంతో కలసి పారుతున్నాయి. అది చూసి అప్రయత్నంగా కెవ్వుమంది గెయిల్. కాస్త తేరుకుని, గజగజ వణుకుతూ మరోసారి ఆ శవం ఎవరిదా? అని పరికించి చూసింది. తన ఇల్లు అమ్మకానికి తీసుకున్న రియల్ఎస్టేట్ వ్యాపారీ మైక్దని గుర్తించి నిర్ఘాంతపోయింది.రంగంలోకి దిగిన పోలీసులు బాడీని పోస్ట్మార్టమ్కి పంపించి, మేరీకి సమాచారం అందించారు. మైక్ ఒంటి మీద 19 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్ట్లో తేలింది. అతడి ఖరీదైన వాచ్, డైమండ్ రింగ్, పర్స్ కనిపించడం లేదని దర్యాప్తులో తెలిసింది. వాటిని కిల్లర్ దోచుకెళ్లాడని నమ్మారు. వేలిముద్రల వంటి ఆధారాలను నాశనం చేయడానికే మైక్ని బెడ్రూమ్లో చంపి, బాత్టబ్లో ముంచాడని స్పష్టత వచ్చింది.‘ఉదయం స్టీవెన్ అనే పెద్దాయన మైక్కి కాల్ చేసి, కిర్క్లాండ్ మాల్కి రమ్మన్నాడు. అక్కడి నుంచే గెయిల్ ఇంటికి వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. స్టీవెన్ మొదటిసారి గెయిల్ ఇంటిని చూడటానికి వచ్చినప్పుడు మైక్తో పాటు నేను కూడా అతణ్ణి చూశాను. అతడికి 50 ఏళ్లుపైనే ఉంటాయి. అతను కుంటివాడు, కర్ర సాయంతో నడవడం చూశాను’ అని చెప్పింది మేరీ. వెంటనే మేరీ చెప్పిన మాల్కి వెళ్లారు అధికారులు. అక్కడ పార్కింగ్లో మైక్ కారు దొరకడంతో స్టీవెనే కిల్లర్ అనే క్లారిటీ వచ్చేసింది.అయితే స్టీవెన్ అనే పేరు అబద్ధం కావచ్చని, స్టిక్ పట్టుకుని నడవడమనేది నాటకం కావచ్చని, ఆ స్టిక్లోనే పదునైన కత్తి దాచి ఉంటాడని, కేవలం దొంగతనమే అతడి టార్గెట్ కాకపోవచ్చని అంచనాలు మొదలయ్యాయి. స్టీవెన్ ప్రొఫెషనల్ హిట్మెన్ అయ్యి ఉంటాడని, మైక్ని చంపడానికి ఎవరితోనో సుపారీ మాట్లాడుకుని వచ్చి ఉంటాడని అధికారులు నమ్మసాగారు. అందుకే మైక్ను హత్య చేయడానికి జనసంచారానికి దూరంగా ఉండే గెయిల్ ఇంటినే కిల్లర్ ఎంచుకుని ఉంటాడని భావించారు. అయితే మైక్ని చంపాలనుకునేంత శత్రువులు ఎవరూ లేరని మేరీ చెప్పింది. బంధుమిత్రులూ అదే మాటన్నారు.సరిగ్గా పదేళ్లకి టెక్నాలజీ సాయంతో నేరం జరిగిన ప్రదేశంలో ఒక డీఎన్ఏని గుర్తించారు. అది గ్యారీ క్రూగేర్ అనే మాజీ పోలీస్ అధికారిదని రుజువైంది. అతడు అప్పటికే చనిపోయాడు. అతడికి మైక్ మర్డర్ కేసులోనే కాదు, మరో మూడునాలుగు మర్డర్ కేసులతో సంబంధం ఉందని తేలింది. పైగా రిటైర్మెంట్ తర్వాత గ్యారీ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా పని చేశాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు జిమ్ బారీ హత్య కేసులోనూ, బ్రాడ్షా మిస్సింగ్లోనూ గ్యారీకి సంబంధం ఉంది.ఏది ఏమైనా గ్యారీ, స్టీవెన్ ఇద్దరూ ఒక్కరేనా? మైక్ని చంపింది ఒక వ్యక్తేనా? అతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? గ్యారీ రియల్ఎస్టేట్ రంగంలో తనకు పోటీ లేకుండా చేసుకోవడానికి మైక్తో పాటు మిగిలిన హత్యలు చేశాడా? లేదంటే ఎవరైనా మైక్ శత్రువులు గ్యారీతో బేరం కుదుర్చుకున్నారా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన -
బ్యాంకాక్లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
బ్యాంకాక్: టూరిస్టుల స్వర్గధామం థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆరుగురు విదేశీయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరుగురు మంగళవారం(జులై 16) నగరంలోని ఓ హోటల్ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. వీరంతా వియత్నాం దేశస్తులని సమాచారం.అయితే వీరిలో ఇద్దరికి అమెరికా పాస్పోర్టులుండటం గమనార్హం. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు. వీరు శని, ఆదివారాల్లో వేరువేరుగా బ్యాంకాక్లోని ఓ ప్రముఖ హోటల్కు వచ్చి రెండు గదులు తీసుకున్నారు. అనంతరం మంగళవారం వారంతా ఒకే గదిలో చనిపోయి ఉండటం మిస్టరీగా మారింది. విదేశీయులు అనుమానాస్పదంగా మృతి చెందిన హోటల్ను ప్రధాని స్రెత్తా తవిసిన్ పరిశీలించారు. పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకుగాను ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రధాని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురితో పాటు వేరే ఎవరైన వ్యక్తి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
వేలూరు: ఆకాశం నుంచి ఏదో వస్తువు పడి పేలిన పెద్ద శబ్ధం వచ్చి, ఆ ప్రాంతంలో ఐదు అడుగుల మేర గుంత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా జోలార్పేట సమీపంలోని అచ్చమంగలం కోట గౌండర్ ప్రాంతానికి చెందిన రైతు రవి. ఇతని వ్యవసాయ భూమిలో గత రెండు రోజుల క్రితం పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు గమనించి వ్యవసాయ భూమి వద్దకు వెల్లి పరిశీలించగా ఐదు అడుగుల లోతు, రెండు అడుగుల వెడల్పుతో కూడిన గుంత ఏర్పడి ఉండడాన్ని గమనించారు. అలాగే ఈ గుంత నుంచి అధికంగా వేడి గాలి వచ్చినట్లు స్థానికులు గుర్తించిన ఆకాశం నుంచి ఏదైనా వస్తువు పడిందా? లేక వేరే ఏమైనా పడిందా? అనే కోణంలో స్థానికులు జోలార్పేట తహసీల్దార్కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దర్పకరాజ్, తహసీల్దార్ ఆనంద క్రిష్ణన్, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరిపారు. వీటిపై కలెక్టర్ దర్పకరాజ్ మాట్లాడుతూ వ్యవసాయ పొలంలో పెద్ద శబ్దంతో కూడిన వస్తువు పడినట్లు స్థానికులు తెలపడంతో వాటిని తనిఖీ చేశామని, అయితే వీటిపై పరిశోధన కేంద్రం అధికారులకు సమాచారం అందజేయడంతో వీటిని నిపుణులు పరిశోధన చేయనున్నారని, ఇప్పటికే గుంటలోని మట్టిని పరిశోధనకు పంపామన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం ఉదయం వే లూరులోని పరిశోధన కేంద్రం అధికారుల బృందం నేరుగా వచ్చి తనిఖీ చేశారని పల్లంలోని మట్టితోపాటు బాగా కాలిన బూడిదను పరిశోధనకు తీసుకెళ్లినట్లు తెలిపారు. పల్లం చుట్టూ ఎవరూ దగ్గరకు వెళ్లకుండా ట్రంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. -
16 మంది మాయం.. మంజుమ్మెల్ బాయ్స్ ‘గుణ గుహ’ గురించి తెలుసా?
మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే.. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్ను అలరిస్తోంది. 2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది. Video Credits: Pyramid Glitz Music -
అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా?
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ‘ప్రణీత్రావు అండ్ కో’ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు... ఈ నెల తొలి వారం నుంచి పోలీసులు లీకుల రూపంలో చెబు తున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్ కేసు, ఆయన రిమాండ్ రిపోర్టులో ఎక్కడా ట్యాపింగ్ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు టార్గెట్ వేరే ఉందా? అనే అనుమానాలు కలు గుతున్నా యి. ప్రణీత్ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్క ట్లేదు. కేసులో ఒక్కటి మినహా అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఏపీలో నమోదైన ‘స్కిల్డెవల ప్మెంట్’ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409సెక్షన్ ఈ కేసులోనూ ఉండటంతో ప్రణీత్ జ్యుడీషియల్ రిమాండ్కు వెళ్లాడని నిపుణులు చెప్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అస్పష్టంగా.. ఎస్ఐబీలో అంతర్భాగమైన స్పెషల్ ఆపరే షన్స్ టార్గెట్ (ఎస్ఓటీ) బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్.. ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్ఐబీ అంతర్గత విచారణలో ఆయన చేసిన అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ విభాగాధిపతి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణీత్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొంత వరకు ట్యాపింగ్కు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఎస్ఓ టీకి ఉద్దేశించిన లీజ్డ్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రణీత్ దుర్వినియోగం చేశారని అందులో ఆరోపించారు. అందులోనే 42 హార్డ్డిస్క్లు మార్చేయడం, ధ్వంసం చేయడం అంశాన్నీ ప్రస్తావించారు. ఈ సస్పెన్షన్ జరిగిన వారం తర్వాత ఎస్ఐబీ ఏఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్లో ప్రణీత్, ఇతరులపై కేసు నమోదైంది. ఆ రెంటిలో కనిపించని ప్రస్తావన... ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు మూడు చట్టాల్లోని 9 సెక్షన్ల కింద అభియోగాలు చేశారు. ఐపీసీ, ఐటీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లు వాడారు. ఈ నెల 13న అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్లో ఐపీసీలోని 120బీ (కుట్ర) ఉండగా... రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్ కనిపించలేదు. సెక్షన్ 34 చేర్చినప్పుడు 120బీ ఉండాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్టులో తొలగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. అయితే ఓ నిందితుడిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయాలంటే కచ్చితంగా టెలిగ్రాఫిక్ యాక్ట్ను జోడించాలి. అయితే ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ రెండింటిలోనూ ఎక్కడా ప్రత్యక్షంగా ట్యాపింగ్ ప్రస్తావన, ఈ యాక్ట్ కనిపించకపోవడం గమనార్హం. ఆ అధికారులూ బాధ్యతులే అవుతారు... ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ కేసులో దీన్ని ప్రస్తావించకపోవడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేయడం చాలా ఖరీదుతో కూడిన అంశం. అధికారికంగా ట్యాప్ చేయాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ సహకారం అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం వారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇది డీఎస్పీ ప్రణీత్ వద్ద నుంచే వచ్చి... ఎస్పీ సహా కొందరు ఉన్నతాధికారులు ఫార్వర్డ్ చేయాలి. ఈ లేఖలు సర్వీస్ ప్రొవైడర్ వద్ద నిర్ణీత కాలం వరకు భద్రంగా ఉండాలి. ట్యాపింగ్ కోణంలో దర్యాప్తు చేస్తే ఆధారాలు సేకరించడం, తదుపరి చర్యలు తీసుకోవడం తేలికే అయినప్పటికీ... అప్పట్లో లేఖలు ఫార్వర్డ్ చేసి, ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అసలు లేఖలే లేకుండా లేదా ప్రాపర్ చానల్లో రాకుండా ట్యాపింగ్కు సహకరిస్తే సర్వీస్ ప్రొవైడర్ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారికంగా ఎక్కడా ట్యాపింగ్ ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని టార్గెట్ వేరేది ఏదో ఉంటుందని, అది తెలియాలంటే మరికొన్నాళ్లు పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'!
కొన్ని పుకార్లు ఎంతగా భయపడతాయంటే..తరాలు మారిన ఆ భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఎందువల్ల అనేది అర్థంకానీ మిస్టరీలా ఉండిపోతుంది. తెలుసుకుందామంటే..కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది. ఆ భయమే ఆ చేధనలో కనిపించి వామ్మో! ఎందుకులే అనిపించేలా ఉంటాయి. అలా నేటికీ అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ ఫాల్ గాథ ఇది!. ఇప్పటికీ ఆ వాటర్ఫాల్ వద్దకు రాత్రుళ్ల వెళ్లాలంటే హడలే..! అది మేఘాలయలోని ‘రంగ్జిర్తెహ్’ గ్రామం. ఇది ‘లికాయి’ అనే స్త్రీ కథ. లికాయికి యుక్తవయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్నిరోజులకే.. అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మోడుగా మార్చింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచటం ఆమెకు కష్టమైంది. దాంతో లికాయి.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు.. తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినే ఎన్నుకుని రెండో పెళ్లి చేసుకుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు.. ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లికాయి. ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపునిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు, వక్క వేసుకుని తృప్తిగా తేన్చాలి అనుకుంది. కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెని భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురు శరీరాన్ని అని గ్రహించి.. పిచ్చిదానిలా కేకలుపెట్టింది. తన రెండవ భర్తే ఇంతటి ఘోరానికి ఒడికట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్దపెద్దగా ఏడ్చింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాద గాథ.. మేఘాలయలోని ‘నోహ్కలికాయి వాటర్ ఫాల్స్’ ముందుండే పెద్ద బోర్డ్ మీద.. ఓ పురాణ గాథలా కనిపిస్తుంటుంది. ఈ ఉదంతం తెలిసిన వాళ్లంతా.. ఆ జలపాతం ‘ఓ కన్నతల్లి గుండె కోత’ అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రి పూట ఇక్కడికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. లికాయి.. ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని, తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మేవాళ్లంతా.. ఈ కథకు హారర్ టచ్ని ఇచ్చి.. మరింతమందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యథ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? లాంటి వివరాలేమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: 'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..) -
విలాసవంతమైన భవనం కట్టడం డ్రీమ్!..సడెన్గా మర్డర్ కేసులో..
అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్లండ్ రాజధాని బ్యాంకాక్లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్ టవర్’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్ యూనిక్ టవర్. ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది. 2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్లో.. స్వీడిష్ టూరిస్ట్ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సాయంతో నవంబర్ 10 థాయిలండ్కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్హౌస్ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. అతని కలే ఈ భవనం.. 1990లో రంగ్సన్ టోర్సువాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్ ఈ టవర్ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్ టోర్సువాన్ వారసుడు పన్సిత్ టోర్సువాన్.. టవర్పైకి ఎక్కి ఆన్లైన్లో ఫొటోలు షేర్ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన (చదవండి: అక్కడ కవి పుట్టిన రోజు ‘బర్న్స్ నైట్’ పేరుతో ఓ పండుగలా ..!) -
పోలీసులకు సవాల్గా మారిన ఆదిభట్ల హత్య కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిభట్ల ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హతుడు బతికుండగానే నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బలవంతంగా గోనె సంచిలో కుక్కారని, గాలి కూడా చొరబడకుండా మూట గట్టిగా కట్టేయడంతో లోపల ఊపిరాడక మరణించి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈనెల 16న బొంగుళూరు టోల్గేట్ నుంచి 1.5 కి.మీల దూరంలో బ్రాహ్మణపల్లి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. తెలిసిన వాళ్ల పనే.. హత్య అనంతరం మృతదేహాన్ని ఎక్కడ పారేయాలో కూడా దుండగులు ముందుగానే ప్లాన్ చేశారని, ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవుల్లో జాతీయ రహదారులలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరూ గుర్తించలేరని నిందితులు భావించి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. హతుడికి తెలిసిన వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై సంచిలో మూటకట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చి ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డులో పడేసి ఉంటారని వివరించారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి వాహన టైర్ల గుర్తులు లభించలేదని, రోడ్డు పైన ఎర్రటి మరకలు ఉండడంతో రక్తం కావచ్చని అనుమానించి..నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతోనే ముందుకు.. హతుడి ఎవరనేది తేలితేనే కేసు దర్యాప్తు సులువవుతుందని భావించిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వందలాది అదృశ్యం కేసుల వివరాలను సేకరించారు. ఘటనాస్థలంలో మృతదేహంపై లభ్యమైన వస్తువులు, హతుడి వయసు, పోలికలతో యువకుల అదృశ్యం కేసుల వివరాలను పోలుస్తున్నారు. ఘటనాస్థలం, పరిసర ప్రాంతాలలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పాటు మృతదేహంపై ఎలాంటి కత్తిపోట్లు, గాయాలను పోలీసులు గుర్తించలేదు. శరీరంలో విష ప్రయోగం ఆనవాళ్లు సైతం ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడికాలేదు. దీంతో కేసు దర్యాప్తు పూర్తిగా సాంకేతిక ఆధారాల పైనే ఆధారపడి ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిని బట్టి హత్య ఈనెల 8–10 తేదీలలో జరిగి ఉండొచ్చని, దీంతో ఆయా తేదీలలో ఓఆర్ఆర్ మీద ప్రయాణించిన సుమారు 12 లక్షల వాహనాలను, లక్షల కొద్ది ఫోన్ కాల్స్ను జల్లెడ పడుతున్నామని తెలిపారు. లక్షల్లో ఉన్న డేటా వందల్లోకి వస్తేనే దర్యాప్తు కొలిక్కి వస్తుందని చెప్పారు. -
మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా?
‘బజ్ఫీడ్’ అనే అమెరికాకు చెందిన మీడియా సంస్థకు.. నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ‘అన్ సాల్వ్డ్ మిస్టరీస్’ పై ప్రత్యేక కథనాలు చేసే ఈ సంస్థ.. ఆసక్తి కలిగించే స్టోరీలను ప్రజలకు అందించడంలో దిట్ట! ‘మీ జీవితాల్లోని విచిత్రమైన సంఘటనలు, భయానక అనుభవాలను రాసి మాకు పంపించండి’ అని ప్రకటించింది. దాంతో బజ్ఫీడ్కి సంబంధించిన మెయిల్స్ అన్నీ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన కథనాలతో నిండిపోయాయి. అందులోనిదే ఇదొకటి. ‘నేను హైస్కూల్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, ఒకరోజు ఉదయాన్నే విపరీతమైన జ్వరంతో నిద్రలేచాను. అది గమనించిన మా మమ్మీ.. నన్ను ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. కానీ ఆ రోజు నాకు ముఖ్యమైన పరీక్ష ఉండటంతో.. స్కూల్కి వెళ్తానని చాలాసేపు మారాం చేశాను. కానీ మా మమ్మీ వినిపించుకోలేదు. ‘‘అవసరం అయితే జ్వరం తగ్గాక స్కూల్కి వచ్చి ప్రిన్సిపాల్తో నేను మాట్లాడతాను’’ అని సర్దిచెప్పింది. దాంతో టాబ్లెట్స్ వేసుకుని.. సోఫాలోనే నిద్రపోయాను. సరిగ్గా మధ్యాహ్నం మూడు అయ్యేసరికి నాకు మెలకువ వచ్చింది. అంటే సుమారు 10 గంటల పాటు నేను నిద్రపోయాను. అప్పటికి నాకు జ్వరం పూర్తిగా తగ్గింది. దాంతో ‘‘నేను.. స్కూల్కి వెళ్తాను, కొన్ని క్లాసులకైనా అటెండ్ అయినట్లుంటుంది కదా’’ అని.. మళ్లీ మా మమ్మీని బతిమాలాను. ఈసారి తను అంగీకరించింది. చివరికి నేను స్కూల్ క్యాంపస్లో అడుగుపెట్టేసరికి.. నా క్లాస్మేట్స్ చాలామంది క్లాస్ రూమ్ బయటున్నారు. వాళ్లంతా నన్ను చూసి.. ‘‘ఎక్కడి నుంచి వస్తున్నావ్’’ అని అడిగారు. ‘‘ఇంటి నుంచి! ఉదయం నుంచీ జ్వరం.. అందుకే ఉదయం రాలేకపోయాను’’ అని చెప్పాను. అంతా వింతగా చూశారు. కొందరైతే.. ‘‘అదేంటీ నువ్వు ఫస్ట్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నావ్ కదా?’’ అని అడిగారు. ఆశ్చర్యపోయాను. మా టీచర్స్ కూడా అదే మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆ రోజు స్కూల్లో మొదటి అవర్లో క్లాస్కి రావడం చూశామని అనడంతో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సాధారణంగా నాకు మొదటి బెంచ్లో కూర్చునే అలవాటు ఉండటంతో వాళ్లు పొరబడే అవకాశం లేదని తేలింది. అయితే ఆ సమయంలో క్లాసుకైతే వచ్చాను కానీ యాక్టివ్గా లేనట. ఫస్ట్ అవర్లో నాతో కొందరు మాట్లాడటానికి ట్రై చేస్తే.. నేను మాట్లాడలేదని.. చాలా గంభీరంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను మా ఇంట్లో నిద్రపోతే.. ఇక్కడి ఎలా వచ్చాను?’’ అనేది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ‘‘ఎంతసేపటి క్రితం కనిపించాను? ఎక్కడెక్కడ తిరిగాను?’’ అంటూ నా స్నేహితుల్ని చాలా ప్రశ్నలు వేశాను. ‘‘చాలాసేపు క్లాసులో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నావ్.. తర్వాత క్లాస్ పూర్తి అయ్యాక ఎప్పటిలానే.. బుక్స్ లాకర్స్ దగ్గరకు వెళ్లాం. ఆ తర్వాత నుంచి నువ్వు కనిపించలేదు. మేము కూడా అంతగా గమనించలేదు’’ అని చెప్పారు. నేను కనిపించని సమయం ఏమిటని ఆరా తీస్తే.. అది సరిగ్గా ఇంట్లో సోఫాలోంచి నేను నిద్ర లేచిన సమయం అని తేలింది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఇంట్లో నిద్రపోవడం నిజమా? లేక స్కూల్కి వెళ్లడం నిజమా? క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా టీచర్స్ కూడా నన్ను చూశామని చెప్పడమే నాకు ఆశ్చర్యంగా తోచింది. ఈ అస్పష్టమైన సంఘటన గురించి ఎంత ఆరా తీసినా నాకు సమాధానం దొరకలేదు. పైగా ఆ వయసులో దీని గురించి నేను కూడా అంతగా ఆలోచించలేదు. ఇదే నా జీవితంలో మరచిపోలేని వింత అనుభవం’ అని రాసుంది ఆ మెయిల్లో. అసలు ఆ వ్యక్తి ఎవరు? అది ఏ స్కూల్? ఏ ఇయర్లో ఇలా జరిగింది? రాసిన వారు అమ్మాయా? అబ్బాయా? తనకు ప్రస్తుతం ఎంత వయసు? తను రాసింది నిజమా అబద్ధమా? ఒక మనిషి నిద్రపోతుంటే.. ఆ మనిషి ఆత్మ లక్ష్యాలను ఛేదించడానికి ఎంతదూరమైనా ప్రయాణిస్తుందా? ఏదైనా చేయగలుగుతుందా? కోరిక బలాన్ని బట్టి ఇలా జరిగే అవకాశం ఉందా? అసలు ఇది ఎలా సాధ్యం? లాంటి వేటికీ సమాధానాల్లేవు. దాంతో ఈ కథనం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ స్టోరీ మాత్రం రకరకాల పూకార్లను మోసుకుంటూ.. వైరల్ అవుతోంది. సంహిత నిమ్మన (చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!) -
ఆ ఊరిలో నాలుగొందలకుపైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్గా..
కొన్ని చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే అప్పటిదాక మాములుగా ఉన్నది కూడా సడెన్గా వింతగా మారిపోతుంది. ఏంటన్నది కూడా తెలియదు. అచ్చం అలాంటిదే ఈ ఊరిలో జరిగింది. చుట్టూ జనసంచారం ఉన్నా అక్కడ జనం ఎవరూ ఎందుకు ఉండరో తెలియదు. పైగా అక్కడ వందలకు పైగా ఇళ్లు అన్ని వనరులు ఉండి ఉండకపోవడం ఏంటీ? అనిపిస్తోంది కదా. ఈ గమ్మతైన ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఆ ఊళ్లో నాలుగువందలకు పైగానే ఇళ్లు ఉన్నాయి. అయినా ఆ ఊళ్లో ఇప్పుడు ఉంటున్నది నలుగురు మనుషులు మాత్రమే! స్కాట్లండ్లో గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఈ ఊరి పేరు క్లూన్ పార్క్. నిజానికి ఇది ఒక టౌన్షిప్. రేవులో పనిచేసే కార్మికుల వసతి కోసం దీనిని 1918–20 కాలంలో నిర్మించారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ ఊరు ‘స్కాట్లండ్ చెర్నోబిల్’గా పేరుమోసింది. అలాగని ఇక్కడేమీ అణు ప్రమాదమేదీ జరగలేదు. అప్పట్లో రేవు కార్మికుల కోసం ఇక్కడ 430 ఫ్లాట్లతో 45 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించారు. వారి సౌకర్యం కోసం ఒక బడి, చర్చ్, షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కూడా నిర్మించారు. స్టీవ్ రోనిన్, కైల్ ఉర్బెక్స్ అనే వ్లాగర్లు రెండేళ్ల కిందట ఈ విచిత్రమైన ఊరి గురించి వెలుగులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్లలోంచి బయటకు చూస్తే మాత్రం సమీపంలోని రోడ్లపై వాహనాల సంచారం మామూలుగానే కనిపిస్తుంది. ఈ టౌన్షిప్ ప్రాంతంలోనే జనసంచారం కనిపించదు. ‘ప్రస్తుతం ఈ ఫ్లాట్లలో నలుగురం మాత్రమే మిగిలున్నాం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్లాలనుకోవడం లేదు. ఇటీవలే ఒకరు తన ఫ్లాట్ను 7000 పౌండ్లకు (రూ. 7.39 లక్షలు) అమ్ముకుని వెళ్లిపోయారు’ అని ఇక్కడ చాలాకాలంగా ఉంటున్న మార్షల్ క్రేగ్ తెలిపాడు. చాలాకాలంగా ఈ ఫ్లాట్లు ఖాళీగా పడి ఉండటంతో భూతగృహాల్లా తయారయ్యాయి. కొందరు దుండగులు ఈ టౌన్షిప్లోని బడి, చర్చ్ వంటి ఉమ్మడి కట్టడాలకు నిప్పుపెట్టారు. క్లూన్పార్క్ టౌన్షిప్లోని పాతబడిన కట్టడాలను పూర్తిగా పడగొట్టి, ఇక్కడ కొత్త భవంతులను నిర్మించడానికి గ్లాస్గోకు చెందిన ఇన్వర్సైకిల్ కౌన్సిల్ 2011లో ప్రతిపాదనలను సిద్ధం చేసినా, ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!
ఎక్కువ సంతానం ఉంటే అంత దీర్ఘాయువు ఉంటుందని విశ్వసించేవారు మన పెద్దవాళ్లు. కానీ అది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. త్వరితగతిన పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ పరిశోధన మనిషి వృధాప్య రహస్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సుగమం చేసిందన్నారు. ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి జీవితకాలంపై ఎలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయో అనేదాని గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పునురుత్పత్తి మనిషి జీవితకాలం తగ్గిపోవడానికి లింకప్ చేయబడి ఉంటుందన్న సరికొత్త విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. త్వరితగతిన పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే జన్యువులు తక్కువ జీవిత కాలన్ని సూచిస్తాయని అన్నారు. ఈ మేరకు మిచిగాన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తొందరగా తల్లిదండ్రులుగా మారిన వారి జీవితకాలం సుమారు 76 ఏళ్ల వరకే ఉంటున్నట్లు వారి సంభావ్యత జన్యువుల సంబంధం ఆధారంగా నిర్థారించారు. ఈ ఆవిష్కరణ వృధాప్య రహస్యన్ని చేధించే పరిశోధనను సులభతరం చేస్తోందన్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఈ సృష్టి మానవుడికి ఇచ్చే జీవిత దశలు చాలా ఆశ్చర్యకరంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 2 లక్షల మంది పైగా వ్యక్తులు పాల్గోన్నారు. వారందరి జన్యువులు, పునరుత్పత్తి, వారి జీవిత కాలాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామని అన్నారు. జీవశాస్త్రవేత్త జియాంజీ జాంగ్ మనషి జీవిత కాలన్ని జన్యుపరంగా పునురుత్పత్తి చాలా బలంగా పరస్పర సంబంధం కలిగి ఉందన్నారు. అంటే ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యు పరివర్తనలే జీవితకాలాన్ని తగ్గిస్తాయి. ఇది కాస్త హాస్యస్పదంగా అనిపిస్తున్నా కాస్త నిశితంగా గమనిస్తే గర్భ నిరోధకం, గర్భస్రావం, తదితరాల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం. కాబట్టి పునరుత్పత్తి అనేది మనిషి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వాదన. అదే సమయంలో ఇక్కడ జన్యు సంసిద్ధత తోపాటు కొంత పర్యావరణ కారకాలు కూడా మనిషి జీవితకాలం తగ్గిపోయేందుకు కారణమని చెబుతున్నారు. ఇక్కడ పునురుత్పత్తి, జీవితకాలం మద్య జరగుతున్న జన్యు ఉత్ఫరివర్తనాలకు సంబంధించిన సంక్లిష్ట చర్యను అర్థం చేసుకుంటే వృద్ధాప్య రహస్యాన్ని సులభంగా చేధించగలమని అన్నారు. ఈ అధ్యయనాలు వృధాప్యం(వయసు) అనేది సహజ ప్రక్రియ అని, అది పునరుత్పత్తి అనే అంశంపైనే బలంగా ఆధారపడి ఉందని చెబుతున్నాయన్నారు. ఎందుకంటే? మన ఫిట్నెస్ అనేది పునురుత్పత్తి ఆధారంగానే సెట్ చేసి ఉంటుంది. అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ పూర్తవ్వడం పైనే లైఫ్ స్పాన్ నిర్ణయించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడటానికి ఎగబడుతున్న జనాలు!
చిమ్మచీకటి వణికిస్తుంది. కానీ కొన్ని సార్లు.. ఆ చీకటిని చీల్చే వెలుతురు కూడా వణికిస్తుంది. అమాంతం ప్రత్యక్షమై.. అర్ధాంతరంగా మాయమై.. గజగజ వణికిస్తోన్న ఆ మిస్టరీ ఏంటీ? అది దక్షిణ అమెరికా, ఆర్కన్సా (Arkansas) రాష్ట్రంలో గుర్డాన్ సిటీ. చీకటిపడేవరకు ఆత్రంగా ఎదురుచూసిన.. ఓ నలుగురు చిన్నారులు నక్కి నక్కి.. పాత రైల్రోడ్ ట్రాక్ వైపు అడుగులు వేశారు. కాళ్లకు చెప్పులుంటే అలికిడి అవుతుందని ఒట్టికాళ్లతో మెల్లమెల్లగా నడుస్తూ.. ఓ బండకు ఆనుకుని ఒకరి తల మీంచి మరొకరు తల పెట్టి తొంగి తొంగి చూస్తున్నారు. చీకట్లో నల్లరాయిలా.. వాళ్లు ఎవరికీ కనిపించడం లేదు. వాళ్లకీ ఏమీ కనిపించడం లేదు.‘ఏది వచ్చిందా? ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? వచ్చేసిందా?’ అనే గుసగుసలు.. వారి గుండె అలికిడి కంటే చిన్నగా వినిపిస్తున్నాయి. ‘అదిగో’ అన్న మాట ఆ నలుగురిలో ఎవరి నుంచి బయటికి వచ్చిందో తెలియదు కానీ.. కాస్త గట్టిగానే వచ్చింది. నిదానిస్తే అది వాళ్ల వైపే దూసుకొస్తోంది. అది, గుండ్రంగా, చిన్నబంతిలా మెరుస్తోంది. దగ్గరకు వచ్చేసరికి వాలీబాల్ అంత పెద్దదైపోయింది. కెవ్వుమనే కేకలతో వణుకుతూ నలుగురూ నాలుగు దిక్కులకు పరుగెత్తారు. ఆ అతీంద్రియశక్తికి ‘గుర్డాన్ లైట్’ అని పేరు పెట్టిన రిపోర్టర్స్.. ఈ మిస్టరీని ప్రపంచానికి పరిచయం చేశారు. అదో కాంతి. ఓ దీపం ప్రకాశించినట్లుగా.. మిలమిలా మెరిసిపోతుంది. అది తరుముతూ వెనుకే వస్తుంటే.. పరుగెత్తే వారికి చీకట్లో తోవ కనిపించడమే ఇక్కడ గమ్మత్తైన విషయం. సీన్ కట్ చేస్తే.. ఆ నలుగురు పిల్లలకు నాలుగు రోజులు నిద్ర లేవలేదు. అది ఆ నలుగురి అనుభవం మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా గుర్డాన్ వాసుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామందికి కలిగిన వింత అనుభవం. ఈ హడలెత్తించే కథనాలను విన్న వారంతా దీని వెనుకున్న ఉదంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినవారే. అయితే పోలీస్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆ వ్యథ.. విన్నవారిని ఇంకాస్త బెదరగొడుతుంది. 1931 డిసెంబరు 10న విలియమ్ మెక్క్లెయిన్ అనే వ్యక్తిని తన కింద పనిచేసే 38 ఏళ్ల లూయీ మెక్బ్రైడ్.. గుర్డాన్ రైల్రోడ్ ట్రాక్ సమీపంలో నరికి చంపేశాడు. అయితే మొదట అనుమానితుడిగా అరెస్ట్ అయిన లూయీ.. చివరికి స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. అక్కడితో లూయీ కథ కూడా ముగిసింది. అయితే మెక్క్లెయిన్ హత్య జరిగిన చోట దాదాపు పావు మైలు పొడవున రక్తపు అడుగుజాడలు ఉన్నాయని.. లూయీ దాడి నుంచి తప్పించుకోవడానికి మెక్క్లెయిన్ చాలా ప్రయత్నించాడని.. చేతిలో లాంతరు పట్టుకుని.. ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశాడని.. పోలీస్ క్రైమ్ రికార్డ్లో ఉంది. తల తెగిన కారణంగానే మరణం సంభవించిందని పోస్ట్మార్టమ్ రిపోర్ట్ తేల్చింది. అయితే మెక్క్లెయిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. అతడి పిడికిలి పట్టులో లాంతరు ఉండటమే కీలకంగా మారింది. నాటి నుంచి ఆ సమీపంలో గుర్డాన్ ఘోస్ట్లీ లైట్.. స్థానికులను పరుగులెత్తిస్తోందనేది చాలామంది నమ్మకం. తెగిపడిన తన తలను వెతుక్కోవడానికే మెక్క్లెయిన్ ఆత్మ లాంతరు పట్టుకుని.. ఆ పరిసరాల్లోనే తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. ఈ దయ్యం కాంతి.. భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉరకలేస్తుందని.. ముందుకు వెనక్కు కదులుతుందని, కొన్ని సార్లు పసుపు, నారింజ, నీలం, ఎరుపు రంగుల్లో కనిపిస్తోందని సాక్షులు చెప్పారు. అయితే ఇది ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. గుర్డాన్ నివాసి మార్తా రామీ అనే ప్రత్యక్ష సాక్షి.. ‘నేను కూడా చిన్నప్పుడు ఆ దీపాన్ని చూడటానికి రాత్రి పూట స్నేహితులతో వెళ్లాను. అది నన్ను తరమడం నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని చెప్పుకొచ్చింది.ఈ లైట్ దయ్యం కాదని.. పీజో ఎలక్ట్రిక్ ప్రభావం అంటూ కొందరు వాదన లేవదీశారు. స్ఫటికాలు, సిరామిక్స్ వంటి కొన్ని పదార్థాలకు తేమగాలులు సోకినప్పుడు ఒత్తిడికి గురై.. విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఆ వెలుతురుని చూసి చాలామంది భయపడుతున్నారని వారు తేల్చేశారు.బాబ్ థాంప్సన్ అనే క్లార్క్ కౌంటీ హిస్టారికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. దీనిపై ఎన్నో పరిశోధనలు చేశాడు. ‘మేము ఒక రకమైన ఎర్రటి, బంగారు కాంతిని చాలాసార్లు చూశాం. అది చూడటానికి ఎవరో ఒక బేస్బాల్ క్యాప్తో ఫ్లాష్లైట్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి అదృశ్యమైపోతుంది. కొన్నిసార్లు ఆ బాల్ లాంటి కాంతి.. స్వింగ్ అవుతున్నట్లుగా వలయాల్లా కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులైనా అది చూసి భయపడతారు’ అని చెప్పుకొచ్చారు. అయితే ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు మాత్రం ఇక్కడకు ఎగబడుతూ ఉంటారు.ఇప్పటికీ చాలామంది ఆ వెలుగును చూసి జడుసుకుంటూంటారు. ఏదేమైనా ఈ కాంతికి అసలు కారణం తేలియకపోవడంతో ఈ ఘోస్ట్ లైట్ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
ప్రపంచంలో ఇప్పటివరకు వర్షం కురవని ఊరు!ఎక్కడ ఉందంటే..
ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కమ్మేస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమ్మీద ఉంటుందని మీకు తెలుసా? మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. వర్షం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కష్టమే. కానీ ఈ ఊర్లో మాత్రం ఇప్పటివరకు అసలు వర్షం ఊసే లేదు. ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడుక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఉండడమే. సాధారణంగా ఘాలు భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు.అందుకే ప్రపంచంలోనే ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ అల్ బోహ్రా ( అల్ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్గా పిలుస్తారు. మరి వర్షం లేకుండా అక్కడి ప్రజలు ఎలా బతుకున్నారు అని సందేహమా? ఇక్కడి నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్ ట్యాంకర్లతో ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తారట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్స్టైల్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు. Hutaib village in Haraz. Some of the best #Yemen coffee made here. Sipping on hot cup to the sound of birds and literally being above the clouds..priceless. So much to lose, and next to nothing to gain by current ugly war. Need cooler heads and compromise for any chance of peace. pic.twitter.com/264McKUgaF — Hisham Al-Omeisy هشام العميسي (@omeisy) September 18, 2019 -
సీక్రెట్ వైట్హౌస్! ప్రపంచంలోనే అందమైన భవంతి!
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవంతి ఏదంటే అంతా ‘గుయాంగ్ వైట్హౌస్’ పేరే చెబుతున్నారు. ఇప్పుడు అది రహస్య భవంతిగా పేరు పొందింది. చైనాలోని హువాగువోయువాన్ వెట్ల్యాండ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఈ పన్నెండు అంతస్తుల మేడ.. అమెరికా అధ్యక్ష భవంతి వైట్హౌస్ను తలపించేలా ఉంటుంది. ముందున్న సరస్సుతో పాటు మొత్తం 18.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుందీ భవనం. విలాసవంతమైన దాని ఇంటీరియర్ను రోజ్వుడ్తో చేసి ఉంటారని ఊహిస్తున్నారు. అయితే భవంతి లోపలి ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించనందున ఆ సమాచారాన్ని ఇంకా ధ్రువీకరించలేకపోతున్నారు. ఈ భవంతిని డజన్ల కొద్దీ గార్డులు 24 గంటలూ పహారా కాస్తుంటారు. దీన్ని చూడటానికి చైనా నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతుంటారు. కానీ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు. అయితే గుయాంగ్ వైట్ హౌస్ ఎవరిదనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇది గుయిజౌ హాంగ్లిచెన్ గ్రూప్ సీఈవో జియావో చున్హాంగ్ నివాసమని అంటున్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు. (చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !) -
జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!
ఏ దేశంలోనైనా బంధాలకు విలువనిచ్చే జీవితాలు ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తాయి. అయితే ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ‘ఎవరి చేతిని పట్టుకుని నడవబోతున్నాం?’ అనేదాని పట్ల స్పష్టత అవసరం. లేదంటే జీవితం ఊహించని మలుపులు తిరిగి ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పే ఉదంతమే ఇది. 1978 డిసెంబర్ 19, డెరెల్డ్ టేసీ అనే సైనికుడి జీవితంలో అదో చీకటి రోజు. జార్జియా, రిచ్మండ్ కౌంటీలోని కార్నివాల్కి చెందిన అతను.. ప్రాణంగా ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడు. అప్పటికే కొన్ని నెలలుగా ఎన్యూరిజం వ్యాధికి గురైన ఆమె (జార్జియా బోయిడ్) కోమాలోకి వెళ్లిపోయి.. చివరికి 22 ఏళ్ల వయసులో మరణించింది. కళ్లముందు చిన్న చిన్న పిల్లలు నలుగురు.. మెదడులో అంతుచిక్కని ప్రశ్నలు.. డెరెల్డ్ని కుదురుగా ఉండనివ్వడంలేదు. భార్య మరణం నాటి నుంచి మొదలైన అతడి అన్వేషణ.. చివరికి అసంపూర్తిగానే మిగిలిపోయింది. అప్పటికి మూడేళ్ల క్రితం వరకూ డెరెల్డ్ జీవితం బిందాస్గానే సాగింది. 1975లో జార్జియా బోయిడ్ పరిచయమైన తర్వాత అతని జీవితమే ఆమె అయిపోయింది. బోయిడ్ అగస్టాలోని ఒక బార్లో గోగో డాన్సర్గా పని చేస్తుందని తెలుసుకున్నప్పటి నుంచి.. అతని ప్రతి ప్రయాణం ఆమె కోసమే సాగింది. ఆమెతో స్నేహం, ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ క్రమంలో చాలా ట్విస్ట్లనే చూశాడు డెరెల్డ్. ‘చిన్నప్పటి నుంచి నార్త్ కరోలినాలో పెరిగాను. మా నాన్న చెరోకీ ఇండియన్. నన్నంతా జెరీ అని ముద్దుగా పిలుస్తారు’ అంటూ పరిచయమైన రోజునే డెరెల్డ్కి చెప్పింది బోయిడ్. స్నేహం బలపడిన తర్వాత తనకు అంతకుముందే పెళ్లి అయిందని చెప్పింది. తర్వాత ఒకరోజు ‘నాకిద్దరు ఆడపిల్లలు, భర్తతో విడిపోయాను’ అని చెబుతూనే.. డెరెల్డ్ని తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొదటిసారి ఆమె కూతుర్లు సాలీ, ఏంజెల్లను కలుసుకున్నాడు డెరెల్డ్. ‘మాతో పాటు ఈ గ్రానీ (నాయనమ్మ) ఉంటుంది’ అంటూ ఒక పెద్దావిడను పరిచయం చేసింది. అయితే ఆమె రక్తసంబంధీకురాలు కాదని తెలిపింది. రోజులు, వారాలు గడిచాయి. డెరెల్డ్, బోయిడ్ల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని డెరెల్డ్తో లివిన్ రిలేషన్ మొదలుపెట్టింది బోయిడ్. అయితే కలసి జీవించే క్రమంలో.. బోయిడ్ కొన్నిసార్లు మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించడం.. డెరాల్డ్ని కాస్త భయపెట్టింది. పగలు కూడా తలుపులు, కిటికీలు మూసుకుని ఇంట్లో ఉండటం, ఫోన్ రాగానే ముందుగా తను చెప్పిన కోడ్ని అవతల వ్యక్తి చెబితేనే మాట్లాడటం.. ఇదంతా డెరెల్డ్కి నెమ్మది నెమ్మదిగా అలవాటైపోయింది. ఒకరోజు బోయిడ్ని కూర్చోబెట్టి ‘ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్?’ అంటూ ఆరా తీశాడు డెరాల్డ్. ‘నా మాజీ భర్త చాలా దుర్మార్గుడు. అతను సాలీ, ఏంజెల్లను కిడ్నాప్ చేస్తాడని భయంగా ఉంది’ అంటూ ఏడ్చేసింది. రెండు వారాల తర్వాత.. ఒకరోజు రాత్రి బోయిడ్ని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన డెరెల్డ్కి.. ఆమె తను పనిచేసే బార్ ముందు భయపడుతూ కనిపించింది. కారణం అడిగితే.. ‘డెవిల్స్ గ్యాంగ్ అనే పేరున్న మోటర్ సైకిల్ ముఠాలోని ముగ్గురు సభ్యులు నన్ను బంధించి తీసుకెళ్లిపోవడానికి బార్కి వచ్చారు. గతంలో నేను వారి దగ్గర నుంచి తప్పించుకు వచ్చాను’ అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఓ వ్యాన్.. వారి బండిని వెంబడించడం డెరెల్డ్ గుర్తించాడు. లక్కీగా దారిలో ఓ పోలీస్ అధికారి ఎదురుపడటంతో.. ఆ వ్యాన్ కాసేపటికి మాయం అయ్యింది. అయితే చాలాసార్లు తన మాజీ భర్త మంచివాడు కాదని.. తనను చాలా వేధింపులకు గురిచేశాడని చెప్పేది. ఇక ఒకరాత్రి చీకట్లో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం చూసిన డెరెల్డ్.. ఆ ఆగంతకుడ్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశాడు. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా బోయిడ్ని మాత్రం వదిలిపెట్టలేదు. కొన్ని రోజులకు ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావడాన్ని కూడా ఆమె తట్టుకోలేకపోయేది. భయంగా ఉంటోందని, ఎవరో.. తలుపులు వేసుకుని ఉన్నా ఇంటి చుట్టూ తిరుగుతూ వేధిస్తున్నారని చెప్పేది. కొన్ని రోజులకు ‘ఐ విల్ గెట్ యు డియర్’ అనే పెయింటింగ్ మెసేజ్ ఆమెని మరింత కుంగదీసింది. కొన్నాళ్లకు బోయిడ్, డెరెల్డ్ జంటకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత బోయిడ్ తీవ్రమైన తలనొప్పితో సతమతమయింది. ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలని డెరెల్డ్.. తన భార్య బోయిడ్ని మిషిగన్లోని స్వస్థలానికి తీసుకెళ్లాడు. ఆమె అక్కడ రెండో కొడుక్కి జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డ పసికందుగా ఉన్నప్పుడే బోయిడ్ మంచం పట్టింది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లి.. చనిపోయింది. ఆమె మరణం తర్వాత డెరెల్డ్.. ఆమె బంధువుల కోసం విస్తృతంగా అన్వేషించాడు. అయితే ఎవ్వరూ ఆమె గురించి ఏ సమాచారమూ ఇవ్వలేదు. పైగా అగస్టా బార్కి వెళ్లి ఆరా తీస్తే.. ఆమె గురించి విచారించడం మానేస్తే మంచిదనే సలహా ఇచ్చేవారు ఎక్కువయ్యారు. కొందరైతే ఆమె గురించి మాట్లాడటానికే ఇష్టపడలేదు. దాంతో స్థానిక టీవీ చానెల్లో ఆమె ఫొటోని 24 గంటలు ప్రసారంలో ఉంచమని.. తెలిసివారు తనని సంప్రదిస్తారని డీల్ మాట్లాడుకున్నాడు డెరెల్డ్. ముందు సరేనన్న ఆ చానెల్.. తర్వాత ప్రసారం చేయలేదు. ఏవో బెదిరింపుల వల్ల ఆ చానెల్ వెనక్కి తగ్గిందని డెరెల్డ్ కొన్నాళ్లకు తెలుసుకున్నాడు. అగస్టా పోలీసులు కూడా డెరెల్డ్కి సాయం చేయలేదు. ఎందుకంటే ‘విచారించడానికి ఇదేం మర్డర్ కేసు కాదుగా?’ అన్నారు. ఆ నలుగురు పిల్లల్ని.. బోయిడ్ కుటుంబంతో కలపాలనేది డెరెల్డ్ కోరిక. ఇక అతడి విచారణలో.. ఏంజెల్, సాలీల తండ్రి గ్యారీమూర్ను కలుసుకుని.. బోయిడ్ అసలు పేరు.. ‘ఎడిత్ గెరాల్డిన్ జాన్స్ మూర్’ అని తెలుసుకున్నాడు. ఇక కొన్నాళ్లకు బోయిడ్ బంధువుల్లో ఇంకొందరిని కూడా కలిశాడు. అయితే డెరెల్డ్కి.. మరో నిజం తెలిసింది. ఏంజెల్, సాలీ కంటే ముందే బోయిడ్కి 11 ఏళ్ల వయసులో.. యూజీన్, రోండా అనే కొడుకు, కూతురు పుట్టారని తెలుసుకున్నాడు. అయితే బోయిడ్ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి.. సొంతవాళ్లు కూడా వెనకాడటం డెరెల్డ్ని కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ ఆమె ఎందుకు తన దగ్గర అన్ని నిజాలను గోప్యంగా ఉంచింది? ఎవరి కారణంగా ఆమె అంతగా భయపడింది? ఆమెని ఎవరు అంతగా వేధించారు? అనే సందేహాలకు అతను సమాధానాలు రాబట్టలేకపోయాడు. నిజానికి ఒక సైనికుడై ఉండి.. జీవితభాగస్వామి వ్యక్తిగత విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం సరికాదనే విమర్శలు చాలానే వచ్చాయి. అయినా అతను బంధాలకు ఇచ్చే విలువ, పిల్లల్ని చేరదీసి పెంచిన విధానం అంతా ఆదర్శనీయంగా నిలిచింది. ఏదేమైనా 22 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన బోయిడ్ అలియాస్ ఎడిత్ జీవితంలో.. ఆమెకు మాత్రమే తెలిసిన నిజాలు, భయాలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ∙సంహిత నిమ్మన (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
దెయ్యాలు కట్టిన గుడి!..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!
మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం. పసివయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి.. ‘దండం పెట్టుకో..’ అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరూ! గొంతు బొంగురుగా చేసి.. ‘హో..’ అనే ఓ విచిత్రమైన శబ్దంతో ‘అదిగో వస్తుంది’ అనే ఓ అబద్ధంతో బెదరగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు.. అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్మఠ్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్, మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడం.. చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్ మెటీరియల్ (జిగట పదార్థం) వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే.. రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం.. నేటికీ చెక్కుచెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు. వాచ్మన్ కూడా లేడు. కొందరు హోమ్ గార్డ్స్ మాత్రం.. ఈ గుడికి కాస్త దూరంగా.. రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూంటారు. ఏదో అతీతమైన శక్తి.. ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడివారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే.. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలిజిస్ట్లు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ, ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయరు. అయితే నేటికీ ఈ ఆలయం చుట్టూ.. ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడపడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి, కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని.. కిందున్న ఏ రాయిని కదిలించినా, గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒకరకమైన శబ్దం వస్తుందనే పుకార్లూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తూంటారు చాలామంది. నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరూ చేయలేదు. దాంతో ఈ ఆలయనిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన (చదవండి: వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!) -
సుమారు 12 ఏళ్లుగా అదే కల అతడ్ని వెంటాడుతూనే ఉంది..
‘అమీ చెప్పు.. నా తిమొతీ ఎక్కడున్నాడు.. చెప్పు ప్లీజ్..’ భార్య అమీ పిట్జన్ భుజాలను కదుపుతూ నిలదీస్తున్నాడు జేమ్స్ పిట్జన్ . అమీ మౌనంగానే ఉంది. ఆమె నోరు విప్పకపోవడంతో అతడికి ఇంకా దుఃఖం ముంచుకొచ్చింది. ‘దయచేసి నిజం చెప్పు.. నా కొడుకును నేను చూడాలి.. చెప్పు ప్లీజ్..!’ అని అరుస్తూ తన కలవరింతలకు తనే ఉలికిపడి లేచాడు. సుమారు పన్నెండేళ్లుగా అదే కల అతడ్ని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే నిజంగా నిలదీయడానికి అతడి భార్య అమీ పిట్జన్ ప్రాణాలతో లేదు. 2011 మే 11 ఉదయాన్నే.. అమెరికాలోని అరారోలో ‘గ్రీన్ మన్ ఎలిమెంటరీ స్కూల్’లో తన ఆరేళ్ల కొడుకు తిమొతీని డ్రాప్ చేసి.. అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్లిపోయాడు జేమ్స్. తన కొడుకుని కళ్లారా చూసుకోవడం అదే చివరిసారని అప్పుడు అతడికి తెలియదు. యథావిధిగా ఆ రోజు సాయంత్రం బాబును ఇంటికి తీసుకెళ్లడానికి స్కూల్కి వచ్చినప్పుడు.. తిమొతీ ఎప్పుడో వెళ్లిపోయాడనే సమాధానం అతణ్ణి చాలా కంగారుపెట్టింది. అయితే తీసుకుని వెళ్లింది తన భార్యేనని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి అమీకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాడు. కలవలేదు. పైగా స్కూల్ టీచర్కి అమీ.. బాబుని తీసుకుని వెళ్లేటప్పుడు ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని ఎందుకు అబద్ధం చెప్పింది? అదే ప్రశ్న జేమ్స్ని కుదురుగా ఉండనివ్వలేదు. అమీ తీరుపై అవగాహన ఉన్న జేమ్స్ వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. విచారణ మొదలైంది. మూడు రోజులు గడచినా.. ఎలాంటి సమాచారం రాలేదు. సరిగ్గా మూడోరోజు (మే 13) మధ్యాహ్నం 2 అయ్యేసరికి.. అమీ తన తల్లికి, చెల్లికి, బావమరిదికి కాల్ చేసి.. ‘మేము క్షేమంగానే ఉన్నాం, కంగారు పడొద్దు’ అని చెప్పింది. ఆ సమయంలో చెల్లెలు కారా.. ఫోన్లో అమీ మాటతో పాటు తిమొతీ మాట కూడా విన్నది. కొడుకు క్షేమమేనని తెలియడంతో జేమ్స్ ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే పోలీసులు.. అమీ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి.. అరారోకి 14 మైళ్ల దూరంలో ఉన్న ఇల్లినాయీ ప్రాంతాన్ని నిఘాలోకి తీసుకున్నారు. అక్కడున్న ప్రధాన సీసీ ఫుటేజ్లను ఒక్కొక్కటిగా పరిశీలించడం మొదలుపెట్టారు. కానీ ఈ లోపే జరగరాని అనర్థం జరిగిపోయింది. ఇల్లినాయీ లోని రాక్ఫోర్డ్లోని రాక్ఫోర్డ్ ఇన్ హోటల్లో మే 14న మధ్యాహ్నం 12 దాటేసరికి అమీ శవమై కనిపించింది. మణికట్టు, మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తను రాసిన సూసైడ్ నోట్లో.. ‘అంతా నన్ను క్షమించండి.. తిమొతీ ప్రాణాలతో ఉన్నాడు.. తనను కంటికిరెప్పలా చూసుకునే వారి దగ్గర సురక్షితంగా ఉన్నాడు. తన కోసం వెతకొద్దు.. వెతికినా మీకు ఎప్పటికీ దొరకడు’ అని రాసి పెట్టింది. జేమ్స్ గుండెలవిసేలా ఏడ్చాడు. పంచప్రాణాలైన కొడుకు ఏమయ్యాడో తెలియదు. నిజం తెలిసిన భార్య ప్రాణాలతో లేదు. ఆరేళ్ల బాబును ఎక్కడని వెతికాలి? ఎవరినని అడగాలి? తెలియక గుండెలు బాదుకున్నాడు. పోలీసులు తక్షణమే తిమొతీ కోసం వెతకడం మొదలుపెట్టారు. మే 11 నుంచి మే 14 లోపు అమీ కదలికలు స్పష్టంగా ఉన్న సీసీ ఫుటేజ్లు సేకరించారు. మే 11న ఉదయం 8 తర్వాత అమీ.. స్కూల్ నుంచి తిమొతీని తీసుకుని బయలుదేరింది. పది అయ్యేసరికి తన కారుని ఒక మెకానిక్ షాప్లో రిపేర్కి ఇచ్చి.. సమీపంలోని బ్రూక్ఫీల్డ్ జూకి తీసుకువెళ్లింది. మధ్యాహ్నం 3 అయ్యేసరికి తిరిగి వచ్చి కారు తీసుకుని.. తిమొతీతో పాటు గుర్నీలోని కీలైమ్ కోవ్ రిసార్ట్కి వెళ్లింది. అక్కడ నుంచి మరునాడు (మే 12న) విస్కాన్సిన్ డెల్స్, విస్కాన్సిన్ లోని కలహారీ రిసార్ట్కి వెళ్లారు. ఆ రోజంతా అక్కడే ఉండి.. ఆ మరునాడు (మే 13న) ఉదయం పది గంటలకు అక్కడి నుంచి చెకౌట్ చేశారు. ఆ తర్వాత తిమొతీ ఏ ఫుటేజ్లోనూ కనిపించలేదు. (అదే రోజు మధ్యాహ్నం అమీ తన చెల్లెలికి కాల్ చే సినప్పుడు తిమొతీ స్వరం విన్నానని చెప్పింది.) అయితే ఆ రోజు రాత్రి 11 అయ్యేసరికి రాక్ఫోర్డ్ ఇన్ హోటల్కి అమీ ఒంటరిగా వచ్చినట్లు కెమెరాలు తేల్చాయి. అంటే మే 13న ఉదయం పది నుంచి రాత్రి 11 లోపు ఏం జరిగింది? అమీ ఎవరిని కలిసింది? తిమొతీని ఏం చేసింది? ఎవరికి అప్పగించింది? అనేది మాత్రం మిస్టరీగా మారింది. నిజానికి 2008 నుంచి అమీకి, జేమ్స్కి మధ్య చాలా పొరపొచ్చాలున్నాయి. ఆమె చనిపోయేనాటికి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. మొదటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్న అమీ.. తిమొతీ సంరక్షణకు అనర్హురాలనేది జేమ్స్ తరపు లాయర్ వాదన. అందుకే తను చనిపోతూ.. తిమొతీని జేమ్స్కి దక్కకుండా చేసిందని కొందరి అభిప్రాయం. మరోవైపు అమీ కారులో తిమొతీ బ్లడ్ శాంపిల్స్ దొరకడంతో.. తిమొతీని చంపి ఎక్కడైనా పారేసి.. హోటల్కి వచ్చి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే దాన్ని అమీ కుటుంబం ఖండించింది. కొడుకుని చంపేంత క్రూరత్వం అమీకి లేదని.. కారులో దొరికిన బ్లడ్ శాంపిల్స్ కేవలం అప్పుడెప్పుడో తిమోతికి దెబ్బ తగిలినప్పుడు కారిన రక్తమని వాదించారు. ఆ వాదనను జేమ్స్ ఇప్పటికీ నమ్ముతున్నాడు. ఇక 2019లో బ్రియాన్ మైకేల్ అనే వ్యక్తి ‘నేనే తిమొతీ’నని సంచలనం రేపి యావత్ ప్రపంచాన్నే తనవైపు చూసేలా చేశాడు. అయితే డీఎన్ఏ పరీక్షల్లో కాదని తేలడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఇప్పటికీ జేమ్స్.. తిమొతీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. తనతో గడిపిన వీడియోలు, జ్ఞాపకాలుగా మిగిలిన ఫొటోలను చూసుకుంటూ జీవిస్తున్నాడు. ఏదేమైనా తిమొతీ ప్రాణాలతో ఉన్నాడో లేదో నేటికీ మిస్టరీనే. ప్రాణాలతో ఉంటే ఇప్పటికి ఆ బాబుకి 18 ఏళ్లు నిండి ఉంటాయి. తనవాళ్లని ఎప్పటికీ కలవనని.. ఆనాడే తల్లికి మాట ఇచ్చి అజ్ఞాతంలో మిగిలిపోయాడా? తండ్రి ఆశల్ని నిజం చేయడానికి ఏరోజుకైనా తిరిగి వస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి. ఇది నాలుగో పెళ్లి.. అమీ చిన్నప్పటి నుంచి ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంది. జేమ్స్ని కలవక ముందు చనిపోవడానికి రైల్వే ట్రాక్ మధ్యలో కారు ఆపి.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని తిరిగొచ్చింది. ఆ తర్వాత కూడా కౌన్సెలింగ్, ట్రీట్మెంట్ అంటూ మందులు వాడేది. తనకంటే ముందు ముగ్గురితో విడాకులు తీసుకుందన్న విషయం జేమ్స్కి తర్వాత తెలిసింది. ఇక జేమ్స్తో డేట్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగం రాలేదని డ్రిప్రెషన్తో ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత నుంచి మానసిక వైద్యులు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉండేది. మొదట వాళ్లు డేట్లో ఉన్నప్పుడు అమీ ఉన్న మానసిక సమస్య తీరే వరకూ పిల్లలు వద్దు అనుకున్నారు. కానీ ఏడాది తర్వాత పిల్లల కోసం కలలు కనడం మొదలుపెట్టారు. 2004లో అమీ నాలుగో నెల కడుపుతో ఉన్నప్పుడు జేమ్స్ తనని పెళ్లి చేసుకున్నాడు. ఇక తిమొతీ చాలా చలాకీ పిల్లాడు. చాలా తెలివిగా ఆలోచించేవాడు. ఎప్పుడూ సరదగా నవ్వుతూ ఉండేవాడు. తండ్రితో అతడికి మంచి అనుబంధం ఉండేది. ఎప్పుడైనా ఆడుకోవడానికి వెళ్లి కాస్త లేటుగా తిరిగి వస్తే.. ‘నన్ను మిస్ అయ్యావా డాడీ’ అని అడిగేవాడట! అమీ కూడా కొడుకుని ప్రాణంగా చూసుకునేది. అలాంటి తల్లి కొడుకు ప్రాణాలు తీస్తుందంటే నేను నమ్మలేను. నిజానికి జేమ్స్ విడాకులు అనేసరికి అమీ మానసిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని నాకు అర్థమైంది. పైగా మందులు కూడా సరిగా వేసుకునేది కాదు. దానికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. కారా జాకబ్స్, అమీ సోదరి -∙సంహిత నిమ్మన -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
అప్పటికే సూపర్ స్టార్,రెండో పెళ్లి.. ఇప్పటికీ మిస్టరీగా చమ్కీలా మరణం
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహా జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. చమ్కీలా (ధనీరామ్) టీమ్లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాల పాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. ∙సంహిత నిమ్మన -
వీడిన వలంటీర్ హత్య కేసు మిస్టరీ
ఆదోనిఅర్బన్: గతనెలలో పట్టణంలో జరిగిన వలంటీర్ హరిబాబు హత్య కేసును ఆదోని టూటౌన్ పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాజీవ్గాంధీనగర్లో నివాసముంటున్న ఈరమ్మ కుమారుడు హరిబాబు భరత్నగర్ సచివాలయంలో వలంటీర్గా పనిచేస్తున్నాడు. అదే కాలనీలో ఉన్న భీమన్న భార్యను మృతుడు వేధించేవాడు. మహిళ కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోగా గణపతి వేడుకల్లో కూడా ఆమెను వేధించాడు. గమనించిన భర్త భీమన్న హత్యకు పథకం రచించాడు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి హరిబాబును మాయమాటలు చెప్పి బహిర్భూమికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపేశాడు. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లి తండ్రి ఈరన్నకు విషయం చెప్పాడు. ఆయన సలహా మేరకు ఆధారాలు దొరకకుండా హత్య సమయంలో వేసుకున్న దుస్తులను కాల్చివేశాడు. 21వ తేదీ ఉదయం కుమారుడి హత్య విషయం తెలుసుకున్న తల్లి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతుడి ఫోన్ కాల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న భీమన్న, అతని తండ్రి ఈరన్న మండిగిరి వీఆర్వో రాజశేఖర్ ముందు లొంగిపోయారు. వారు హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదించిన టూటౌన్ సీఐ శ్రీనివాసనాయక్, వన్టౌన్ సీఐ విక్రమసింహ, హెడ్కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్ ఆంజనేయులు, హోంగార్డు గోవర్ధన్ను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతారు!
ఈ ప్రపంచంలో అసాధారణమైన ప్రతీది మిస్టరీనే. మనం ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వాలి నిలబడగలమా? బేస్లేకుండా ఏ వస్తువునైనా నిలబెట్టగలమా? ఎప్పుడైనా, ఎక్కడైనా ఇద్దరు వేరువేరు పొడవులు గల వ్యక్తుల ఎత్తులు సమాంతరంగా మారతాయా? ఈ వింతలన్నీ ఒకే చోట జరుగుతాయి. అమెరికాలోని ఓ మిస్టీరియస్ స్పాట్లో ఒక చీపురును నిలబెడితే.. ఏ సపోర్ట్ లేకుండా నిలబడుతుంది. కుర్చీ నేలకు ఆనకుండా.. గోడకు ఆనిస్తే.. అది నిలబడే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! యూఎస్లోని మిషిగన్, సెయింట్ ఇగ్నస్ ప్రాంతంలో.. ‘ది ఒరెగాన్ వోర్టెక్స్’ అనే పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే ఈ వింతలన్నిటినీ చూడొచ్చు. ఇక్కడున్న ‘ద హౌస్ ఆఫ్ మిస్టరీ’ అనే ఇంట్లోకి వెళ్తుంటే కళ్లు చెదరడం పక్కా! తూలుతూ, ఊగుతూనే ఇందులో అడుగుపెడతారంతా. ఈ ఇల్లు ఓ పక్కకు వాలి ఉంటుంది. ఈ ఇంట్లో గోడ మీద నిలబడొచ్చు! ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన రాయిని ఎక్కితే ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా కనిపిస్తాయి. నిలబడిన స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ తేడాను గమనించొచ్చు. ఇక్కడ నడిస్తే అడుగులన్నీ వాలుగానే పడుతాయి. ఈ విచిత్రమైన ప్రదేశాన్ని 1950లో కొందరు సర్వేయర్స్ కనుగొన్నారు. ఇక్కడ ఎలాంటి పరికరాలూ పనిచేయవు. సుమారు 300 అడుగుల డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఈ వింత గోచరిస్తుంది. జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే అంటుంటారు పర్యాటకులు. ఈ థ్రిల్ని ఎంజాయ్ చెయ్యడానికి ఇక్కడికి ఎగబడుతుంటారు ఔత్సాహికులు. ఈ స్పాట్.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందట. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ఎందుకు సాధారణంగా లేదు? అనేదానికి కారణాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దాంతో ఈ ప్రదేశం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సంహిత నిమ్మన (చదవండి: బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..) -
అబద్ధమని కొట్టిపారేయకండి.. దెయ్యాలతో మాట్లాడిన చిన్నారి!
దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు. ‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ. వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు. జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్లో సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్. వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త) ‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు. అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హెడీ మాటల్లో.. ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ∙సంహిత నిమ్మన -
అంతుచిక్కని మిస్టరీగా రాజా హుకుం సింగ్ హత్య
జోద్పూర్ పరిసర ప్రాంతాలన్నీ ఉదయాన్నే తెలిసిన ఆ వార్తతో ఉలిక్కపడ్డాయి. 1984 ఏప్రిల్ 17న అర్ధరాత్రి వేళ జరిగింది ఆ సంఘటన. రావు రాజా హుకుం సింగ్ అలియాస్ టుటు బనాను ఎవరో చంపేశారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన జరిగిన రాజ్పుత్ రెస్ట్హౌస్కు చేరుకున్నారు. హత్య జరిగి కొన్ని గంటలు గడిచిపోవడంతో అప్పటికే హుకుం సింగ్ శరీరం చల్లబడిపోయింది. విచిత్రంగా ఇద్దరు నిందితులు హుకుం సింగ్ మృతదేహం పక్కనే పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నిందితుల్లో మరో ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. మృతదేహం పక్కనే నెత్తుటి మరకల కత్తి పడి ఉంది. అది హుకుం సింగ్దే! హుకుం సింగ్ శరీరంపై ఇరవైకి పైగా కత్తి వేట్లు ఉన్నాయి.జోద్పూర్ రాజవంశానికి చెందిన రావు రాజా హుకుం సింగ్ హత్యపై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.హుకుం సింగ్ జోద్పూర్ మహారాజా గజ్ సింగ్కు సవతి సోదరుడు, జోద్పూర్ మాజీ పాలకుడు మహారాజా హనువంత్ సింగ్, జుబేదా బేగంల కుమారుడు. హనువంత్ సింగ్, జుబేదా బేగం దంపతులు 1952లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి హుకుమ్ సింగ్ వయసు ఏడాది మాత్రమే! సవతి తల్లి కృష్ణకుమారి ఆలన పాలనలో పెరిగాడు. తండ్రి హనువంత్ సింగ్ మరణం తర్వాత హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్ పట్టాభిషిక్తుడయ్యాడు.అతి గారాబం వల్ల హుకుం సింగ్ అల్లరి చిల్లరిగా, దురుసుగా తయారయ్యాడు. రాచప్రాసాద మర్యాదలను పెద్దగా పట్టించుకోకుండా, ఊళ్లోని ఆకతాయి యువకులతో కలసి విచ్చలవిడిగా తిరిగేవాడు. తాగుడుకు అలవాటుపడి, జనాలతో తరచు తగవులు పెట్టుకునేవాడు. ఒక సందర్భంలో తనను నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులనే తుపాకి గురిపెట్టి బెదిరించాడు. తుపాకితో బెదిరించినందుకు పోలీసులు హుకుం సింగ్పై హత్యాయత్నం అభియోగం మోపుతూ కేసు పెట్టారు. హైకోర్టు ఆ కేసును కొట్టేసి, బెదిరింపు కేసు కింద విచారణ చేపట్టింది. ఇలాంటి దుందుడుకు స్వభావం ఉన్న హుకుం సింగ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. జోద్పూర్ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగాడు. అకస్మాత్తుగా అతడు హత్యకు గురవడంతో జోద్పూర్లో కలకలం రేగింది.మొదటగా రంగంలోకి దిగి, దర్యాప్తు చేసిన జోద్పూర్ పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు. నలుగురు నిందితులను అరెస్టు చేసినా, అసలు దోషులను నిరూపించలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత జోద్పూర్ ఎస్పీ శంతను కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. అతను చెప్పిన ప్రకారం– హుకుం సింగ్కు నేరప్రవృత్తి ఉంది. పర్యాటక శాఖ ఉపమంత్రి నరేంద్రసింగ్ భాటితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, కొద్దిరోజులగా ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. హత్య జరిగిన రోజు సాయంత్రం హుకుం సింగ్ సమీపంలోని బస్తీలో జరిగిన డ్యాన్స్ కార్యక్రమం చూసి, రాత్రి రెస్ట్హౌస్కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. అందరూ మందు పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో తనతో ఉన్నవాళ్లతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే హత్యకు గురయ్యాడు. హత్య జరిగాక మృతదేహం వద్ద వేచి చూస్తున్న ఇద్దరినీ, అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారే దోషులని నిరూపించలేకపోయారు. హుకుం సింగ్ హత్య కాంగ్రెస్ జాతీయ పార్టీలోనూ అలజడి రేపింది. హత్య వెనుక మంత్రి భాటి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భాటి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘హత్యకు కొద్దిరోజుల ముందు హుకుం సింగ్ జైపూర్ సర్క్యూట్హౌస్లో గొడవ పడ్డాడు. సంఘటనా స్థలానికి వచ్చిన విధాయక్పురి పోలీసులు అతణ్ణి కొట్టారు. హత్యాయత్నం కేసులో దిగువకోర్టు శిక్ష విధిస్తే, నాలుగు నెలలు జైల్లో గడిపి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. తరచు తగవులు పెట్టుకునే హుకుం సింగ్కు చాలామంది శత్రువులు ఉంటారు’ అని భాటి చెప్పారు. ఈ సంఘటనలో హుకుం సింగ్ సవతి సోదరుడు గజ్ సింగ్పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఇద్దరికీ పొరపొచ్చాలు ఉన్న మాట నిజమే అయినా, హత్యలో గజ్ సింగ్ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.అయితే, జోద్పూర్ కాంగ్రెస్ నేతలు భాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మూపనార్కు ఫిర్యాదు చేశారు. మూపనార్ దీనిపై భాటిని ప్రశ్నించారు. హుకుం సింగ్ ఢిల్లీలో తన పరువుతీసే పనులు చేస్తున్నాడని, తన ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడని, అయితే అతడి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హుకుం సింగ్ హత్యలో రాజకీయ నాయకులెవరి ప్రమేయమూ లేదని రాజస్థాన్ ఐజీ జీసీ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే రాజస్థాన్ పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐ చేతికి మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు సీబీఐ ఈ కేసులో గుమన్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. విచిత్రంగా విచారణకు ముందే అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ఈ కేసు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. -
మిస్టరీ: అందమైన ఇంటిని శ్మశానంగా మార్చాడు, 34 ఏళ్ల తర్వాత..
నిస్సహాయతను, నిర్వేదాన్ని నింపుకున్న గుండెలో.. ఓ వెర్రి నవ్వు నిస్తేజంగా తొణికిసలాడుతుంది. ఆ నవ్వులో.. సమాజాన్ని నిలువునా కాల్చి బూడిద చేయగలిగేంత ఆవేశం ఉంటుంది. 43 ఏళ్ల వెనెస్సా బెన్నెట్ని కదిలిస్తే అచ్చం అలాంటి నవ్వే నవ్వుతుంది. ఎందుకంటే.. తనకు ఊహ తెలియక మునుపే.. క్రూరమైన చావు పరిచయం అయ్యింది. ఊహ తెలిసేసరికి.. ఆ చావే శరణమనిపించింది. చెల్లాచెదురైన తన బతుకుని చక్కదిద్దుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. బతుకుపోరాటంలో ఇప్పటికీ తన మనసుతో తాను యుద్ధం చేస్తూనే ఉంది. ఇంతకీ ఎవరీ వెనెస్సా? అసలు తన జీవితంలో ఏం జరిగింది? వెనెస్సా గురించి ఒక మాటలో చెప్పాలంటే.. దురదృష్టానికి, అదృష్టానికి మధ్య నలిగిన ఒక జీవితం. తనకు అసలేం జరిగిందో తెలియని వయసులోనే.. తోటివాళ్ల రూపంలో.. వెకిలినవ్వులు, ఎగతాళి చూపులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. ఆ పరిస్థితికి కారణం ఎవరో తెలియక, తను ఎందుకలా ఉందో తెలియక తల్లడిల్లింది. ఊహ తెలిశాక తన కథ తనకే కన్నీళ్లు తెప్పించింది.1984 జనవరి 16 అర్ధరాత్రి ఓ రాక్షసుడు సుత్తి చేత పట్టుకుని.. అమెరికా, కొలరాడోలోని అరోరాలో.. వెనెస్సా ఇంట్లో అడుగుపెట్టాడు. ఆమెకప్పుడు మూడేళ్ల వయసు. వాడు లోపలికి అడుగుపెట్టగానే.. వెనెస్సా తండ్రి బ్రూస్ బెన్నెట్(27)ని అత్యంత క్రూరంగా సుత్తితో కొట్టి చంపేశాడు. మూడేళ్ల చిన్నారిపై లైంగికంగా.. తర్వాత తల్లి డెబ్రా(26), అక్క మెలిస్సా(7)లపై లైంగికంగా దాడి చేసి.. అదే సుత్తితో వాళ్లనూ హత్య చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇంటిని శ్మశానంగా మార్చాడు. అసలేం జరుగుతోందో తెలియని స్థితిలో వెనెస్సా ఒంటరిగా ఆ కిల్లర్ చేతికి చిక్కింది. కనికరంలేని ఆ క్రూరుడు మూడేళ్ల వెనెస్సాపై కూడా లైంగికదాడి చేసి.. సుత్తితో తీవ్రంగా కొట్టాడు. అందరిలానే ఆ పాపా చనిపోయిందనుకుని తెల్లారేసరికి పారిపోయాడు. ఉదయం పది దాటేసరికి వెనెస్సా నాన్నమ్మ కొన్నే బెన్నెట్.. ఆ ఘోరాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. కాసేపటికే పోలీసులు, వైద్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న వెనెస్సా కొన ఊపిరితో ఉందని గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 16ఏళ్లకే డ్రగ్స్కు అలవాడుపడి.. కిల్లర్ దాడికి.. వెనెస్సా దవడ, పుర్రె పగిలిపోయాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. శరీరం మొత్తం ఛిద్రమై.. ప్రాణం మాత్రమే మిగిలింది. రెండేళ్లకు కోలుకున్న వెనెస్సా.. తీవ్రమైన ఒత్తిడి, కోపం, అసహనం లాంటి ఎన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతూ నాన్నమ్మ దగ్గరే పెరిగింది. అయితే ఇంతటి ఘోరం చేసిన కిల్లర్ ఎవరో.. ఎవరికీ తెలియలేదు. దర్యాప్తు జరుగుతున్నా.. సరైన సాక్ష్యాధారాల్లేక.. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. కాలక్రమేణా తన కథను తెలుసుకున్న వెనెస్సా.. సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంది. చెడుదారుల్లో నడిచింది. 16 ఏళ్లకే డ్రగ్స్కు అలవాటుపడింది. 17 ఏళ్ల వయసులో.. జీవితం మీద విరక్తి పుట్టి.. చనిపోవాలని మణికట్టుని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. జీవితం విలువ తెలిసొచ్చింది ఏళ్లుగా కిల్లర్ కోసం.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగినా.. ఆ అగంతుకుడు ఎవరో తేలలేదు.18 ఏళ్ల వయసులో తన ఇష్టపూర్వకంగానే గర్భవతి అయిన వెనెస్సా.. కొడుకు పుట్టిన 3 నెలలకు ‘తల్లిగా ఎలా ఉండాలో తెలియట్లేదు’ అంటూ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అధికారులకు బాబుని అప్పగించేసింది. రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తను, తన బాయ్ఫ్రెండ్ కలసి వంతెన కింద జీవించడం మొదలుపెట్టారు. తలస్నానం చెయ్యాలన్నా.. దగ్గరల్లోని ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంది. దొంగతనాలు, మాదకద్రవ్యాల కేసుల్లో జైలుకి కూడా వెళ్లింది. 30 ఏళ్లు వచ్చేసరికి.. ఆమెలో మార్పు మొదలైంది. జీవితం అంటే ఇది కాదు అనే ఆలోచన వచ్చింది. మనిషిగా బతకడానికి.. గతంతో సంబంధం లేదనిపించింది. దాంతో మాట, తీరు అన్నీ మార్చింది. ఫ్రాంకీ విల్లార్డ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఆలోచనతో తన కథను ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టింది. డ్రగ్ కౌన్సెలర్ అయేందుకు డిగ్రీ కళాశాలలో చేరింది. 2018లో సుమారు 20 ఏళ్ల వయసున్న తన కొడుకుని కూడా కలుసుకుంది. ఆ రోజు వెనెస్సా మనస్పూర్తిగా నవ్వింది. ‘నేను ఒకరికి ప్రాణం పోశాననే ఆనందం.. నేనో తల్లిననే అనుభూతి చాలా గొప్పగా ఉంది’ అంటూ పొంగిపోయింది. 2018 వరకూ ఈ కేసు మిస్టరీగానే ఉంది. సరిగ్గా 34 ఏళ్ల తర్వాత.. డీఎన్ఏ ఆధారంగా కిల్లర్ ఎవరనేదానిపై ఓ స్పష్టత వచ్చింది. డీఎన్ఏతో హంతకుడు ఎవరో తేలింది షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కిల్లర్.. పరారీలో ఉన్న నిందితుడు కాదని.. 1984 ఆగస్ట్ 9 నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నేరగాడని తేలింది. అతడు సీరియల్ కిల్లర్ అలెక్స్ క్రిస్టోఫర్ ఎవింగ్ అని అందరితో పాటు వెనెస్సా అప్పుడే తెలుసుకుంది. 1984లో అతడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో బెన్నెట్ ఫ్యామిలీ విషాదగాథ కూడా ఒకటని.. ముందు నుంచి అనుమానాలున్నా.. డీఎన్ఏతో 2018లో క్లారిటీ వచ్చింది. 1984 జనవరి 10న లేక్వుడ్లో ప్యాట్రీషియా స్మిత్ అనే మహిళపై హింసాత్మకంగా లైంగిక దాడి చేసి, హత్య చేశాడు. అదే ఏడాది ఆగస్టు 9న నెవాడా, హేండర్సన్లో గొడ్డలితో నాన్సీ, క్రిస్ బ్యారీలపై దాడిచేసి పారిపోయాడు. ఆ కేసులోనే అతడు అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నాడు. అతడికి హ్యామర్ కిల్లర్ అనే పేరు కూడా పెట్టాయి అప్పటి వార్తా పత్రికలు. మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజలపై దాడి చేసినట్లు ఆధారాలు ఉండటంతో అతడికి పెరోల్ కూడా లభించలేదు. 2021 నాటికి అతడు బెన్నెట్ కేసులో దోషిగా రుజువు కావడంతో కోర్టు.. మూడు జీవితకాలాల కారాగార శిక్షను విధించింది. దాంతో అతడు జీవితంలో బయటికి వచ్చే అవకాశాన్నే కోల్పోయాడు. ఈ కథ తెలిసిన వాళ్లంతా న్యాయం జరిగింది అన్నారు. కానీ వెనెస్సా మాత్రం.. తనకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని, అతడిలో నేను పశ్చాత్తాపం చూడలేదని చెప్పింది. సమాజంపై గౌరవం కోల్పోయింది ‘అతడి కారణంగా నేను నా వాళ్లని మాత్రమే కాదు.. సమాజంపై నమ్మకాన్నీ, గౌరవాన్నీ కోల్పోయాను. నా వ్యక్తిత్వాన్నీ కోల్పోయాను. ఇప్పటికీ నేను ప్రతిరోజూ అద్దంలో చూసుకుని.. తట్టుకోలేని వేదనను అనుభవిస్తున్నాను. తెలియని కోపం, ద్వేషం, మానసిక వేదన ఇలా అన్నీ నన్ను కుంగదీస్తూనే ఉన్నాయి. నా జీవితం నాశనమైపోయింది. దానికి ఏ పరిష్కారం లేదు’ అంటూ ఎందరో మనసుల్ని మెలిపెట్టింది. సరైన సాక్షులు లేని ఈ కథలో కిల్లర్ కేవలం డీఎన్ఏ ఆధారంగానే దొరికాడు. లేదంటే ఇప్పటికీ ఈ కథ మిస్టరీగానే ఉండిపోయేది. ∙సంహిత నిమ్మన -
హలో బ్రదర్ సినిమా మాదిరి కవల సిస్టర్స్ !..ఊహాతీతమైన ఓ మిస్టరీ గాథ
ఆత్మల మధ్య అనుసంధానమనేది మనిషి చావుపుట్టుకలకు అతీతమైనది. జ్ఞాననేత్రంతో దివ్యదృష్టిని (సిక్త్ సెన్ ్స) సాధించడం, ఎలాంటి ప్రసార సాధనం లేకుండా మనిషి నుంచి మనిషికి సమాచారాన్ని చేరవేయడం (టెలిపతీ) వంటివన్నీ మనిషి జీవితంలో ఎప్పటికీ అబ్బురాలే! అలాంటి ఊహాతీతమైన మిస్టరీ ఈవారం మీకోసం. ఇది రెండు వేరు వేరు చోట్ల, రెండు వేరు వేరు సందర్భాలను కలిపి చెప్పే సినిమా కథలాంటిది. అది 1978 అక్టోబర్ 31. అంతా హాలోవీన్ సెలబ్రేషన్ ్సలో ఉన్నారు. సాయంత్రం ఆరు తర్వాత, 19 ఏళ్ల కర్రన్, కాథీ అనే కవలలు.. తమ అక్క షారోన్, కాథీ బాయ్ఫ్రెండ్ లూకాస్తో కలసి స్థానిక క్లబ్కి వెళ్లారు. అక్కడ కొందరు స్నేహితుల్ని కలసి ఎంజాయ్ చేశారు. సరిగ్గా 8 అయ్యేసరికి లూకాస్తో కలసి కాథీ ఇంటికి బయలుదేరింది. కర్రన్ తన అక్క షారో తో ఇంకాసేపు క్లబ్లోనే గడపాలని నిర్ణయించుకుంది. అయితే కాథీ, లూకాస్లు ఇంటికి సమీపిస్తుండగా, ఇద్దరు ముసుగు దుండగులు వాళ్లను అడ్డుకున్నారు. తుపాకీ చూపించి.. వారి దగ్గరున్న విలువైన వస్తువులను, డబ్బును లాక్కున్నారు. అదే సమయానికి క్లబ్లో ఉన్న కర్రన్ ఉన్నట్టుండి తనకు తెలియకుండానే భయంతో వణికిపోయింది. కారణం లేకుండానే బాగా ఏడ్చింది. వెంటనే ఇంటికి వెళ్లాలని పట్టుబట్టింది. పక్కనే ఉన్న షారోన్కి ఏం అర్థం కాలేదు. కాథీ ఏదో ప్రమాదంలో పడిందని కర్ర మనసుకు తెలుస్తూనే ఉంది. తీరా ఇంటికి చేరేసరికి దగ్గర్లో లూకాస్ గాయాలతో కనిపించాడు. ఆ పరిసరాల్లో ఎక్కడా కాథీ కనిపించలేదు. కాథీని చంపేస్తామని బెదిరించి, దాడికి తెగబడిన దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని పోయారని లూకాస్ చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాసేపటికి కాథీ నుంచి కర్రన్కి డైరెక్ట్ సందేశాలు రావడం మొదలయ్యాయి. టెలిపతీ మాదిరి.. ప్రమాదం తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘కాథీ ఓ కారులో బందీగా వెళుతోందని, ఆ కారు సీట్ కలర్తో పాటు కారులో ఉన్న కార్పెట్ కలర్ కూడా చెప్పింది కర్రన్. మొదట ఎవ్వరూ ఆమె మాటలు నమ్మలేదు. పోలీసులైతే ఆమెకి పిచ్చి అనుకున్నారు. కానీ కర్ర ఎంతో తీక్షణంగా కనురెప్పలు వాల్చకుండా, కళ్లతో చూస్తున్నట్లుగా కాథీ పరిస్థితి గురించి ప్రతి అంశాన్నీ వివరంగా చెబుతూనే ఉంది. కాథీని తీసుకెళ్తున్న కారు సమీపంలోని ఎయిర్వేస్ బూలవాడ్ వైపు వెళుతోందని చెప్పింది కర్రన్. అయితే కాథీ తలపై ఆ దుండగులు గట్టిగా కొడుతున్నారని కర్ర ఆ నొప్పిని అనుభవిస్తూ చెప్పింది. కాథీకి దెబ్బలు తీవ్రంగా తగలడంతో కర్రన్ తట్టుకోలేక విలవిల్లాడింది. తన అక్కను చంపేస్తున్నారనే భయం ఆమెను క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆమె బాధ చూసి పోలీసులు కూడా కరిగిపోయారు. ఆమె చెప్పిన చోటికి ఆమె వెంటే పయనమయ్యారు. అయితే కాసేపటికి కాథీ నుంచి కర్రన్కి పరోక్ష సందేశాలు ఆగిపోయాయి. పుట్టినప్పటి నుంచి అదే బంధం.. కాథీ– కర్రన్లు 1959 ఏప్రిల్ 25న అమెరికా, టెనసీలోని మెంఫిస్లో జన్మించారు. సాధారణంగా కవలల్లో ఒకరికి జ్వరం వస్తే మరొకరికి జ్వరం రావడం.. ఒకరికి ఆకలేస్తే మరొకరికి ఆకలేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కాథీ, కర్రన్ లకు ఎంత దూరంలో ఉన్నా మొదటి నుంచి ఒకరి భావోద్వేగాలు మరొకరికి అనుభవంలోకి వచ్చేవి. ఒకసారి కాథీ తన బాయ్ఫ్రెండ్తో గొడవ పడుతుంటే.. చాలా దూరంలో ఉన్న కర్రన్కి విపరీతమైన కోపం పొంగుకొచ్చింది. కాథీ ప్రసవవేదనను కర్రన్ కూడా అనుభవించి, అల్లాడిపోయింది. అవన్నీ సాధారణమే అనుకున్న కాథీ, కర్రన్ల జీవితంలో కాథీ కిడ్నాప్ ఘటన.. ఆ కవలల మధ్యనున్న అతీంద్రియ అనుబంధాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో ఓ చోట అకస్మాత్తుగా కాథీ వెళ్తున్న కారులో ఇంధనం అయిపోయింది. కారు ఆగిపోయింది. దాంతో దుండగులు భయపడి, కారును ఓ పక్కకు నెట్టారు. ఆ దారిలో పార్క్ చేసి ఉన్న మరో కారు నుంచి ఒక దుండగుడు ఆయిల్ దొంగలిస్తుంటే, మరో దుండగుడు కాథీని అదుపుచేసే పనిలో ఉన్నాడు. ఆ గందరగోళాన్ని పసిగట్టిన కొన్ని కుక్కలు భీకరంగా మొరగడం మొదలుపెట్టాయి. ఆ అలికిడికి పక్కనే ఉన్న ఇంట్లోంచి దంపతులు బయటికి వచ్చి ‘ఎవరది’ అంటూ గద్దించారు. వెంటనే ఆ దుండగులు వారి మీద కూడా కాల్పులు జరిపి పెద్ద హంగామా సృష్టించారు. ఆ అరుపులకి ఇంకొంత మంది రావడంతో దుండగులు భయపడి.. కారు వదిలిపెట్టి, కాథీని తీసుకుని అక్కడి నుంచి పరుగుతీశారు. కాసేపటికి కర్రన్కి మళ్లీ కాథీ నుంచి సందేశాలు రావడం మొదలయ్యాయి. కాథీ ఎక్కడో ఓ రోడ్డు మీద పరుగు తీస్తున్నట్లుగా కర్రన్ మెదడుకు సందేశాలు వచ్చాయి. దాంతో కాథీ బతికే ఉందనే ఆనందం కర్రన్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. అయితే కాథీ ఒళ్లంతా చల్లగా ఉందని, ప్రాణాపాయ స్థితిలోనే ఉందని మనోనేత్రంతోనే గుర్తించి తనతో ఉన్నవాళ్లకు చెప్పింది. దాంతో కాథీ కోసం కర్రన్, షారో లతో కలసి ఆ పోలీస్ బృందం వెతుకుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే.. దుండగుల కాల్పుల హంగామా, దంపతుల ఫిర్యాదుతో మరో పోలీస్ బృందం ఆ పరిసరాలను జల్లెడపట్టే పనిలో పడింది. పోలీస్ సైరన్లకు బెంబేలెత్తిన ఆ దుండగులు కాథీని వదిలి పారిపోవడం.. చావుబతుకుల మధ్య ఉన్న కాథీ ఆ పోలీస్ బృందానికి దొరకడం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడం అంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. కాసేపటికి కర్రన్, షారోన్లకు, వారితో ఉన్న పోలీస్ బృందానికి ఈ సమాచారం అందింది. ప్రమాదం తర్వాత ఆ ఆసుపత్రిలోనే కాథీ, కర్రన్ కలుసుకున్నారు. కాథీ కోలుకున్నాక కర్రన్ చెప్పిన ప్రతి అంశం నిజమేనని కాథీ నిర్ధారించింది. దుండగులు దాడి చేయగానే భయంతో ఏడవడం దగ్గర నుంచి కారు సీట్ కలర్, కార్పెట్ కలర్ వరకూ అన్నీ.. కర్రన్ చెప్పినట్లే ఉన్నాయని తేలింది. దాంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఏదేమైనా ఈ అద్భుతం గురించి మీడియాలో పెద్దగా కథనాలేమీ రాలేదు. కాథీ, కర్రన్ల మధ్య ఉన్న బంధం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. వారికి చెందిన మరే ఇతర వివరాలు ప్రపంచానికి తెలియలేదు. అలాగే కాథీని కిడ్నాప్ చేసిన దుండగులు ఎవరూ ఇప్పటికీ పట్టుబడలేదు. దాంతో ఈ ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. గాంట్స్ కవలల అన్వేషణ లీసా గాంట్స్, డెబ్బీ గాంట్స్ అనే ట్విన్స్.. కవలల జీవితాల్లోని రహస్యాలను అర్థం చేసుకునేందుకు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కవలలను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలోనే కాథీ, కర్రన్ల అనుబంధం గురించి వారికి తెలిసింది. గాంట్స్ సిస్టర్స్ రాసిన ‘ద బుక్ ఆఫ్ ట్విన్స్’ అనే ఈ పుస్తకంలో ఆ వివరాలున్నాయి. కవలల మధ్య టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉంటుందని చెబుతూ కాథీ, కర్రన్ల కథను ఆధారంగా చూపించారు. మొదటి నుంచి కర్రన్, కాథీలు మానసికంగా అనుబంధాన్ని కలిగి ఉన్నారని, ఒకరి బాధను మరొకరు అనుభవించగలరని గాంట్స్ సిస్టర్స్ పేర్కొన్నారు. సంహిత నిమ్మన (చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు) -
వీకెండ్ ట్రిప్కి వెళ్లి తిరిగిరాలేదు..ఆరోజు అడవిలో ఏం జరిగింది?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్గ్రౌండ్కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్గ్రౌండ్కి వెళ్లి, తనవాళ్ల టెంట్ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్గ్రౌండ్కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. షాకింగ్ విషయం సెప్టెంబర్ 1న క్యాంప్గ్రౌండ్లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్కి 3 జీవిత ఖైదులను విధించింది. ఇప్పటికీ మిస్టరీనే.. విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్ఫ్రెండ్తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్ను నాగ్పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
‘మా ఊరి పోలిమేర–2’ రిలీజ్ ఎప్పుడంటే..
‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్స్లో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పోలిమేర–2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 2న విడుదల చేయనున్నారు. డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘మా ఊరి పోలిమేర ’ కన్నా రెండో భాగం ఇంకా ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి. -
ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..
నిజాలను అబద్ధాలుగా.. అబద్ధాలను నిజాలుగా మార్చేయడం నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటివాళ్ల గారడీలో చిక్కిన అమాయకుల కథ ప్రపంచానికి తెలియకుండానే ముగిసిపోతుంది. చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతుంది. కాథీ ఫోర్డ్ వ్యథ అలాంటిదే. వెస్ట్ వర్జీనియాలోని గోర్మానియా, మేరీల్యాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్మిల్ రెస్టారెంట్ అది. 1988 ఫిబ్రవరి 17 మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ ఫోన్ మోగింది. అందులో వెయిట్రెస్గా పని చేస్తున్న కాథీ ఫోర్డ్ అనే 19 ఏళ్ల అమ్మాయి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ రెస్టారెంట్ ఆమె తల్లిదండ్రులదే. అందులో తను పార్ట్టైమ్ జాబ్ చేస్తూ ఉండేది. ఫోన్ పెట్టెయ్యగానే ఆమె చాలా కంగారుగా, అందులో పనిచేసే మరో ఉద్యోగినితో ‘కాల్ చేసింది ఓ మేజిస్ట్రేట్ అట, మైనర్లకు మద్యం అమ్ముతున్న బార్లు, రెస్టారెంట్లపై పోలీస్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని అతడు హెచ్చరించాడు’ అని ఇతర వివరాలేమీ చెప్పకుండా అక్కడి నుంచి పరుగుతీసింది. ఆమె అదే కంగారుతో ఇంటికి వెళ్లి స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని.. సరిగ్గా గంటకి రెస్టారెంట్కి తిరిగి వచ్చింది. అంతే వేగంగా తన పర్స్ అందుకుని, తన తండ్రి కారులో బయలుదేరింది. అదే ఆమె కనిపించిన ఆఖరి దృశ్యం. సాయంత్రం దాకా ఆమె కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరునాడు కాథీ బాయ్ఫ్రెండ్ డార్విన్ పోలీసుల్ని కలసి.. గోర్మానియాకు చెందిన డిప్యూటీ షెరీఫ్ పాల్ ఫెర్రెల్పై తనకు అనుమానం ఉందని, కాథీకి అతడితో పరిచయం ఉందని చెప్పాడు. పైగా గతరాత్రి కాథీని ఫెర్రెల్ నివాస గృహానికి సమీపంలో చూశానని సాక్ష్యమిచ్చాడు. దాంతో అదేరోజు ఫెర్రెల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ‘కాథీ నాకు ప్రియురాలి కంటే ముందు గొప్ప స్నేహితురాలు.. గత రాత్రి ఎనిమిదిన్నర సమయంలో స్థానిక క్లబ్హౌస్కి నా కోసం కాథీ కాల్ చేసి, కలుద్దాం అంటూ ఏడ్చింది. హైస్కూల్ పార్కింగ్ స్థలంలో ఎదురుచూస్తా త్వరగా రా అన్నాను. సుమారు 20 నిమిషాలు ఎదురు చూసినా తను రాలేదు’ అంటూ ఫెర్రెల్ బదులిచ్చాడు. ఫెర్రెల్ అప్పటికే బెర్నార్డ్ అనే మహిళతో రిలేషన్లో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 1988 జనవరిలోనే ఫెర్రెల్ వెస్ట్ వర్జీనియాలోని గ్రాంట్ కౌంటీలో డిప్యూటీ షెరీఫ్గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా నెలకు కాథీ మిస్ అయ్యింది. ‘1987 నుంచే మా మధ్య పరిచయం ఉంది. మా కలయిక చాలా రహస్యంగా నడిచేది. ఇటు బెర్నార్డ్కి కానీ, అటు కాథీ బాయ్ ఫ్రెండ్కి కానీ తెలియకుండా జాగ్రత్తపడేవాళ్లం. జాబ్ వచ్చిన తర్వాత కాథీకి సమీపంలో బిస్మార్క్ రోడ్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేవాడ్ని. అప్పుడప్పుడు కాథీ నా దగ్గరకు వచ్చేది’ అని ఫెర్రెల్ చెప్పాడు. ఆధారాలు లేక అతడ్ని వదిలిపెట్టేశారు. సరిగ్గా వారానికి ఓల్డ్మిల్ రెస్టారెంట్కి ఓ లేఖ వచ్చింది. అందులో ‘నేను క్షేమంగానే ఉన్నాను.. నా కోసం వెతకొద్దు’ అని కాథీ రాసినట్లుంది. అయినా డార్విన్.. కాథీ కోసం వెతకడం ఆపలేదు. మరో రెండు వారాలకు ఫెర్రెల్ నివాసం ఉండే ఇంటికి కిలోమీటర్లోపే, అడవిలో కాథీ తీసుకెళ్లిన కారు కాలి బూడిదై కనిపించింది. ఎక్కడా కాథీ ఆనవాళ్లు కానీ, మృతదేహం కానీ కనిపించలేదు. వెంటనే.. రెస్టారెంట్కి వచ్చిన లేఖలోని చేతిరాతపై నిఘా పెట్టారు అధికారులు. అది ఫెర్రెల్ చేతిరాతేనని తేలడంతో కేసు బిగుసుకుంది. అయితే ఫెర్రెల్ ఇంకో షాకిచ్చాడు.. ‘ఆ కారు అక్కడున్న విషయం నాకు ముందే తెలుసు. కాథీ కేసు విషయంలో నన్ను విచారించి, వదిలిపెట్టిన మరునాడే కాథీ కోసం వెతుకుతుంటే.. ఆ కారు అక్కడ కనిపించింది. కాథీ శవం కారులో ఉందేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. ఎవరో నన్ను ఇరికిస్తున్నారని అర్థమై ఆ లేఖ రాసి తప్పించుకోవాలని అనుకున్నా’ అన్నాడు. మరోవైపు ఫెర్రెల్ బెడ్రూమ్లో గోడ మీద రక్తం మరకలు ఉండటంతో ఆ శాంపిల్స్ ల్యాబ్కి పంపించారు పోలీసులు. అది ఓ మహిళ రక్తమని తేలింది కానీ కాథీదో కాదో తేల్చలేకపోయారు. దాని గురించి ఫెర్రెల్ని అడిగితే.. ఆ మరకలు తాను అద్దెకు రాకముందు నుంచే ఆ గోడ మీద ఉన్నాయని చెప్పాడు. ఇక ఫెర్రెల్ నివాసానికి పొరుగున ఉండే కిమ్ నెల్సన్ అనే మహిళ.. ఫిబ్రవరి 17 రాత్రి తనకు సమీపంలో ఓ అమ్మాయి అరుపులు, తుపాకీ శబ్దాలు వినిపించాయని సాక్ష్యమిచ్చింది. దాంతో కాథీని చంపి మృతదేహాన్ని ఫెర్రెల్ ఎక్కడో దాచేశాడని నమ్మేవాళ్లు పెరిగిపోయారు. అలా సుమారు పదిహేనేళ్లు జైల్లోనే ఉండిపోయాడు ఫెర్రెల్. మరోవైపు అతడు.. పరిచయస్తులైన ఆడవారికి అజ్ఞాత ఫోన్ కాల్స్ చేసి.. అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తేలింది. తను చెప్పిన చోటుకు రావాలని బెదిరించేవాడని కొందరు మహిళలు సాక్ష్యమిచ్చారు. ఆ ఆరోపణలను ఫెర్రెల్ అంగీకరించినప్పటికీ.. ఈ ఫోన్ కాల్స్కి, కాథీ మిస్సింగ్కి సంబంధం లేదని వాదించాడు. అయితే కాథీకి ఆ రోజు కాల్ చేసింది ఫెర్రెలే అయ్యుంటాడని, ఏదో చెప్పి బెదిరించడంతోనే ఆమె వెళ్లి ఉంటుందని.. గతంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన సంబంధాన్ని అతడు కావాలనే తప్పుగా క్రియేట్ చేసి చెబుతున్నాడని కొందరు అధికారులు భావించారు. అయితే అతడు నిర్దోషి అనేందుకు మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఓ జంటను సాక్ష్యంగా తీసుకొచ్చాడు. కాథీ కనిపించకుండా పోయిన ఏడాదికి.. టెన్నెసీ గుండా వెళుతుంటే మార్గంమధ్యలో ఓ రెస్టారెంట్లో కాథీ.. వెయిట్రెస్గా పనిచేయడం చూశామని ఆ జంట చెప్పుకొచ్చింది. ‘మీరు కాథీనే కదా?’ అని అడ గటానికి ప్రయత్నించినప్పుడు ఆమె కిచెన్లోకి పారిపోయిందని వాళ్లు చెప్పారు. మరోవైపు తనతో ఆ రోజు పోలీసులు బలవంతపు సాక్ష్యం చెప్పించారని కిమ్ వెల్లడించింది. దాంతో ఫెర్రెల్ పట్ల సానుభూతిపరులు పెరిగారు. 2002లో అతడికి పెరోల్ లభించింది. అయితే కాథీ తమని వదిలి ఉండాలనుకునే మనిషి కాదని.. తనను ఎవరో చంపేసి ఉంటారని ఆమె కుటుంబం నమ్మింది. ఈ కేసులో కాథీ స్నేహితులు కొందరు అసలు నేరస్థుడు డార్విన్ కావచ్చన్నారు. ఎందుకంటే కాథీ నిత్యం డార్విన్కే భయపడుతూ బతికేదని వాళ్లు గుర్తుచేసుకున్నారు. ఈ ఉదంతంలో కాథీ చనిపోయిందా? లేక పారిపోయిందా? డార్విన్ చంపేసి.. కేసు ఫెర్రెల్ని చుట్టుకునేలా ప్లాన్ చేశాడా? లేక ఫెర్రెలే చంపేసి.. అమాయకంగా నాటకం ఆడాడా? కాథీకి ఆ రోజు మధ్యాహ్నాం కాల్ చేసింది ఎవరు? ఇలా అన్నీ మిస్టరీగానే మిగిలాయి. --సంహిత నిమ్మన (చదవండి: కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..) -
అక్కడ శిశువులు ఎలా చనిపోతున్నారనేది?..అంతుపట్టని మిస్టరీ!
ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు. చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె. పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా.. రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు! 2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. వైద్య బృందాలు అధ్యయనం చేయగా.. వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే. గుర్తించిన అంశాలు.. శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది. (చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్) -
కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..
జాలి, దయ, తప్పు, ఒప్పు తెలియని పశుత్వం మనిషిరూపంలో ఉంటే.. అమాయకమైన జీవితాలు ఎలా ఆగమవుతాయో చెప్పే ఉదంతమే ఇది. ‘ఫ్రాంక్లిన్ డెలానో ఫ్లాయిడ్’ అనే రాక్షసుడు.. తన ఇష్టానుసారంగా కాలరాసిన కొందరి అభాగ్యుల తలరాత ఇది. 1994 సెప్టెంబర్ 12, ఉదయం పదకొండు దాటింది. అమెరికా ఓక్లహోమాలోని చోక్టావ్లో ‘ఇండియన్ మెరిడియన్ ఎలిమెంటరీ స్కూల్’లో ఒక్కసారిగా పిల్లలంతా పెద్దపెద్దగా కేకలేస్తున్నారు. కొందరైతే భయంతో ఏడుస్తున్నారు. స్కూల్ టీచర్స్ అంతా వెనక్కి అడుగులేస్తుంటే.. ప్రిన్సిపల్ జేమ్స్ డేవిస్ మాత్రం చేతులు పైకెత్తి నెమ్మదిగా ముందుకు అడుగులేస్తున్నాడు. నిజానికి అతడి తలకు గురిపెట్టిన తుపాకీనే.. అతడ్ని గదమాయిస్తూ ముందుకు తోస్తోంది. గన్ పట్టుకున్న ఆ ఆగంతకుడి ఆజ్ఞలే అక్కడున్న అందరినీ వణికిస్తున్నాయి. అతడు చెప్పినట్లే ప్రిన్సిపల్.. ఓ క్లాస్రూమ్లోని ఆరేళ్ల మైకేల్ హ్యూజ్ అనే బాబు దగ్గరకు వెళ్లాడు. క్షణాల్లో ఆ బాబుని తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఆగంతకుడు.. సరాసరి ప్రిన్సిపల్ని ఓ కారు దగ్గరకు నడిపించి, డ్రైవ్ చెయ్యమన్నాడు. అతడి ఆదేశాలతోనే ఆ కారు ముందుకు కదిలింది. కిడ్నాప్ అయింది ప్రిన్సిపల్తో పాటు మైకేల్ అని పోలీసులకి తెలియగానే.. ఆ ఆగంతకుడు వారెన్ జడ్సన్ మార్షల్ అని వాళ్లకు క్లారిటీ వచ్చేసింది. వెంటనే పోలీస్ రికార్డ్స్ నుంచి ఓ ఫొటో తీసి.. కొందరు ప్రత్యక్ష సాక్షుల(టీచర్స్)కి చూపించి నిర్ధారించుకుని మరీ వేట మొదలుపెట్టేశారు. ఐదు గంటల తర్వాత.. ఓ అడవి సమీపంలో ‘హెల్ప్ హెల్ప్’ అనే అరుపులు జేమ్స్ని గుర్తించేలా చేశాయి. అతణ్ణి ఎవరో చెట్టుకు కట్టేశారు. అయినా, సురక్షితంగానే ఉన్నాడు. జేమ్స్ని ‘మైకేల్ ఎక్కడ?’ అని అడిగితే.. ‘నన్ను కట్టేసి.. బాబుని తీసుకుని అతడు (వారెన్) పారిపోయాడ’ని సమాధానమిచ్చాడు. నిజానికి మైకేల్ తల్లి షారోన్ మార్షల్ అనుమానాస్పద మృతిలో వారెన్ (ఆమె భర్తే) ప్రధాన నిందితుడు. తల్లి మరణం తర్వాత మైకేల్ని సంరక్షణ కేంద్రానికి తరలించి.. ఆమె భర్త వారెన్ని అరెస్ట్ చేశారు. పలు ఆంక్షలతో పోలీసులు వదిలిపెట్టిన ప్రతిసారి వారెన్.. నేను నా భార్య షారోన్ ని చంపలేదు.. నా కొడుకు మైకేల్ను నాకు తిరిగి అప్పగించండి అని రచ్చ చేసేవాడు. నాలుగేళ్లుగా అదే మాట మీదున్న వారెన్.. చివరికి మైకేల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. షారోన్ కేసు విచారణ సమయంలోనే మైకేల్.. వారెన్ కన్నకొడుకు కాదని డీఎన్ఏ రిపోర్ట్లు తేల్చాయి. షారోన్ కి రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం ఉందని, అతడే మైకేల్ తండ్రి అని అధికారులు నమ్మారు. అదే నమ్మకంతో వారెన్.. షారోన్ ని చంపేసి ఉంటాడని కూడా భావించారు. బాబు కిడ్నాప్ అయిన రెండు నెలలకు వారెన్ పోలీసులకు దొరికేశాడు. అయితే మైకేల్ అతడితో లేడు. మైకేల్ ఎక్కడ? అనే ప్రశ్నకు అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. అయినా నోరు విప్పలేదు. కొన్ని రోజులకి ‘మైకేల్ సురక్షితంగానే ఉన్నాడు.. కానీ అతడి వివరాలు ఎప్పటికీ చెప్పను’ అని మొండికేశాడు. నిజం చెప్పకపోవడంతో కస్టడీలోనే ఉండిపోయాడు. అప్పుడే అతడు చేసిన మరిన్ని అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇంతలో ఫ్లోరిడాకు చెందిన షీరల్ కమెస్సో అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయి మిస్సింగ్ కేసులో అనుమానితుడైన క్లారెన్స్ హ్యూజ్, ఈ వారెన్ ఒక్కరేనని తేలింది. పైగా షీరల్, షారోన్ ఇద్దరూ మంచి స్నేహితులు. వారెన్ (క్లారెన్స్)తో షీరల్కి ఏదో విషయంలో వాగ్వాదం జరిగిందట. తర్వాత కొంత సమయానికే ఆమె కనిపించకుండా పోయిందట! ఆమె మిస్ అయిన కాసేపటికే వారెన్ కుటుంబం ఫ్లోరిడా నుంచి ఓక్లహోమా షిఫ్ట్ అయ్యారట! పైగా పేర్లు కూడా మార్చేసుకున్నారు. అన్నీ అనుమానించదగ్గ అంశాలే కావడంతో వారెన్ (క్లారెన్స్) చుట్టూ కేసు బిగుసుకుంది. ఇక అతడి భార్య షారోన్ అతడి కంటే పాతికేళ్లు పైనే చిన్నది కావడంతో.. మైకేల్ని ఎత్తుకెళ్లినట్లే.. షారోన్ ని కూడా ఎత్తుకొచ్చాడా? అనే అనుమానం వారెన్ నేరపుటల్ని కదిలించింది. వారెన్ (క్లారెన్స్) అసలు పేరు ఫ్రాంక్లిన్ డెలానో ఫ్లాయిడ్ అని తెలిసినప్పటి నుంచి అతడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడటం మొదలైంది. ఫ్రాంక్లిన్ ఊరికో పేరు మార్చేవాడని తేలింది. విచారణలో ఉన్న ఫ్రాంక్లిన్ రోజుకో అబద్ధం చెప్పేవాడు. పొంతనలేని సమాధానాలతో పిచ్చెక్కించేవాడు. అయితే 1995లో దొరికిన కొన్ని ఆధారాలతో 2002లో షీరల్ని హత్య చేసింది ఫ్రాంక్లిన్నే అని నిర్ధారణ అయ్యి అతడికి జీవితఖైదు పడింది. ఇక జైల్లోనే మగ్గిపోయాడు.‘షీరల్ మర్డర్ కేసులో శిక్షపడింది కాబట్టి.. ఎలాగో నీ జీవితం జైల్లోనే ముగుస్తుంది. ఇప్పుడైనా మైకేల్, షారోన్ ల గురించి నిజం చెప్పు’ అంటూ 2014లో ఎఫ్బీఐ ఏజెంట్స్ ఫ్రాంక్లిన్ ని మళ్లీమళ్లీ ప్రశ్నించారు. దాంతో మైకేల్ని ఆ రోజే చంపి ఓక్లహోమా/టెక్సాస్ సరిహద్దు సమీపంలో పాతేశానని చెప్పాడు ఫ్రాంక్లిన్. అయితే ఆ పరిసరాల్లో ఎక్కడా మైకేల్ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో అతడు చెప్పింది నిజమో అబద్ధమో తేలలేదు. ఇక ఫ్రాంక్లిన్ బయటపెట్టిన షారోన్ కథ ఎందరినో కంటతడి పెట్టించింది. షారోన్ అసలు పేరు సుజానే సేవకీస్, తను నా మొదటి భార్య శాండీ బ్రాండెన్ పెద్ద కూతురు, అంటే సుజానే(షారోన్)కి నేను సవతితండ్రిని, ఆమెకి ఐదేళ్ల వయసున్నప్పుడు 1975లో కరోలినా నుంచి ఎత్తుకొచ్చా అని చెప్పాడు. వెంటనే ఆధారాల కోసం శాండీ కథను, ఫ్రాంక్లిన్ గతాన్ని లోతుగా తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. ఫ్రాంక్లిన్ 17 ఏళ్ల నుంచి 31 ఏళ్ల వరకూ చేసిన నేరాలు ఒక ఎత్తయితే.. 31 ఏళ్ల నుంచి చేసిన కుట్రలు మరో ఎత్తు. అమెరికాలోని జార్జియా నుంచి ఇల్లినాయీ వరకూ ఎన్నో లైంగిక, హత్య నేరాలకు పాల్పడి.. కొన్నింటికి శిక్షలు అనుభవించి.. మరికొన్నింటికి పాల్పడినా, చిక్కకుండా తప్పించుకుని పారిపోయి.. 1974 నాటికి కరోలినా చేరుకున్నాడు. అక్కడ పరిచయం అయ్యింది శాండీ బ్రాండెన్ అనే నలుగురు పిల్లల తల్లి. ఫ్రాంక్లిన్ ఆమెని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలు గడిచే సరికి.. శాండీ ఏదో చెక్ విషయంలో 30 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఫ్రాంక్లిన్ అసలు స్వరూపం తెలియని శాండీ.. జైలుకి వెళ్తూ వెళ్తూ తన పిల్లలందరినీ ఫ్రాంక్లిన్ కే అప్పగించి వెళ్లింది. ఆమె తిరిగి జైలు నుంచి వచ్చేసరికి ఇంట్లో తన పిల్లలు, భర్త ఫ్రాంక్లిన్ ఎవ్వరూ కనిపించలేదు. కొన్ని రోజులకి తన నలుగురు పిల్లల్లో.. ఇద్దరు ఆడపిల్లలు స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్నారని తెలుసుకుని వారిని చేరుకుంది. మరి పెద్ద కూతురు సుజానే, కొడుకు ఫిలిప్ని ఫ్రాంక్లిన్ ఎత్తికెళ్లాడని గుర్తించి.. కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసింది. అయితే సవతి తండ్రికి పిల్లలపై హక్కు ఉంటుంది కాబట్టి కేసు నమోదు చెయ్యలేమని అధికారులు చెప్పారు. దాంతో శాండీ కొన్నేళ్లకు తన ఇద్దరు పిల్లల మీద ఆశలొదులుకుని బతకడం మొదలుపెట్టింది. 1987లో కూతురుగా పెరిగిన సుజానే(షారోన్)ని.. ఫ్రాంక్లిన్ (వారెన్) రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె వయసు 16. సరిగ్గా ఏడాదికి మైకేల్ జన్మించాడు. మైకేల్ తన కొడుకు కాదని తెలిసి, హిట్ అండ్ రన్ సాకుతో సుజానేని చంపేసే ఉంటాడని అధికారులు అంచనా వేశారు. ఇదంతా 2014లో ఫ్రాంక్లిన్ చెప్పిన ఆధారాలతో వెలికి తీసిన కథ. మరి సుజానే తమ్ముడు ఫిలిప్ని ఏం చేశావ్? అని ఫ్రాంక్లిన్ని ప్రశ్నిస్తే.. అప్పట్లోనే ఓ జంటకు దత్తత ఇచ్చానని చెప్పాడు. ఇక 2019లో ఫిలిప్ స్టీవ్ అనే వ్యక్తి.. సుజానే నా అక్క, ఫ్రాంక్లిన్ ఎత్తుకొచ్చిన శాండీ కొడుకుని నేనే అని డీఎన్ఏ పరీక్షకు సిద్ధమయ్యాడు. 2020లో అది నిర్ధారణైంది. దాంతో ఫిలిప్ తిరిగి శాండీ కుటుంబాన్ని కలుసుకున్నాడు. మరోవైపు ఫ్రాంక్లిన్ 79 ఏళ్ల వయసులో 2023 జనవరి 23న ఫ్లోరిడాలోని జైల్లోనే మరణించాడు. ఏది ఏమైనా సుజానే, మైకేల్లను నిజంగానే ఫ్రాంక్లిన్ చంపాడా? మరి మైకేల్ అవశేషాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే. --సంహిత నిమ్మన (చదవండి: సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ మిస్టరీనే!) -
అక్కడ ఎందుకలా చనిపోతున్నారు?
నిర్మల్: విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కలకలం రేపుతున్నాయి. ఇందులో చాలా మరణాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. జూన్లోనే ఇద్దరు విద్యార్థి నులు తనువు చాలించగా, ఇటీవలే వర్సిటీలోకి అడుగుపెట్టిన కొత్త విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం కలచివేస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీలు వేసినా అసలు కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత చేతులు దులిపేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఒకప్పుడు 20 వేల నుంచి 30 వేల మధ్య దరఖాస్తులు వచ్చేవి. వరుస ఘటనలతో ఇప్పుడు 10 వేల నుంచి 12 వేల మధ్యకు దరఖాస్తులు పడిపోవడం గమనార్హం. బలవన్మరణాలు ఎందుకు? ఎంత ఒత్తిడి, ఎంత బాధ, భవిష్యత్తుపై ఎంత భయం కలిగి ఉంటే.. ఓ 17ఏళ్ల విద్యార్థి ని బాత్రూమ్లో.. అదీ ఎగ్జాస్ట్ ఫ్యాన్కు తన చున్నీతోనే ఉరేసుకుంటుంది..? జూన్ 13న సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక(17) ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోయిన రోజే నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా.. ఇప్పటికీ కారణాలు బయటపెట్ట లేదు. ఇక దీపిక మృతిచెంది రెండురోజులు కూడా గడవకముందే తనతోపాటే పీయూసీ–1 చదువుతున్న గజ్వేల్కు చెందిన బుర్ర లిఖిత జూన్ 15న అర్ధరాత్రి తర్వాత గంగా బ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయింది. లిఖిత మరణంలోనూ ఏదో మిస్టరీ ఉందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. తాజాగా ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ మండలం నాగాపూర్కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌన్సెలింగ్ చేస్తున్నారా.. విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పా ర్టీలు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బాసర సరస్వతీమాత ఆలయంలో హుండీ లెక్కించగా, అందులో తల్లిదండ్రులు రాసిన లేఖ బయటపడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉంది. అసలు ఆ విభాగం ఏం చేస్తోంది.. నూతన విద్యార్థులకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు, మరణాలపైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరుగుతోంది.. అసలు.. బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జూన్లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు నలుగురు సభ్యులతో వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో బయటకు రాలేదు. ఇక కళాశాల విద్యార్థులు చనిపోతే ఆ మృతదేహాలను అనాథ శవాల్లా ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులతో మార్చురీకి తరలించేసి యాజమాన్యం దులిపేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆస్పత్రులకు పంపించామని చెబుతున్న అధికారులు, బాసరకు దగ్గరగా ఉన్న నిజామాబాద్కు పంపించాలి కానీ.. దూరంగా ఉన్న నిర్మల్కు ఎందుకు పంపిస్తున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.. -
డబ్బింగ్ పనుల్లో ‘మిస్టరీ’
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘ఇదొక థ్రిల్లర్ కామెడీ సినిమా. సాయి అనుకున్న కథని అనుకున్నట్లుగా తీశాడు. నా పాత్ర డబ్బింగ్ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది. టీమ్ అందరికి నా అభినందనలు’అని అన్నారు. -
మీకు తెలుసా? ఒక్క రాత్రిలో దెయ్యాలు ఆలయాన్ని కట్టించాయట
మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది, సైన్స్కు అందని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే కట్టించాయట. అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? అయినా వాటికి ఆలయం కట్టించాల్సిన పనేంటి? ఇంతకీ ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుకున్న కథేంటి అన్నది ఈ స్టోరీలో చూసేయండి.. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. మన దేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించాలని విన్నాం. అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయట. కర్ణాటకలోని దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర గ్రామంలోని శివాలయాన్ని దెయ్యాలే కట్టించాయని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. సుందరేశ్వర దేవాలయంగా ఆ గుడికి పేరుంది. సాధారణంగా దేవాలయాలపై దేవుళ్ళ రాతి శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తాయి. కానీ దేవాలయంలో మాత్రం రాక్షసుల నమునాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం ఉందట. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు. దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో దెయ్యాలను వశపర్చుకొని బంధీగా చేశాడట. దీంతో బుచ్చయ్యను బతిమాలగా, కూలదోసిన ఆలయాన్ని తిరిగి కట్టివ్వాలని దెయ్యాలకు శరతు విధించాడట. మాంత్రికుడి ఆదేశంతో దిగి వచ్చిన దెయ్యాలు రాత్రికి రాత్రే దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. అప్పటి నుంచి దెయ్యాలు కట్టిన దేవాలయంగా ఆ ఆలయాన్ని పిలిచేవారు. ఇక కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. అప్పట్నుంచి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎవరికైనా దెయ్యాలు పట్టినా ఈ ఆలయానికి తీసుకొస్తే దెయ్యం వదులుతుంది అని స్థానికుల నమ్మకం. -
వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..
చెట్లు నిటారుగా ఉంటాయి. కొన్ని వంకరగా కూడా ఉంటాయి. మరికొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్లో లేక మరేదైనా కారణం చేతనో వంకరగా ఉండటం సహజం. కానీ ఎవరో దగ్గరుండి పనిగట్టుకుని పెంచినట్లుగా అన్ని ఒకే వంకరల్లో చెట్లు ఉంటాయ?. విచిత్రం ఏమిటంటే అలా వంపు తిరిగి ఉన్నవన్నీ ఒకే జాతి మొక్కలు. ఎందకిలా జరిగింది? రీజన్ ఏంటో అని శాస్త్రవేత్తలు జుట్లు పీక్కుని మరీ పరిశోధనలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇంతకీ ఆ అడవి ఎక్కడుందంటే.. పోలాండ్లోని వెస్ట్ పోమెరేనియాలోని గ్రిఫినో అనే పట్టణానికి సమీపంలో ఈ విచిత్రమైన అడవి ఉంది. దీన్ని 'వంకర అడవి' లేదా క్రూక్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి చెట్టు బేస్ వద్ద వంపు తిరిగి ఉండి.. అసాధారణమైన అడవిలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ పైన్ చెట్లే. పైగా చెట్లన్ని కూడా సుమారు 90 డిగ్రీ బేస్ వంపు తిరిగి ఉన్నాయి. సుమారు రెండు హెక్టార్ల భూమిలో వందకు పైగా ఉన్నో ఈ పైన్ చెట్లన్ని ఇలానే వంకరగా ఉన్నాయి. చూడటానికి ఆంగ్ల అక్షరం 'J' ఆకారంలో ఉన్నాయి చెట్లు. ఆ చెట్లన్ని కూడా ఉత్తరం వైపే తిరిగి ఉంటాయి. ఇవి వంకరగా ఉన్నప్పటికీ వాటి వంపుతో సంబంధంల లేకుండా సుమారు 50 అడుగులు ఎత్తు వరకు ఎదగుతుండడం విశేషం. వాటికి ఎలాంటి చీడపీడల లేవు. పైగా ఆరోగ్యంగా ఉన్నాయి. పైన్ చెట్లు ఎందుకిలా వంపు తిరిగి ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో భాగంగా ఆ చెట్ల వయసును లెక్కిస్తే.. దాదాపు 1930లలో నాటిన చెట్లుగా తేలింది. ఇక్కడ చెట్లు వంపు తిరిగి ఉండటానికి మంచు తుపానులు, లేక గురత్వాకర్షణ శక్తి లేదా జన్యు పరివర్తన అని పరివిధాలుగా పరిశోధనలు చేసినా.. ఓ పట్టాన శాస్త్రవేత్తలు అసలు కారణం ఏమిటో చెప్పలేకపోయారు. గ్రహాంతరవాసులు పని అని కొందరూ భావిస్తున్నారు. ఈ ఫైన్ చెట్లు ఇలా అసాధారణ రీతిలో ఉండటానకి కారణం స్థానికి రైతులేనని అంటున్నారు పలువురు. ఫర్నీచర్ కోసం ఇలా వంగిన చెట్లను ఉద్దేశపూర్వకంగానే పెంచుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈ అడివిలో దాదాపు 400 పైన్చెట్లు ఉన్నాయని అవే అలా వంకర ఉన్నాయని పలు వాదనలు వినిపిస్తున్నాయి. 1970లో రెండోవ ప్రపంచ యుద్ధంలో ఆ అడవిని అలా వదిలేయడంతో ఇలా చెట్లు వంపు తిరిగి ఉన్నాయని కొందరూ చెబుతున్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థానికులకే ఈ అసాధారణ అడవికి సంబంధించిన రహస్యం తెలిసి ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైనా ఇప్పటి వరకు ఆ అడవి అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది. (చదవండి: ఓర్నీ!.. ఏం రికార్డ్రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!) -
Mystery Movie: ఫోరెన్సిక్ ఆఫీసర్గా ఆలీ
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆలీ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం ఫోరెన్సిక్ ఆఫీసర్ సాయి పాత్రలో ఆలీ కనిపిస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ ‘దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం. ఆలీ డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ అన్నారు. -
పోలీసులనే హడలెత్తించిన మిస్టరీ కేసు..అతడొస్తే.. వర్షం వచ్చేస్తుంది!
అసంభవమైన ప్రతిదానికి పుకార్లు ఎక్కువ, సాక్ష్యాలు తక్కువ. అందుకే.. అస్పష్టత, సందిగ్ధతలే వాటిని తీర్మానిస్తాయి. నిర్ధారించలేని ఎన్నో ఘటనల్లో ఈ రెయిన్ మెన్ కథ ఒకటి. ఎవరీ రెయిన్ మెన్? ఏం జరిగింది? అది 1983 ఫిబ్రవరి 24. అమెరికా పెన్సిల్వేనియాలోని స్ట్రౌడ్స్బర్గ్లో జేమ్స్ కిషోగ్ (63) అనే వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న రోజది. అతడి మరణంతో ఆ కుటుంబమంతా బాధలోనే ఉంది. కానీ జేమ్స్ మనవడు డాన్ డెకర్ (21) మనసుకు చాలా సంతోషంగా ఉంది. డెకర్.. స్పెషల్ పర్మిషన్తో జైలు నుంచి ఆ రోజే బయటకు వచ్చాడు. అంటే డెకర్ కానీ.. జేమ్స్ని చంపి జైలుకు వెళ్లాడా? అనుకునేరు, డెకర్ జైలుకు వెళ్లడానికి, జేమ్స్ చావుకు ఎటువంటి సంబంధం లేదు. జేమ్స్ లివర్ సిర్రోసిస్తో మరణించాడు. డెకర్.. మాదకద్రవ్యాల కేసులో శిక్షను అనుభవిస్తూ.. కుటుంబ అత్యవసర పరిస్థితుల్లో ఖైదీగానే బయటికి వచ్చాడు. మరి ఎందుకు తాత చావు మనవడికి సంతోషంగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం తన స్నేహితురాలు జెన్నీ కైఫర్కి సీక్రేట్గా చెప్పాడు. ‘జేమ్స్ నన్ను ఏడేళ్ల వయసు నుంచి శారీరకంగా, చెప్పుకోలేని విధంగా హింసించేవాడు, ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు. అతడి మరణం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఇక నా బ్యాడ్ టైమ్ పోయినట్లే’ అని మనసులో మాటల్ని జెన్నీకి చెప్పాడు. కానీ అతడి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ రాత్రికే డెకర్కి జ్వరం వచ్చింది. ఆ రాత్రంతా చాలా వింతలు చూశాడు. బాత్రూమ్ కిటికిలో ఓ వృద్ధుడు వెకిలిగా నవ్వుతూ మీదకు దుమికినట్లు.. ఉన్నపళంగా ఎవరో బలవంతంగా తోస్తున్నట్లు.. వింత భ్రమలతో నిద్ర లేకుండా గడిపాడు. అంత్యక్రియల తర్వాత కుటుంబీకులు.. జేమ్స్ని ఎంతగానో పొగడటంతో మరింత కలత చెందిన డెకర్.. మరునాడు రాత్రికి జెన్నీ ఇంటికి వస్తున్నానని, మరో స్నేహితుడు బాబ్ని కూడా అక్కడికి రమ్మని, ఆ రాత్రికి అక్కడే ఉందామని రిక్వెస్ట్ చేశాడు. అనుకున్నట్లే ముగ్గురూ జెన్నీ ఇంట్లో కలిశారు. చాలాసేపు కబుర్లుతో సరదాగా గడిపారు. రాత్రి డిన్నర్ చేసి.. డెకర్, బాబ్ గదిలోకి వెళ్లగానే.. కిందనున్న జెన్నీని పెద్ద శబ్దం వణికించింది. బాబ్ పరుగున వచ్చి.. ‘జెన్నీ.. వెంటనే పైకిరా గదిలో వర్షం కురుస్తోంది. డెకర్ వింతగా ప్రవర్తిస్తున్నాడు’ అంటూ గాభరా పడ్డాడు. జెన్నీ.. బాబ్ వెనుకే ఆ గదికి పరుగుతీసింది. గది అంతా వర్షమే. ఏదో దుర్గంధం. డెకర్ ఓ మూలన పడున్నాడు. నిస్సహాయంగా.. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఎంత పిలిచినా పలకలేదు. ఆ గదిలోకి వెళ్లాలంటే ఇద్దరికీ భయమేసింది. అసలా నీరు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. వెంటనే ఇంటి పైనుండే హౌస్ ఓనర్ రాన్ వాన్ని పిలిచారు. అతడు ఆ గదిలోకి వచ్చి చూసి షాక్ అయ్యాడు. ప్లంబింగ్, బాత్రూమ్ లీక్ కాబోలని రెండూ చెక్ చేశాడు. వెంటనే భార్య రోమైన్ ని కిందకి పిలిచాడు రాన్. ఆమెకీ ఏం అర్థంకాలేదు. దాంతో పోలీసు అధికారి జాన్ బౌజన్ కి సమాచారం ఇచ్చారు రాన్ దంపతులు. అతడు వచ్చేలోపు.. మరోసారి నీళ్లు ఎలా వస్తున్నాయో గమనించాలని మొత్తం పరికించారు. ఆ నీళ్లు పైకప్పు నుంచి కిందకు మాత్రమే రావడం లేదని.. గోడల్లోంచి, నేలలోంచి అన్నివైపుల నుంచి వస్తున్నాయని గుర్తించి వణికారు. పైగా ఆ నీళ్లను తాకితే.. జిగటగా అనిపించిందట. కాసేటికి బౌజన్ ఆ ఇంటికి వచ్చాడు. వర్షాన్ని చూసి భయమేసి తన స్నేహితుడు (ఆ రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న మరో అధికారి) రిచర్డ్ వోల్బర్ట్ను పిలిచాడు. అతడికీ భయమేసింది. వర్షం అయితే పడుతుంది కానీ.. నీళ్లు నిండి, పొంగడం లేదు. ఎలాగో ధైర్యం చేసి, అంతా కలసి గదిలోకి వెళ్లి డెకర్ను బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు కూడా చాలాసార్లు డెకర్.. గిలగిలా కొట్టుకుని కాసేపటికి మామూలయ్యాడు. వర్షం మాత్రం ఆగలేదు. చుట్టు పక్కలున్న కొందరు ఆ వింతను చూసి విస్తుపోయారు. బౌజన్, వోల్బర్ట్లు కలసి స్ట్రౌడ్స్బర్గ్ చీఫ్ ఆఫ్ పోలీస్ గ్యారీ రాబర్ట్స్కి నివేదించడానికి బయలుదేరారు. అప్పటికి వర్షం మొదలై సుమారు 23 గంటలైంది. ఎదురుగా ఉండే రెస్టారెంట్ యజమాని.. పామ్ స్క్రోఫానో ఆ ఇంటికి వెళ్లి గదిలోని ఆ వర్షాన్ని, డెకర్ పరిస్థితిని గమనించి.. ఇది కచ్చితంగా దెయ్యం పనే అని చర్చి అధికారులకు కాల్ చేయించింది. ఇంతలో డెకర్కి ఏదో ఒకటి తినిపించడానికి తన రెస్టారెంట్కే తీసుకుని రమ్మని సలహా ఇచ్చింది. మధ్యలో బాబ్ ఆ టెన్షన్ భరించలేక ఇంటికి పారిపోయాడు. జెన్నీ.. సాధారణ స్థితిలోకొచ్చిన డెకర్ని తీసుకుని ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి బయలుదేరింది. వాళ్లు వెళ్లగానే ఆ గదిలో వర్షం ఆగిపోయిందని గుర్తించిన రాన్, రొమైన్లు.. దీనికి జెన్నీ, డెకర్లలో ఎవరో ఒకరు కారణమని నమ్మారు. ఇక డెకర్ రెస్టారెంట్కి వెళ్లి కూర్చోగానే అక్కడా అదే వర్షం మొదలైంది. సీలింగ్ కింద నుంచి చినుకులు రావడం జెన్నీని, రెస్టారెంట్ యజమాని పామ్ని బాగా భయపెట్టాయి. వెంటనే పామ్ ధైర్యం చేసి.. శిలువను అందుకుని.. డెకర్ నుదుటిపై ఆనించింది. ఆ ఊహించని స్పందనకు డెకర్ విలవిల్లాడిపోయాడు. వర్షం ఆగిపోయింది. కాసేపటికి మామూలు మనిషి అయిపోయి.. జరిగింది తెలుసుకున్నాడు డెకర్. కొన్ని గంటలకు ఇద్దరూ.. జెన్నీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి అయిపోయింది. వాళ్లు రాగానే రాన్, రోమైన్లు వాళ్లతో గొడవకు దిగారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని వింతలు ఇప్పుడే చూస్తున్నామని.. వెంటనే ఇళ్లు ఖాళీ చెయ్యాలని పట్టుబట్టారు. అంతలో వంటగదిలోంచి కూరగాయలన్నీ పైకి లేచి విచిత్రమైన శబ్దాలు చేయసాగాయి. లైట్స్ వెలిగి ఆరుతున్నాయి. ఉన్నట్టుండి డెకర్ గాల్లోకి లేచాడు. డెకర్ను ఎవరో మెలిపెట్టినట్లుగా మెలికలు తిరిగాడు. కాసేపటికి ఐదు అడుగుల దూరానికి విసిరినట్లుగా పడ్డాడు. వెంటనే జెన్నీ దేవుడ్ని ప్రార్థించసాగింది. చినుకులు మొదలై, వర్షం ఆమెను కొట్టడం ప్రారంభించింది. అయినా జెన్నీ ప్రార్థించడం ఆపలేదు. కొన్ని గంటలకు అధికారులు బౌజన్, వోల్బర్ట్ తమ పైఅధికారి రాబర్ట్స్ని తీసుకుని వచ్చారు. వాళ్ల మీద కూడా చినుకులు రాళ్లలా విరుచుకుపడ్డాయి. ఆ రాత్రి అక్కడ పరిస్థితిని చూసిన రాబర్ట్స్.. బౌజన్, వోల్బర్ట్లను బలవంతంగా బయటికి పంపించేసి.. ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఎవరినీ రానివ్వలేదు. రాబర్ట్స్ కూడా ఏదో దుష్టశక్తి ప్రభావానికి లోనయ్యాడని భావించిన బౌజన్, వోల్బర్ట్లు.. మరునాడు ఉదయాన్నే రాబర్ట్స్ ఆదేశాలకు వ్యతిరేకంగా ముగ్గురు అనుభవజ్ఞులైన అధికారులను లోపలికి పంపించారు. జెన్నీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ రాత్రి ఏం జరిగిందో మాత్రం రాబర్ట్స్ నోరు విప్పలేదు. లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు అధికారులు.. డెకర్ ఉమ్మితో వర్షాన్ని సృష్టిస్తున్నాడా? అనే అనుమానంతో రకరకాలుగా చెక్ చేశారు. అధికారులలో ఒకరైన బిల్ డేవిస్.. డెకర్ చేతిలో బంగారు శిలువను ఉంచాడు. వెంటనే వర్షం ఆగింది. అయితే దాన్ని డెకర్ విసిరేశాడు. కింద పడిన శిలువను తీసుకున్నప్పుడు, అది చాలా వేడిగా ఉందని డేవిస్ గుర్తించాడు. కొద్ది క్షణాల తర్వాత మళ్లీ వర్షం మొదలైంది. మరో అధికారి జాన్ రండిల్.. అకస్మాత్తుగా డెకర్ని నేలపై నుంచి ఎత్తి గదికి అడ్డంగా విసిరినట్లు కళ్లారా చూశానని, ఆ సీన్ బస్సు ఢీ కొట్టినట్లే ఉందని చెప్పాడు. అప్పుడే డెకర్ మెడ మీద రక్తంతో మూడు పంజా గుర్తులను చూశాడు. అవి దెయ్యం గీరిన చారికలని అతడు నమ్మాడు. చివరగా, ఫిబ్రవరి 27, మూడవ రాత్రి, సువార్త బోధకుడైన ‘రెవరెండ్ జాన్సన్’ సమక్షంలో ప్రార్థనలు సాగాయి. తెల్లారేసరికి అంతా ప్రశాంతమైంది. వర్షం ఆగిపోయింది. డెకర్ మామూలు మనిషి అయ్యాడు. జాన్సన్ దెయ్యాన్ని తరిమేశాడని చూసినవారంతా నమ్మారు. ఆ దెయ్యం డెకర్ తాత జేమ్స్ ఆత్మేనని అతడి కథ తెలిసినవాళ్లంతా భావించారు. ఇక్కడితో కథ ఆగిపోలేదు. దీనికి కొనసాగింపుగా మరో ఎపిసోడ్ ఉంది. జైలు గోడల మధ్య.. నిబంధనల ప్రకారం డెకర్ శిక్ష అనుభవించడానికి తిరిగి జైలుకు వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు సాధారణంగానే సాగింది. ఉన్నట్టుండి ఒకరాత్రి అతడున్న సెల్లో వర్షం మొదలైంది. అది చూసిన డెకర్ సెల్మేట్ (మరో ఖైదీ) బెంబేలెత్తిపోయాడు. పెద్దపెద్ద కేకలతో ‘సెల్ ఓపెన్ చేయండి. నన్ను కాపాడండి’ అంటూ అరిచాడు. ఆ అరుపులకు పరుగున వచ్చిన గార్డులు వర్షం అడ్డంగా రావడం చూసి బిత్తరపోయారు. కాంక్రీట్ ఫ్లోర్ నుంచి వర్షం ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. డెకర్ మాత్రం నిశ్చేష్టుడై, ధైర్యంగా జైల్లో తన బెడ్ మీద కూర్చుని ఉండటం వాళ్లను మరింత భయపెట్టింది. కాసేపటికి డెకర్ని.. ‘ఏంటిదంతా? సెల్లో వర్షం ఎలా పడుతుంది?’ అని ఓ గార్డ్ నిలదీశాడు. ‘నేను వర్షాన్ని నియంత్రించగలను’ అని సమాధానమిచ్చాడు డెకర్ పొగరుగా. ఆ విషయాన్ని గార్డ్ మొదట నమ్మలేదు. అందుకే డెకర్ని ఆ గార్డ్ రెచ్చగొట్టాడు. ‘నీకు ఆ శక్తే ఉంటే కాస్త దూరంలో ఉన్న మా వార్డెన్ అధికారి కీన్ హోల్డ్ మీద వర్షం కురిపించు చూద్దాం’ అంటూ చాలెంజ్ చేసి.. వెంటనే డెకర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కీన్హోల్డ్ దగ్గరకు వెళ్లాడు గార్డ్. అప్పుడు సమయం రాత్రి ఎనిమిది దాటింది. గార్డ్ నడుచుకుంటూ.. కీన్హోల్డ్ క్యాబిన్ దగ్గరకు వెళ్లేసరికి కీన్హోల్డ్ ఛాతీ మీద షర్ట్ తడిసినట్లు స్పష్టంగా కనిపించసాగింది. ఏంటని గమనించేలోపే అటుగా నీటి చుక్కలు అడ్డంగా వచ్చి అతడి ఛాతీని తాకి, స్మాష్ అవుతున్నాయి. అది కళ్లారా చూసిన గార్డ్ ముఖం తెల్లబోయింది. జైలు గదిలో వర్షం గురించి, దానితో పాటు అతడి చొక్కా తడవడానికి తాను చేసిన చాలెంజ్ గురించి.. అన్నీ వరుసగా చెప్పుకొచ్చి.. కీన్హోల్డ్ని డెకర్ దగ్గరకు తీసుకుని వెళ్లాడు. ఈ లోపు ప్లంబర్ వచ్చి.. సెల్లోకి వెళ్లేందుకు భయపడి పారిపోయాడు. కాసేపటికి వర్షం ఆగింది. అయితే ఆ గది మొత్తం ఏదో దుర్వాసన. మార్చురీ నుంచి వచ్చే వాసనేనని చాలా మంది గుర్తించారు. డెకర్ మామూలు మనిషి అయ్యాక.. తనకు కూడా ఆ వాసన వస్తున్నట్లు చెప్పాడు. ఇక ఖైదీలు, అధికారులు అందరిలోనూ తెలియని గందరగోళం మొదలైంది. అప్పుడే డెకర్ని కూర్చోబెట్టి ఆరా తీస్తే.. ‘నాకు వర్షంపై అధికారం ఉంది.. దాన్ని నియంత్రించే శక్తి నాకు మాత్రమే ఉంది’ అంటూ నిరూపించడానికి చేతులు పైకెత్తి వేళ్లను నిమిరాడు. క్షణాల్లో పొగమంచు వర్షం మొదలైంది. వెంటనే రెవరెండ్ బ్లాక్బర్న్ అనే అనుభవజ్ఞుడైన భూతవైద్యుడ్ని రంగంలోకి ప్రవేశపెట్టారు అధికారులు. డెకర్ని పరిశీలించిన బ్లాక్బర్న్.. నేను నీ కోసం ప్రార్థిస్తానని చెప్పిన్పప్పుడు.. ‘మీరు నా గురించి ఎలాంటి ప్రార్థనలు చెయ్యాల్సిన పనిలేదు వెళ్లండి ఇక్కడి నుంచి’ అని అరిచాడు డెకర్ ఆవేశంగా. వెంటనే బ్లాక్బర్న్ ధైర్యం చేసి ప్రార్థనలు మొదలుపెట్టాడు. కొన్ని గంటల పాటు ప్రార్థిస్తూనే ఉన్నాడు. వర్షం ఆగింది. మామూలు మనిషి అయిన తర్వాత డెకర్.. బ్లాక్బర్న్ని కౌగిలించుకుని మరీ కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేశాడు. ఆ రోజు నుంచి డెకర్ విచిత్ర ప్రవర్తనను, ఆ వర్షాన్ని ఎవరూ చూడలేదు. అయితే సాక్షులంతా అధికారులు,విద్యావంతులు కావడమే ఈ కథలోని అసలైన ట్విస్ట్. ‘ఆ రోజు రాత్రి డెకర్ని కాపాడటంతో పాటు నన్ను నేను కాపాడుకోవడం కష్టమైంది’ అని చెప్పకొచ్చాడు బ్లాక్బర్న్. మొదట జెస్సీ ఇంట్లో నిస్సహాయంగా ఓ ఆటబొమ్మలా విలవిల్లాడిన డెకర్.. జైల్లో తానే సుప్రీమ్లా ప్రవర్తించాడు. ఇతడి కేసుని స్టడీ చేసిన కొందరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్.. డెకర్ జైలుకు చేరేసరికి పూర్తిగా ఆ దుష్టశక్తి ఆధీనంలో ఉన్నాడని, అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే ఆ దుష్టశక్తి అతడి తాత జేమ్స్ ఆత్మేనని వారంతా నమ్మారు. న్యూజిలాండ్ మెడికల్ సోషియాలజిస్ట్ బార్తోలోమ్యూ.. ఈ కేసును పరిశీలించి, అదంతా మంచు గడ్డ కట్టే ప్రాంతమని.. అలాంటి చోట్ల రాత్రి ఉష్ణోగ్రత మార్పులతో ఇంటి పైకప్పు మీద పేరుకున్న మంచు కరిగి.. అటక లోపల వర్షం పడి ఉంటుందని అంచనా వేశాడు. మరి వరుసగా జైల్లో, రెస్టారెంట్ల్లో అది ఎలా సాధ్యమైందో చెప్పలేదు. ఏది ఏమైనా ఈ ఘటన బూటకమని కొందరు.. అతీంద్రియ శక్తి ఫలితమని మరికొందరు నమ్ముతుంటారు. ఇదే కథను ఆధారం చేసుకుని.. ఈ రెయిన్ మెన్ గురించి కొన్ని సిరీసులు, డాక్యుమెంటరీలు కూడా రిలీజ్ అయ్యాయి. మొత్తానికి ఇది దెయ్యం పనేనా? లేక డెకర్ ఏదైనా మ్యాజిక్ ట్రిక్స్తో అలా గిమ్మిక్కులు చేశాడా? అనేది నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన (చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!) -
అత్యంత పురాతనమైనవి.. ఈ గుహ పెయింటింగ్స్ చూశారా?
మానవులు గుహలనే ఆవాసాలుగా చేసుకుని జీవించే కాలంలో గుహల గోడలపై రకరకాల చిత్రాలు చిత్రించిన ఆనవాళ్లు ప్రపంచంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి రాతియుగం నాటి హోమోసేపియన్ మానవులు చిత్రించినవి. అయితే, వారి కంటే పూర్వీకులైన నియాండర్తల్ మానవులు చిత్రించిన గుహాచిత్రాలు ఇటీవల ఫ్రాన్స్లో బయటపడ్డాయి. ఫ్రాన్స్లోని సెంటర్ వాల్ డి లోరీ ప్రాంతంలోనున్న లా రోష్ కోటార్డ్ గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలు కనిపించాయి. యూనివర్సిటీ ఆఫ్ టూర్స్కు చెందిన పరిశోధన బృందంలోని శాస్త్రవేత్తలు ఈ చిత్రాలను గుర్తించారు. పొడవాటి గీతలు, చుక్కలతో ఉబ్బెత్తుగా చెక్కిన ఈ చిత్రాలు దాదాపు 75 వేల ఏళ్ల కిందటివని పరిశోధకులు అంచనా వేశారు. ఈ గుహను వాడటం మానేసి 57 వేల ఏళ్లు కావచ్చని వారు చెబుతున్నారు. ఇవి నియాండర్తల్ మానవులు చెక్కినవేనని, ఇదివరకు దొరికిన నియాండర్తల్ మానవుల చిత్రాల కంటే ఇవి పురాతనమైనవని చెబుతున్నారు. జింక ఎముకలపై నియాండర్తల్ మానవులు చెక్కిన చిత్రాలు ఇదివరకు జిబ్రాల్టర్లో బయటపడ్డాయి. అవి దాదాపు 51 వేల ఏళ్ల నాటివని శాస్త్రవేతలు చెబుతున్నారు. -
డెత్ మిస్టరీ: టీవీ చూస్తూ అస్థిపంజరంలా మారిన మహిళ..
ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తుంటారు. కొన్ని సహాజ మరణాలు కాగా, మరికొందరు అసహజ రీతిలో మరణిస్తుంటారు. అయితే కొన్ని సంఘటనలు వింటే అస్సలు నమ్మబుద్ది కాదు. కానీ కళ్లముందు సాక్ష్యాలు కనబడితే మాత్రం నమ్మకుండా ఉండలేరు. ఇలాంటి కోవలోకే వస్తుంది ఓ డెత్ మిస్టరీ. లండన్కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ చనిపోయిన తీరు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. అసలు ఏంటా కథ? అన్నది ఈ మిస్టరీ స్టోరీలో తెలుసుకుందాం.. లండన్కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ విచిత్రమైన రీతిలో మరణించింది. 1965, అక్టోబర్19న యూకేలో జన్మించిన ఈమె పదాహారేళ్ల వయసులో మ్యూజిక్ వైపు దృష్టిపెట్టింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూసేవారు. అయితే ఎందుకో తెలియదు కానీ కొన్నాళ్లకు తన కుటుంబం నుంచి విన్సెంట్ బయటకు వచ్చేసింది. ఓ సంస్థలో చిన్న ఉద్యోగిగి చేరి తన కాళ్లపై తను నిలబడింది. అయితే కుటుంబంతో మాత్రం శాశ్వతంగా బంధాన్ని తెంపేసుకుంది. అప్పటినుంచి విన్సెంట్ ఒంటిరి జీవితానికి అలవాటుపడింది.లండన్లోని బెడ్సిట్ అపార్ట్మెంట్స్లో ఆమె నివసించేది. ఇవి గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలన్నమాట. ఓసారి ట్రస్ట్ అధికారులు ఆమె ఫ్లాట్ కాలింగ్ బెల్ ఎంతసేపు కొట్టినా తలుపుతీయలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు గుండె జలదరించే దృశ్యం కనిపించింది. ఎదురుగా టీవీ ముందు కుర్చీలో అస్థిపంజరం వాళ్లకు దర్శనం ఇచ్చింది. అది విన్సెంట్దే అని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే.. టీవీ చూస్తేన్నట్లుగానే సోఫాలో కూర్చొని చేతిలో టీవీ రిమోట్ పట్టుకొని ఉండటం అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. 2006 జనవరి 25న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె ఫ్రిజ్లోని ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ ఆధారంగా ఆమె చనిపోయి అప్పటికే మూడేళ్లు అయ్యిందని విచారణలో బయటపడింది. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయడం, స్నేహితులతోనూ సంబంధాలు తెంచేసుకొని ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చనిపోవడం, అది మూడేళ్లకు బయటపడటం.. ఇవన్నీ ఇప్పటికీ అలా మిస్టరీగానే ఉండిపోయాయి. -
అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్ శాంటానా మూడు రోజుల పాప కథ..
కొన్నిసార్లు ఆకస్మిక ప్రమాదాల నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జీవితమే ఒక పీడకలగా మిగిలిపోతుంది. శాంటానా కుటుంబానికి ఆనందం, విషాదం రెండూ ఒకదాని వెంట ఒకటి కవలపిల్లల్లా వచ్చాయి. కేవలం ఆనందమే మిగులుంటే ఈ రోజు ఈ కథ మిస్టరీ అయ్యేదే కాదు. అసలు మార్లీన్ శాంటానా ఎవరు? తనకేమైంది? మార్లీన్ శాంటానా కేవలం మూడు రోజుల పాప. కడుపులో ఉన్నప్పుడే తనకు మార్లీన్ అనే పేరుపెట్టాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ అలా జరగలేదు. అది 1985 అక్టోబర్ 21. రాత్రి తొమ్మిది దాటింది. అమెరికా, న్యూయార్క్లోని బ్రూక్లిన్లోని బ్రూక్డేల్ హాస్పిటల్ ముందు జనాలంతా ఒక్కొక్కరుగా పలుచబడుతున్నారు. పేషెంట్స్ రద్దీ తగ్గి.. డాక్టర్లు, నర్సులు అంతా సేదతీరుతున్నారు. అప్పుడే ఫ్రాన్సిస్కా శాంటానా అనే మూడురోజుల బాలింత డిశ్చార్జ్ అయ్యి.. తన పాపను ఎత్తుకుని ఆసుపత్రి రూమ్ నుంచి బయటికొచ్చింది. భార్యతో పాటు తన బుల్లి ప్రిన్సెస్ని ఇంటికి తీసుకుని వెళ్లడానికి ఫ్రాన్సిస్కా భర్త థామస్ చాలా సంబరంగా ఎదురుచూస్తున్నాడు. సాయం కోసం ఇంటి నుంచి.. ఫ్రాన్సిస్కా వాళ్ల ఇద్దరు అత్తలూ ఆసుపత్రికి వచ్చారు. నలుగురూ కలసి.. పాపను, లగేజ్ని తీసుకుని.. ఆసుపత్రి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్లారు. సరిగ్గా అప్పుడే సుమారు పాతికేళ్ల అపరిచితురాలు వాళ్ల దగ్గరకు వచ్చి.. ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అంటూ మాట కలిపింది. ‘ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్నాం’ అని చెప్పింది ఫ్రాన్సిస్కా. ఆమె ప్రశ్నలైతే వేస్తుంది కానీ.. చూపులు మాత్రం వాళ్లవైపు లేవు. పరిసరాలను గమనిస్తున్న కంగారు.. ఆమె కళ్లల్లో తొణికిసలాడుతోంది. స్ట్రీట్లైట్ వెలుగుల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ థామస్ ఫ్యామిలీ మాత్రం అదంతా పట్టించుకునే స్థితిలో లేదు. వాళ్ల హడావుడిలో వాళ్లున్నారు. అప్పుడే సడెన్గా ‘నేను మీ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా’ అంది ఆమె. ఆ మాటలకు ఫ్రాన్సిస్కా అర్థం కానట్లుగా ఆమెవైపు అయోమయంగా చూసింది. ఆమె భయాన్ని పసిగట్టేసిన ఆ మహిళ.. వెంటనే తుపాకీ బయటికి తీసింది. క్షణాల్లో పసిపాప తలకు గురిపెట్టి ‘అరిస్తే చంపేస్తా, నేను చెప్పిందే చెయ్యాలి’ అంది. థామస్ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్లు పెద్దవి చేస్తూ.. గద్దిస్తూ వాళ్లను చాలా దూరం నడిపించింది. గుండె లోతుల్లోంచి దుఃఖం తన్నుకొస్తున్నా.. పాప కోసం చెప్పింది చెప్పినట్లే చేయడానికి వాళ్లు సిద్ధపడ్డారు. ఊహించని ఆ ప్రమాదానికి ఎలా స్పందించాలో, ఎలా తప్పించుకోవాలో థామస్కి అర్థం కాలేదు. దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. అరకొర అలికిడి ఉన్నా, సమీపంలో ఎవ్వరూ లేరు. కాస్త దూరంలో జంక్ యార్డ్ దగ్గర ‘ఆగండి’ అంటూ గదమాయించింది. ‘ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు.. మేము పాప పుట్టిన ఆనందంలో ఉన్నాం. మా దగ్గర విలువైనవి కూడా ఏం లేవు’ అంటూ ఫ్రాన్సిస్కాతో పాటు అంతా ఆ స్త్రీని వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పటి దాకా ఆమె ఒక దోపిడీదారని, డబ్బు లేదా విలువైన వస్తువులు లాక్కోవడానికే దాడి చేసిందని అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ.. పసిపాపను తన చేతికి ఇవ్వాలని.. గన్ ట్రిగ్గర్ మీద వేలును ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టింది. ‘నా బిడ్డను ఏం చేయొద్దు ప్లీజ్’ అని ఏడుస్తూ నిస్సహాయంగా పాపను ఆ స్త్రీ చేతుల్లో పెట్టింది ఫాన్సిస్కా. అలా పెట్టగానే ఒక్క ఉదుటున అందరినీ తోసిపడేసిన ఆ మహిళ.. పాపతో సహా పరుగందుకుంది. క్షణాల్లో అక్కడ దగ్గర్లో స్టార్ట్ చేసి ఉన్న కారు ఎక్కి ‘పోనీ త్వరగా’ అంది. శాంటానా ఫ్యామిలీ ఆ షాక్లోంచి తేరుకునే లోపే కారు వేగం అందుకుంది. ‘నా పాప.. ప్లీజ్ నా పాపను నాకు ఇచ్చేయండి, కారు ఆపండి’ అంటూ బాలింత ఫ్రాన్సిస్కా కారు వెనుకే పరుగు తీసిన దృశ్యం.. ఆ కుటుంబాన్ని ఎంతగానో కలచివేసింది. వెంటనే వారంతా పోలీస్స్టేషన్కి పరుగుతీసి, జరిగిందంతా చెప్పారు. పోలీసుల విచారణలో ఓ సీసీ ఫుటేజ్ దొరికింది. దానిలో పాపను తీసుకుని ఆమె పారిపోయే సీన్ దూరం నుంచి కనిపించింది. కానీ స్పష్టత లేదు. కాలక్రమంలో పత్రికలే పాపకు మార్లీన్ అని నామకరణం చేశాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాప కిడ్నాప్కి ముందు ఆ మహిళను ఫ్రాన్సిస్కా.. ఆసుపత్రిలోని పిల్లల వార్డ్లో కలుసుకుంది. అక్టోబర్ 19 మధ్యాహ్నసమయంలో ఆ స్త్రీ.. ఫ్రాన్సిస్కాతో మాట్లాడిందట. ‘నేను వేరే పాప కోసం వచ్చాను. కానీ మీ పాప చాలా అందంగా ఉంది. అసలు ఏడవకుండా ఎంత ముద్దుగా ఉందో.. నాకు మీ పాప బాగా నచ్చింది’ అని పొగిడిందట. ఆ రోజు ఆ పొగడ్తలకు సంతోషించిందే తప్ప అనుమానించలేదు. అదే అపరాధభావం ఫ్రాన్సిస్కాను వేధించింది. ఈ ఘటనకు ముందు న్యూయార్క్లోని మరో ఆసుపత్రిలో క్రిస్టోఫర్ మోర్గాన్ అనే రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఒకరి ఇంట్లో సజీవంగా దొరికాడు. వారు తాము పోగొట్టుకున్న బిడ్డ స్థానంలో క్రిస్టోఫర్ని చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారని తేలింది. దాంతో మార్లీన్ని ఎత్తుకెళ్లిన స్త్రీ వృత్తిరీత్యా నేరస్థురాలు కాకపోవచ్చని.. బహుశా ఆమె బిడ్డను పోగొట్టుకుని, తన పాప స్థానంలో మార్లీన్ని పెంచుకుంటుంది కాబోలని చాలామంది భావించారు. అదే అనుమానంతో పోలీసులు చుట్టుపక్కల ఆసుపత్రులన్నీ జల్లెడపట్టి.. గర్భస్రావాలు లేదా ప్రసవాలు జరిగిన చాలామంది మహిళలను విచారించారు. కానీ ఏ ఆచూకీ రాబట్టలేకపోయారు. నేటికీ మార్లీన్ ఆచూకీ తేలలేదు. కేవలం రోజుల పాపే కావడం, రియల్ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడంతో గత 38 ఏళ్లుగా.. మార్లీన్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప ఫలితం లేదు. మార్లీన్ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ప్రతి పుట్టిన రోజునూ జరుపుకుంటున్నారు. ఆమె రాక కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. --సంహిత (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్..ఇందులో చేరాలంటే.) -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
పిడుగుపాటుతో వ్యాధులు నయమవుతాయా? మిస్టరీలా ఉందే!
నమ్మశక్యం కాని సంఘటనలు, ఊహకు అందని సందర్భాలు ఈ ప్రపంచంలో చాలానే ఉంటాయి. అవన్నీ కొందరికి అద్భుతాలుగా తోస్తే.. మరికొందరికి అబద్ధాలుగా అనిపిస్తుంటాయి. తర్కాన్ని నమ్మేవారికి, నమ్మనివారికి మధ్య వాగ్వాదాల చిచ్చు రాజేస్తాయి. వేలవేల మీమాంసలతో, సవాలక్ష అనుమానాలతో నిశబ్దంగా కాలాన్ని వెళ్లదీసి, అంతుచిక్కని కథలుగా మిగిలిపోతుంటాయి. అమెరికాకు చెందిన మేరీ క్లామ్సర్ జీవితం కూడా అలాంటిదే! మేరీ.. ఓక్లహోమా నివాసి. తన పందొమ్మిదేళ్ల వయసులో మల్టిపుల్ స్లె్కరోసిస్కి గురైంది. ఆ వ్యాధి ముదిరే కొద్దీ కాళ్లు చచ్చుబడి, నడవలేని స్థితి ఏర్పడుతుందని, పిల్లలు పుట్టడం కూడా కష్టమేనని వైద్యులు తేల్చేశారు. అది తెలియగానే.. మేరీ ప్రపంచం బద్దలైనట్లుగా కుమిలికుమిలి ఏడ్చింది. అప్పటికే కొన్ని నెలల క్రితం.. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాన్ క్లామ్సర్తో నిశ్చితార్థం జరగడం ఆమెను మరింత బాధించింది. తన కారణంగా రాన్ జీవితం నాశనం కావడం ఇష్టం లేని మేరీ.. ‘నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందాం.. నీ జీవితం నువ్వు చూసుకోమ’ని రాన్కి చెప్పేసింది. అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు. ‘నువ్వు ఎలా ఉన్నా నాకు కావాలి. ఏదేమైనా కలసే బతుకుదాం’ అని పట్టుబట్టాడు. దాంతో మేరీ.. ప్రేమ మీదున్న గౌరవంతో రాన్ చేయి అందుకుంది. ఇద్దరూ పెళ్లితో ఏకమయ్యారు. అప్పటి నుంచి వీలైనంత ఓపిక తెచ్చుకుని.. భర్తతో జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూండేది. పెళ్లైన పదేళ్ల వ్యవధిలో మూడు కష్టతరమైన కాన్పులొచ్చాయి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు పూర్తి ఆరోగ్యంతో పుట్టారు. ఏళ్లు గడిచే కొద్దీ ఆమె వ్యాధి బాగా ముదురుతోంది. ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. నడక కష్టమైంది. మేరీకి 42 ఏళ్ల వయసు వచ్చేసరికి కుడి కాలు కూడా బలహీనమైపోయింది. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వీల్చైర్కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చేసింది. మరో రెండేళ్లు అలానే గడిచాయి. అప్పుడే జరిగింది ఓ అద్భుతం. అది 1994 ఆగష్టు 17.. ఆ రోజంతా భీకరమైన ఉరుములు, మెరుపులతో వర్షానికి తెరిపన్నదే లేదు. తనకు చేతనైన చిన్నచిన్న పనులన్నీ పూర్తి చేసిన మేరీ.. స్నానం చేయడానికి ఇంటి బయటున్న బాత్రూమ్లోకి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఓ పిడుగు మీద పడింది. 10,000 వోల్టుల విద్యుత్.. మేరీని నేలకు విసిరికొట్టింది. కాసేపటికి గమనించిన కుటుంబసభ్యులు మేరీని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్కి తరలించారు. రెండు రోజులకు ఆమె కళ్లు తెరిచింది. రౌండ్స్కి వచ్చిన డాక్టర్ గాయాలకు డ్రెసింగ్ చేస్తుంటే.. ఆమె ఎడమకాలిని తాకినట్లు స్పర్శ తెలిసింది. ఎన్నో ఏళ్లుగా చచ్చుబడిన ఆ కాళ్లల్లో కదలికలు మొదలయ్యాయి. వైద్యులు ఆశ్చర్యపోయారు. సరిగ్గా నెలరోజులు గడిచేసరికి వీల్ చైర్ పక్కన పెట్టి నడవడం మొదలుపెట్టింది. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే ఎవరి ఆసరా లేకుండా.. కాళ్లకు ఎలాంటి సపోర్ట్ బ్యాండ్స్ లేకుండా ఆమె చాలా దూరం నడవడం ఆ కుటుంబాన్ని నివ్వెరపరచింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని ప్రారంభించింది మేరీ. అది ఓ అద్భుతమని ఆమె నమ్మింది. 1995 ఏప్రిల్ 19న ప్రపంచానికి తన జీవిత కథ చెప్పడానికి సిద్ధపడి.. సమీపంలోని ఆల్ఫ్రెడ్ పి. ముర్రా ఫెడరల్ బిల్డింగ్లో రిపోర్టర్స్కి అపాయింట్మెంట్ ఇచ్చింది. అయితే అదే రోజు ఆ బిల్డింగ్పై ఉగ్రవాదులు బాంబు దాడి చేసి 168 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ ఘటన ఆమెను నోరు మెదపనివ్వలేదు. తనకు జరిగిన మిరాకిల్ దైవరహస్యమని, దాన్ని చెబితే తనకే ప్రమాదమని భావించిందో ఏమో.. ఇక ఏ ఇంటర్వ్యూకీ ఒప్పుకోలేదు. అయితే 2003 నాటికి మేరీలో మళ్లీ ఆ వ్యాధి లక్షణాలు మొదలయ్యాయట. మరోసారి కాళ్లు నిర్జీవంగా మారిపోవడంతో నడవడం కష్టమైందట. సరిగ్గా రెండేళ్లకి ఇంటి ఆరుబయట ఆమె మళ్లీ పిడుగుపాటుకు గురై.. తిరిగి కోలుకుని నడవడం మొదలుపెట్టిందని, ఇక ఆమె పిడుగుపాటుకు గురికాకుండా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిని ఏర్పరచారనే సమాచారం వచ్చింది. ఆమె మాత్రం ప్రపంచం ముందుకు రాలేదు. జరిగిందేమిటో వివరంగా చెప్పలేదు. ఇక రాన్.. 2016లో తన 68వ ఏట అనారోగ్యంతో కన్నుమూశాడు. తర్వాత కొడుకు క్రిస్టోఫర్ కూడా మరణించడంతో మేరీ వివరాలు బయటికి పొక్కలేదు. అసలు మేరీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఎక్కడుంది? ఏం చేస్తోంది? లాంటి వివరాలేవీ తెలియవు. ప్రాణాలతో ఉంటే ఇప్పటికి ఆమెకు 70 ఏళ్లు నిండి ఉంటాయి. ఈ కథలో.. పిడుగుపాటుకు ప్రాణాలు పోకపోగా, కొత్త ఎనర్జీ రావడం, ఉన్న వ్యాధులు మాయం కావడం ఓ మిరాకిల్ అయితే.. ఆ నిజాన్ని మేరీ తనంతట తాను ప్రపంచానికి వెల్లడించాలనుకున్న రోజే బాంబు దాడి జరగడం మరో పెద్ద మిస్టరీ! పిడుగులాంటి ఘటనలు ► అమెరికాలోని అలబామాకు చెందిన ఫెయిత్ మోబ్లీ కథ కూడా ఇలాంటిదే! ఆమె మెక్ డొనాల్డ్స్లో వర్కర్గా పనిచేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురైంది. ఆ విద్యుత్ ఎనర్జీ.. ఆమె హెడ్సెట్ నుంచి షూ గుండా భూమిలోకి ప్రవహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే ఆమె ప్రాణాలతో బయటపడటంతో పాటు.. బలహీనంగా ఉన్న ఆమె కంటి చూపు పూర్తిగా మెరుగుపడిందట! ► రూబెన్ స్టీఫెన్సన్ అనే రైతు పొలంలో పని చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యాడు. అతడి పక్కనే ఉన్న రెండు గుర్రాలు చనిపోయాయి. కానీ అతడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే పెదవిపై ప్రాణాంతక మెలనోమాతో బాధపడుతున్న స్టీఫెన్ సన్.. పిడుగుపాటు తర్వాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడట! ► అమెరికాలోని జెర్సీలో ఒక పోలీసు అధికారి కూడా పిడుగుపాటుకు గురయ్యాడు. ఆ సమయంలో అతని కోటు కాలిపోయింది. ఇత్తడి బటన్లు కరిగిపోయాయి. కానీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అప్పటిదాకా ఉన్న వాతం, అజీర్తి మాయమయ్యాయట! -
డెత్ మిస్టరీ: ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్ ఎలా చనిపోయింది?
అది 1986 ఏప్రిల్ 29.. ఉదయం పది నలభై దాటింది. అమెరికా, ఓక్లహోమాలోని లాటన్ హైవే పక్కన పాడుబడిన వంతెనపైన మంటలు ఎగసిపడుతున్నాయి. కాస్త దూరం నుంచి వాటిని గమనించిన ఓ రైతు.. వెంటనే ఫైరింజిన్కి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సరిగ్గా 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలు ఆర్పి.. పరిశీలనగా చూసేసరికి.. కారు డ్రైవింగ్ సీట్లో ఓ అస్థిపంజరం కలవరపరచింది. కారు అదుపు తప్పి.. క్రాష్ అయ్యిందని భావించిన అధికారులు.. కారు ఎవరిది? కారులో ఉన్నది ఎవరు? లాంటి ప్రశ్నలతో, క్లూ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాసేపటికి ఆ కారు పాత్ కాన్వే అనే 33 ఏళ్ల వివాహితుడిదని గుర్తించారు. దాంతో చనిపోయింది అతడి భార్య ఐలీన్ కాన్వే అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ హైవే.. వాళ్ల ఇంటికి కేవలం పదిహేను మైళ్ల దూరంలో ఉంది. తాను మంటల్ని గుర్తించే సమయానికి ఏ అరుపులు వినిపించలేదని రైతు చెప్పడంతో అధికారులు.. అప్పటికే ఐలీన్ ప్రాణం పోయి ఉంటుందని భావించారు. కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. యాక్సిడెంట్ జరిగే సమయానికి కారు స్పీడ్ 50 నుంచి 60 లోపే ఉందని అధికారులు అంచనా వేశారు. ఆ మాత్రం వేగానికి అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటలకు పాత్.. ఇంటికి వెళ్లి, అక్కడ పరిస్థితి చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఇంట్లో.. ఐలీన్ మాత్రమే ఒంటరిగా ఉందని తనకు బాగా తెలుసు. కానీ అక్కడ కొన్ని ఆనవాళ్లు అతడ్ని గజగజ వణికించాయి. ఇంటి ముందు గార్డెన్లో వాటర్ పైప్ చాలా సేపటి నుంచి పొంగడంతో ఆ నీళ్లు స్మిమ్మింగ్ పూల్లోకి పోవడం గమనించాడు. వెంటనే దాన్ని ఆఫ్ చేసి ఇంట్లోకి నడవబోయాడు. అయితే ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో.. అతడిలో అనుమానం మొదలైంది. దానికి తోడు హాల్లో ఐరన్ బాక్స్ కాలిపోయి ఉంది. బట్టలు ఇస్త్రీ చేయడానికి స్విచ్ ఆన్ చేసి ఎన్నో గంటలైందని అక్కడ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పాత్ అడుగులు.. ఆందోళనగా ముందుకు కదిలాయి. మాస్టర్ బాత్రూమ్లో బాత్ టబ్ పక్కనే ఉన్న టెలీఫోన్ రిసీవర్ పక్కకు తీసి, దాని హుక్ లాగినట్లుగా కనిపించింది. వెంటనే పాత్ కంగారు కంగారుగా ఇల్లంతా వెతికాడు. ఓ చోట భార్య డ్రైవింగ్ లైసెన్స్, కళ్లజోడు ఉన్న హ్యాండ్బ్యాగ్ కనిపించింది. హ్యాండ్బ్యాగ్ కూడా వదిలిపెట్టి.. కారులో ఎక్కడికి బయలుదేరింది? ఆమెకు డ్రైవింగ్ అనుభవం ఉన్నాకూడా ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది? పాత్ దగ్గర అన్నీ ప్రశ్నలే మిగిలాయి. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి.. తన భార్య మరణమై అనుమానాలు ఉన్నాయని.. కంప్లైంట్ ఇచ్చాడు. యాక్సిడెంట్ అయిన చోటును పాత్ కానీ, ఐలీన్ కానీ అంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. వెంటనే జిల్లా న్యాయవాది కార్యాలయంలోని రే ఆండర్సన్ని సంప్రదించాడు. మొదట ఆండర్సన్.. పాత్ వాదనను నమ్మలేదు. తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నాడని భావించాడు. అయినా పాత్.. తన ప్రయత్నాలు ఆపలేదు. యాక్సిడెంట్ జరిగిన చోటే క్లూ కోసం వెతకడం మొదలుపెట్టాడు. కారు కాలిపోయిన చోటికి 200 అడుగుల దూరంలోని చర్చి బులెటిన్ కనిపించింది. అది ఐలీన్ హాజరైన చర్చ్కి సంబంధించిందే. పాత్.. దాన్ని చివరిగా కారు డాష్బోర్డ్లో చూశాడు. ఐలీన్కి ఎప్పుడూ కారు విండోస్ క్లోజ్ చేసి.. ఎయిర్ కండిషనింగ్ ఆన్తో డ్రైవింగ్ చేయడం అలవాటు. అలాంటప్పుడు చర్చి బులెటిన్ కదులుతున్న కారు నుంచి బయటకు రావడం అసాధ్యం. అంటే ఆ కారులో ఐలీన్తో పాటు కిల్లర్ ఉన్నాడని పాత్ ఊహించాడు. ప్రాణాలతో లేని / సృహలో లేని ఐలీన్ని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి.. యాక్సిలేటర్ని పెంచేసి, కారు ముందుకు పోయేలాచేసి ఉంటారని పాత్ బలంగా నమ్మాడు. యాక్సిడెంట్ అయిన తర్వాతే కారుకు నిప్పు పెట్టి ఉంటారని భావించాడు. తన అనుమానాలను అధికారులకు బలంగా వినిపించి.. కేసు హిస్టరీలో ప్రమాదవశాత్తు అనే పదానికి బదులు అనుమానాస్పద మృతి అని మార్పించాడు. ఏది ఏమైనా ఆమె మరణానికి అసలు కారణం మాత్రం తేలలేదు. ఊహాగానాలు.. ఐలీన్ మరణానికి వారం క్రితం ఆ పరిసరప్రాంతాల్లో దొంగలు పెట్రేగిపోయారు. ఎవరూ లేని ఇళ్లపై దోపిడీలు చేసిన కేసులు చాలానే నమోదయ్యాయి. ఐలీన్ ఇంట్లో ఉందనే విషయం తెలియక.. ఆ దొంగల ముఠా ఆ ఇంటిపై దాడిచేసి ఉంటారని.. ఐలీన్ వాళ్లను చూడడంతో ఆమెను చంపేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేసి ఉంటారని పాత్తో పాటు చాలామందే నమ్మారు. అయితే ఐలీన్ హెల్త్ హిస్టరీ తెలిసిన కొందరు.. ఆమెకు ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చి ఉంటుందని.. ఆ మెడికల్ ఎమర్జెన్సీతో ఇంటి పనులన్నీ మధ్యలోనే వదిలిపెట్టి ఆసుపత్రికి తనంతట తానే కారులో బయలుదేరి ఉంటుందని.. దారిలో అనుకోకుండా ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. అయితే న్యాయపోరాటం చేస్తున్న పాత్ దురదృష్టవశాత్తు 2013లో.. నిజం తెలుసుకోకుండానే మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఫ్రైడ్ కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాడు. 2018లో అతడు కూడా కన్నుమూయడంతో ఈ కేసు కోల్డ్ కేసుల సరసన చేరి.. అపరిషృతంగానే మిగిలిపోయింది. నిజానికి ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఐలీన్ ఎలా చనిపోయింది? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. ∙సంహిత నిమ్మన -
సుపారీ ఇచ్చి.. హత్య చేయించి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ఆయ నను అపహరించి, హత్య చేసిందని.. క్వారీ నీటి గుంటలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయిందని గుర్తించారు. భూముల వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ఈ హత్య కు సూత్రధారి అని తేల్చారు. ఈ మేరకు బచ్చన్నపేట, టా స్క్ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, సుపారీ ముఠా సభ్యులు డోలకొండ శ్రీకాంత్, శివ రాత్రి బాషా అలియాస్ భాస్కర్లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఓసారి చంపేందుకు యత్నించి..: అంజయ్య కు సంబంధించి సర్వే నంబర్ 174లోని భూములపై వివా దాలు ఉన్నాయి. దీనిపై రామకృష్ణయ్య గతంలో అధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టిన అంజయ్య.. రామకృష్ణయ్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. 2022 జూలైలో జలంధర్ అనే వ్యక్తితో కలసి కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఇటీవల తనకు పరిచయమున్న దండుగు ల తిరుపతి అనే వ్యక్తితో రూ.8 లక్షలు సుపారీ ఇస్తానని, రా మకృష్ణయ్యను చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీ నికి అంగీకరించిన తిరుపతి.. తనకు సమీప బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజులతో కలసి రామకృష్ణయ్య హత్యకు ప్లాన్ చేశాడు. పోచన్నపేట శివారులో కిడ్నాప్ చేసి..: తిరుపతి, శ్రీకాంత్, బాషా, దండుగుల రాజు నలుగురూ కలసి ఈ నెల 15న సాయంత్రం ఒక కారు అద్దెకు తీసుకుని పోచన్నపేట శివారులో మాటు వేశారు. బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని, చిన్నరామన్చర్ల శివారుకు తీసుకువెళ్లారు. సుమారు 6.30 గంటల సమయంలో టవల్ మెడకు బిగించి రామకృష్ణయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని.. ఓబూల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్ల మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ఓ క్వారీ నీటిగుంటలో పడవేశారు. హత్య జరిగే నాటికి అంజయ్య ఫోన్పే, గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల వరకు నిందితులకు ముట్టజెప్పాడు. ఒకటి కాదు రెండు హత్యలు!: రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ జరుపుతున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చిందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య మరో భూవివాదంలో రూ. 2.5 లక్షల సుపారీ ఇచ్చి తన బావమరిది మల్లేశం భార్య సుభద్రను హత్య చేయించినట్టు వెల్లడైందని వివరించారు. 2022 అక్టోబర్ 20న ఆ హత్య జరిగిందని, ఆ ఘటనలోనూ తిరుపతి, రాజు హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. 2012లో సుభద్ర భర్త మల్లేశం చనిపోయాడని.. తనకు రెండెకరాల భూమి రావాలని సుభద్ర నిలదీయడంతో అంజయ్య సుపా రి గ్యాంగ్తో హత్య చేయించాడని సీపీ వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్ భూవివాదాలు, హత్య కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్య తొలి నుంచి బీఆర్ఎస్ కార్యకర్త కాదని, నాలుగేళ్ల కింద వేరే పార్టీ నుంచి వచ్చాడని పేర్కొన్నారు. -
తిరుపతి: వీడిన కొత్తశానంబట్ల మంటల మిస్టరీ
సాక్షి, తిరుపతి: ఉన్నట్లుండి గడ్డివాములకు నిప్పంటుకోవడం.. ఇళ్లలో బట్టలకు మంటలు.. ఒకానొక టైంలో తాళం వేసిన ఇళ్లలోని బీరువాలో బట్టలు తగలబడిపోవడం.. జిల్లాలో గత నెలరోజులుగా చర్చనీయాంశంగా మారింది శానంబట్ల(కొత్త) గ్రామ మంటల మిస్టరీ. భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆ ఊరి ప్రజలు. ఒకానొక టైంలో ఇది ఊరికి పట్టిన శాపమంటూ ఊరు విడిచిపోయారు కొందరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేర్చారు. ఆకతాయిల పనిగా మొదలై.. ఇది ప్రతీకార చర్యగా కొనసాగిందని నిర్ధారించారు. చంద్రగిరి మండలం కొత్తశానంభట్ల గ్రామం లో మంటల మిస్టరీ చేధించారు పోలీసులు. తొలుత కొందరు ఆకతాయిలు ఓ గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదనుగా తల్లి బంధువులపై విద్వేషంతో రగిలిపోతున్న కీర్తి అనే మహిళ.. తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత వరుసగా బంధువుల ఇళ్లలో నిప్పు పెడుతూ వచ్చింది. కేవలం అగ్గిపుల్లలతోనే నిప్పు పెడుతూ ఊరందరినీ భయభ్రాంతులకు గురి చేసిందామె. ఈలోపు అగ్ని ప్రమాదంలో నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. దీంతో అత్యాశకు పోయిన గ్రామంలోని ఇద్దరు.. కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. దర్యాప్తులో ఇదంతా గుర్తించిన పోలీసులు.. కీర్తితో పాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు ఎంఆర్పల్లి పోలీసులు. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి గడ్డి వాములు తగలబడి పోవడం, బీరువాలు, కప్బోర్డుల్లోని బట్టలకు నిప్పంటుకోవడంలాంటి పరిణామాలతో కొత్తశానంభట్ల గ్రామస్తులు వణికిపోయారు. తొలుత పిల్లపాలెం అన్నదమ్ములకు సంబంధించిన నాలుగు ఇళ్లలో, వారి పొలాల్లో మాత్రమే మంటలు వ్యాప్తి చెందగా.. ప్రస్తుతం ఇతరుల ఇళ్లలోనూ మంటలు వ్యాపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ మంటల వెనుక కారణం ఏంటో తేల్చే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. క్లూ టీంతో ఆధారాలు సేకరిస్తూ.. గ్రామంలో భారీగా పికెటింగ్ నిర్వహించారు. అదే సమయంలో.. ఇది గ్రామ దేవత శాపమని, ఓ బుడబుక్కలవాడి శాపమని, కాదు.. 40 ఏళ్ల కిందట సైతం ఇలాగే మంటలు వ్యాపించేవని కొందరు వృద్ధులు ప్రచారంలోకి దిగడం గమనార్హం. -
ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే మిస్టరీని ఛేదించాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రీతి కుప్పకూలి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు అక్కడ ఎవరెవరున్నారనేది పోలీసుల విచారణలో తేలినా సాంకేతిక దర్యాప్తులోనూ అనుమానమున్న వ్యక్తులు అక్కడేమైనా ఉన్నారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 24న నిందితుడైన సెకండియర్ విద్యార్థి సైఫ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... ♦ గత డిసెంబర్లో ఓ ప్రమాద కేసులో రోగి గైడ్ వైర్ విషయంలో సైఫ్ ప్రీతిని వేధించాడు. ఫిబ్రవరిలో హనుమకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడూ ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్స్ (పీఏసీ) రాయమన్నాడు. దాన్ని ప్రీతి రాశాక, వాట్సాప్ గ్రూప్లో ఆ నివేదికను పోస్టు చేసి ఇది ఎవరు రాశారంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రీతి స్పందిస్తూ ‘నాతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీ లేదంటే జీఎంహెచ్ ఇన్చార్జికి ఫిర్యాదు చేయ్’ అని సైఫ్కు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. లేదంటే ఇదే విషయాన్ని హెచ్ఓడీకి చెబుతాననడంతో కోపోద్రిక్తుడైన సైఫ్ ఆమెను మరింత వేధించాలనుకున్నాడు. ♦ హెచ్ఓడీకి సైఫ్పై ఫిర్యాదు చేసేందుకు మద్దతివ్వాలని స్నేహితులు, సహచరులను ప్రీతి కోరింది. తన ప్రవర్తన మారకపోతే అందరినీ వేధిస్తాడని చెప్పింది. ♦ ఈ నెల 21న అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకు వేధింపులపై వచ్చిన సమాచారంతో అదేరోజు 11 గంటలకు సైఫ్ను పిలిపించి మాట్లాడారు. ప్రీతిని ఎందుకు వేధిస్తున్నావు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రీతిని పిలిచి ఇద్దరూ ఒకేచోట డ్యూటీ చేయొద్దన్నారు. ఎంజీఎం కాకుండా అంతకుముందు డ్యూటీ వేసిన ఆస్పత్రిలోనూ చేసుకోవచ్చన్నారు. ♦ ప్రీతి అదేరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీఎంలో వి ధులకు హాజరైంది. స్టాఫ్ నర్సు మండె విజయలక్ష్మి, సె కండియర్ స్టూడెంట్ డాక్టర్ భీమని మనీశ్, థర్డ్ ఇయర్ హౌస్ సర్జన్ డాక్టర్ రూహితో కలిసి విధులు నిర్వర్తించింది. 22న ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జరిగిన అపరేషన్లో పాల్గొంది. ఆ తర్వాత అనస్తీషి యా పీజీ రూమ్ లోకి వెళ్లింది. 7.15 నిమిషాలకు స్టాఫ్ నర్సు విజయలక్ష్మి అక్కడికెళ్లగా కిందపడి ఉన్న ప్రీతిని చూసింది. ప్రీతికి డాక్టర్ రూహి, డాక్టర్ భీమని మనీశ్ చికిత్స అందించారు. తేలాల్సినవెన్నో... ♦ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి క్లాస్మెట్స్, సీనియర్ విద్యార్థులకు తెలిసినా ఆమె సహాయం కోరినప్పుడు వారు ఎందుకు మద్దతివ్వలేదు. ప్రీతి క్లాస్మేట్ అనూషకు వాట్సాప్ ద్వారా ప్రీతికి సపోర్ట్ చేయొద్దంటూ సైఫ్ వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్ పోలీసులకు లభ్యమైంది. ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ ఈ వైద్య విద్యారి్థనులంతా సైఫ్కు అనుకూలంగా ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. విద్యార్థులు సీనియర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తమ కెరీర్కు ఇబ్బంది అవుతుందని వెనకడుగు వేశారా అన్నది తేలాలి. ♦ ప్రీతి కార్డియాక్ అరెస్ట్ వల్ల కుప్పకూలిందని, పీఏసీ రిపోర్టు విషయంలోనే సైఫ్ గట్టిగా మాట్లాడాడని, వేధింపులు, ర్యాగింగ్ లేవని బుధవారం నాడే ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు ప్రకటించారు? సైఫ్ ర్యాగింగ్, వేధింపులు చేశాడని కౌన్సెలింగ్లో ఒప్పుకున్నా ఈ మాటల్ని వీరెందుకు చెప్పలేదు? ♦ ట్యాక్సికాలాజి రిపోర్టు వెల్లడించినా ఆమె ఇంజక్షన్ తీసుకుందా అన్నది పోలీసులు తేల్చాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్ బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతిచెందినట్లు జవహర్నగర్ పోలీసులు గుర్తించారు. కాగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. దీంతో జవహర్నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతిచెందినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. చదవండి: డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్.. -
5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు
ఇద్దరు కెనడియన్బిలినియర్ దంపతులు 5 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొదట్లో ఆత్మహత్య చేసుకున్నారని భావించారు అంతా. ఆ తర్వాత హత్య అని తేలినా ఇప్పటికి వరకు ఈ కేసు మిస్టరీ అంతుచిక్కలేదు పోలీసులకు. దీంతో హంతకుడు తలపై భారీ మొత్తంలో నగదును సైతం ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులు. వివరాల్లోకెళ్తే...డ్రగ్ దిగ్గజం అపోటెక్స్ వ్యవస్థాపకుడు బారీ షెర్మాన్ అతని భార్య హనీ ఐదేళ్ల క్రితం టోరంటోలోని వారి ఇంటిలో హత్యకు గురయ్యారు. ఆ బిలినియర్ దంపతులు డిసెంబర్ 15, 2017న మృతి చెందారు. ఐదేళ్లైన ఇప్పటికీ ఈ కేసులో కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారు పోలీసులు. వాస్తవానికి భారీ షెర్మాన్ 1974లో అపోటెక్స్ అనే డ్రగ్ కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రధాన ఔషధ కంపెనీగా తీర్చిదిద్ది అంచెలంచెలుగా బిలినియర్ స్థాయికి ఎదిగాడు. ఆ జంట సుమారు రూ. 400 కోట్ల డబ్బును దాతృత్వ సేవలకు వినియోగించారు. ఆ జంట చనిపోయేటప్పటికీ వారి నికర చరా ఆస్తుల విలువ సుమారు 20 వేల కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. ఆ జంట అంత్యక్రియలకు ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరియు అంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ కాథ్లీన్ వైన్తో సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. తమ తల్లిదండ్రుల హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుందని వారి పిల్లలు కుమారుడు జోనాథన్ షెర్మాన్ , కుమార్తె అలెక్స్ క్రావ్జిక్ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఈ హత్యకేసు సాధ్యమైనంత తొందరగా చేధించి నిందితుడుని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు కోరారు వారు. ఆ హంతకుడి ఆచూకి తెలిపిన వారికి దాదాపు రూ. 500 కోట్లు వరకు అందజేస్తామంటూ ఇది వరకు ప్రకటించిన ఆఫర్ని రెడ్డింతలు పెంచి మరీ ప్రకటించారు. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి పలువురు కుటుంబసభ్యులను విచారించారు. ఐతే ఈ కేసులో కీలక నిందితులను ఆచూకి మాత్రం లభించలేకపోవడం గమనార్హం. (చదవండి: -
చెడ్డవాడిగా బతకడం భలే సరదాగా ఉంటుంది..
‘చెడ్డవాడిగా బతకడం భలే సరదాగా ఉంటుంది’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చి మరీ మారిన ఓ ముసుగు మనిషి కథ ఇది.జపాన్లో హ్యోగో ప్రిఫెక్చర్లోని ఆషియా సిటీ మధ్యలో చిన్న కొండపై తమ పాత ఇంటిని కలుపుకుంటూ.. రెండతస్తుల మేడ కట్టుకున్నాడు కట్సుహిసా ఎజాకి(42). గ్లికో ఫుడ్ కంపెనీ ప్రెసిడెంట్గా అతడికి మంచి పేరుతో పాటు శత్రువులూ ఎక్కువే. అందుకే ఇంటి తలుపులకు హైటెక్ సెకామ్ సెక్యూరిటీ సిస్టమ్ని అమర్చుకున్నాడు. పాతింట్లో.. తల్లి యోషీ ఉండేది. కొత్త ఇంటి తాళాల్లో ఒకటి తల్లి దగ్గర మరొకటి భార్య దగ్గర ఉండేవి. 1984 మార్చి 18, రాత్రి ఎనిమిదిన్నర దాటాక వర్షం పడుతుంటే.. ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు యోషీ ఇంట్లోకి చొరబడ్డారు. వాళ్ల చేతుల్లో తుపాకీలు, కత్తులు ఉన్నాయి. టీవీలో మునిగిపోయిన యోషీని.. బెదిరించి.. టెలిఫోన్ వైర్స్ కట్ చేసి.. వాటితోనే కట్టేశారు. నోటికి, కళ్లకి టేప్ వేసి.. ఆమె దగ్గరున్న కొత్తింటి తాళం తీసుకుని పరుగుతీశారు. అప్పటికి కట్సుహిసా.. తన నాలుగేళ్ల కూతురు యుకికోకి, 11 ఏళ్ల కొడుకు ఎట్సురోకి స్నానం చేయిస్తూ బాత్రూమ్లో ఉన్నాడు. భార్య మికీకో.. మరో ఏడేళ్ల కూతురు మారికోతో కలసి టీవీ చూస్తోంది. బయట నుంచి తాళం తీసి.. మికీకో ఉన్న గదిలోకి వెళ్లి తుపాకీలు గురిపెట్టారు. క్షణాల్లో అక్కడున్న టెలిఫోన్ వైర్స్ని కట్ చేసి.. వాళ్ల కాళ్లు చేతులు కట్టి.. నోటికి ప్లాస్టర్స్ వేసి.. కట్సుహిసాని వెతుక్కుంటూ వెళ్లారు. బాత్రూమ్లో ఉన్న కట్సుహిసా గుండెకు గన్ గురిపెట్టి.. ‘అరవద్దు కాల్చేస్తాను’ అని పిల్లల్ని బెదిరించారు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురి నోటికి, కళ్లకి ప్లాస్టర్స్ వేసి.. పిల్లల్ని అక్కడే కట్టిపడేసి.. కట్సుహిసాను లాక్కుపోయారు. ‘త్వరగా కారు తియ్’ అనగానే కారు ముందుకు కదలడంతో మరో దుండగుడూ కారులో ఉన్నట్టుగా కట్సుహిసాకి అర్థమైంది. సరిగ్గా పది నిమిషాలకి మికీకో కష్టపడి తనకున్న కట్లు విప్పుకుని, కూతురు మారికోని కూడా విడిపించి.. డైనింగ్ హాల్లో ఉన్న ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే చెక్పోస్టుల్లో క్షుణ్ణంగా తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు. తెల్లవారుజామున ఒంటి గంటకు, గ్లికో కంపెనీ డిపార్ట్మెంట్ హెడ్.. ఫుజీ ఇంటికి ఒక ఫోన్ వచ్చింది. ‘తకాట్సుకిలోని పబ్లిక్ టెలిఫోన్ బాక్స్లోని టెలిఫోన్ డైరెక్టరీలో ఓ లేఖ ఉంది, చూడండి’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మొదట అంతగా పట్టించుకోని ఫుజీ.. ఎందుకో ఆ వాయిస్ తమ యజమాని కట్సుహిసాలాగా అనిపించి.. వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ నిజంగానే ఓ లేఖ ఉంది. ‘కట్సుహిసా ప్రాణాలతో దక్కాలంటే 1 బిలియన్ యెన్ (రూ. 60 కోట్లు), 100 కిలోల బంగారం సిద్ధం చేసుకోండి. వాటిని ఫుజీ ఇంటి ముందు తెల్లటి కారులో ఉంచి వెళ్లాలి. మేము మళ్లీ ఫుజీకే కాల్ చేస్తాం. మీరు ఏ ప్రయత్నం చేసినా మాకు తెలిసిపోతుంది. పోలీసుల్లో మాకు స్నేహితులున్నారు’ అనేది ఆ లేఖ సారాంశం. అది చదవగానే ఫుజీ పోలీసుల దగ్గరకే పరుగుతీశాడు. తీరా కట్సుహిసా.. అతడి కంపెనీకి చెందిన గిడ్డంగిలోనే బందీ అయ్యాడు. ‘నీ కూతురు మారికో కూడా మా దగ్గరే ఉంది. నువ్వు తప్పించుకుంటే ఆమెను చంపేస్తాం’ అని అబద్ధం చెప్పి బెదిరించారు కూడా. అయితే మార్చి 21 మధ్యాహ్నం గిడ్డంగిలో దుండగులు లేని సమయంలో కట్సుహిసా.. తుప్పుపట్టిన వెనుక డోర్ని బలంగా తన్ని దానిలోంచి బయటపడ్డాడు. పోలీసుల సాయంతో సురక్షితంగా కుటుంబాన్ని చేరుకున్నాడు. నేరస్థులు దొరక్కున్నా.. కథ సుఖాంతం అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ కాలేదు. ఎవరో ఏప్రిల్ 10న.. గ్లికో కార్పొరేట్ కార్ పార్కింగ్లోని 3 కార్లకు నిప్పు పెట్టారు. 3 రోజుల తర్వాత ‘ది మాన్స్టర్ విత్ 21 ఫేసెస్’ అనే పేరుతో ‘అది మా పనే’ అంటూ ఓ లేఖ వచ్చింది. మే 10న, అదే పేరుతో ‘గ్లికో ఉత్పత్తులను పొటాషియం సైనైడ్తో విషపూరితం చేశాం’ అనే మరో బెదిరింపు లేఖ ఫుడ్ కార్పొరేషన్ కి అందింది. దాంతో ఆ కంపెనీ 21 మిలియన్ యెన్ లను నష్టపోయింది. మరికొన్ని రోజులకు.. విషపూరిత ఉత్పత్తులను గ్లికో స్టోర్ షెల్ఫ్లలో ఉంచుతామంటూ లేఖ వచ్చింది. చెప్పినట్లే స్టోర్ షెల్ఫ్ ముందు ఓ వ్యక్తి సీసీటీవీలో అనుమానస్పదంగా కనిపించాడు. అతడే మాన్ స్టర్ అని అంతా నమ్మారు. కానీ ఫుటేజ్లో అతడి ముఖం స్పష్టంగా కనిపించలేదు. అలాగే అతడు వచ్చివెళ్లిన ర్యాక్లో ఎలాంటి విషపూరిత ఆహారం దొరకలేదు. ‘నేనొక అసంతృప్తితో ఉన్న గ్లికో ఉద్యోగిని’ అంటూ పోలీసులకూ లేఖలొచ్చాయి. ఆ దిశగానూ విచారణ ఫలించలేదు. జూన్ 26న ‘మాన్ స్టర్.. గ్లికోను క్షమిస్తున్నాడు!’ అంటూ వచ్చిన లేఖతో.. ఆ కంపెనీపై వేధింపులు ఆగిపోయాయి. ఆ తర్వాత నుంచి మోరినాగా అనే మరో ఆహార సంస్థకు అలాంటి లేఖల రాక మొదలైంది. గ్లికో విచారణ తర్వాత మాన్ స్టర్ ఊరికే బెదిరిస్తున్నాడని ఆ లేఖలను లైట్గా తీసుకుంది మోరినాగా సంస్థ. అయితే ‘మోరినాగా ఉత్పత్తుల్లో మేము ప్రత్యేక మసాలా సోడియం సైనైడ్ను కలిపాం.. కాబట్టి అది కొంచెం చేదుగా ఉంటుంది’ అంటూ దేశంలోని పిల్లల తల్లులను ఉద్దేశిస్తూ.. మాన్స్టర్ నుంచి మీడియాకి ఓ లేఖ వచ్చింది. వెంటనే ఫుడ్ కార్పొరేషన్ రంగంలోకి దిగి.. మోరినాగాకు చెందిన 29 విషపూరిత ఉత్పత్తులను గుర్తించింది. దాంతో వణికిన మోరినాగా.. 50 మిలియన్ యెన్ లు చెల్లిస్తామని.. వేధింపులు ఆపాలని మాన్ స్టర్ని వేడుకుంది. ఆ ఆఫర్ని అంగీకరించాడు మాన్స్టర్. జూన్ 28న ఆ డబ్బు అందుకోబోతూ.. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారని గుర్తించి తప్పించుకున్నాడు. అప్పుడే మాన్ స్టర్ కళ్లను ఓ అధికారి చూశాడట. అతడి కళ్లు నక్క కళ్లలా ఉండటంతో.. మాన్ స్టర్.. ఫాక్స్–ఐడ్ మ్యాన్ గా మారాడు. మాన్ స్టర్ వేధింపులు పెరగడంతో పోలీసుల మీద పై అధికారుల ఒత్తిడి పెరిగిపోయింది. 1985 ఆగస్ట్లో షోజీ యమమోటో అనే పోలీస్.. మాన్ స్టర్ని పట్టుకోలేకపోతున్నాననే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మా¯న్స్టర్ నుంచి చివరిగా ఒకే ఒక్క లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘పోలీసుల్లో మాకు స్నేహితులు ఎవరూ లేరు. యమమోటో ఓ మనిషిలా చనిపోయాడు. దానికి మేము సానుభూతి తెలుపుతున్నాం. ఇక నుంచి మా వేధింపులను నిలిపేస్తున్నాం. మా పేరుతో మరెవరైనా ఈ నేరాలకు పాల్పడితే అది మేము కాదని గుర్తించండి. మేం చెడ్డవాళ్లం. చెడ్డ వ్యక్తిగా జీవితాన్ని గడపడం సరదాగా ఉంటుంది. ఇట్లు.. 21 ముఖాల రాక్షసుడు’ అనేది అందులోని భావం. అప్పటి నుంచి మాన్ స్టర్ కనుమరుగు అయిపోయాడు. మాన్ స్టర్ ఒక గ్రూప్కి లీడరా? లేక నిజంగానే 21 మంది కలిసే ఇదంతా చేశారా? అనేది నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
వికారాబాద్: వింత పరికరంపై వీడిన మిస్టరీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు. -
చైనా గొర్రెల సర్కిల్.. మిస్టరీ వీడింది!
వైరల్: ఆ వీడియో.. చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంటర్నెట్ ద్వారా యావత్ ప్రపంచం చర్చించుకునేలా చేసింది. గొర్రెలు గుండ్రంగా పదిరోజులకు పైగా తిరిగిన వీడియో ఒకటి ఈ నెల మొదట్లో ట్విటర్ ద్వారా ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. చైనా అధికారిక మీడియా సంస్థ పీపుల్స్ డెయిలీనే హైలెట్ చేసింది. అయితే.. ఈ వీడియోపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడిచింది. మరోవైపు చైనా నుంచి మరో ముప్పు రాబోతోందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది. చైనీయులకు మాత్రం ఆ వీడియో వణుకు పుట్టించింది. గొర్రెల మంద అలా తిరగడం అపశకునంగా భావించారు చైనా ప్రజలు. ఏదైనా ప్రకృతి విపత్తుకు ముందస్తు సంకేతంగా అనుమానించారు. మరోవైపు.. లిస్టెరియోసిస్ బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా సర్కిలింగ్ డీసీజ్ కారణంగానే అవి అలా చేసి ఉంటాయని సైంటిస్టులు భావించారు. కానీ.. ఇవేవీ ఆ మూగజీవాల వింత ప్రవర్తను కారణం కాదని అంటున్నారు ఇంగ్లండ్ హార్ట్ప్యూరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మ్యాట్ బెల్. మంగోలియాలోని ఓ పొలంలో గొర్రెలు అలా వ్యవహరించడం వెనుక బలమైన కారణం ఉందని ఆయన అంటున్నారు. చాలాకాలం పాటు గొర్రెలు దొడ్డిలోనే ఉండడం మూలంగానే అలా ప్రవర్తించి ఉంటాయని అంటున్నారు. ‘‘చాలాకాలంగా అవి దొడ్డికే పరిమితం అయ్యి ఉండొచ్చు. ఆ కారణంగానే బయటకు రాగానే.. అవి తమ పరిధిని దాటి పోకుండా అలాగే ఉండిపోయాయి. గుండ్రంగా తిరిగిన వాటి మూస ప్రవర్తనకు కారణం కూడా అదే. వాటిలో మందలోని కొన్ని గొర్రెలు అలా ప్రవర్తిస్తే.. పోనుపోనూ మిగతావి కూడా అనుసరిస్తూ ఉండిపోయాయి. ఇదసలు ఏమాత్రం మంచి పరిణామం కాదు’’ అని మ్యాట్ బెల్ తెలిపారు. The great sheep mystery! Hundreds of sheep walk in a circle for over 10 days in N China's Inner Mongolia. The sheep are healthy and the reason for the weird behavior is still a mystery. pic.twitter.com/8Jg7yOPmGK — People's Daily, China (@PDChina) November 16, 2022 గొర్రెలు మంద మనస్తత్వాన్ని ప్రదర్శిస్తాయి. మందతో పాటు కదులుతాయి. వేటాడే జంతువుల నుంచి రక్షించుకునేందుకు అలా వ్యవహరిస్తుంటాయి. వైరల్ అయిన వీడియోలో గొర్రెల ఓనర్.. మిస్ మియావోగా తేలింది. ఆమె దగ్గర 34 గొర్రెల దొడ్లు ఉన్నాయని. కానీ, ఒక్క మందలోనే గొర్రెలే అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని ఆమె పేర్కొంది. చాలాకాలం వాటిని మందలో ఉంచి.. ఆ తర్వాత వాటిని పొలంలోకి వదిలిందట!. నవంబర్ 4వ తేదీ నుంచి అవి అలా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడవి ఇంకా గుండ్రంగానే తిరుగుతున్నాయా? తిరగడం మానేశాయా? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. -
చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...
కోలారు: బెంగుళూరు రూరల్కు చెందిన ఐటీ ఇంజినీర్ కూతురుతో సహా చెరువులోకి దూకిన ఘటన బుధవారం కోలారు తాలూకాలోని కెందట్టి వద్ద చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి గత 3 సంవత్సరాల క్రితం బెంగళూరుకు వచ్చి హోసకోట తాలూకా చక్లాటి బాగలూరు లో నివాసం ఉంటున్న రాహుల్ (27), తన చిన్నారి కూతురు దియా (3)తో సహా చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది. చెరువు వద్ద నీలం రంగు ఐ– 10 కారు ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులోన గాలించగా పాప శవం దొరికింది, రాహుల్ జాడ తెలియరాలేదు. స్కూల్లో వదిలి వస్తానని వెళ్లాడు: భార్య సమాచారం తెలిసి రాహుల్ భార్య భవ్య ఘటనా స్థలానికి వచ్చి కారు తమదేనని, పాప తన కూతురేనని బోరున విలపించింది. భర్త రాహుల్ కుమార్తెను పొద్దున్నే పాఠశాలలో వదిలి వస్తానని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని ఆమె తెలిపింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. గత ఆరు నెలల కాలంగా రాహుల్ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉండేవాడని, దీని వల్ల అప్పులు పెరిగినట్లు భవ్య చెప్పింది. పోలీసు విచారణకు భయపడి చేశాడా? ఇటీవల ఇంట్లో బంగారు నగలు చోరీ అయినట్లు రాహుల్ బాగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు విచారణలో రాహుల్ బంగారాన్ని చెమ్మనూర్ జ్యూవెల్లర్స్లో తనఖా పెట్టినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని గట్టిగా మందలించి విచారణకు పిలిచారు. దీంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా అని కోణంలో కోలారు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్న కారులో రాహుల్ మొబైల్ ఫోన్, పర్సు అన్నీ ఉన్నాయి. అతడు నిజంగా చెరువులోకి దూకాడా, లేక పరారు అయ్యాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమైందో తెలియదు: ఎస్పీ డి.దేవరాజ్ ఐటి ఉద్యోగి రాహుల్కు ఏమైందో తెలియదు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. పోలీసుల భయమా, లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. పాపను చెరువులోకి తోసి అతడు పరారై ఉంటాడు అనే అనుమానం కూడా వస్తోంది. (చదవండి: కాల్’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! ) -
నమ్మి మోసపోయిన షర్మిణి.. ఇంతకీ ఆమెను చంపింది ఎవరు? ఆ దుర్మార్గుడేనా!
మోసం ఎప్పుడూ అవకాశం కోసమే ఎదురు చూస్తుంది. అవసరం ఎప్పుడూ గుడ్డినమ్మకంతో దూసుకుపోతుంది. ఈ విషాదగాథలో అదే జరిగింది. ఎందరికో కనువిప్పు కలిగించే పాఠంగా మిగిలింది. అది 1999, కెనడాలోని టొరంటో పట్టణం. 15 ఏళ్ల షర్మిణి ఆనందవేల్.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని.. రాబోయే మిడిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు కావాల్సిన డ్రెస్, షూస్ తనే కొనుక్కోవాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గ డబ్బు సంపాదించాలని ఆశపడింది. ఏదైనా చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. షర్మిణి తండ్రి ఏలూర్నాయగం.. 1994తో శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో ఆ దేశాన్ని వదిలి భార్యపిల్లలతో సహా కెనడాకు వలస వచ్చాడు. అప్పటికి షర్మిణికి పదేళ్లు. తనకి అన్న దినేష్, తమ్ముడు కాథీస్ ఉన్నారు. టొరంటోలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. ఉదయాన్నే పేపర్స్ వేయడం, పిజ్జా ఆర్డర్స్ సప్లయ్ చేయడం.. ఇలా డబ్బు కోసం పిల్లలు కూడా కష్టపడ్డారు. వుడ్బైన్ జూనియర్ హైస్కూల్లో మెరిట్ స్టూడెంట్గా షర్మిణి మంచి గుర్తింపే తెచ్చుకుంది. 1999 జూన్ నెలలో డబ్బు కోసం షర్మిణి చేసిన ప్రయత్నాలకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ‘నాకు జాబ్ వచ్చింది. దగ్గరలోనే ఆఫీస్.. కేవలం అక్కడ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడటమే నా పని’ అంటూ ఇంట్లో వాళ్లకి శుభవార్త చెప్పింది. అదే నెల జూన్ 12న ఉదయాన్నే 9 గంటలకు షర్మిణి మొదటిసారి ఆఫీస్కి బయలుదేరింది. అక్కకి బై చెప్పడానికి కాథీస్ ఎలివేటర్ వరకూ వచ్చాడు. షర్మిణి ఎలివేటర్ బటన్ నొక్కింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆమె లోపలికి అడుగుపెట్టి, కాథీస్కి బై చెప్పి, కిందకు వెళ్లేందుకు బటన్ నొక్కింది. తలుపులు మూసుకున్నాయి. ఆమె ప్రాణాలతో కనిపించడం అదే చివరిసారి. ఉదయమనగా వెళ్లిన షర్మిణి.. రాత్రి అయినా తిరిగి రాకపోయేసరికి.. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు.. షర్మిణి బెడ్రూమ్లో జాబ్ అప్లికేషన్ను చూసి.. అది స్కామ్ అయ్యి ఉంటుందని భావించారు. ‘షర్మిణి వెళ్లేటప్పుడు ఆ ఆఫీస్ వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాం.. మరిచిపోయి వెళ్లిపోయింది’ అంటూ ఏలూర్నాయగం దంపతులు కంటతడిపెట్టుకున్నారు. అయితే షర్మిణి కావాలనే వివరాలు ఇవ్వలేదని తర్వాత అర్థమైంది. విచారణలో భాగంగా పోలీసులు.. షర్మిణి స్నేహితుల్ని కూడా ప్రశ్నించారు. అప్పుడే ఓ షాకింగ్ విషయం బయటపడింది. ‘షర్మిణి.. తనకి అండర్కవర్ డ్రగ్స్ ఆపరేటర్గా జాబ్ వచ్చిందని మాతో చెప్పింది’ అంటూ షర్మిణి స్నేహితులు నోరువిప్పడంతో ఒక్కసారిగా ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. అంటే ఎవరో షర్మిణిని తప్పుదారి పట్టించి, జాబ్ వివరాలు ఇంట్లో కూడా చెప్పొద్దని నమ్మించి.. కిడ్నాప్ చేసి ఉంటారని డిటెక్టివ్స్ అంచనా వేశారు. అనుమానితుడిగా స్టాన్లీ జేమ్స్ టిప్పెట్ అనే కెనడియన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి కారుని స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీలో డక్ట్ టేప్, తాడు, జాక్నైఫ్, కత్తెరలు, కొలిచే టేప్, సుత్తి, పొడవైన ప్లాస్టిక్ తాడు దొరికాయి. దాంతో కేసు బిగుసుకుంది. ఆగస్ట్ 20న ఫించ్ అవెన్యూ సమీపంలో డాన్ నది వెంబడి నడుస్తున్న హైకర్లు మానవ శరీరం అవశేషాలను కనుగొన్నారు. శరీరం కుళ్లి, సగానికి పైగా జంతువులు తినేయడంతో.. కేవలం డెంటల్(పళ్లు) రికార్డుల ఫోరెన్సిక్ పరిశోధనలో ఆ అవశేషాలు షర్మిణివేనని తేలింది. దాంతో కేసు టిప్పెట్ మెడకే చుట్టుకుంది. దానికి ప్రధాన కారణం.. కారులో ఆయుధాలు దొరకడంతో పాటు.. టిప్పెట్పై అప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. టిప్పెట్ ఎప్పుడూ కథలు బాగా చెప్పేవాడు. నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా మార్చి చెప్పడంలో అతడు దిట్ట్ట అని అక్కడ అందరికీ తెలుసు. నిజానికి ఫ్లీ మార్కెట్లో కొన్న పోలీస్ జాకెట్ వేసుకుని తిరుగుతూ అక్కడుండే పిల్లల్ని మాజీ పోలీస్ అధికారిని అంటూ నమ్మించేవాడు. విచారణ కోసం బైక్ కావాలంటూ అవసరానికి కొందరి దగ్గర బైక్స్ తీసుకుని వెళ్తుండేవాడు. అలాగే చాలామంది మహిళలను వెంబడించి.. లైంగిక దాడికి తెగబడేవాడు. ఒకసారి వాల్–మార్ట్ ఫెయిర్లో ఒక మహిళకు ఉద్యోగం ఇస్తానని నమ్మించి.. ఆమెకు చాలా బహుమతులు ఇవ్వడానికి పదే పదే ఆమె ఇంటికి వెళ్లి.. ఇబ్బందుల్లో పడ్డాడు. ఒకసారి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. స్థానికులకు అడ్డంగా దొరికేశాడు. మరోసారి నకిలీ తుపాకీని చూపించి.. బస్ స్టాప్లో ఒక మహిళను కిడ్నాప్ చేస్తే.. ఆమె తనకు హెచ్ఐవీ ఉందని అబద్ధం చెప్పి వాడి నుంచి తప్పించుకుంది. మరోవైపు షర్మిణి అదృశ్యమైన రోజు ఆ అపార్ట్మెంట్ సమీపంలో టిప్పెట్ని చూశామంటూ చాలామంది సాక్ష్యం చెప్పారు. కిడ్నాప్, లైంగిక వేధింపులతో సహా ఏడు నేరారోపణలలో టిప్పెట్ను డిసెంబర్ 2009లో కోర్టు దోషిగా నిర్ధారించింది. 2011లో టిప్పెట్ని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడిగా గుర్తించడంతో.. ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నాడు. అయితే షర్మిణిని హత్య చేసినట్లు మాత్రం టిప్పెట్ ఒప్పుకోకపోవడంతో.. షర్మిణి ఎలా, ఎందుకు చనిపోయిందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. షర్మిణి గాథ.. అపరిచితుల్ని నమ్మకూడదు అనేందుకు ఒక పాఠం. -సంహిత నిమ్మన చదవండి: Venkampalli: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ -
ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా?
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది. -
కుక్క పిల్ల అని తెచ్చుకుంటే..
బనశంకరి: రోడ్డు మీద కనిపించిన కుక్క పిల్లని ఇంటికి తెచ్చి పాలు పెరుగు పెట్టారు. తరువాత అది నక్క పిల్ల అని తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల బెంగళూరు బనశంకరికి చెందిన వ్యక్తి వీధిలో దొరికిన కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. మామూలుగా దానికి పాలు, పెరుగు పెట్టారు. అవి తినడంతో అది అనారోగ్యానికి గురై నాలుగురోజుల పాటు ఇంట్లో మూలుగుతూ ఇబ్బంది పడింది. దాని అరుపులు విన్న ఇరుగుపొరుగువారు ప్రాణి సంరక్షకులను ఫోన్ చేశారు. కుక్కపిల్ల వీడియో పంపాలని వారు కోరగా వారు అలాగే చేశారు. దానిని పరిశీలించి అది కుక్క కాదు నక్క అని తేల్చారు. పోలీసులు వచ్చి నక్క పిల్లను తీసుకుని కెంగేరి వద్ద గల జంతు సంరక్షణాలయానికి తరలించారు. కాగా నగరంలో జనావాసాల్లోకి నక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా ఉంది. (చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం) -
మోస్ట్ వాంటెడ్ కిల్లర్
అది అమెరికా, ఆరిజోనాలోని గ్లెన్డేల్ నగరం. ఇరవై ఏళ్ల డయానా షా క్రాఫ్ట్.. తన అక్క క్రిస్టీనాతో కలసి ఓ అపార్ట్మెంట్లో ఉంటూ బర్గర్ కింగ్లో ఉద్యోగం చేసేది. వాళ్లది కొలరాడో. ఉద్యోగాల కోసం ఆరిజోనా వచ్చారు.డయానాని వదిలి ఉండలేని తన చిన్ననాటి స్నేహితురాలు పందొమ్మిదేళ్ల జెన్నిఫర్ లూత్..ఆరిజోనా వెళ్తానని తన పేరెంట్స్ని ఒప్పించింది. డిస్కవరీ కార్డ్లో జాబ్ సంపాదించి మరీ డయానా దగ్గరకు వచ్చేసింది. దాంతో ముగ్గురూ కలసి అదే అపార్ట్మెంట్లో ఉండేవారు. 1996 మే 24 సాయంత్రం.. డయానా,జెన్నిఫర్లు కలసి.. త్వరగా వచ్చేస్తామని స్టీనాతో చెప్పి.. సమీపంలోని మినీ–మార్ట్కు వెళ్లారు. అయితే క్రిస్టీనా వాళ్లని చూడటం అదే చివరిసారైపోయింది. రాత్రి 12 దాటినా వాళ్లు తిరిగి రాకపోయేసరికి.. మెమోరియల్ డే వీకెండ్ పార్టీకి వెళ్లారేమోనని సరిపెట్టుకుంది క్రిస్టీనా. మరునాడు ఉదయానికి కూడా వాళ్లు రాకపోయేసరికి కంగారుపడింది. వెంటనే దగ్గర్లోనే ఉంటున్న తన తండ్రి రోడ్జర్ షాక్రాఫ్తో పాటు.. జెన్నీ పేరెంట్స్కి కూడా సమాచారం ఇచ్చింది. వాళ్లందరూ గ్లెన్డేల్కు చేరుకుని పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలో దిగారు. విచారణలో.. ఆ అమ్మాయిలు ఒక అజ్ఞాత వ్యక్తితో వెళ్లడం చూశానని చెప్పాడు మినీ–మార్ట్ క్యాషియర్. దాంతో మెక్సికోలో జరిగే మెమోరియల్ డే పార్టీకి వెళ్లారేమో అని పోలీసులతో సహా అంతా భావించారు. కానీ రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలు అయ్యాయి. వాళ్లు మాత్రం తిరిగిరాలేదు.ఆగస్ట్ మధ్యవారంలో ఫీనిక్స్కు ఉత్తరాన వంద మైళ్ల దూరంలోని మారుమూల ఎడారిలోకి కొందరు స్థానికులు వేటకెళ్లినప్పుడు.. ఒకదానిపై ఒకటిపడి ఉన్న రెండు మృతదేహాలు వారి కంటపడ్డాయి. అవి ఇరవై–ఇరవై ఐదేళ్లలోపు యువతులవని వాళ్లు పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ శవాలను పోస్ట్మార్టమ్కి పంపించారు. అవి డయానా, జెన్నీల మృతదేహాలేనని తేలడంతో అంతా షాక్ అయ్యారు. అసలు అంత దూరం వాళ్లెలా వెళ్లారు? ఎవరు తీసుకుని వెళ్లారు? చనిపోకముందే అక్కడికి వెళ్లారా? లేక ఎవరైనా చంపి అక్కడ పడేశారా? వంటివన్నీ సమాధానాల్లేని ప్రశ్నలయ్యాయి. డయానా, జెన్నిఫర్ మాయమైన రోజు అసలేమైంది? అంటూ మరోసారి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ‘క్లియర్గా ఏం జరిగిందో చెప్పు’ అంటూ.. మినీ–మార్ట్ క్యాషియర్ని నిలదీశారు. ఆ రోజు ఆ ఇద్దరమ్మాయిలు సిగరెట్, సోడా ఇక్కడే కొనుక్కుని తాగారని, రెండు గంటల పాటు బయట బెంచ్ మీదే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారని, ఆ తర్వాత నీలం రంగు పికప్ ట్రక్లో వచ్చిన ఓ వ్యక్తి వారితో మాట్లాడాడని,కొంతసేపటికి అదే ట్రక్కులో ఎక్కి ఆ ముగ్గురూ వెళ్లిపోయారని చూసింది చూసినట్లుగా చెప్పాడు ఆ క్యాషియర్. అంతేకాదు ఆ వ్యక్తికి ముప్పై నుంచి ముప్పై మూడేళ్ల వయస్సుంటుందని, బ్రౌన్ కలర్ జుట్టు, గడ్డం ఉన్నాయని.. డెనిమ్ జాకెట్ వేసుకున్నాడనీ సమాచారమిచ్చాడు. దాంతో పోలీసులు.. ఆ అజ్ఞాత వ్యక్తి కచ్చితంగా డయానా, జెన్నిఫర్లలో ఇద్దరికీ లేదా ఒకరికి బాగా తెలిసినవాడే అయ్యుంటాడని నమ్మారు.తక్షణమే అనుమానితుడి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఈ క్రైమ్ స్టోరీకి పత్రికల్లో, టీవీల్లో విస్తృత ప్రచారం కలిపించారు. ఫీనిక్స్లో డయానా, జెన్నీలు ఎన్నో పార్టీలకు, నైట్క్లబ్లకు హాజరయ్యేవారని తెలియడంతో.. అక్కడే ఆ ఆగంతకుడు వారికి పరిచయం అయ్యుంటాడని భావించారు. ఎక్కడైతే వీరి మృతదేహాలు లభించాయో అక్కడే రెండు సిలువలను పాతి..డయానా, జెన్నిఫర్ల ఫొటోలు పెట్టి,సమాధుల్లా కట్టించారు కుటుంబసభ్యులు. ఆ పరిసరాల్లో పోలీస్ నిఘాని పెంచారు. నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2000 సంవత్సరం,సెప్టెంబర్ 29న సమాధుల దగ్గరున్న ఫ్రేమ్స్లోని ఫొటోలు మాయమయ్యాయి. వాటిని హంతకుడే దొంగిలించి ఉంటాడని చాలామంది నమ్మారు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు.. చనిపోయినవారి పట్ల చాలా గౌరవంతో ఉంటారని.. అలాంటిది సమాధులపై ఫొటోలు మాయం చేశారంటే అది కచ్చితంగా నేరస్థుల పనేనని భావించారు. ఫొటోలు మాయం చేసింది హంతకుడే అయితే అతడిలో అపరాధ భావన కలిగిందా? లేక ఇన్నేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకున్నందుకు గర్వపడుతున్నాడా? జెన్నీ,డయానాలే కాకుండా ఇంకా ఎంత మంది ఆడపిల్లలు అతడి చేతుల్లో బలయ్యారో? ఇలా ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. జెన్నీ మీద దిగులుతో ఆమె తండ్రి రాబర్ట్.. 2014లో జెన్నీ స్మారకదినం రోజునే కన్నుమూశాడు. అపμటికే డయానా తల్లిదండ్రులు కూడా మరణించారు.నిజానికి రాబర్ట్ తన కూతురు జెన్నీ కోసం పెద్ద పోరాటమే చేశాడు. హంతకుడు కచ్చితంగా ఒక్కడు కాదు.. అతనికి సహచరులు ఉండే ఉంటారని అతడు భావించాడు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేయించాడు. అయినా ఫలితం లేకపోయింది. 2014లో అతడి మరణం తర్వాత.. అతడి భార్య డెబోరా.. ఇప్పటికీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆవిడ కొలరాడోలోని లవ్ల్యాండ్లో నివసిస్తూ కోర్టుల చుట్టూ.. అధికారుల చుట్టూ తిరుగుతోంది.ఇప్పటికీ ఆమె తన కూతురు జెన్నీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ.. ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతోంది. నేరస్థుడు దొరుకుతాడని.. ఏదో ఒకరోజున నిజం బయటపడుతుందని నమ్ముతోంది. ఆ దుస్సంఘటన జరిగి 26 ఏళ్లు కావస్తున్నా.. ఆ ప్రాణస్నేహితుల్ని చంపిన హంతుకులు ఎవరో బయటపడలేదు. ఆ తల్లి కడుపుకోతకు సమాధానం దొరకలేదు. - సంహిత నిమ్మన -
Mystery: సెకండ్ షోకి వెళ్లి శవాలుగా తేలి.. గ్రిమ్స్ సిస్టర్స్ డెత్ స్టోరీ
ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్ల విషాద గాథ. షికాగో చరిత్రలో అత్యంత అపఖ్యాతికి గురైన అపరిష్కృత వ్యథ. అది 1956 డిసెంబరు 28. షికాగోలోని ఇల్లినాయీకి చెందిన బార్బరా గ్రిమ్స్(15), ప్యాట్రీషియా గ్రిమ్స్(12) అనే ఇద్దరు సోదరీమణులు.. మెకిన్లీ పార్క్, బ్రైటన్ థియేటర్లోని అప్పటి స్టార్ హీరో అండ్ సింగర్ ‘ఎల్విస్ ప్రెస్లీ’ సినిమా ‘లవ్ మీ టెండర్’ సెకండ్ షోకి వెళ్లారు. వాళ్లింటికి ఆ థియేటర్ కేవలం ఒకటిన్నర మైళ్ల దూరం. వాళ్లు ఆ సినిమా చూడటం అది పదకొండవసారి. ప్రెస్లీకి వీరాభిమానులైన ఆ అక్కాచెల్లెళ్లు ప్రెస్లీ ఫ్యాన్స్ క్లబ్లో సభ్యులు కూడా. రాత్రి 7:30కి ఇంటి నుంచి బయలుదేరిన ఆ అమ్మాయిలు.. సినిమా చూసి, 11:45 కల్లా వచ్చేస్తామని తల్లి లోరిటాకి మాటిచ్చారు. పన్నెండు దాటినా రాకపోయేసరికి భయపడిన లోరిటా.. తన మరో కూతురు థెరిసా, కొడుకు జోయిలను బస్స్టాండ్కి పంపించింది చూసి రమ్మని. వాళ్ల ముందే మూడు బస్సులు వెళ్లిపోయాయి కానీ బార్బరా, ప్యాట్రీషియా మాత్రం రాలేదు. ఆ కుటుంబం.. ఆ బాలికల స్నేహితుల ఇళ్లకు పరుగుతీసింది. అక్కడా నిరాశే ఎదురైంది. దాంతో వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రౌండ్ సెర్చ్ మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ సాక్షులు పెరిగారు తప్ప బాలికల ఆచూకీ మాత్రం దొరకలేదు. ప్యాట్రీషియా స్కూల్ ఫ్రెండ్ డోరతీ.. ‘ఆ రోజు రాత్రి నేనూ, మా అక్క కూడా అదే సినిమాకు వెళ్లాం. లేట్ అవుతుందనే ఉద్దేశంతో తొమ్మిదిన్నరకు ఇంటర్వెల్లో ఇంటికి వెళ్లిపోయాం. వెళ్తూ వెళ్తూ వాళ్లిద్దరినీ చూశాను. పాప్కార్న్ కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డారు. సంతోషంగానే కనిపించారు’ అని చెప్పింది. మరికొందరు ప్రత్యక్షసాక్షులు.. మెర్క్యురీ మోడల్ కారులో వచ్చిన ఒక యువకుడితో బాలికలు మాట్లాడటం చూశామని.. ఆ వ్యక్తి అచ్చం ప్రెస్లీని పోలి ఉన్నాడని చెప్పారు. పత్రికల్లో విస్తృత ప్రచారం మొదలైంది. ‘ఆచూకి చెప్పండి’ అంటూ రివార్డ్లూ ప్రకటించారు. అనుమానాలు, అరెస్ట్లు ముమ్మరంగానే సాగాయి. తన పిల్లల్ని వదిలిపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తానంటూ లోరిటా కిడ్నాపర్లకు పలు విజ్ఞప్తులూ చేసింది. డిసెంబర్ 28న బాలికలు తన బస్ ఎక్కారని, దాదాపు రాత్రి 11:05 గంటలకు వెస్ట్రన్ అవెన్యూలో దిగారని ఓ బస్ డ్రైవర్ సాక్ష్యమిచ్చాడు. ఆ ప్రదేశం థియేటర్కి.. బాలికల ఇంటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కాలం గడుస్తున్నా కొద్దీ.. ఆ అమ్మాయిల్ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, వాళ్లంతట వాళ్లే ఇంటి నుంచి పారిపోయి స్వచ్ఛందంగా బాయ్ఫ్రెండ్స్తో ఉంటున్నారనే అభిప్రాయం స్థిరపడిపోయింది. 1957 జనవరి 19న టెలివిజన్లో ప్రెస్లీ గ్రేస్ల్యాండ్ ఎస్టేట్ నుంచి అమ్మాయిల కోసం అధికారిక ప్రకటన వెలువడింది. ‘మీరు నిజమైన ప్రెస్లీ అభిమానులైతే వెంటనే ఇంటికి వెళ్లిపోండి. మీ మీద బెంగతో మీ అమ్మ చిక్కిశల్యమవుతోంది’ అంటూ ప్రెస్లీ కూడా స్పందించాడు. అయినా కేసులో ఎలాంటి పురోగతి లేదు. జనవరి 22న విల్లో స్ప్రింగ్స్లోని నిర్మానుష్య రహదారి పక్కన.. కరిగిన మంచు ముక్కల మధ్య.. లియోనార్డ్ ప్రెస్కాట్ అనే కార్మికుడికి.. రెండు తెల్లటి బొమ్మలు కనిపించాయి. అనుమానం వచ్చిన లియోనార్డ్.. దగ్గరల్లో ఉన్న తన ఇంటికి వెళ్లి భార్యను తీసుకొచ్చి వాటిని చూపించాడు. అవి బొమ్మలు కావు శవాలని గుర్తించిన అతడి భార్య అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. తేరుకుని ఆ ఇద్దరూ స్టేషన్కు పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ శవాలు గ్రిమ్స్ సిస్టర్స్వని గుర్తించారు. వారిది నిజంగా కిడ్నాప్ అని, లైంగికదాడి చేసి చంపేశారని నమ్మేవాళ్లు పెరిగారు. వాళ్లు కనిపించకుండా పోయిన(డిసెంబర్ 28) ఐదు గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యారని రిపోర్ట్స్ తేల్చాయి. అయితే డిసెంబర్ 30 తర్వాత, జనవరి మొదటి వారాల్లో వాళ్లను హోటల్స్ దగ్గర, స్టోర్స్ దగ్గర చూశామంటూ చాలా మంది సాక్ష్యమిచ్చారు. అప్పటికే చనిపోయిన వారిని వాళ్లంతా ఎలా చూశారనేది పెద్ద మిస్టరీగా మారింది. బాలికల శరీరాలపై తీవ్రమైన గాయాలేమీ లేవు కానీ కొట్టినట్లుగా కొన్ని మచ్చలు ఉన్నాయి. ఎలుక కొరికిన గాట్లున్నాయి (శవాలపై జరిగిన దాడి కావచ్చు). బాలికల్ని ఎక్కడో చంపి.. కారులో కౌంటీలైన్ రోడ్కి తీసుకొచ్చి పడేసి ఉంటారని, మంచులో ఉండటం వల్లే శవాలు త్వరగా పాడుకాలేదని అంచనాకు వచ్చారు నిపుణులు. ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా వాళ్లిద్దరూ ఊహించని షాక్ వల్లే చనిపోయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి తప్ప మరే కారణాన్ని స్పష్టపరచలేదు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 3 లక్షల మందిని విచారించారు పోలీసులు. రెండు వేల మందిపై పూర్తి నిఘా పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఎడ్వర్డ్ బెడ్వెల్ అనే వ్యక్తిపై సుదీర్ఘ విచారణ జరిగింది. నేరాన్ని అంగీకరించాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని అతడు కోర్టు ముందు వాపోయాడు. ఆ తర్వాత అభియోగాల నుంచి బయటపడ్డాడు. అయితే అసలు నేరస్థులు ఎవరు? బాలికలు తమ ఇష్టంతోనే వెళ్లారా? లేక వాళ్లను బలవంతంగా లాక్కెళ్లారా? బాలికలకు తెలిసిన వాళ్ల పనేనా? లేక అపరిచితుల కుట్రా? అసలు సాక్ష్యులంతా నిజమే చెప్పారా లేదా? అనేది నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన చదవండి: Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రుల్ని చంపిందెవరు? -
మిస్టరీ గెలాక్సీ చిక్కింది
ఇంతకాలంగా అందీ అందనట్టుగా తప్పించుకుంటూ వస్తున్న ఓ మిస్టరీ గెలాక్సీ ఆనవాలు ఎట్టకేలకు చిక్కింది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల పై చిలుకు దూరంలో ఉన్న కార్ట్వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరా కంటిలో బంధించింది. దాని కేంద్రకం వద్ద ఉన్న భారీ కృష్ణబిలం కూడా వెబ్ కెమెరాకు చిక్కింది. ఈ గెలాక్సీని నిత్యం నక్షత్ర ధూళి భారీ పరిమాణంలో ఆవరించి ఉంటుందట. దాంతో హబుల్ వంటి కాకలు తీరిన టెలిస్కోప్లు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా దీన్ని ఫొటోలు తీయలేకపోయాయి. అందుకే ఈ గెలాక్సీ కంటపడటాన్ని చాలా అరుదైన విషయంగా నాసా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. కోట్లాది ఏళ్లలో కార్ట్వీల్ గెలాక్సీ ఎలాంటి మార్పుచేర్పులకు గురవుతూ వచ్చిందీ తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ తీసిన ఇన్ఫ్రా రెడ్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. దాని కేంద్ర స్థానం వద్ద ఏర్పడ్డ కృష్ణబిలం గురించి కూడా విలువైన సమాచారం తెలిసే వీలుందట. అంతేగాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించి ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చన్నది సైంటిస్టుల మాట. అచ్చం బండి చక్రంలా... వయసు మీదపడుతున్న హబుల్ టెలిస్కోప్కు వారసునిగా జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేయడం తెలిసిందే. కాలంలో వెనక్కు చూడగల ఇన్ఫ్రా రెడ్ సామర్థ్యం దీని సొంతం. దాని సాయంతో మహావిస్ఫోటనం (బిగ్బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే జేమ్స్ వెబ్ మనకు అందించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా కార్ట్వీల్ గెలాక్సీకి సంబంధించి కూడా దాని ఇప్పటి, సుదూర, సమీప గతాలకు సంబంధించిన ఫొటోలనూ జేమ్స్ వెబ్ స్పష్టంగా అందించగలిగింది. ఈ ఫొటోల్లో కార్ట్వీల్ గెలాక్సీ పేరుకు తగ్గట్టుగా అచ్చం బండి చక్రం మాదిరిగానే కన్పిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర పాలపుంతలు కూడా నేపథ్యంలో కనిపిస్తుండటం విశేషం. ఒక అతి పెద్ద, మరో బుల్లి గెలాక్సీ ఊహాతీతమైన వేగంతో ఢీకొనడం వల్ల కార్ట్వీల్ గెలాక్సీ పురుడు పోసుకుందని సైంటిస్టులు సిద్ధాంతీకరించారు. కానీ దీని ఉనికి చాలాకాలం పాటు మిస్టరీగానే ఉండిపోయింది. అంతరిక్ష ధూళి తదితరాల గుండా సులువుగా పయనించగల పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పట్టుకోగలదు. దాని సాయంతోనే ఎట్టకేలకు అది కార్ట్వీల్ ఉనికిని నిర్ధారించి కెమెరాలో బంధించగలిగింది. ఫొటోలో కన్పిస్తున్న నీలి రంగు చుక్కలన్నీ నక్షత్రాలు. కోట్లాది ఏళ్ల కాలక్రమంలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటాలు తదితరాల వల్ల కార్ట్వీల్ గెలాక్సీలో చోటుచేసుకుంటూ వచ్చిన కీలక మార్పులను ఈ ఫొటోల సాయంతో విశ్లేషించవచ్చట. ఈ గెలాక్సీ చుట్టూ రెండు వెలుతురు మండలాలున్నాయి. కేంద్ర స్థానంలో సంభవించిన మహా విస్ఫోటం ఫలితంగా చెరువులో అలల్లా ఇవి నానాటికీ విస్తరిస్తూ పోతున్నాయట. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని రింగ్ గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకృతులుండే పాలపుంతలు అరుదు. దీనిలోని అంతరిక్ష ధూళికి సంబంధించి లోతైన విషయాలను జేమ్స్ వెబ్ తాలూకు మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ (ఎంఐఆర్ఐ) సాయంతో విశ్లేషించే పనిలో పడింది నాసా. – నేషనల్ డెస్క్, సాక్షి -
ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ!
శాంటియాగో: భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. ఈ ఊదరగొట్టుడు హెడ్లైన్స్ వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు. చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఈ భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని(198 మీటర్లు) మింగేసేంత సామర్థ్యం ఉంటుందన్న మాట. అయితే.. ప్రాథమిక దర్యాప్తులో ఈ భారీ గొయ్యి ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి అంచనాకు రాలేకపోయారు అక్కడి అధికారులు.. ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. మానవ కార్యకలాపాల వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్ కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్ను ఉత్పత్తి చేసే హబ్. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు అక్కడి అధికారులు. ఈ విషయంపై మైనింగ్ మినిస్టర్ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్ కార్యకలాపాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ భారీ గొయ్యి ఏర్పడిన సమీప ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. -
అసలు ఆమెను చంపిందెవరు? పోస్ట్మార్టమ్ నివేదికలోనూ..
పదహారేళ్ల జేనెట్ బయటకు వెళ్లడానికి రెడీ అయింది. ‘మమ్మీ! ఫ్రెండ్ను కలవడానికి ట్రెయిన్లో వెళుతున్నా... తొందరగానే వచ్చేస్తాలే’ చెప్పింది జేనెట్. ‘సరేనమ్మా! జాగ్రత్త!’ సాగనంపింది తల్లి. ఇది జరిగి నేటికి సరిగ్గా యాభయ్యేళ్లు. అంటే, 1972 ఆగస్టు 7న తల్లితో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది జేనెట్ డి పామా. వెళ్లడమైతే వెళ్లింది గాని, ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెదుకులాడారు. ఆరాతీశారు. ఫ్రెండ్ దగ్గరకు కూడా చేరలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో యూనియన్ కౌంటీ స్ప్రింగ్ఫీల్డ్ టౌన్షిప్ క్లియర్వ్యూ రోడ్డులో ఉంటుందా ఇల్లు. స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు ఇంటికి వచ్చి, తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు రోజుల తరబడి చాలాచోట్ల గాలించారు. ఫలితం కనిపించలేదు. ఆరువారాలు గడిచాక ఒకరోజు– సెప్టెంబర్ 19న ఒక కుక్క కుళ్లిపోయే దశలో ఉన్న అమ్మాయి మోచేతిని నోట కరుచుకుని వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు వెదుకులాట మొదలుపెట్టారు. కుక్క వచ్చిన దారిలో వెదుకులాడుతూ స్ప్రింగ్ఫీల్డ్లోని హూడై క్వారీ కొండ శిఖరం మీదకు చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం ఒళ్లు జలదరించేలా ఉంది. అర్ధగోళాకారంలో పేర్చి ఉన్న చెట్ల కొమ్మలు, కలప దుంగల కింద అమ్మాయి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం ఒక ముగ్గులాంటి ఆకారం మీద పడి ఉంది. మృతదేహం చుట్టూ జంతువులను బలిచ్చినట్లుగా జంతు కళేబరాల అవశేషాలు కనిపించాయి. పరిసరాల్లోని దృశ్యాన్ని బట్టి క్షుద్రపూజల కోసం ఎవరో తాంత్రికులు అమ్మాయిని బలి ఇచ్చి ఉండవచ్చని స్థానికులు చెవులు కొరుకున్నారు. అయితే, పోలీసులు ఆ వాదనలను కొట్టి పారేశారు. చకచకా చెట్ల కొమ్మలను, దుంగలను తొలగించి, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కనిపించకుండా పోయిన జేనెట్దేనని గుర్తించారు. నిబంధనల ప్రకారం అక్కడ జరగాల్సిన తతంగాన్ని పూర్తి చేశాక, పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. పోస్ట్మార్టంలో ఆమె మరణానికి దారితీసిన కారణాలేవీ బయటపడలేదు. శరీరంపై కత్తిపోట్లు, తూటాల గాయాలు ఏవీ లేవు. అఘాయిత్యం జరిపి, హింసించి గాయపరచిన ఆధారాల్లేవు. ఎముకలు విరిగిన గుర్తుల్లేవు. కనీసం మాదక ద్రవ్యాలు లేదా విషపదార్థాల ఆనవాళ్లు కూడా శవపరీక్షలో దొరకలేదు. కచ్చితమైన ఆధారాలు దొరకకున్నా, బహుశ గొంతు నొక్కేయడం వల్ల ఆమె మరణించి ఉంటుందని పోస్టుమార్టం జరిపిన డాక్టర్లు నివేదిక ఇచ్చి, అంతటితో చేతులు దులిపేసుకున్నారు. జేనెట్ చనిపోయిన రెండువారాల నుంచి పత్రికల్లో రకరకాల కథనాలు మొదలయ్యాయి. క్షుద్ర తాంత్రికుల నరబలికి ఆమె బలైపోయి ఉంటుందనే వాదనతో ఈ పత్రికలు ప్రచురించిన కథనాలు అమెరికా అంతటా కలకలం రేపాయి. యూనియన్ కౌంటీలోని వాచుంగ్ అభయారణ్యం క్షుద్రతాంత్రికులకు అడ్డాగా పేరు మోసింది. జేనెట్ మృతదేహం వాచుంగ్ అభయారణ్యానికి చేరువలోనే ఉన్న క్వారీ కొండపై లభించడంతో జనాలు కూడా పత్రికల వాదనను నమ్మారు. అంతేకాదు, జేనెట్ మరణానికి కొద్దినెలల ముందు జాన్ లిస్ట్ అనే ఉన్మాది యూనియన్ కౌంటీలో తన భార్యను, తల్లిని, ముగ్గురు పిల్లలను చంపేసి పారిపోయాడు. దాంతో యూనియన్ కౌంటీ జనాలు సాయంత్రమైతే చాలు ఇంటి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోయేవాళ్లు. అయితే, జేనెట్ మరణానికి పోస్ట్మార్టంలో కూడా కారణాలు బయట పడకపోవడంతో కేసు మూలపడింది. దశాబ్దాలు గడిచాక ఈ కేసు మళ్లీ చర్చలోకి వచ్చింది. అదెలాగంటే, ‘వీయర్డ్ ఎన్జే మేగజైన్’ కార్యాలయానికి 1990ల చివర్లోను, 2000 ప్రారంభంలోను జేనెట్ మరణానికి సంబంధించి వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు వచ్చాయి. ఆ పత్రిక ఎడిటర్ మార్క్ మోరాన్ ఈ కేసుపై పరిశోధన ప్రారంభించాడు. తన పరిశోధనలో కనుగొన్న అంశాలతో, పలు అనుమానాలతో వరుస కథనాలను ప్రచురించాడు. ఈ కేసు ఫైలును స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు పోగొట్టుకుని ఉంటారని లేదా నాశనమైనా చేసి ఉంటారనే అనుమానం కూడా ఆయన తన కథనాల్లో వ్యక్తం చేయడంతో దీనిపై మళ్లీ కలకలం మొదలైంది. మీడియా గట్టిగా నిలదీయడంతో 1999 నాటి ఫ్లాయిడ్ తుపానులో ఈ కేసు ఫైలు గల్లంతైందని పోలీసులు అంగీకరించారు. అయితే, దాని ప్రతి మాత్రం పదిలంగానే ఉందని చెప్పారు. దరిమిలా జేనెట్ మరణంపై ఎడిటర్ మోరాన్ తన పత్రికలోనే పనిచేసే కరస్పాండెంట్ జెస్సీ పోలాక్తో కలసి ‘డెత్ ఆన్ ది డెవిల్స్ టీత్’ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం స్థానికంగా సంచలనం కలిగించింది. జేనెట్కు న్యాయం జరిపించాలంటూ స్థానికులు ఏకంగా ‘జస్టిస్ ఫర్ జేనెట్ డి పామా’ పేరుతో ఒక సంస్థనే ప్రారంభించి, న్యాయ పోరాటానికి రంగంలోకి దిగారు. జేనెట్ దుస్తులను డీఎన్ఏ పరీక్షలకు పంపాలంటూ కోర్టుకు వెళ్లారు. అధునాతనమైన డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ సంఘటనకు గల కారణాలు బయటపడవచ్చని భావిస్తున్నామని ఈ సంస్థ ప్రతినిధులు ఆశాభావంతో ఉన్నారు. ఈ కేసులో నిజం ఎప్పటికైనా బయటపడుతుందా? జేనెట్ను చంపిందెవరో వెలుగులోకి వస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. చదవండి: 1991 Austin Yogurt Shop Killings: యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..! -
జర్నలిస్ట్ గోపాల్ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: వివిధ దినపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన చింతమాను గోపాలకృష్ణ (35) అదృశ్యమై ఐదేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 2017, నవంబరు 11న గోపాలకృష్ణ కనిపించకుండా పోయాడని అతని తల్లి చింతమాను లక్ష్మమ్మ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు 97/2017 క్రైం నంబర్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గోపాలకృష్ణ ఎక్కడున్నది గుర్తించలేకపోయారు. కుమారుడు బతికున్నాడో.. లేదో తెలియని స్థితిలో అతని తల్లి మంచం పట్టి చివరకు అనారోగ్యంతో మృతి చెందింది. చదవండి: డ్రైవర్తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి.. అనంతరం గోపాల్ భార్య, పిల్లలు కూడా కనిపించకుండా పోయారు. గోపాల్ సోదరి తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. అడిగేవారు లేకపోవడంతో గోపాల్ కేసును పోలీసులు అటకెక్కించేశారు. కాగా, గోపాలకృష్ణను హత్య చేశారన్న వదంతులూ హల్చల్ చేస్తున్నాయి. ఒక జర్నలిస్టు అదృశ్యమై ఐదేళ్లవుతున్నా పోలీసులు ఆచూకీ కనుగొనలేదంటే దర్యాప్తు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికైనా జర్నలిస్ట్ సంఘాలు ఉద్యమించి గోపాల్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని పలువురు కోరుతున్నారు. -
మంచి మాట: జీవనమధురిమలు
ప్రతి ఒక్కరి జీవితంలో మాధుర్యముంటుంది. కానీ, దానిని చేరుకునే సోపానం ఒకటి కాదు అనేక రకాలు. మనకి అనువైనదేదో తెలియచేప్పేది మన జీవిత నేపథ్యం. ఈ జీవన మాధుర్యానుభూతి.. స్థాయి.. గాఢతలను నిర్ణయించేది మన జీవిత దృక్పథం.. వైఖరి.. భావన. సుఖం.. సంతోషం .. ఆనందం వీటి భావన, అనుభూతి మనందరిలో ఒకే రకంగా ఉండదు. జీవన మాధుర్యమూ అంతే! కొందరికి ఐశ్వర్యం జీవన మాధుర్యం. మరికొందరికి పుస్తకాలు. అందమైన ప్రకృతి, పరోపకారం .. జీవితార్థ శోధన.. ఆధ్యాత్మికత, జీవాత్మ – పరమాత్మల సంబంధ, సంయోగ యోచన, వృత్తి, హోదా... సజ్జన సాంగత్యం.. ఇలా అనేకానేక ఆలోచనలు జీవన మాధుర్యంలోని విభిన్నతను, వైవిధ్యతను సూచిస్తున్నాయి. లోకో భిన్న రుచిః. చెరుకు తియ్యగా ఉంటుంది. ఇది మనకందరకు తెలుసు. ఈ భావన అనుభవంలోకి రావాలంటే చెరకు గడ మీద ఉండే మందపాటి పెచ్చును తీసి, ముక్కను కొరికి నమలాలి. అపుడు కొద్దిగా తీపిదనం తెలుస్తుంది. ఎంత బాగా నమిలితే అంతటి రసం.. అంతటి తీపి. అలాగే జీవితం కూడ. ఇదీ చెరకు గడే.. ఎలా జీవించాలో తెలుసుకోవాలి. అనుభవించటం తెలియాలి. అనుభవించినకొద్దీ జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. క్షీరసాగర మధనం తరువాతే అమృతం లభించింది. దానిని మన జీవితంలో వెతికి పట్టుకోగలిగే చూపు.. నేర్పు కావాలి. లేనప్పుడు ఎవరైనా గురువును పెద్దల్ని.. అనుభవజ్ఞుల్ని ఆశ్రయించాలి. మధుపం అనేక పుష్పాలమీద వాలి.. వాటిలోని మకరందాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. తేనె అన్ని పుష్పాలలో ఉండదు. వేటిలో ఉంటుందో దానికి తెలుసు. వాటి మీద వాలి వాటి నుంచి తేనెను పీల్చుకుంటుంది. జీవిత పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదించాలంటే అది ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉందో తీసుకోగలగాలి. దాన్ని అందుకోవాలి. జీవితంలోని తీపిని మనకు తెలియచెప్పేది కుటుంబం. ఇది ప్రధాన సాధనం. బంధాలు – అనుబంధాలలోని తీయదనపు రుచి తెలుసుకున్న తరువాత స్నేహం ఆ రుచిని మరింత పెంచుతుంది. మన ఇంటి ఆవరణలో... మన వీధిలో ఉండే వాళ్ళతో సావాసం ఓ అద్భుత మధురసమే. తరువాత విద్యాభ్యాస కాలంలో స్నేహితులు, కాకి ఎంగిళ్ల తిళ్ళు.. మధ్యాహ్న భోజనాలలో పంచుళ్లు, వారితో గిల్లికజ్జాలు.. మౌనవ్రతాలు..ఊరేగటాలతో పాటు విద్యలో అసూయ.. ఒకరినొకరు దాటి వెళ్లాలనుకునే పోటీ తత్వం... సాహసాలు.. దుస్సాహసాలు ... ఇలా ఎన్ని మధురిమలు! గుండె పట్టలేనన్ని! ఇవి అనుభవించిన కాలంలోనే కాక తరువాతి కాలంలో కూడ నెమరువేసుకునే జ్ఞాపకాల తీపి ఊటలవుతాయి. ఒంటరితనంలో, మనసు శూన్యమైన సమయంలో.. గాయపడిన వేళ.. ఈ మధురిమలు ఎంత ఊరటనిస్తాయి! మనసు అతలాకుతలం కాకుండా కాపాడి మనల్ని నిలబెడతాయి. జీవన మాధుర్యాన్ని తెలుసుకుని.. దాన్ని అనుభవించేవారు విద్వాంసులే కానక్కర లేదు. వారు విద్యావిహీనులు కావచ్చు. సామాన్యులూ కావచ్చు. ఎవరైతే ఆ రుచిని ఒడిసి పట్టుకుని ఆస్వాదిస్తారో వారే గొప్ప వేదాంతులు.. యోగులు.. . సత్యశోధకులు. జీవిత మాధుర్యాన్ని తెలుసుకుని అనుభవించటమే జీవన రహస్యం. ఏమిటది? రెండక్షరాలలో ఉంటుందది. అదే.. తృప్తి... వివాహానంతరం ఒక స్త్రీ.. పురుషుడు దాంపత్యమనే నావలో జీవనసాగరంలో ప్రయాణం చేయాలి. ఆరంభపు అనురాగం అంబరమే. ఈ ఆనందపు తీపి గురుతులు మనస్సుకెంత ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని... హాయిని ఇస్తాయో! భార్యాభర్తల దాంపత్యపు తీయని ఫలాలే పిల్లలు. వారి పెంపకం.. ముద్దుమురిపాలు.. ఆపై వీరి వివాహం. మేము సైతం మీ జీవన మాధుర్యానికంటూ వచ్చేవాళ్లే కదా మనవలు.. మనవరాళ్లు. వివాహం వల్ల ఒనగూరే మధురిమలెన్నెన్నో ! రోహిణి కార్తె చండ్ర నిప్పులు తరువాత పలుకరించే తొలకరి జల్లులో ఒక ఆనందముంది. బాగా వేడెక్కిన భూమిని వానచుక్క చుంబించిన తరుణాన అవనినుండి వచ్చే మట్టి వాసనే అది. శీతాకాలపు ఉషోదయాన మంచు కురిసిన పచ్చిక మీద పాదాలుంచిన క్షణం.. ఓహ్... అది ఎంతటి హాయిని... ఆహ్లాదాన్ని ఆనందాన్నిస్తుంది! పిల్ల తెమ్మర మన నాసికకు చేరవేసే పూల సుగంధం కూడ ఒక జీవన మధురిమే. ఇలా మనకి ఆనందాన్నిచ్చేవన్నీ మన జీవన మాధుర్యాన్ని పెంచేవే. ఈ జీవన మధురిమలు ఎవరికైనా సొంతమే. ఎవరైనా ఆనందించవచ్చు. కావలసినది కొంచెం స్పృహ. తపన. అన్వేషణ. జీవిత అంతరార్థాన్ని, తనలోని అంతర్యామిని అర్థం చేసుకుంటూ ఆ సర్వాంతర్యామిని ఈ సకల చరాచర సృష్టిలో చూసే ప్రయత్నం కొందరు చేస్తారు. ఇదే వారి దృష్టిలో మానవ జీవితంలోని మాధుర్యాన్ని చూపగలిగే మార్గం. ఇదే గొప్పదైనది. ఇదే అసలైనది అని వారి భావన. భగవంతుడి తత్వాన్ని అవగతం చేసుకునే ఓ అద్భుతమైన సోపానం. మానవ సేవలో అంకితమవ్వటం మాధవ సేవే కదా! మంచి చేసేది... మంచిని పెంచేది ప్రతిదీ మాధుర్యాన్ని పంచి ఇచ్చేదే. జీవితంలోని మాధుర్యాన్ని దర్శించాలంటే బాధలను, కష్టాలను దూరంగా ఉంచి, ఆనందకరమైన జ్ఞాపకాలను సదా మననం చేసుకుంటూ ఉండాలి. చెడ్డవారిలోనూ మంచిని చూడగలగాలి. చేదులోను తీపిని చూసే మానసిక స్థితిని పెంచుకోవాలి. అప్పుడు సృష్టి అంతా మధురంగానే ఉంటుంది. – లలితా వాసంతి -
మహిళ హత్య కేసు మిస్టరీ.. అనుమానం నిజమైంది..
చిత్తూరు రూరల్: మండలంలోని బీఎన్ఆర్ పేట వద్ద వారం క్రితం వెలుగుచూసిన మహిళ హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు తాలూకా పోలీస్స్టేషన్లో సీఐ బాలయ్య, ఎస్ఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. జీడీనెల్లూరు మండలం నల్లరాళ్లపల్లెకు చెందిన చిన్నబ్బ మందడి కుమార్తె మోహన అలియాస్ రోజా(23)కు చిత్తూరు మండలం కుర్చివేడు పంచాయతీ వీఎన్పురం గ్రామానికి చెందిన ప్రకాష్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. చదవండి: సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం.. కొంత కాలానికే భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రకాష్ రోజూ తాగి వచ్చి రోజాను వేధించేవాడు. దీంతో అప్పుడప్పుడు ఆమె మనస్తాపంతో పుట్టింటికి వెళ్లిపోయి కొన్నిరోజులు ఉండి వచ్చేది. ఈక్రమంలో ఇటీవల మళ్లీ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తండ్రి వద్దని వారించినా వినకుండా ప్రకాష్ ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోజా ఇక్కడ తాను ఉండలేనని తండ్రి వద్దకు వెళ్లిపోతానంటూ కాలినడకనే బయలుదేరింది. బైక్పై ఆమె వెనుకే వచ్చిన ప్రకాష్ మార్గం మధ్యలో అడ్డుకున్నాడు. మాటామాటా పెరగడంతో దగ్గరలోని బండరాయి తీసుకుని రోజా తలపై మోదాడు. ప్రాణాలు పోకపోవడంతో చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. 18వ తేదీ సాయంత్రం అటు వైపు వెళ్లిన స్థానికులు తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా రోజా తల్లిదండ్రులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు చూపించిన రోజా తాళిబొట్టు, ఇతర ఆధారాలను చూసి తమ కూతురే అని నిర్ధారించారు. రోజాను ఆమె భర్తే చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రోజా భర్త ప్రకాషే నిందితుడని తేలడంతో మిగిలిని ఇద్దరినీ విడిచిపెట్టేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్
ఖగోళంలో మరో మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. విశ్వంలోని మరో పాలపుంత నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్ను ట్రేస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. భూమికి మూడు బిలియన్ల కాంతి సంవత్సరం దూరంలో ఉన్న పాలపుంత నుంచి ఈ రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ సిగ్నల్స్ను గుర్తించడం ఇది రెండోసారి. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్స్(FRB)కు FRB20190520Bగా నామకరణం చేశారు. ఎఫ్ఆర్బీలకు కారణమేంటన్నది ఖచ్చితంగా తెలియదు కానీ.. న్యూట్రాన్ నక్షత్రం వెనుక వదిలిపెట్టిన సూపర్నోవా పేలుడు ద్వారా వెలువడిన దట్టమైన పదార్థంగా భావిస్తున్నారు. ‘నవజాత’ సిద్ధాంతం ప్రకారం, ఎఫ్ఆర్బీ వయసు పెరిగేకొద్దీ సంకేతాలు క్రమంగా బలహీనపడతాయని అంచనా. మే 2019లో చైనాలోని గుయిజౌలో ఐదు వందల మీటర్ల గోళాకార ఎపర్చరు రేడియో టెలిస్కోప్ (FAST)ని ద్వారా FRBని ట్రేస్ చేశారు. అదనపు పరిశీలనలు 2020లో ఐదు నెలల వ్యవధిలోనే.. దాదాపు 75 FRBలను నమోదు చేశాయి. తర్వాత US నేషనల్ సైన్స్ ఫౌండేషన్కు చెందిన కార్ల్ G జాన్స్కీ వెరీ లార్జ్ అర్రే ఈ సిగ్నల్స్ని స్థానీకరించారు. -
గుడ్డిగా నమ్మి ప్రాణాలు కోల్పోయింది.. కానీ ఆ విషయం మాత్రం మిస్టరీనే!
కొందరు మోసగాళ్లకి నమ్మకమే పెట్టబడి. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. కనీసం మోసపోయామనే విషయం కూడా తెలియకుండానే జీవితం ముగిసిపోతుందనడానికి ఈ కథ ఓ ఉదాహరణ. అది 1893 డిసెంబర్ 3.. మినీయపోలిస్ (మిన్నెసొటా, అమెరికా).. కనిచీకటి పడుతున్న వేళ.. 29 ఏళ్ల క్యాథరిన్ జింగ్.. గూస్మాన్ లివెరీ స్టేబుల్కి వెళ్లి క్లాస్ బ్లిక్ట్స్ అనే పేరు మీద ఓ గుర్రం, ఓ బగ్గీ (గుర్రబ్బండి)ని అద్దెకు తీసుకుంది. సరిగ్గా రాత్రి ఏడున్నర అయ్యేసరికి ఆ బగ్గీపై వెస్ట్ హోటల్ వైపు వెళ్లి.. అక్కడ క్లాస్ బ్లిక్ట్స్ అనే వ్యక్తిని కలిసింది. తన దగ్గరున్న నకిలీ నోట్లు అతడికి ఇచ్చి.. అతడి దగ్గరున్న ఒరిజినల్ కరెన్సీని తను తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఆమె రాకకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న బ్లిక్ట్స్.. ఆమె రాగానే తుపాకీతో కాల్చాడు. క్షణాల్లో నేలకొరిగిన క్యాథరిన్ తలపై పెద్ద రాయితో కొట్టి, ఆమె దగ్గరున్న అన్నింటినీ లాక్కుని ఉడాయించాడు. గుర్రాన్ని, గుర్రబ్బండినీ గూస్మాన్ లివెరీ స్టేబుల్కి అప్పగించేశాడు. ఎలాగో బ్లిక్ట్స్ పేరుమీదే వాటిని క్యాథరిన్ అద్దెకు తీసుకుంది కాబట్టి వాటిని తిరిగి ఇవ్వడానికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఎనిమిదిన్నర.. తొమ్మిది మధ్యలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విలియం ఎర్హార్డ్ అనే వ్యక్తి రోడ్డు మీద జింగ్ మృతదేహాన్ని గుర్తించాడు. కాసేపటికే అజ్ఞాత యువతి యాక్సిడెంట్ అని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్ట్మార్టమ్ తర్వాత అది హత్య అని ఆమె తలలోని బుల్లెట్ తేల్చింది. ఆ తర్వాత.. ఆమె ఎవరో కాదు క్యాథరిన్ జింగ్ అనే డ్రెస్ మేకర్ అనీ తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్యాథరిన్ జింగ్... చాలా అందగత్తె. ఆమె సన్నిహితులంతా ఆమెని కిట్టీ అని ముద్దుగా పిలుచుకునేవారు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ నుంచి మిన్నెసొటాకి వచ్చి, బట్టలు తయారుచేసే సంస్థలో డ్రెస్ మేకర్గా చేరింది. మరో డిపార్ట్మెంట్ స్టోర్లో క్లర్కుగా పనిచేస్తున్న ఫ్రెడెరిక్తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఏవో కొన్ని గొడవలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఫ్రెడెరిక్ తొడిగిన నిశ్చితార్థపు ఉంగారాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ తన మెడలో వేసుకుని తిరిగేది. ఏళ్లు గడిచే కొలదీ ఆమె జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులతో పాటు డబ్బూ జమకూడింది. అయితే జింగ్ మరణం తర్వాత మరింత లోతుగా ఆరాలు తీసిన పోలీసులు.. హత్య జరిగిన మూడురోజుల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో క్యాథరిన్ మాజీ ప్రేమికుడు ఫ్రెడెరిక్తో పాటు ధనిక కుటుంబానికి చెందిన హ్యారీ హేవార్డ్, హ్యారీ సోదరుడు ఆండ్రీ, సెక్యూరిటీ గార్డ్ బ్లిక్ట్స్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఫ్రెడెరిక్ అమాయకుడని నిర్ధారించి విడిచిపెట్టేశారు. ‘క్యాథరిన్ నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు కోసమే ఆమెని చంపి, డబ్బు ఎత్తుకెళ్లి ఉంటారు’ చెప్పాడు హ్యారీ. తను క్యాథరిన్కు డబ్బు ఇచ్చేప్పుడు సాక్షిగా ఉన్న పనిమనిషినీ స్టేషన్కు పిలిపించాడు. దాంతో పోలీసులు హ్యారీది కూడా తప్పు లేదని నమ్మారు. ఆండ్రీ, బ్లిక్ట్స్ కూడా తమకు ఈ కేసుతో ఏ సంబంధం లేదనడంతో పోలీసుల దృష్టి హ్యారీ గర్ల్ఫ్రెండ్ లిలియన్ అలెన్ మీద పడింది. గతంలో హ్యారీతో క్యాథరిన్ క్లోజ్గా ఉండటం తట్టుకోలేకపోయిన అలెన్ .. రెండుమూడు సార్లు క్యాథరిన్తో గొడవపడిందట. కానీ విచారణలో ఆమె కూడా నిర్దోషిగానే తేలింది. అయితే పోలీసుల దెబ్బలు రుచి చూసిన ఆండ్రీ నోరు విప్పాడు. ‘హ్యారీ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి.. క్యాథరిన్ను చంపేందుకు సాయం చేయాలని కోరాడు. కానీ నేను భయపడి నో చెప్పాను. మా ఫ్యామిలీ లాయర్ లెవీ స్టూవర్ట్కి అప్పుడే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. కావాలంటే స్టూవర్ట్ని ప్రశ్నించండి’ అంటూ కేసుని హ్యారీ వైపు తిప్పాడు ఆండ్రీ. స్టూవర్ట్.. ఆండ్రీకి అనుకూలంగా నిలబడటంతో హ్యారీ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఒజార్క్ ఫ్లాట్స్లోని క్యాథరిన్ అద్దెకుండే అపార్ట్మెంట్ ఓనర్ హ్యారీ తండ్రిదని.. హ్యారీకి, క్యాథరిన్కి చాలా సన్నిహిత సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో బయటపడింది. హ్యారీ మంచి జూదగాడు. ఇన్సూరెన్స్ మోసాలు, డబ్బు కోసం భారీ చోరీలు, నకిలీ కరెన్సీ తయారీ వంటి పనుల్లో ఆరితేరిన మనిషి. చాలా అపరిష్కృత హత్య కేసుల్లో అతడి పేరుంది. అతడి గురించి తెలిసినవాళ్లంతా అతన్ని శాపనార్థాలు పెట్టేవారు. ఫ్రెడెరిక్తో విడిపోయిన బాధలో ఉన్న క్యాథరిన్కి.. హ్యారీ స్నేహం ఊరటనిచ్చింది. క్యాథరిన్కు డబ్బు ఆశ చూపిస్తూ తను చేసే ప్రతి దుశ్చర్యలో ఆమెను భాగంచేసేవాడు.. కొంత సొమ్ము ముట్టజెప్పేవాడు. ఆ క్రమంలోనే వారి మధ్య బంధం బలపడింది. హ్యారీ ప్రోత్సాహంతో క్యాథరిన్.. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంది. దానికి నామినీగా అతడి పేరు రాయించుకున్నాడు. క్యాథరిన్ చనిపోతే ఆ పాలసీ డబ్బులు తనకే వస్తాయని ఇదంతా చేశాడు హ్యారీ. మొత్తం కథలో బ్లిక్ట్స్ ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. క్యాథరిన్ నన్ను కలవడానికి ప్లాన్ చేసిందే హ్యారీ. నకలీ డబ్బుల మార్పిడి కోసం క్యాథరిన్ నా దగ్గరకు వచ్చిందని చెప్పాడు. అంతే కాదు హ్యారీ ఈ హత్య ప్లాన్ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, అతడు నా కళ్లలోకి కళ్లు పెట్టి తదేకంగా చూశాడు. ఆ తర్వాత అతడు ఏం చెప్పినా నేను నో అనలేకపోయాను. ఆ చూపులో ఏదో మాయ ఉంది. అందుకే క్యాథరిన్ని హత్య చేశాను’ అంటూ హ్యారీ తనపై హిప్నాటిజం చేశాడని చెప్పుకొచ్చాడు బ్లిక్ట్స్. అయితే అప్పటికే స్థానికులు హ్యారీ హిప్నాటిజం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అతడికి ఏదో శక్తి ఉందని, అతడి కళ్లల్లో ఏదో మాయ ఉందని.. వశీకరణ చేసి చాలా మందిని మట్టుబెట్టాడని ఇలా హ్యారీపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. బ్లిక్ట్స్ ప్రత్యక్షసాక్షి కావడంతో వశీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి.. న్యాయపరంగానే విచారణ సాగించారు. కొన్ని వాయిదాల తర్వాత హ్యారీకి ఉరిశిక్ష, బ్లిక్ట్స్కి జీవితఖైదు పడింది. ఆండ్రీ నిర్దోషిగా బటయపడ్డాడు. 1895 డిసెంబర్ 11న తెల్లవారు జామున 2.12కి హ్యారీని ఉరి తీశారు. అయితే హ్యారీ 2.25 ని.ల వరకూ బతికేవున్నాడనీ రికార్డుల్లో నామోదు చేసుకున్నారు అధికారులు. దాంతో నిజంగానే హ్యారీ చాలా శక్తిమంతుడని.. అతడికి క్షుద్రపూజలు కూడా తెలుసని.. చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. అతడు తిరిగి లేచి, బతికొస్తాడనీ కొందరు భావించేవారు. హ్యారీకి ఉరి తీసే కొన్ని రోజుల ముందు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తను చేసిన కొన్ని హత్యల గురించి నోరు విప్పాడు హ్యారీ. అప్పుడు కూడా వశీకరణ గురించి చెప్పలేదు. దాంతో బ్లిక్ట్స్ని నిజంగానే వశీకరణ చేసి క్యాథరిన్ని చంపించాడా? లేక బ్లిక్ట్స్ కావాలనే అబద్ధం చెప్పాడా? అనేది తేలలేదు. కేసు ముగిసినా నేరస్తుడికి శిక్షపడినా.. ఈ కథలోని వశీకరణ కోణం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన చదవండి: Mystery Room No 1046 Story: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్! -
Mystery: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్!
ప్రతీకారమో పశ్చాత్తాపమో కానీ.. ఓ జీవితం ముగిసింది. హత్యనో.. ఆత్మహత్యనో తేలకుండా అనుమానాస్పద కథనంగా మిగిలిపోయింది. అది 1935 జనవరి 4. అమెరికాలోని కేంజస్ సిటీలో నిత్యం అతిథులతో కళకళలాడే ‘ప్రెసిడెంట్ హోటల్’లో ఊహించని కలకలం మొదలైంది. అంతకు రెండు రోజుల క్రితం రూమ్ నం. 1046లో దిగిన రోలాండ్ టి. ఓవెన్ అనే యువకుడు చావుబతుకుల మధ్య నెత్తురోడుతున్నాడు. గమనించిన హోటల్ సిబ్బంది.. మొదటి కాల్ అంబులెన్స్కి, రెండో కాల్ పోలీస్ స్టేషన్కి చేశారు. ఆ రూమ్ మొత్తంలో ఒక సిగరెట్ పెట్టె, పగిలిన గ్లాస్, టెలిఫోన్ స్టాండ్ మీద దొరికిన ఒక మహిళ వేలిముద్రలు కీలక ఆధారంగా మారాయి. పోలీస్ విచారణలో వింత విషయాలు చాలానే బయట పడ్డాయి. రోలాండ్ చూడటానికి కాస్త బాడీ బిల్డర్లా ఉన్నాడని, బ్లాక్ కోట్ ధరించిన అతడికి సుమారు 20 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని.. జుట్టు బ్రౌన్ కలర్లో ఉందని, అతడి తల మీద చాలా గాయాల తాలూక ఆనవాళ్లు ఉన్నాయని, అతడి చెవులు కాస్త భిన్నంగా కిందకు వంగినట్లుగా ఉన్నాయని.. చెప్పుకొచ్చారు అక్కడి సిబ్బంది. అయితే అతడ్ని మొదటిసారి రూమ్కి తీసుకుని వెళ్లిన బెల్బాయ్ రాండమ్ క్రాఫ్ట్.. మరో విచిత్రమైన విషయాన్ని చెప్పాడు. రోలాండ్ జనవరి 2న మధ్యాహ్న సమయంలో హోటల్కి వచ్చాడని, తన వెంట కేవలం ఒక బ్రష్, ఒక పేస్ట్, ఒక దువ్వెన మాత్రమే తెచ్చుకున్నాడని, పైగా రూమ్ కావాలని కాకుండా.. కిటికీలు కూడా లేని ఇంటీరియర్ రూమ్ కావాలని.. ప్రైవసీ ఎక్కువగా ఉండాలని కోరడంతో మేనేజర్.. అలాంటి రూమ్నే కేటాయించాడని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగింది? రోలాండ్.. హోటల్లో దిగిన రోజు సాయంత్రం రూమ్ క్లీన్ చేసేందుకు మేరీ సోప్టిక్ అతడి రూమ్కి వెళ్లింది. అప్పుడు రోలాండ్.. డిమ్ లైట్లో చైర్పై కూర్చుని కాస్త భయపడుతున్నట్లుగా కనిపించాడట. రూమ్ క్లీన్ చేసిన తర్వాత బయటికి రాబోతున్న సోప్టిక్తో రోలాండ్.. ‘కాసేపట్లో నా స్నేహితుడు వస్తాడు, డోర్ లాక్ చేయొద్దు’ అని చెప్పాడట. దాంతో ఆమె డోర్ లాక్ చేయకుండానే వెళ్లింది. కొద్దిసేపటికి టవల్స్ తీసుకుని సోప్టిక్ మళ్లీ రోలాండ్ రూమ్కి వచ్చింది. అప్పుడు రోలాండ్ ఒంటినిండా దుప్పటి కప్పుకుని మంచంపై పడుకుని కనిపించాడట. అయితే బల్ల మీద ‘డాన్, నేను పావుగంటలో వస్తా, వెయిట్ చేయండి’ అని నోట్ రాసిపెట్టాడట. అది చదవిన సోప్టిక్ టవల్స్ రూమ్లో పెట్టి, బయటికి వచ్చేసింది. ఆ మరునాడు సోప్టిక్ మళ్లీ రోలాండ్ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్లినప్పుడు.. తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండటంతో తన దగ్గరున్న డూప్లికేట్ కీ సాయంతో తలుపు తెరిచింది సోప్టిక్. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో, లైట్ వేసింది. ఎదురుగా రోలాండ్ దిగులుగా కూర్చుని ఉండటం చూసి షాక్ అయ్యింది. బయట తలుపు ఎవరు పెట్టారు? అనేది ఆమెకు అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకుని క్లీనింగ్ చేస్తున్నప్పుడు రోలాండ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ.. ‘వద్దు డాన్, నాకు తినాలని లేదు. నేను ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేశాను’ అని చెప్పాడట. మరునాడు మళ్లీ దుప్పట్లు మార్చేందుకు రోలాండ్ రూమ్ బెల్ కొట్టింది సోప్టిక్. అయితే ఈ సారి ఆ రూమ్లో రోలాండ్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా ఆమె గమనించింది. ‘మాకు ఏం అవసరం లేదు.. నువ్వు వెళ్లొచ్చు’ అనే గంభీరమైన స్వరం ఒకటి సోఫ్టిక్కి వినిపించింది. అది కచ్చితంగా రోలాండ్ స్వరం కాదు అనేది సోఫ్టిక్కి తెలుసు. మరోవైపు జనవరి 4 తెల్లవారు జామున రూమ్ నంబర్ 1048లో ఉంటున్న ఒక మహిళ నుంచి రిసెష్షన్కి ఓ కంప్లైంట్ వచ్చింది. ‘1046లో ఉంటున్న వాళ్లతో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందులో ఓ మహిళ పెద్దపెద్దగా అరుస్తోంది’ అని ఆమె రిసెప్షన్కి కాల్ చేసి చెప్పింది. దాంతో వెంటనే రోలాండ్ ఉండే రూమ్కి ఫోన్ ట్రై చేశారు రిసెష్షన్లో పని చేసే సిబ్బంది. ఫోన్ కలవకపోవడంతో టెలిఫోన్ కనెక్షన్ పోయి ఉంటుందనుకుని.. బెల్ బాయ్ని రోలాండ్ రూమ్కి పంపించారు. ఎంత సేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో వెనుదిరిగాడు బెల్ బాయ్. కొన్ని గంటల తర్వాత మరో బెల్ బాయ్ రోలాండ్ రూమ్ దగ్గరకు వచ్చాడు. అతడు ఈసారి బలవంతంగా తలుపు తెరిచి చూశాడు. డోర్కి రెండు అడుగుల దూరంలో రోలాండ్ మోకాళ్లపై కూర్చుని తలను చేతులతో పట్టుకుని ఉన్నాడు. ఒంటి నిండా రక్తం కారుతోంది. లైట్ ఆన్ చేసిన బెల్ బాయ్.. మంచం మీద, బాత్ రూమ్లో, గోడలపైనా ఉన్న రక్తం మరకల్ని చూసి భయపడ్డాడు. పరుగున వెళ్లి మేనేజర్కి విషయం చెప్పాడు. రోలాండ్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు.. అతడ్ని ఎవరో తీవ్రంగా హింసించారని, ఛాతీలో, ఊపిరితిత్తుల్లో కత్తితో గట్టిగా పొడిచారని.. కుడివైపు మెదడు బాగా దెబ్బతిందని.. కొన్ని గంటల వరకూ ఏం చెప్పలేమని అన్నారు. దాంతో రోలాండ్పై హత్యాయత్నం చేసింది ఎవరంటూ పోలీసులు గట్టిగానే విచారణ మొదలుపెట్టారు. ఇక్కడే మరో ట్విస్ట్ కథను ఉత్కంఠగా మార్చింది. రోలాండ్ సృహలోకి వచ్చాడు. వెంటనే రోలాండ్పై డిటెక్టివ్, పోలీసులు కలసి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు?’ అని రోలాండ్ని అడిగితే.. ‘నన్ను ఎవరూ చంపాలనుకోలేదు.. నేను బాత్ రూమ్ టబ్లో పడిపోయాను. అందుకే దెబ్బలు తగిలాయి’ అని షాకిచ్చాడు రోలాండ్. ‘నిజం చెప్పు.. ఎవరూ నీపై దాడి చేయకుంటే.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నావా?’ అనీ ప్రశ్నించారు. ‘లేదు.. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమే’ అని సమాధానమిచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ మరునాడు జనవరి 5న అదే ఆసుపత్రిలో చనిపోయాడు. దాంతో పోలీసులు కేసుని సవాలుగా తీసుకున్నారు. అప్పుడే మరో కీలక సాక్ష్యం బయటపడింది. ఆ హోటల్ ఎలివేటర్ ఆపరేటర్ చార్ల్స్ బ్లాషర్.. ‘ఒక మహిళ రూమ్ నంబర్ 1026 ఎక్కడా? అని నన్ను అడిగింది, తర్వాత ఆమె రోలాండ్ రూమ్ ముందు తచ్చాడుతూ కనిపించింది, నన్ను చూడగానే కాస్త కంగారుపడి పొరపాటుగా ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి ఆమె మరో వ్యక్తితో కలసి మాట్లాడటం నేను చూశాను’ అని చెప్పాడు. అంతే కాదు ఆ వ్యక్తే డాన్ అయి ఉండొచ్చని చార్ల్స్ అభిప్రాయపడ్డాడు. చార్ల్స్ చెప్పిందంతా విన్నాక.. రోలాండ్ గదిలో దొరికిన మహిళ వేలిముద్రలు ఆమెవే కావచ్చనీ పోలీసులు భావించారు. ఇక పోలీసులు రోలాండ్ శవాన్ని ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఊహించిన ఒక ఫోన్ కాల్.. అతడి మరణం హత్యేనని బలపరచింది. ‘కావాల్సినంత డబ్బు పంపిస్తాను. అతడి అంత్యక్రియలు మాత్రం కేంజస్ సిటీ మెమోరియల్ పార్క్ శ్మశాన వాటికలోనే ఘనంగా జరిపించండి. అక్కడైతే అతడు మా చెల్లెలికి దగ్గరలో ఉంటాడు’ అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. అతడు చెప్పినట్లే మార్చి 23న ఒక అజ్ఞాత సెంటర్ నుంచి పెద్ద డబ్బు కట్ట పోలీస్ స్టేషన్కి వచ్చింది. డబ్బుతో పాటు రాక్ ఫ్లవర్ కంపెనీ నుంచి కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. వాటి మధ్యలో ‘లవ్ ఫరెవర్ లూయీ’ అనే నోట్ ఉంది. రాక్ కంపెనీలో ఆరా తీస్తే.. అక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. ఇక ఈ విషయాన్ని వార్తాపత్రికలు కథలు కథలుగా ప్రచురించాయి. అలాంటి ఓ కథనాన్ని చదివిన రూబీ ఓగ్లెట్రీ అనే మహిళ.. కేంజస్ సిటీ పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ వచ్చింది. రోలాండ్ తన కన్నకొడుకు అని.. అతడి అసలు పేరు ఆర్టెమస్ ఓగ్లెట్రీ అని చెబుతూ తన కొడుకు తనకు రాసిన లెటర్లు కొన్ని సాక్ష్యంగా చూపించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రూబీకి వచ్చిన లెటర్స్లో కొన్ని రోలాండ్ చనిపోయిన తర్వాత తేదీతో ఉన్నాయి. అవన్నీ హ్యాండ్ రైటింగ్తో కాకుండా టైప్ చేసి ఉన్నాయి. ఇంకో వార్త పత్రికకు మరో మహిళ ఫోన్ చేసి.. ‘వాడు చేసిన తప్పుకు వాడికి తగిన శిక్షే పడింది’ అని చెప్పిందట. ‘ మీరు మాట్లాడేది రోలాండ్ గురించేనా అంటే.. ‘అవును’ అని ఫోన్ పెట్టేసిందట. అయితే పోలీసులకు ఆ ఫోన్ కాల్స్పై కూడా ఏ ఆధారం దొరకలేదు. ఆ ఫోన్ కాల్స్ ఎపిసోడ్ తర్వాత.. రోలాండ్ అలియాస్ ఆర్టెమస్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని, అది తట్టుకోలేక ఆమె చనిపోతే.. ఆమె బంధువులే అతడ్ని మట్టుపెట్టి ఉంటారనే కథా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికీ రూబీకి లెటర్లు ఎవరు పంపారు? డాన్ ఎవరు? 1048 రూమ్ నుంచి కంప్లైంట్ చేసిన మహిళ చెప్పినట్లు రోలాండ్ రూమ్లో పెద్దపెద్దగా అరిచిన మహిళ ఎవరు? చనిపోయాక అతడి కోసం డబ్బులు, పువ్వులు ఎవరు పంపిచారు? అసలు లూయీ అంటే ఎవరు? రోలాండ్ అసలు పేరు నిజంగానే ఆర్టెమస్సేనా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య అతడి కథ ముగిసింది అనుమానాస్పదంగా! -సంహిత నిమ్మన -
Tomato Flu: చిన్నారుల్లో అంతుచిక్కని ‘టమాటో ఫ్లూ’ కలకలం
మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. టమాటో ఫ్లూ అంటే.. ఇది అరుదైన డిసీజ్. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది. లక్షణాలు.. టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. సరిహద్దులో నిఘా.. ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు. అలాగే వలయార్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
Mystery: 35 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన విమానం.. పైలట్ సీటులో అస్థిపంజరం!
టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు లేక ఆశ్చర్యకరమైన ఉదంతాలుగా, జవాబులు లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. అలాంటిదే శాంటియాగో ఫ్లైట్ నం. 513 రిటర్న్స్ స్టోరీ. అది 1989, నవంబర్ 15. బ్రెజిల్లోని పార్టో అలెగ్రే విమానాశ్రయం ముందు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు.. ‘గత నెల 12న ఇక్కడేం జరిగింది? ఎందుకు ఈ ప్రభుత్వం 513 ఫ్లైట్ వివరాలు చెప్పడం లేదు?’ అంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. 1954 నాటి శాంటియాగో ఫ్లైట్లోని ప్రయాణికుల వివరాలను తక్షణమే బయటపెట్టాలనేది వారి పోరాటం. ‘నిరాధారమైన ప్రశ్నలకు మేమెలా సమాధానం ఇవ్వగలం?’ అనేది విమానాశ్రయ అధికారుల వాదన. అసలేం జరిగింది? 35 ఏళ్ల కిందట జర్మనీలో మిస్సైన ‘శాంటియాగో ఫ్లైట్ నం. 513’ విమానం (1989,అక్టోబర్ 12) బ్రెజిల్లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా.. ఆ విమానం 1954, సెప్టెంబరు 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు ఆధారాలు ఉన్నాయి. నిజానికి అది 18 గంటల తర్వాత గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల పాటు వెతికిన తర్వాత ఆ ఫ్లైట్ అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని అక్కడి అధికారులు తేల్చేశారు. అందులోని కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూతో సహా అంతా చనిపోయినట్లు ప్రకటించారు. అయితే నాడు మిస్ అయ్యిందనుకున్న విమానం.. 1989లో అలెగ్రే ఎయిర్పోర్ట్లో ల్యాండయ్యింది. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో స్పందిస్తూ.. ‘ఆ విమానం 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది’ అని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించింది. కానీ వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. బ్రెజిల్ విమానాశ్రయవర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎయిర్పోర్ట్లో ల్యాండైన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తిమంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని బ్రెజిల్ అధికారులు నిర్ధారించారు. విచిత్రం ఏమిటంటే.. ఆ విమానంలో 88 మంది ప్రయాణికులతో పాటు, ముగ్గురు విమాన సిబ్బంది, విమానం నడిపిన పైలట్ కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. మొత్తం కలిపి 92 మంది అస్థిపంజరాలుగా మిగిలారు. దీనిపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీయగా.. ‘ఈ విమాన పైలట్.. కెప్టెన్ విక్టర్ క్యూ.. కాక్పీట్లో విమానం నడుపుతున్న పొజిషన్ లో మాకు కనిపించారు. ల్యాండింగ్కు ముందు ఆ ఫ్లైట్.. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా సేపు చక్కర్లు కొట్టింది. దాని గురించి మాకు ముందుగానే ఎలాంటి సమాచారం లేకపోవడంతో మేము కాస్త అయోమయంలో పడ్డాం. ఆ తర్వాత విమానం దానంతట అదే ల్యాండయ్యింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం ఎలా ల్యాండ్ అయ్యిందనేది మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే’ అని చెప్పుకొచ్చారు. ఇది 1989, నవంబర్ 14.. ఉదయాన్నే ‘వీక్లి వరల్డ్ న్యూస్’ పత్రిక చదివిన వారిని విస్మయపరచిన వార్త. ఆ నోట ఈ నోట విస్తృతంగా ప్రచారమై.. ప్రపంచమూ విస్తుపోయేలా చేసింది. 35వ ఏళ్ల క్రితం మిస్ అయిన విమానం తిరిగి రావడమేంటీ? పైగా ఒక అస్థిపంజరం పైలెట్ స్థానంలో కూర్చుని, విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడమేంటీ? అనే ప్రశ్నలు.. బ్రెజిల్, జర్మనీ దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్నీ అనుమానంలోకి నెట్టాయి. ఈ ఘటనపై ‘విమానాశ్రయ అధికారుల అలసత్వం సరికాదు’ అంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేర మని, ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని.. ఆ సమాచారం వారి బంధువులకు పంపించండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వార్తను గోప్యంగా ఉంచుతోందనీ అనుకున్నారు. ఓ కట్టుకథ కొంతమంది మాత్రం.. ‘ఇదంతా ఓ కట్టుకథ, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు’ అని కొట్టిపారేశారు. ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త చుట్టూ భిన్నవాదనలు వెల్లువెత్తాయి. ప్రపంచ చరిత్రలో ఎయిర్క్రాఫ్ట్ లిస్ట్ను పరిశీలిస్తే.. 1856లో మొదటిసారి మిస్ అయిన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర నుంచి.. 2019లో గల్లంతయిన ఎమ్బీబీ బీవో 105 హెలికాప్టర్ వరకూ చూసుకుంటే ‘శాంటియాగో నం. 513’ అనే ఫ్లైట్ మిస్ అయినట్లు కాదు కదా కనీసం రికార్డ్ల్లో కూడా ఆ పేరుతో ఒక్క ఫ్లైట్ కనిపించలేదు. దీంతో ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు అధికారులు. మరో విషయం ఏమిటంటే.. ‘వీక్లి వరల్డ్’ పత్రిక ఇలాంటి ఫిక్షన్ స్టోరీస్ని సృష్టించడంలో దిట్టని చాలా మంది నిరూపించారు. అయినా సరే కొందరు శాంటియాగో 513 టైమ్ ట్రావెల్లో చిక్కుకుందని.. ప్రభుత్వాలే నిజాన్ని దాచిపెడుతున్నాయని.. బలంగా నమ్మారు. దాంతో ఈ ఫ్లైట్ రిటర్న్స్ స్టోరీ మిస్టరీల సరసన చేరి కథలు కథలుగా ప్రచారమవుతోందిప్పటికీ! -సంహిత నిమ్మన చదవండి: USA Boy In The Box Mystery: నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు? -
నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు?
కొన్ని పైశాచిక చర్యలు.. చరిత్రపుటలను రక్తపుధారలతో తడిపేస్తాయి. మానవాళికి మాయని మచ్చలుగా మిగిలిపోతాయి. సరిగ్గా 65ఏళ్ల క్రితం.. అమెరికాలో ఫిలడెల్ఫియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం అలాంటిదే. అది 1957, ఫిబ్రవరి 26.. సుస్కెహన్నా అడవిలో కుందేళ్ల అలికిడి కాస్త అనుమానంగా అనిపించి.. రోడ్డు పక్కనే కారు ఆపాడు ఓ కాలేజీ కుర్రాడు. ‘జంతువుల్ని పట్టేందుకు అడవిలో అక్రమంగా బోనులేమైనా పెట్టి ఉంటారా? కుందేళ్లు ఎందుకు అలా బెదురుతున్నాయి?’ అనే అనుమానంతో.. అడవి వైపే అడుగులు వేశాడు. లోపలికి వెళ్లే కొలదీ తట్టుకోలేని దుర్గంధం అతడ్ని ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అయినా ఏదో కీడు శంకించి.. అడుగులు ముందుకే కదిపాడు. అతడి అనుమానమే నిజమైంది. ఓ నాలుగు నుంచి ఆరేళ్లలోపు పసివాడు నిర్జీవంగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన అతడు.. ‘ఈ విషయంలో నన్ను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు’ అని రిక్వెస్ట్ చేయడంతో... ఫిలడెల్ఫియా పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. బాడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్లింది. నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టుతో ఉన్న ఆ బాబు.. ఎంతో కాలంగా పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. తలపై లోతైన గాయాలు, శరీరమంతా దెబ్బలు, గాట్లు.. ఆ బాబు దయనీయ స్థితికి అద్దంపడుతుంటే.. చనిపోయిన తర్వాతే బాబు జుట్టు, గోళ్లు కత్తిరించిన ఆనవాళ్లు(ఒంటి నిండా వెంట్రుక ముక్కలు) ఉన్నాయి. పైగా శవాన్ని చాలాసేపు నీటిలో ఉంచినట్లు కాళ్లు, చేతులపై ముడతలు పడ్డాయి. తమ బాబు కనిపించడం లేదని ఏ ఒక్కరూ స్టేషన్కి రాలేదు. బాబు ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు.. 4 లక్షల కాపీలు ప్రింట్ వేయించి.. ఆ చుట్టుపక్కల అందరికీ పంచారు. ప్రధాన కూడళ్లలో గోడలకు అతికించారు. వార్త వేయమంటూ పత్రికలకు వివరాలు ఇచ్చారు. ఫిలడెల్ఫియాలో ఇచ్చే ప్రతీ గ్యాస్ బిల్లుతోనూ బాబు ఫొటోను అందించారు. అయినా ఎలాంటి సమాచారం లేదు. ఈ కేసులో కీలకమైన కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి బ్లూ కలర్ టోపీ, చిన్నారి స్కార్ఫ్, వైట్ కర్చీఫ్, ఆ కర్చీఫ్ మీదున్న ‘ఎమ్’ అనే అక్షరం. అయితే ఏ ఒక్క క్లూ తదుపరి విచారణకు సహకరించలేదు. దాంతో బాబు శవానికి డ్రెస్ వేసి.. నిలబెట్టి, కూర్చోబెట్టి కూడా ఫుల్ సైజ్ ఫొటోలు తీసి పబ్లిష్ చేశారు. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే మీడియా, కొందరు ఔత్సాహికులు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాబు శవం చుట్టూ చాలా కథలల్లేశారు. అందులో ముఖ్యంగా 1960లో ఓ వ్యక్తి చెప్పిన కథ చాలా మందిని నమ్మించింది. పిల్లాడి శవం దొరికిన చోటికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఓ ఫాస్టర్ హోమ్ ఉంది. అది హాస్టల్ లాంటిదే. అక్కడ చిన్న పిల్లల్ని సంరక్షిస్తుంటారు. ఆ హోమ్కి వెళ్లిన అతడు.. బాబు శవానికి వాడిన ఊయల లాంటి బాసీనెట్, శవానికి చుట్టిన దుప్పటిని అక్కడ చూశానంటూ సొంతంగా ఓ కథ అల్లాడు. అతడి ఊహ ప్రకారం.. ‘ఆ ఫాస్టర్ హోమ్ యజమాని సవతి కూతురికి పుట్టిన బాబే ఈ బాబు. పెళ్లి కాకుండానే బాబు పుట్టడంతో సవతి తల్లి ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆ బాబుని చంపేసి, అడవిలో పడేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఎందుకైనా మంచిదని పోలీసులు.. ఆ ఫాస్టర్ హోమ్ యజమానినీ, ఆమె సవతి కూతురినీ ప్రశ్నించారు. కానీ ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఏళ్లు గడుస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించాలని.. ఆ బ్రాంచ్కి వచ్చిన ప్రతి కొత్త పోలీసు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓ రోజు ఈ కేసుపై మాట్లాడాలంటూ.. మార్తా అనే యువతి పోలీస్ స్టేషన్కి ఎంట్రీ ఇచ్చింది. బాబు శవంతో పాటు దొరికిన కర్చీఫ్ మీదున్న అక్షరం, ఆమె పేరులోని మొదటి అక్షరం ‘ఎమ్’ కావడంతో.. పోలీసులు ఆమె చెప్పే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మార్తా ఏం చెప్పిందంటే.. మా అమ్మ 1954 వేసవిలో... జొనాథన్ అనే గుర్తు తెలియని బాబుని.. ఓ జంట నుంచి కొనుక్కుంది. అప్పటి నుంచీ సైకోలా మారి... దాదాపు రెండున్నరేళ్ల పాటూ ఆ బాబుని భౌతికంగా హింసించింది. సరిగా తిండి కూడా పెట్టేది కాదు. ఓ రోజు చీకటి పడుతున్న సమయంలో... జొనాథన్ బేక్ చేసిన బీన్స్ తిన్నాడు. ఆ వెంటనే వాంతి చేసుకున్నాడు. అది చూసిన మా అమ్మ.. ఎప్పటిలానే ఆ బాబుని చితకబాదింది. అక్కడితో ఆగకుండా ఆవేశంలో బాబు తలను నేలకేసి కొట్టింది. దాంతో జొనాథన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భయపడిన మా అమ్మ జొనాథన్కు వెంటనే స్నానం చేయించింది. ఆ సమయంలోనే ఆ బాబు చనిపోయాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. బాబు తల వెంట్రుకలు, చేతి గోళ్లు కత్తిరించి, డెడ్ బాడీని దుప్పట్లో చుట్టి.. అడవిలోని నక్కలు తిరిగే ప్రాంతంలో పడేసేందుకు ప్లాన్ చేసింది. అందుకు నా సాయం కోరింది.. నేను సాయం చేశాను’ అంటూ జరిగిందంతా కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. ఆమె చెప్పిన చాలా అంశాలు... ఫోరెన్సిక్ పరిశోధనతో సరిపోలాయి. బాబు చనిపోవడానికి రెండు మూడు గంటల ముందు ఏదో తిన్నాడని, పొట్టలో బీన్స్ పదార్థాలు ఉన్నాయని, అలాగే బాడీ తడిసినందు వల్లే, కాళ్లు, చేతులు.. ముడతలు పడ్డాయని రిపోర్టులు తేల్చాయి. మార్తా చెప్పినట్లే జుట్టు, గోళ్లు కతిరించిన సంగతీ తెలిసిందే. అయితే ఇదంతా చెప్పిన మార్తా మానసిక సమస్యతో సతమతమవుతోంది. అలాంటి వాళ్లు చెప్పేది కోర్టులో సాక్ష్యంగా నిలబడదు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. మార్తా ఇంటి చుట్టుపక్కల వాళ్లని ఆరా తీశారు. అయితే వాళ్లంతా.. ‘మేము ఎప్పుడూ మార్తా ఇంట్లో ఆ బాబుని చూడలేదు. అయినా పిచ్చిదాని మాటలు పట్టుకుని మీరెలా ఎంక్వైరీ చేస్తారు?’ అంటూ తిరిగి ప్రశ్నించారు. దాంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మొత్తానికీ ఈ కేసు 270 మంది పోలీసుల చేతులు మారింది. ఇప్పటికీ ఆ కేసు యాక్టివ్లోనే ఉంది. మరో ఆసక్తికరమైన వాదన ఏంటంటే.. బాబుని ఎవరో అమ్మాయిలా పెంచాలి అనుకున్నారు. అందుకే జుట్టును బాగా పెంచారు. చనిపోయాక కట్ చేసేశారు. బాబు కనుబొమ్మలు అంత స్టైలిష్గా ఉండటానికి కారణం అదే అంటూ 2008లో పొడవైన జుట్టుతో స్కెచ్ గియ్యగా.. అచ్చం ఆడపిల్లలాగే ఉన్నాడు ఆ బాబు. ఇది పోలీసులనే కాదు ఈ కేసుపై దృష్టిసారించిన అందరినీ ఆశ్చర్యపరచింది. 1957లో పోస్ట్మార్టం తర్వాత పొట్టర్స్ ఫీల్డ్లో ఆ చిన్నారి శవాన్ని పూడ్చిపెట్టారు. 1998లో ఓసారి బయటికి తీసి.. అస్థిపంజరం, దంతాల నుంచి డీఎన్ఏ సేకరించారు. తిరిగి ఫిలడెల్ఫియా... సెడార్బ్రూక్లోని ఐవీ హిల్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఆ సమాధిపై ఓ భారీ హెడ్ స్టోన్ ఏర్పాటు చేసిన పోలీసులు... ‘అమెరికన్ అన్నోన్ బాయ్’ అని రాసి ఉంచారు. 2018 ఆగస్ట్లో వంశవృక్ష నిపుణురాలు బార్బరా రే–వెంటర్, బాలుడిని గుర్తించడానికి డీఎన్ఏ ప్రొఫైలింగ్ని ఉపయోగిస్తామని చెప్పారు. కానీ నేటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. దాంతో ఆ బాబు ఎవరు? మార్తా చెప్పిన దానిలో వాస్తవమెంత? జొనాథన్ అనేది నిజంగానే ఆ బాబు పేరా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -సంహిత నిమ్మన -
తన హత్య కేసును తనే రీ ఓపెన్ చేయించుకున్న ఆత్మ?! ఆ తర్వాత
‘మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?’ సమాధానం దొరకని ప్రశ్న! అయితే ‘ఆత్మ అమరం’ అని నమ్మేవారు అశరీరవాణికి పెద్దపీట వేస్తారు. దెయ్యాలు, పిశాచాలు, సైతాన్లు.. ఇలా కంటికి కనిపించని అతీంద్రియ శక్తులను బలంగా నమ్ముతారు. అలాంటివారి నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ గ్రీన్ బ్రియర్ ఘోస్ట్ మిస్టరీ. ఓ ఆత్మ తన కథను తనే తిరగరాసుకుంది. తన మర్డర్ కేసుని తనే రీ–ఓపెన్ చేయించుకుని.. తనని చంపినవాడికి శిక్షపడేలా చేసింది. నమ్మబుద్ధి కావట్లేదు కదూ! కానీ 18వ శతాబ్దం చివర్లో అమెరికాని వణికించిన ఉదంతం ఇది. 1897.. జనవరి 23.. మిట్ట మధ్యాహ్నం.. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఓ బాలుడు.. గావుకేకలు పెడుతూ తన తల్లి దగ్గరకు పరుగుతీశాడు. ‘ఎల్వా ఆంటీ.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉందమ్మా’ అని చెప్పాడు రొప్పుతూ. ‘ఏమైందీ’ అంటూ కంగారు పడింది ఆ బాలుడి తల్లి. ‘ఎల్వా ఆంటి భర్త ఎడ్వర్డ్ అంకుల్ లేడూ.. తను మార్కెట్కు పోతూ పోతూ.. ఎల్వా ఆంటీకి ఏమైనా కావాలేమో కనుక్కుని రా అంటూ నన్ను వాళ్ల ఇంటికి పంపించాడు. నేను వెళ్లేసరికి ఆమె మాట లేకుండా పడి ఉందమ్మా..’ అంటూ వణుకుతూ వివరించాడు తనకు తెలిసిందీ.. తను చూసిందీ! అది విన్న వెంటనే కొడుకును తీసుకుని డాక్టర్ నాప్ దగ్గరకు పరుగుపెట్టింది ఆ బాలుడి తల్లి. 1896 అక్టోబర్లో ఎల్వా జోనా హిస్టర్కీ, ఎరాస్మన్ (ఎడ్వర్డ్) షూతో పెళ్లైంది. ఎడ్వర్డ్ స్థానికంగా కమ్మరి పనిచేసేవాడు. ఇంటికి వెళ్లిన పిల్లాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఎడ్వర్డ్.. కంగారుగా ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి చేరేలోపే అక్కడ డాక్టర్తో పాటు చుట్టుపక్కలవాళ్లు గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో అచేతనంగా పడున్న ఎల్వాని చూసి.. నిశ్చేష్టుడైపోయాడు ఎడ్వర్డ్. ఓ పక్క డాక్టర్ ఆమెని చెక్ చేస్తున్నాసరే.. భార్య ముఖాన్ని పట్టుకుని వదిలిపెట్టలేదు ఎడ్వర్డ్. ఏడుస్తూనే ఉన్నాడు. భార్యకు ఎంతో ఇష్టమైన స్కార్ఫ్ అంటూ ఓ స్కార్ఫ్ తెచ్చి ఎల్వా మెడకు చుట్టాడు. నా భార్య విశ్రాంతి తీసుకుంటుందని తల కింద దిళ్లు పెట్టి జోకొట్టాడు. అతని స్థితి చూసిన వాళ్లంతా ‘అయ్యో పాపం’ అంటూ కంటతడిపెట్టారు. ఎల్వా తల దగ్గర భర్త ఎడ్వర్డ్ పడి ఏడుస్తుంటే, డాక్టర్ నాప్.. ఎల్వాను చెక్ చేసి.. ఆమె ప్రాణాలతో లేదని నిర్ధారించాడు. పైగా ఎల్వా గత కొన్ని రోజులుగా తన దగ్గర గైనిక్ సమస్యకు చికిత్స తీసుకుంటుండడంతో .. ఆ సమస్యే తీవ్రమై ఆమె చనిపోయుంటుందని భావించాడతను. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎల్వా తల్లి మేరీ జేన్ హిస్టర్ కూడా అక్కడికి చేరుకుని, కూతురి శవాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. రావాల్సిన వాళ్లు, చూడాల్సిన వాళ్లు ఎవ్వరూ లేరని తేలిన తర్వాత.. మరునాడు జనవరి 24న ఎల్వా మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. అప్పుడే మొదలైంది అసలు కథ.. నెల రోజులు గడవక ముందే ఎల్వా తల్లి మేరీకి వరుసగా నాలుగు రోజుల పాటు ఎల్వా కలలోకి వచ్చింది. తనది సహజమరణం కాదని.. తన భర్త ఎడ్వర్డే తనని బలవంతంగా చంపేశాడంటూ మొరపెట్టుకుంది. మేరీ ఆశ్చర్యపోయింది. ‘సాక్ష్యం లేనిదే కోర్టులో ఎలా నిరూపించగలను?’ అనుకుంటూనే స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ ఆల్ఫ్రెడ్ని కలిసింది. తన కూతురు కలలోకి వచ్చిందని, కేసును రీ–ఓపెన్ చెయ్యాలని ప్రాధేయపడింది. ఆమె వాదనని మొదట్లో కొట్టిపారేసిన జాన్ .. అనుమానం వచ్చి ఎడ్వర్డ్ ఎలాంటివాడని స్థానికంగా ఆరా తీశాడు. ఎల్వాను నిరంతరం ఎడ్వర్డ్ కొట్టేవాడని, అతడే చంపేసుంటాడనే అనుమానాలు వెలువడ్డాయి. వెంటనే డాక్టర్ నాప్ని ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ జాన్ . ‘ఎడ్వర్డ్ ఏడుస్తూ ఉండటంతో.. ఎల్వా డెడ్ బాడీని సరిగా పరీక్షించలేకపోయాను’ అని నాప్ తెలిపాడు. దాంతో.. కేసు రీ–ఓపెన్ అయ్యింది. 1897 ఫిబ్రవరి 22న ఎల్వా బాడీని సమాధి నుంచి బయటికి తీసి.. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. 1897 మార్చి 9కి రిపోర్టుల్లో ఎల్వాది హత్యేనని తేలింది. మెడ విరిచి చంపినట్లు ఎడ్వర్డ్ వేలిముద్రలు కూడా దొరికాయి. విరిగిన మెడ వాలిపోకుండా ఉండటానికే ఆ రోజు శవం మెడకు స్కార్ఫ్ చుట్టాడని, తల కింద దిండ్లు పెట్టాడని అందరికీ అర్థమైంది. దాంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో ఎడ్వర్డ్ గురించి మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఎడ్వర్డ్కి ఎల్వా మొదటి భార్య కాదని.. మూడో భార్యని తెలిసింది. మొదటి భార్య.. ‘ఇలాంటి క్రూరుడితో బతకడం నా వల్ల కాదు’ అని విడాకులు ఇచ్చి వెళ్లిపోగా.. రెండో భార్య అనుమానాస్పద రీతిలో చనిపోయింది. అంటే ఆమెని కూడా ఎడ్వర్డే చంపి ఉంటాడనే ఆరోపణలు బలపడ్డాయి. పైగా ఎడ్వర్డ్.. ఏడు పెళ్లిళ్లు చేసుకోవాలనేది తన కోరికని, అందుకే ఎల్వాను చంపానని, సరైన ఆధారాలు లేవు కాబట్టి.. త్వరలోనే విడుదల అవుతానని తోటి ఖైదీలతో గర్వంగా చెప్పుకునేవాడట. 1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎల్వా ఆత్మకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు.. ‘కోర్టు ముందు ఆత్మల ప్రస్తావన వద్దని.. రిపోర్టులు, ఆధారాలతోనే ముందుకు వెళ్దామని’ జడ్జ్ అడ్డుపడటంతో కేసులో ఆత్మ ప్రస్తావన లేకుండాపోయింది. మొత్తానికీ ఎల్వాని ఉద్దేశపూర్వకంగానే ఎడ్వర్డ్ హత్య చేసినట్లు జూలై 11న తీర్పు రావడంతో ఎడ్వర్డ్కి జీవిత ఖైదు పడింది. ఓ అమాయకురాల్ని పొట్టనపెట్టుకున్నాడని, అతడ్ని తామే చంపుతామని చాలామంది ఎల్వా సానుభూతిపరులు.. జైలుపై దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎడ్వర్డ్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత మూడేళ్లకే అంటే 1900 మార్చి 13న వెస్ట్ వర్జీనియా, మౌండ్స్ విల్లేలోని స్టేట్ పెనిటెన్షియరీలో ఎడ్వర్డ్ చనిపోయాడు. అయితే అది సహజ మరణం కాదు. తెలియని ఏదో వ్యాధి సోకి, చిత్రవధ అనుభవిస్తూ చనిపోయాడు. ఎల్వా ఆత్మే అతడిని చంపిందని అంతా అనుకున్నారు. ఆ వ్యాధి ఎవరికీ సోకే ప్రమాదం లేకుండా.. స్థానిక శ్మశాన వాటికలో అతనిని ఖననం చేశారు. ఎల్వా సమాధి దగ్గర.. వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ చారిత్రక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఇలా ఉంటుంది.. ‘ఎల్వా ఆత్మ.. తన తల్లి కలలోకి వచ్చి.. తనది సహజ మరణం కాదని చెప్పింది. ఆమె భర్తే ఆమెని హత్య చేసినట్లు తేలింది. ఒక ఆత్మ సాయంతో ఓ హత్య కేసు పరిష్కరించడం ఇదే మొదటిసారి’ అని. మొత్తానికీ ఈ కథ చరిత్రలో ఓ ఊహించని మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
Russia Ghost Ship: నిజమే.. ఇది ఓడ కాదు ప్రాణాలు తీసే దెయ్యం! భయంలేని కెప్టెన్ కూడా..
అది సముద్రంపై సాగే సుదూరప్రయాణం. అలల ఉధృతిలో మొదలైన అంతుపట్టని రహస్యం. వింత ఆకారాలు, పిచ్చి చేష్టలతో అనుక్షణం భయానకం. రోజుకో ఆత్మహత్యతో మోగిన మరణమృదంగం.. ఇదే ‘ఇవాన్ వాసిలీ షిప్’ వణుకుపుట్టించే చరిత్ర. ఇది ఓడ కాదు ప్రాణాలు తీసే దెయ్యం. నిజమే, హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఘోస్ట్ షిప్ గురించి చరిత్ర కథలు కథలుగా చెబుతోంది. అందంగా, ఆకర్షణీయంగా 1897లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో.. తయారుచేసిన ఇవాన్ వాసిలీ అనే నౌక.. చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. ఇది బాల్టిక్ సముద్రం నుంచి ఫిన్లాండ్ గల్ఫ్ వరకూ సరుకులను మోసుకెళ్లేది. గంటకు 8 నాటికల్ మైళ్ల వేగంతో నడిచే ఈ నౌక.. బొగ్గు సాయంతో 4వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించేది. జోరుగా కదిలే సముద్ర కెరటాల ధాటికి తట్టుకుని ఆరేళ్ల పాటు సరుకులు రవాణా చేస్తూ ఏ సమస్య లేకుండా నడిచింది. 1903లో రష్యా–జపాన్ యుద్ధం మొదలైంది. దాంతో అత్యవసర పరిస్థితుల్లో రాత్రికి రాత్రి.. వాసిలీలో సాధారణ సరుకుల్ని తొలగించి.. యుద్ధ సామగ్రిని నింపారు అధికారులు. వ్లాదివోస్తోక్లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామగ్రిని అందించేందుకు వాసిలీని రంగంలోకి దింపారు. నాటి నుంచే మొదలైంది అసలైన సమస్య. రాత్రివేళల్లో ఓడలోని సిబ్బందిని ఏవేవో పీడకలలు భయపెట్టేవి. నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని యుద్ధ ఆదేశాల ప్రకారం వాసిలీ.. నార్త్ సీ నుంచి అట్లాంటిక్కు, ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్కు.. అటు నుంచి కేప్టౌన్కు.. అక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలో ఉన్న జాంజిబార్కు వెళ్లింది. అప్పటికి నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని గమనించిన సిబ్బంది వెంటనే బొగ్గు నింపారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం వైపు కదిలింది నౌక. అయితే ఉన్నట్టుండి అందులో ప్రయాణిస్తున్న వారికి ఓ అనుమానం వచ్చింది. ఆ నౌక బొగ్గుతో కాకుండా ఏదో అసాధారణ శక్తితో నడుస్తోందని. ఆ అనుమానం వాళ్లను కుదురుగా ఉండనివ్వలేదు. వారికి వింత అనుభవాలు చీకటిపడితే చాలు.. నౌకలోని వారంతా ఎవరో తమని గమనిస్తున్నట్లు భయపడేవారు. కళ్లకు కనిపించని శక్తి ఏదో వేగంగా తమ దగ్గరకు వచ్చినట్లు.. ఆ సమయంలో మంచు కొండ పక్కనే ఉన్నట్లుగా చలిపెడుతున్నట్లు ఫీలయ్యేవారు. ఇలా కొన్ని రోజులు నౌకలోని వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు నౌక డెక్ దగ్గర్లో ఉన్న వారికి ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడటానికి మనిషిలాగే ఉంది కానీ ధగధగా మెరిసిపోతుంది. క్షణాల్లో అది డెక్ అంతటా తిరిగి లైఫ్ బోట్ వెనక్కి వెళ్లి కనిపించకుండా మాయమైపోయింది. దాంతో వారి భయం రెట్టింపు అయ్యింది. ఇంతలో నౌక చైనాలోని పోర్ట్ అర్థర్ మిలిటరీ బేస్ చేరింది. అక్కడ నౌకలో సామాగ్రి ఎక్కించుకుని, ప్రయాణం కొనసాగించారు. నాటి నుంచే మొదలైంది మరణమృదంగం. ఆ రాత్రి ఓడలోని వాళ్లంతా ఉన్నట్టుండి, పిచ్చి పట్టినట్లు ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక.. వాళ్లలో ఒకడైన అలెక్ గోవిన్స్కీ అనే వ్యక్తి.. తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. నౌకను వదిలి పరుగుతీశారు అది చూసిన మిగిలినవారంతా కళ్లు తిరిగి పడిపోయారు. లేచి చూసేసరికి వ్లాదివోస్తోక్ వైపు ప్రశాంతంగా ప్రయణిస్తోంది ఆ నౌక. రెండురోజుల తర్వాత వారంతా మళ్లీ అరవడం, కొట్టుకోవడం, వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కాసేపటికి అంతా కళ్లు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచి చూస్తే వారిలో మరో వ్యక్తి మిస్సయ్యాడు. అదే రోజు నౌక వ్లాదివోస్తోక్ చేరింది. అప్పటి దాకా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న నౌకలోని సిబ్బంది నౌకను వదిలి పరుగుతీశారు. కానీ ఆ పోర్టులో సెక్యూరిటీ రూల్స్ పేరుతో వాళ్లను బయటికి పోనీలేదు. వణుకుతున్న ప్రతి వ్యక్తికి స్వాగతం పలికింది వాసిలీ. అందరినీ తీసుకుని హాంకాంగ్ వైపు కదిలింది. ఆ రాత్రి మళ్లీ పీడకలలు మొదలయ్యాయి. అరవడం, కొట్టుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం.. ఒకరు మిస్ అవ్వడం.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఏం జరుగుతుందోనన్న భయంతో ఒక సిబ్బంది గుండె ఆగిపోయింది. నౌక హాంకాంగ్ చేరుకునే సరికి కెప్టెన్ స్వెన్ ఆండ్రిస్ట్ సముద్రంలో దూకి చనిపోయాడు. చివరికి ఓ రాత్రి హాన్సెన్ కూడా దాంతో దెయ్యాలంటే భయం లేని క్రైస్ట్ హాన్సెన్ అనే సెకండ్ ఆఫీసర్ని కెప్టెన్గా నియమించారు పైఅధికారులు. పారిపోయిన వారిని పారిపోనిచ్చి.. కొత్త సిబ్బందితో కెప్టెన్ హాన్సెన్ ప్రయాణం సాగించారు. చివరికి ఓ రాత్రి హాన్సెన్ తన రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. నౌక సిడ్నీ చేరగానే కొత్త సిబ్బంది కూడా పారిపోయారు. ఆ బోట్లో మొదటి నుంచి ఉన్న మరో ధైర్యవంతుడు బోట్స్ వాయన్ హారీ నెల్సన్ మాత్రం పారిపోలేదు. మరో కెప్టెన్ను వెతికే పనిలో పడ్డాడు. కెప్టెన్ దొరక్క 4 నెలల వరకూ నౌక సిడ్నీలోనే ఉండిపోయింది. నాలుగు నెలలకి కొత్త కెప్టెన్ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరింది. మళ్లీ మరణమృదంగం మోగింది. ఇదేదో తేడాగా ఉందనుకున్న నెల్సన్.. నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాదివోస్తోక్కి నౌకను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నౌక ఆ నగరాన్ని చేరగానే నెల్సన్ సహా అంతా ఆ నౌక నుంచి బయటపడ్డారు. మళ్లీ దాన్లోకి ఎవ్వరూ ఎక్కలేదు. కొన్నినెలల పాటు అది అక్కడే ఉండిపోయింది. ఆ నౌక అలా ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరమని భావించిన కొందరు ఔత్సాహికులు 1907లో దానికి నిప్పు అంటించారు. కాలి బూడిదై సముద్రంలో మునిగిపోయింది. అయితే మునిగే సమయంలో ఓ భయంకరమైన ఏడుపును విన్నామని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగింది? నిజంగానే ఇదంతా జరిగిందా? అనేదానికి పూర్తి ఆధారాలు లేవు. ఆ మిస్టరీ ఏంటో నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన -
అతడే హంతకుడని ఎలా కనిపెట్టారు?
అప్పారావు, ఆమని అనే నూతన దంపతులు హానిమూన్కు వెళ్లారు. రెండురోజులు తరువాత అప్పారావు అందరికీ ఫోన్ చేసి తన భార్య బోట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు చెప్పి రోదించాడు. అప్పారావు సొంత గ్రామానికి వచ్చిన తరువాత చుట్టాలు, పక్కాలు పరామర్శించారు. అప్పారావు మీద అనుమానంతో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావే భార్యను హత్య చేసిన హంతకుడని పోలీసులు తేల్చారు. ఎలా? (క్లిక్: ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి చూద్దాం!) జవాబు: అప్పారావు తన భార్య కోసం కేవలం వన్–వే టికెట్ మాత్రమే బుక్ చేశాడు. -
Brain Gym: మీరే డిటెక్టివ్ అయితే.. ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి!
ఒక క్రిమినల్ ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేశాడు. వారి ముందు మూడు వాటర్ గ్లాస్లు పెట్టాడు. ఒక్కొక్కరికి రెండు పిల్స్ ఇచ్చాడు. ‘మీకు ఇచ్చిన పిల్స్లో ఒకటి విషం ఉన్నది. రెండోది విషం లేనిది. అందులో ఒకటి నోట్లో వేసుకొని గ్లాస్లో నీళ్లు తాగండి. మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి’ అని హుకుం జారీ చేశాడు. మొదటి వ్యక్తి రెండిట్లో ఒకటి వేసుకొని, గ్లాస్లో నీళ్లు తాగాడు. చనిపోయాడు. రెండో వ్యక్తి రెండిట్లో ఒకటి నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. చనిపోయాడు. మూడో వ్యక్తి బా...గా ఆలోచించి ఒకటి సెలెక్ట్ చేసుకొని, నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. అతడు కూడా చనిపోయాడు. రెండు పిల్స్లో ఒకటి మాత్రమే విషపూరితమైనప్పుడు ఒక్కరికైనా బతికే అదృష్టం ఎందుకు లేకుండా పోయింది? అసలు విషయం: నిజానికి అందులో ఒకటి కూడా పాయిజన్ పిల్ లేదు. వారికి ఇచ్చిన వాటర్గ్లాస్లలోనే పాయిజన్ ఉంది! చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
Mystery: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? లేదంటే..
ఆసక్తిని రేపే వింతలు.. అనుకోకుండా తారసపడినప్పుడు.. శోధించాలనే జిజ్ఞాస మనిషిని నిమిషం కూడా కుదురుగా నిలువనివ్వదు. కునుకు పట్టనివ్వదు. ఈ కథలో జరిగిందీ అదే. ఓ పక్క నిజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా నిరూపించలేని నిస్సహాయత వెక్కిరిస్తుంటే.. మరోపక్క విశ్లేషించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా అవాంతరాలు అడుగడుగునా హెచ్చరిస్తుంటే సాహసంతో ముందుకు నడిచాడు ఓ జర్నలిస్ట్. అది 1987.. అమెరికాలోని వర్జీనియాలో వైథెవిల్ అనే ప్రాంతవాసులు రాత్రి అయితే చాలు భయంతో గజగజా వణికేవారు. ఆ భయానికి కారణం ఆకాశంలో ఎగిరే ఓ వింత ఆకారం (ఎగిరే పళ్లెం, ‘యూఎఫ్ఓ–అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్’). ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అదే కలకలం. ఆనోటా ఈనోటా ఆ వింత.. ‘వేవ్ రేడియో’ రిపోర్టర్ డ్యానీ చెవినా పడింది. అక్టోబర్ 7న అదే విషయాన్ని పెద్ద జోక్గా శ్రోతలతో షేర్ చేసుకున్నాడు డ్యానీ. విన్నవారు మాత్రం జోక్గా తీసుకోలేదు. నిజమేనంటూ సీరియస్ అయ్యారు. ఆ వింతను మేమూ చూశామనే ఫోన్కాల్స్ పెరిగాయి. రోజులు గడుస్తున్నాయి. అక్టోబర్ 17న నైట్ డ్యూటీలో ఉన్న డ్యానీకి.. వైథెవిల్ చుట్టుపక్కల ప్రజల నుంచి ఫోన్కాల్స్ పోటెత్తాయి. ‘ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. శబ్దం రావట్లేదు కానీ మెరుస్తోంది. చూడటానికి చాలా పెద్దగా ఉంది. దానికి రంగురంగుల లైట్స్ ఉన్నాయి.. మాకు భయంగా ఉంది’ అని చెప్పారు ఫోన్ చేసినవాళ్లంతా. దాంతో డ్యానీ.. ‘అమెరికా ప్రయోగాత్మకంగా యుద్ధ విమానాలను పరీక్షిస్తుండొచ్చు, కంగారు పడాల్సిన పనిలేదు’ అంటూ ధైర్యం చెప్పుకొచ్చాడు. అయితే డ్యానీ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. పెంటగాన్ అధికారుల దగ్గర ఆరా తీశాడు. వాళ్లేమో ‘ప్రభుత్వం ఎలాంటి ప్రయోగాలు చెయ్యడం లేదని.. జనావాసం మధ్యలో అలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తామ’ని ఎదురు ప్రశ్నించారు. దాంతో డ్యానీకి యూఎఫ్ఓల రాక నిజమేనన్న అనుమానం మొదలైంది. నాలుగు రోజుల తర్వాత డ్యానీ తన స్నేహితుడు రోజర్ హాల్తో కలసి కారులో.. వైథెవిల్కి దక్షిణ దిశగా బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్లాక ఎంతసేపు ఎదురు చూసినా ఎలాంటి అలజడి లేదు. ప్రజలు అనవసరంగా భయపడుతున్నారని తీర్మానించుకుని వెనుదిరిగారు ఇద్దరూ. కారు స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్లేసరికి.. కారు అద్దంలోంచి మెరుపులు విరజిమ్మడం చూసి ఆశ్చర్యపోయారు. కారు దిగి, ఆ వింతని కళ్లారా చూశారు. విశాలమైన ఆకాశంలో ఓ పెద్ద క్రాఫ్ట్ గిర్రున తిరుగుతూ.. మరో గుండ్రటి ప్లేట్ని తనలో కలుపుకుని ఒక్కసారిగా అంతర్ధానమైపోయింది. ఆ షాక్లో ఇద్దరూ ఫొటోలు తియ్యలేకపోయారు. అందుకే మరునాడు రాత్రి అదే సమయానికి అదే చోటికి వెళ్లి.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఆధారాలు ఉన్నాయనే నమ్మకంతో యూఎఫ్ఓ ఫొటోలు తీశామని తెలుపుతూ.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రకటించాడు డ్యానీ. అయితే అదే రోజు రాత్రి డ్యానీకి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాదాపుగా బెదిరింపు కాల్స్ లాంటివి. ముందు కాల్ చేసిన వ్యక్తి.. ‘అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ(సీఐఏ)కీ, అమెరికా ప్రభుత్వానికి యూఎఫ్ఓపై చాలా ఆసక్తి ఉంది’ అని చెప్పగా.. తర్వాత కాల్ చేసిన వ్యక్తి.. ‘యూఎఫ్ఓలపై ప్రయోగాలొద్దు. అదంతా ప్రభుత్వ వ్యవహారం. ఈ విషయంలో గోప్యత చాలా అవసరం. అదే అందరికీ మంచిది’ అంటూ హెచ్చరించాడు. దాంతో మరునాడు(అక్టోబర్ 23న) ప్రెస్ కాన్ఫరెన్స్లో నోరు విప్పలేకపోయాడు డ్యానీ. ‘పూర్తి సమాచారం రాగానే యూఎఫ్ఓపై మాట్లాడతాను’ అంటూ కాన్ఫరెన్స్ని ముగించాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ యూఎఫ్ఓ ఫొటోలు మాత్రం కనిపించలేదు. డ్యానీకి అర్థమైంది.. ఇదంతా రాత్రి కాల్ చేసినవాళ్ల పనేనని. డిసెంబర్ చివరి నాటికి యూఎఫ్ఓ చూసిన సాక్ష్యుల సంఖ్య పెరగసాగింది. దాంతో ఈ విషయంపై మాట్లాడటానికి.. డ్యానీ పెంటగాన్లోని రక్షణశాఖ అధికారులని కలిశాడు. ‘యూఎఫ్ఓలు ఉన్నట్లు ప్రభుత్వం నమ్ముతోంది. కానీ ప్రజలకు ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వాభిప్రాయం’ అని చెప్పారు. దాంతో డ్యానీ సమాధానపడలేదు. యూఎఫ్ఓలపై దూకుడు పెంచాడు. మరో రెండు నెలలు దాటింది. 1988 మార్చి 19న వర్జీనియా బీచ్లో బ్రాడ్కాస్టర్స్ కాన్ఫరెన్స్ కోసం వెళ్లాడు డ్యానీ. ‘డ్యానీని పిలుస్తారా?’ అంటూ అక్కడికో ఫోన్ వచ్చింది. కాసేపటికి రిసీవర్ అందుకున్న డ్యానీ.. ‘ఐయామ్ డ్యానీ.. హూ ఈజ్ దిస్’ అనగానే ఓ వృద్ధ స్వరం గంభీరంగా పలికింది. ‘నేను రిటైర్డ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని. కావాలంటే నా మాటలను రికార్డ్ చేసుకో. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నట్లు నిరూపించేందుకు ఈ వాయిస్ టేప్ నీకు ఉపయోగపడుతుంది. నీలాగే యూఎఫ్ఓలపై పరిశోధనలు చేసిన నా కొడుకు ల్యుకీమియాతో చనిపోయాడు. నీకు అదే గతిపడుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి నీలాంటి వాళ్ల ధోరణి నచ్చదు. నా మాట విని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్. విడిచిపెట్టకపోతే నీపైన, నీ కుటుంబం పైనా రసాయన ప్రయోగాలు జరిగే ప్రమాద ముంది’ అని హెచ్చరించాడు ఆ పెద్దాయన. ‘డోంట్ లుక్ అప్’ పుస్తకం విడుదల ‘రోనోకే టైమ్స్’ బ్యూరో రిపోర్టర్ పాల్ డెల్లింగర్ 1866 నుంచి వైథెవిల్లోనే నివాసముండేవాడు. 1988లో అతడు కూడా డ్యానీలానే యూఎఫ్ఓని ప్రత్యక్షంగా చూసి పలు కథనాలు రాశాడు. ఆ వింతను ప్రత్యక్షంగా చూసినవారినెందరినో ఇంటర్వ్యూలూ చేశాడు. ఈ క్రమంలోనే డ్యానీతో జతకట్టాడు. రోనోకే టైమ్స్, వేవ్ రేడియో ఒకే బిల్డింగ్లో ఉండటంతో డ్యానీకి, పాల్కి స్నేహం కుదిరింది. దాంతో ఇద్దరూ కలసి యూఎఫ్ఓకి సంబంధించిన వాస్తవ సంఘటనలతో ‘డోంట్ లుక్ అప్’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు. 208 పేజీలతో నిండిన ఈ పుస్తకంలో కేవలం వైథెవిల్ యూఎఫ్ఓ సంఘటనలే కాకుండా కామన్వెల్త్ అంతటా ఉన్న రహస్యాల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకం వేల కాపీల్లో అమ్ముడుపోయినప్పటికీ ఆ మిస్టరీలు నాటికీ, నేటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తూ.. యూఎఫ్ఓ స్ట్రెస్కు లోనయ్యాడు డ్యానీ. అతడి పరిస్థితి చూసి, కుటుంబ సభ్యులు.. ఇదంతా వదిలిపెట్టేయమంటూ ఒత్తిడి తెచ్చారు. 1990 డిసెంబర్ తర్వాత డ్యానీకి యూఎఫ్ఓలు కనిపించలేదు. 1992లో ‘అన్ సాల్వ్డ్ మిస్టరీస్’ అనే పలు సిరీస్లు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే పుస్తకంలో చెప్పినట్లు ‘నేను పైకి చూడను.. నేను దేనికోసం వెతకను.. కానీ నిజంగా ఆ రోజు నేను ఈ బుక్ రాయకుండా ఉండి ఉంటే ప్రపంచానికి తెలిసేదే కాదు. కథ అనేది ఎప్పటికీ నిలిచిపోతుందని నేను నమ్ముతాను’ అంటారు డ్యానీ. 2022 జనవరిలో డ్యానీ మరో పోరాటం మొదలుపెట్టాడు. నెట్ఫ్లిక్స్లో 2021లో విడుదలైన ‘డోంట్ లుక్ అప్’ సినిమా టైటిల్ను తమ బుక్ నుంచే తీసుకున్నారని.. కేవలం ఆశ్చర్యార్థకాన్ని తొలగించి.. ఆ పేరును యథాతథంగా వాడుకున్నారని, దానికి తన అనుమతి తీసుకోలేదంటూ బాధ్యుల మీద దావా వేశాడు డ్యానీ. అదలా ఉండగా ఆనాటి యూఎఫ్ఓలు ప్రభుత్వం పనా? లేక ఏలియన్స్ పనా? మరి డ్యానీని హెచ్చరించింది ఎవరు? ఇలా పలు ప్రశ్నలతోనే మిస్టరీగా చరిత్రలో చేరింది ఈ కథ. -సంహిత నిమ్మన చదవండి: టేస్టీ ఐలాండ్.. అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు! -
ఏ కష్టం వచ్చిందోగానీ.. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
సాక్షి, తుమకూరు (కర్ణాటక): ఏ కష్టం వచ్చిందోగానీ పసిగుడ్డును వదిలేసి పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. చిక్కనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ శశిధర్, భార్య లావణ్య (32)తో కలిసి క్వార్టర్స్లో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా, వీరికి ఆరునెలల మగ బిడ్డ ఉన్నాడు. ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే. ఆదివారం ఉదయం శశిధర్ డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంట్లో లావణ్య ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శశిధర్ ఉరికి వేలాడుతున్న భార్యను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె కన్నుమూసింది. వేధింపులతో యువకుడు ఆత్మహత్య మైసూరు: టి.నరసిపుర తాలూకా వ్యాసరాజపుర గ్రామానికి చెందిన రామనాయక కుమారుడు మను (19) అనే యువకుడు యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో యువతి బంధువులు సిద్దరాజు, ప్రతాప్, శాంతరాజు, భాగ్యమ్మ అనేక సార్లు పిలిచి మనును తిట్టడంతో అతడు ఆవేదన చెందాడు. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మను తల్లి బన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. -
‘లైట్హౌస్ కీపర్స్’ స్టోరీ.. ఇది ఇప్పటికీ ఆసక్తికరమే
Flannan Isles Lighthouse Keepers Mystery Real Story: కొన్ని రక్కసి క్షణాలు.. కొందరి జీవితాలను ఇట్టే తలకిందులు చేస్తాయి. నామరూపాలు లేకుండా తలరాతలను మార్చేస్తాయి. ఆనవాళ్లను సైతం మాయం చేస్తాయి. చరిత్ర జాడల్లో మిస్టరీలుగా మిగుల్చుతాయి. అలాంటిదే ఈ ‘లైట్హౌస్ కీపర్స్’ స్టోరీ.ఊహకు అందని ప్రతీది అతీంద్రియ శక్తుల చర్యే అంటారు చాలా మంది. ఊహించగలిగినంత మేర ఇదే నిజమని వాదిస్తుంటారు ఇంకొంతమంది. ఈ కథలో ఇలాంటివారి అభిప్రాయలు ఎన్నో ఉన్నాయి కానీ.. నిర్ధారించే ఆధారాలే లేవు. అందుకే నేటికీ ఇది అత్యంత ఆసక్తికరమైన కథనమైంది. స్కాట్లాండ్కి పడమర తీరాల్లో.. మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని భయంకరమైన దీవులున్నాయి. వాటిని ఫ్లానెన్ఐజిల్స్ అంటారు. 18వ శతాబ్దంలో స్కాట్లాండ్కి సుమారు 379 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుటర్ హెబ్రిడ్స్లోని ఏడు ద్వీపాల(సెవెన్ హంటర్స్)లో గడ్డి అధికంగా మొలిచేది. ఆ గడ్డిలో ఏదో మ్యాజిక్ ఉందని, దాన్ని గొర్రెలు తింటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాయని.. కవల గొర్రె పిల్లలు పుడతాయని స్థానికులు నమ్మేవారు. అందుకే అక్కడి గొర్రెల కాపర్లు.. ఆ ప్రాంతం ప్రమాదకరమని తెలిసినా.. తమ గొర్రెలను పడవల్లో ఆ దీవులకు తీసుకెళ్లి.. రోజంతా మేయించి, సాయంత్రానికల్లా తిరుగుప్రయాణం అయ్యేవారు. ఏ కారణం చేతైనా రాత్రి అక్కడే ఉండాల్సి వస్తే మాత్రం.. వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలే ఎదురయ్యేవని, ఎవరో తరుముతున్నట్లు, ఎవరో గమనిస్తున్నట్లు ఉంటోందనేది అప్పటి అనుభవజ్ఞుల మాట. 1896లో సెవెన్ హంటర్స్లో ఒకటైన ఐలియన్ మోర్లో అత్యవసరంగా.. ఎందరు వద్దని వాదించినా వినకుండా 300 మీటర్లు ఎత్తు గల లైట్హౌస్ నిర్మాణం మొదలుపెట్టారు. 1899లో దీని నిర్మాణం పూర్తయి.. ఆ ఏడాది డిసెంబర్ కల్లా తొలిసారి వెలిగింది. ఈ లైట్ హౌస్కి కాపలాగా నలుగురు కీపర్స్ని నియమించారు. ఎల్లప్పుడూ అక్కడ ముగ్గురు కీపర్స్ ఉండేలా.. వారిలో ప్రతి ఒక్కరికీ 6 వారాలు వర్కింగ్ డేస్, 2 వారాలు సెలవులు ఉండేలా డ్యూటీ చార్ట్ సిద్ధమైంది. వండుకునేందుకు వంటగది, రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. ఏ అవాంతరాలు లేకుండా ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాదికి.. 1900 డిసెంబర్లో.. హెస్పెరస్ అనే బోట్ ఐలియన్మోర్ ద్వీపం వైపు లైట్ హౌస్కి బయలుదేరింది. అయితే వాతావరణ పరిస్థితుల అనుకూలించక బోట్ చాలా ఆలస్యంగా నడిచింది. సముద్రం మధ్యలో ఉండగానే ఆ బోట్ కెప్టెన్ జేమ్స్ హార్వేకి గానీ.. అతడి సిబ్బందికి గానీ లైట్ హౌస్ పైన లైట్ కనిపించలేదు. బోట్ ఐలాండ్కి చేరువ అవుతున్నకొద్ది.. లైట్ హౌస్ లైటే కాదు.. దాని మీద ఎగిరే స్కాట్లాండ్ జెండా కూడా కనిపించలేదు. దాంతో హారన్స్ మోగించి అక్కడ కీపర్స్ని అలర్ట్ చెయ్యాలనుకున్నారు. కావాలనే పలుమార్లు బోట్ హారన్స్ మోగించడం మొదలుపెట్టారు. ఎన్ని హారన్స్ కొట్టినా ఐలాండ్ నుంచి స్పందన రాలేదు. దాంతో హార్వే టీమ్.. హెచ్చరిక మాదిరి సిగ్నల్స్ ఇస్తూ.. గాల్లోక్కి కొన్ని తారాజువ్వలను ఎగరేశారు. అయినా అటు నుంచి నో రిప్లై. తీరా డిసెంబర్ 26 సాయంత్రానికి హెస్పెరస్ బోట్.. లైట్ హౌస్ దగ్గరకు చేరుకుంది. అక్కడంతా సాధారణంగానే ప్రశాంతమైన వాతావరణమే ఉంది. కానీ ఏదో తెలియని నిర్మానుష్య శ్మశాన నిశబ్దం అలముకుంది. మెయిన్ గేట్, మెయిన్ డోర్, లోపలి గదులు అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. ఒక్క కీపర్ కూడా కనిపించ లేదు. వంట గది మాత్రమే తెరుచుకునుంది. అందులోని పొయ్యి చూస్తే గత కొన్ని రోజులుగా దాన్ని వాడలేదని అర్థమవుతోంది. పైగా అక్కడున్న గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. డ్యూటీలో ఉండాల్సిన ముగ్గురూ ఏమయ్యారో తెలియలేదు. దాంతో అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మాయమైన ముగ్గురిలో 20 ఏళ్ల అనుభవమున్న ప్రిన్సిపల్ కీపర్ జేమ్స్ డ్యుకాట్(43), అకేషనల్ కీపర్ డొనాల్డ్ మాకార్థర్ (40) సెకండ్ అసిస్టెంట్ కీపర్ థామస్ మార్షల్(28) ఉన్నారు. వీరిలో మొదటి ఇద్దరూ వివాహితులే. నేటికి 121 ఏళ్లు గడిచినా ఆ ముగ్గురూ ఏమయ్యారనేది తెలియలేదు. నాలుగో కీపర్ జోసఫ్ మోర్ సెలవులో ఉండటం వల్లే బాధితుల లిస్ట్లో అతడి పేరు చేరలేదు. అధికారులు, పోలీసులు ఏకమై వెతికినా ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. ఐలాండ్కి పడమర వైపు బోట్ లాండ్ అయ్యే చోటు డ్యామేజ్ అయ్యి ఉంది. మోరింగ్ రోప్స్ తెగిపోయి ఉన్నాయి. టాకిల్ బాక్స్ మిస్ అయ్యింది. ఐరన్ రెయిలింగ్స్ విరిగిపోయి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ప్రొఫిలింగ్ బోయ్ సమీపంలోనే ఉంది. అయితే అది పక్కకు ఒరిగిన తీరుని గమనిస్తే సముద్రమే తన దారిని మార్చుకుందనిపించింది. ఎందుకంటే దాన్ని కదిలించడం మనుషుల తరం కాదు. ఈ పాయింట్స్ అన్నీ విచారణలో భాగంగా ఫైల్ అయ్యాయి. కానీ ఫలితం లేదు. ఇదిలా ఉండగా గాలింపు చర్యల్లో ఒక కోటు దొరికింది. అది తన సహోద్యోగి డొనాల్డ్ వాడే కోటేనని నాలుగో కీపర్ జోసఫ్ మోర్ గుర్తించాడు. అయితే డిసెంబర్ నెలలో కోటు తీసేసి ఉండటం అసాధ్యం. మరి డొనాల్డ్ దాన్ని ఎందుకు ధరించలేదనేది మరో చిక్కుప్రశ్నగా మారింది. డిసెంబర్ 12న లైట్హౌస్ లాగ్బుక్లో మార్షల్.. ‘నేను మునుపెన్నడు చూడని విధంగా గాలులు వీస్తున్నాయని, డ్యుకాట్ మౌనంగా ఉన్నాడు కానీ.. మాకార్థర్ ఏడుస్తున్నాడు. ఇంత అనుభవజ్ఞుడైన మాకార్థర్ బేలగా మారిపోయాడు’ అని రాశాడు. విచిత్రమేమిటంటే.. 12, 13, 14 తేదీల్లో ఎలాంటి నివేదికా లేదు కానీ.. డిసెంబర్ 15న ‘తుఫాను ముగిసింది, సముద్రం ప్రశాంతంగా ఉంది, గాడ్ ఈజ్ ఓవర్ ఆల్’ అని రాసి ఉంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. దాంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ ముగ్గురూ మాయం కావడానికి కారణం అక్కడున్న అతీంద్రియశక్తులే అని కొందరు.. సముద్ర జీవుల పని అని మరికొందరు భావించారు. అయితే ముగ్గురిలో ఒకరికి పిచ్చి పటì ్ట మిగిలిన ఇద్దరినీ చంపి, సముద్రంలో పడేసి.. తనూ దూకేశాడంటూ ఓ కథ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. బహుశా ఇది విదేశీ గూఢాచారుల పని అయ్యుండొచ్చని, లేదంటే ఏలియన్స్ వచ్చి ఆ ముగ్గురినీ తీసుకుని వెళ్లి ఉంటారని వదంతులు వ్యాపించాయి. అయితే.. నార్తన్ లైట్స్కి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ కమిషన్ రాబర్ట్ ముయిర్హెడ్ రాసిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.. ‘డిసెంబర్ 15 మధ్యాహ్నం ఆ ముగ్గురూ వెస్ట్ ల్యాండింగ్ సమీపంలోని మూరింగ్ రోప్స్ భద్రపరడానికి వెళ్లి ఉంటారని.. ఆ సమయంలో అనుకోకుండా పెద్ద కెరటం వచ్చి ముగ్గురినీ ఒకేసారి కొట్టుకునిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 1950లో ఓ చరిత్రకారుడు మైక్ డాష్.. ఈ ఐలాండ్ సముద్రమట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి.. అంతకు మించిన ఎత్తులో సముద్ర కెరటాలు ఎగసిపడి ఉంటాయనేందుకు.. పలు ఆధారాలు కనుగొన్నాడు. అదే జరిగితే మనుషులు కొట్టుకుపోవడం ఖాయమని భావించాడు. ఆ అంచనా ప్రకారం ఆ ముగ్గురూ మాయమయ్యారనేది అతడి వాదన. మొత్తానికి ఆ ముగ్గరూ ఏమయ్యారనేది మాత్రం ప్రపంచానికి తెలియకుండా ముగిసిన కథ. కానీ ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్, ఘటన జరిగిన ఏడాదికి అక్కడ డ్యూటీలో ఉన్న కీపర్స్కి.. అదృశ్యమైన వారి పేర్లు పిలుస్తూ ఎవరో కేకలు వేస్తున్న ధ్వనులు వినిపించాయట. అది నిజమా, కల్పితమా అనేది మరో మిస్టరీ. ∙సంహిత నిమ్మన -
అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..
సిరిసిల్లక్రైం/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్రోడ్డులో సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు గ్రామానికి చెందిన వంగ వీరయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 19 గుంటల భూమి పంచాయితీ తమ కుటుంబ పెద్ద దిక్కును బలి తీసుకుందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. వివాదానికి కారణాలు వివాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు ఎల్లమ్మ ఆలయం ఎదురుగా తెట్టకుంట శివారులోని సర్వేనంబర్ 51/2లో 19 గుంటల స్థలాన్ని ఆరేళ్ల క్రితం వంగ వీరయ్య, వంగ హన్మండ్లు కొనుగోలు చేశారు. దీన్ని ఓర్వలేని వారి బంధువులు ఆ భూమి గౌడ కులస్తులకు చెందితే బాగుంటుందని ఇద్దరిపై పంచాయితీకి ఉసిగొల్పారు. ఈ విషయమై సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్కుమార్ ఇరువర్గాలను పిలిచి అడుగగా, పంచాయితీ నిర్వహించుకుని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు పంచాయితీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం రాత్రి పంచాయితీ పెద్దలను పిలవడానికి వీరయ్య ఒకవైపు, హన్మండ్లు మరోవైపు వెళ్లారు. పెద్దలను కలిసిన వీరయ్య ఇంటికి వస్తున్నానని కుటుంబీకుల్లో ఒకరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం సిరిసిల్ల రెండో బైపాస్లో వీరయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య చేశారని ఆరోపణలు భూమి విషయంలో తగాదాలను మనసులో పెట్టుకుని వీరయ్యను హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బైక్ నుంచి పడితే కేవలం తల మాత్రమే ఎలా పగులుతుందన్న అనుమానాలున్నాయి. అంతేకాకుండా మృతుడి మర్మాంగాలపై తీవ్రంగా కొట్టారని మృతదేహాన్ని చూసిన స్థానికుల్లో కొందరు ఆరోపించారు. పంచాయితీ రోజుకు ముందు కొన్ని గంటల వ్యవధిలో ఎవరో కావాలని హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం వీరయ్యకు భార్య రేణుక, ముగ్గురు కూతుళ్లు శ్రావణి, ప్రవళిక, మానస, కుమారుడు ప్రణయ్ ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహం జరిగింది. మిగతావారు చదువుకుంటున్నారు. కల్లుగీత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఇంటి పెద్ద మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. న్యాయం చేయాలని వేడుకోలు తమ కుటుంబ పెద్దను చంపిన వ్యక్తులను పట్టుకుని న్యాయం చేయాలని వీరయ్య భార్య అతడి పిల్లలు టౌన్ సీఐ అనిల్కుమార్ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కేసును అనుమానాస్పదంగా భావించి 174 సెక్షన్లో నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు హత్యగా 30 శాతం తెలిపినా మర్డర్ కేసుగా అల్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. హత్య అని తేలితే ఎంత పెద్ద మనుషులున్నా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చదవండి: Balanagar: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు -
Mystery: ‘ఆ వాసన భరించలేక 15 మంది చనిపోయారు! ఇంకొంత మంది..’
Mystery: ఏదేశంలోనైనా.. అక్రమార్కులకు అధికారపు అండదండలు ఉన్నంతవరకూ అభాగ్యుల జీవితాలన్నీ అపశృతులే. ఉద్యమించే గళాలన్నీ నిస్సహాయపు ఆర్తనాదాలే. ఆ ఊచకోతల తాలూకు రక్తపు ఛాయలన్నీ ఆధారాలుగా భ్రమింపజేసే ఎండమావులే! దానికి ఉదాహరణే మెక్సికో నరమేధం!! అక్కడో మాఫియా గ్యాంగ్.. స్థానిక అధికారులతో కలసి 43 మంది విద్యార్థులను సజీవదహనం చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 80 మంది నిందితుల్లో 44 మందికి పైగా పోలీసులే ఉండటం గమనార్హం. ఒక పోలీస్ ఉన్నతాధికారి, నగర మేయర్, అతడి భార్యా ఈ కేసులో పాత్రధారులే. ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా.. నేటికీ నేరనిర్ధారణ జరగలేదు. శిక్షలు అమలుకాలేదు. తవ్వేకొద్దీ మిస్టరీగా మారిపోయిన ఈ ఘటనలో 43 మంది విద్యార్థులు ఏమయ్యారు? ఒక ఊచకోతపై పోరాటం చేస్తూ వాళ్లూ ఊచకోతకు గురయ్యారా? నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయిన సత్యాలు. 24 సెప్టెంబర్ 2014, దక్షిణ మెక్సికోలోని టీచర్ ట్రైనింగ్ స్కూల్కు చెందిన 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజది. 1968 నాటి విద్యార్థుల ఊచకోతల వార్షిక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు.. 19 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు.. భారీ సంఖ్యలో అయిదు బస్సుల్లో బయలుదేరారు. అయితే కొకులా, ఇగౌలా ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులు రోడ్లకు అడ్డంగా బారీకేడ్లను పెట్టి ఆ బస్సులను అడ్డుకున్నారు. ఉన్నట్టుండి మొదలైన పోలీసు కాల్పులు, దానివల్ల జరిగిన తొక్కిసలాట కారణంగా అప్పటికే ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఆ ఘర్షణల నుంచి తప్పించుకున్న కొందరు విద్యార్థులు దగ్గర్లోని కొండల వెనక్కి పారిపోయారు. అయితే పోలీసులు దొరికినవారిని దొరికినట్లుగా పట్టుకుని, రెండు బస్సుల్లో ఎక్కించి వేరే ప్రాంతానికి తరలించారనేది నాటి స్థానిక కథనం. ఆ మరునాడు నుంచే 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. పోలీసులే విద్యార్థుల్ని మాయం చేశారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పోరాటం చెయ్యడంతో.. ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారు కొందరు పోలీసులతో పాటు స్థానిక మేయర్ హోస్ లూయీస్ అబార్కా, అతడి భార్య మారియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ, ఫలితం లేదు. అయితే పోలీసులు ఆ రాత్రి పట్టుకున్న విద్యార్థులను ఓ డ్రగ్ మాఫియాకు అప్పగించారనేది అప్పటికే అందిన రహస్య సమాచారం. దాన్ని బలపరచే ఓ మెసేజ్.. ఈ కేసుకి కీలక ఆధారంగా మారింది. ఆ డ్రగ్ మాఫియా గ్యాంగ్లోని ఒక వ్యక్తి.. ఆ మాఫియా నేతకు మొబైల్లో పంపిన మెసేజ్ ఏంటంటే.. ‘వారిని బస్సుల్లోంచి చెత్తను తరలించే లారీల్లో ఎక్కించి డంప్యార్డుకు తీసుకెళ్లాం. ఆ వాసన భరించలేక 15 మంది చనిపోయారు. మిగిలిన వారంతా కొన ఊపిరితో ఉన్నారు. అందరినీ లారీలోంచి దింపి, ఓ గుట్టగా వేసి, డీజిల్, పెట్రోల్ పోసి నిప్పంటించాం. తెల్లవారేదాకా ఆ దేహాలు దహనమవుతూనే ఉన్నాయి. పూర్తిగా బూడిద అయిన తర్వాత అస్థికలను ఎనిమిది ప్లాస్టిక్ బ్యాగుల్లోకి ఎత్తి, కొకులా సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశాం. ఇక ఎవరూ గుర్తుపట్టలేరు’ అని! ఈ మెసేజ్.. విచారణాధికారులకు చిక్కింది. దీంతో పోలీసులే ఆ విద్యార్థులను డ్రగ్ మాఫియాకు అప్పగించారని, ఆ విద్యార్థుల్లో ఆ మాఫియా గ్రూప్కు చెందని ప్రత్యర్థులు ఉన్నారనే అనుమానంతోనే అందరినీ సజీవదహనం చేసుంటారని అంచనాకు వచ్చారు. అనాబెల్ హెర్నాండెజ్ అనే జర్నలిస్ట్ తన ప్రాణాలకు తెగించి పలు కీలక ఆధారాలు సంపాదించింది. ఆ వివరాలతో (మెక్సికోలో నరమేధం) పేరుతో 2016లో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. అసలు నిజానిజాలు తేల్చేందుకు ఆ మాఫియా గ్యాంగ్లో కొందరు వ్యక్తులను రహస్యంగా కలుసుకుంది అనాబెల్. ‘విద్యార్థులను మాఫియాకు అప్పగించింది పోలీసులే. దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తముంది. ఆ రోజు విద్యార్థులు ప్రయాణిస్తున్న అయిదు బస్సుల్లో రెండు బస్సులు మాఫియా స్మగ్లింగ్కు ఉపయోగించే బస్సులు కావడమే ఈ దుర్ఘటనకు అసలు కారణం. ఆ బస్సుల్లో అప్పటికే మాఫియా రెండు మిలియన్ డాలర్ల (రూ.15,33,90,000) విలువ చేసే హెరాయిన్ను రహస్యంగా దాచిపెట్టింది. బస్సులు గనుక మెక్సికోకు చేరితే అందులోని మత్తుమందు డ్రగ్ కంట్రోల్ టీమ్కు చిక్కుతుందనే భయంతోనే ఆ మాఫియా డాన్.. స్థానిక నాయకులతో, పోలీసులతో అప్పటికప్పుడు మాట్లాడి బస్సులను దారి మళ్లించారు’ అని అనాబెల్ తన పుస్తకంలో రాసింది. ఆమె కథనం ప్రకారం ఆ రోజు డ్రగ్ డీలర్స్ నుంచి, మాఫియా డాన్ నుంచి.. చాలామంది ప్రముఖులకు ఫోన్ కాల్స్ వచ్చాయని.. మొదటి ఫోన్ కాల్ ఇగౌలాలోని 27వ బెటాలియన్ కల్నల్కు వచ్చిందని పలు ఆధారాలు అందించింది. అయితే పుస్తకం మార్కెట్లోకి రాగానే ఆమెకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆమెకు సమాచారం ఇచ్చిన మాఫియా వ్యక్తిని కిరాతకంగా హత్య చెశారు. అతడి భార్యను అపహరించారు. ఇదంతా ఓ ఘోరమైన కుట్ర. ఇప్పటి వరకూ ఆ 43 మందిలో ముగ్గురు విద్యార్థుల అవశేషాలు మాత్రమే లభిచడం ఈ కేసులో కనిపించిన పురోగతి. 2014లో 19 ఏళ్ల అలెగ్జాండర్ మోరా అనే విద్యార్థి అవశేషాలను.. కొకులాలోని డంప్యార్డ్ దగ్గర ఉన్న ఒక ప్రవాహంలో కనుగొన్నారు. 2020లో క్రిస్టియన్ అల్ఫోన్సో రోడ్రిజ్(19) అనే విద్యార్థి అవశేషాలు, 2021లో హోసివానీ గురేరో (20) అనే విద్యార్థి అవశేషాలు లా కార్నిసెరియా లోయలో లభించాయి. మిగిలిన 40 మంది ఏమయ్యారనేది నేటికీ మిస్టరీనే. విద్యార్థులకు చెందిన పలు నమూనాలు లభించినా ఫోరెన్సిక్ రిపోర్ట్లో మ్యాచ్ కాకపోవడం కూడా ఓ కుట్రే. మెక్సికోలో డ్రగ్స్ మాఫియాదే పెత్తనం. ఇక్కడ ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అందులో ఇది కూడా ఒకటి అంటుంటారు కొందరు. కానీ బాధిత కుటుంబాలు మాత్రం నేటికీ పిడికిలి బిగించే నిలబడ్డాయి న్యాయం కోసం. -సంహిత నిమ్మన -
నాలుగు రోజుల్లో పెళ్లి.. ‘పెళ్లి కొడుకు’ అదృశ్యం
సాక్షి, అమీర్పేట(హైదరాబాద్): నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనల ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం, కొట్టాయగూడెం రోడ్కు చెందిన సత్యనారాయణగుప్తా (30) కూకట్పల్లిలో ఉంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 13న రాత్రి 9.30 గంటల సమయంలో సోదరుడు బాపిరాజుకు ఫోన్ చేసి తాను స్వగ్రామికి వెళ్తున్నానని, కేపీహెచ్బీలో బస్సు ఎక్కానని తెలిపాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబసభ్యులు నగరానికి వచ్చి సత్యనారాయణ కోసం వివిధ చోట్ల విచారించారు. బస్సు ఎక్కి ఎస్ఆర్నగర్లో దిగిపోయాడని డ్రైవర్ వారికి చెప్పాడు. ఈ నెల 17న వివాహం జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
స్నేహితులను కలిసి వస్తానని వెళ్లిన యువతి.. ఫోన్ స్విచ్చాఫ్..
సాక్షి, కుత్బుల్లాపూర్(హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన శ్రీను, నాగసత్యవేణి పెద్దకుమార్తె నాగరేవతి(20) ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సుచిత్రలోని ఓ దుస్తుల షాపులోని తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అలాగే చింతల్లోని ఓ కళాశాలలో చదువుతున్న తన సోదరికి ఇచ్చేందుకు టిఫిన్బాక్స్ కూడా తీసుకు వెళ్లింది. కాగా చిన్నకుమార్తె ఫోన్ చేసిన తనకు టిఫిన్స్ బాక్స్ అందలేదని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాగరేవతి మొబైక్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో గురువారం పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన కారు.. ఒకరి మృతి.. మరో ముగ్గురు -
ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?
Cube Shaped House On Moon, Viral Photos: ఛాన్స్ దొరికిందంటే చాలు.. చైనావాళ్లను సోషల్మీడియాలో ఒక రేంజ్లోనే ఆడేసుకోవడం మనవాళ్లకు బాగా అలవాటైంది. అంతెందుకు కరోనా వైరస్ విషయంలో చైనా పాత్రను ధృవీకరించేసుకుని మరీ ఆడుకున్నంత ఆట అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో ఇప్పుడు మరో సెటైర్ పేలుతోంది. చైనాకు చెందిన రోవర్ ‘యుటు-2’ 2019లో చంద్రుడి మీదకు చేరి, పరిశోధనలు మొదలుపెట్టింది. అయితే తాజాగా ఇది చంద్రుడి మీద క్యూబ్ ఆకారంలో ఒక వస్తువును గుర్తించింది. ఆ ఫొటోల్ని చైనా స్పేస్ ఏజెన్సీ సీఎన్ఎస్ఏ (China National Space Administration) రిలీజ్ చేసింది. వోన్ కర్మన్ ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో గుర్తించినట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచే అసలు విషయం మొదలైంది. ఇదొక మిస్టరీ హౌజ్ కావొచ్చని, బహుశా ఏలియన్ల నివాసం కావొచ్చని చైనా స్పేస్ రీసెర్చర్లు ముందస్తు ప్రకటనలు ఇచ్చుకున్నారు. మరొకొన్ని రోజుల్లో ఏలియన్ల మిస్టరీ గుట్టు తేలుస్తామంటూ తొందరపడి అధికారిక మీడియా ద్వారా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంతే.. రాళ్లు, రప్పాలపై చైనా చేస్తున్న అతివ్యహారంపై సెటైర్లు పడుతున్నాయి. ఇక ఇలాంటి వన్నీ చైనా వాళ్లకే కనబడతాయంటూ ఇంటర్నెట్లో మనవాళ్లు జోకులు, దొరికితే సూప్ చేసుకుని తాగుతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సాధారణంగా యూఎఫ్వో-అమెరికా మీద ఎక్కువ ఇంటర్నెట్లో వెటకారం కనిపిస్తుంటుంది. pic.twitter.com/OrhWdHroDt — Joseph VR777 (@JosephRuggiero4) December 5, 2021 కానీ, చైనా మీద మాత్రం ఏలియన్ల వ్యవహారంలో జోకులు పేలుతుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. చైనా ఏకంగా ఏలియన్ల ఉనికి కోసమే అడ్డగోలుగా ఖర్చు పెడుతోంది. ఇదివరకే ఏలియన్ల ఉనికిని పసిగట్టడం కోసం భారీ టెలిస్కోప్ రాడార్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసిన డ్రాగన్ కంట్రీ.. ప్రత్యేకమైన స్పేస్ సెంటర్ టియాన్గోంగ్ను కూడా అందుకే నిర్మిస్తోందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చంద్రుడిపై కనిపించిన ఆ ఆకారం.. ఏ స్థూపమో లేదంటే ఏలియన్లకు సంబంధించిందో కాదని, కానీ, ఆసక్తిని రేకెత్తించేదిగా ఉందంటూ స్పేస్ డాట్ కామ్ జర్నలిస్ట్ ఆండ్రూ జోన్స్ తెలిపారు. రోవర్ నుంచి ఆ నిర్మాణానికి కేవలం 80మీటర్ల దూరమే ఉంది. కానీ, చేరుకోవడానికి 3 నెలల టైం పడుతుందట!. అప్పుడుగానీ అదెంటో మిస్టరీ వీడుతుందన్నమాట. It's an Amazon delivery. — Sandra Sarff (@SandySarff) December 5, 2021 pic.twitter.com/c9alRuvUtQ — ConnorJC (@ConnorJConroy) December 6, 2021 It's a Chinese photo shop — Ross Probert (@probiesr) December 4, 2021 చదవండి: ప్రపంచానిది ఓ దారి.. చైనాది మరో దారి! ఏలియన్ల కోసం ఆరునెలలు.. -
అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?
సాక్షి,పాతపట్నం(శ్రీకాకుళం): అలికిడి లేని చిన్న అడవి. ఎప్పుడో గానీ మనుషులు తిరగని ప్రదేశం. అక్కడ ఓ జీడి చెట్టు. దానికి నెల రోజులుగా వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహం. వినేందుకు ఏదో క్రైమ్ కథను తలపిస్తున్న ఈ ఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం పంచాయతీ మామిడిగుడ్డి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని క్వారీ కొండ వెనుక ఉన్న బోడి కొండపై నెల రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. (చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది ) పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మామిడిగుడ్డి గ్రామానికి చెందిన సవర గణేష్ సోమవారం వంట కలప కోసం కొండపైకి వెళ్లాడు. అటుగా తిరుగుతుండగా ఓ జీడి చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండడం చూసి భయపడ్డాడు. వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఎస్ఐ వి.సందీప్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. పాతపట్నం సీఐ ఎం.వినోద్ కుమార్, పాలకొండ సబ్ డివిజన్ క్లూస్ టీమ్లు కొండపైకి వెళ్లి ఆ చెట్టు చుట్టూ నిశితంగా పరిశీలించారు. మృతదేహం పరిసరాల్లో నాటుసారా బాటిల్ కనిపించింది. నెల రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చని వారు భావిస్తున్నారు. మృతదేహం బాగా పాడైపోయి ఉండడంతో మెళియాపుట్టి మండలంలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు. అదే మండలం కొసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు (54)గా అదృశ్యమైనట్లు గుర్తించారు. నిర్ధారణ కోసం ధర్మారావు బావమరిది పుడితిరు మల్లేసును అక్కడకు తీసుకువచ్చి మృతదేహాన్ని చూపించగా అది ధర్మారావేనని గుర్తు పట్టారు. కొసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు కుమారులు నర్సిమూర్తి, వినోద్ కుమార్లు గత నెల 19వ తేదీన మెళియాపుట్టి పోలీసు స్టేషన్లో తమ తండ్రి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అనుసరించి దర్యాప్తు చేయగా మృతుడి వివరాలు తెలిశాయి. పాతపట్నం సీహెచ్సీ వైద్యుడు ఐ.శ్రీధర్ మృతదేహానికి అక్కడే శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, సవర గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి.. -
దేశంలోనే అత్యంత ధనిక ఆలయం.. కానీ సరిగ్గా మూడేళ్ల క్రితం..
భువనేశ్వర్: దేశంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన పూరీ జగన్నాథుని మందిరం సొత్తు భద్రతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్నాథునికి ఉన్న వజ్ర, వైఢూర్య, బంగారు, వెండి, నవరత్నాల ఆభరణాలు, నగల సొత్తు అపారమైనది. ఈ సంపదని శ్రీమందిరం అంతరాలయంలోని ప్రత్యేక భాండాగారంలో భద్రపరిచారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ భాండాగారం తాళం చెవి గల్లంతైనట్లు వార్త బయటకు పొక్కింది. దీంతో స్వామి నిధి భద్రతపై భక్తుల్లో అభద్రతాభావం బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో ఉలికిపాటుకు గురైన దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం, పూరీ జిల్లా అధికార యంత్రాంగం స్వామి సంపద భద్రతపై భక్తుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. రత్నభాండాగారం సంపద సందర్శన నిమిత్తం 17 మంది ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అప్పట్లో అట్టహాసంగా ఈ కమిటీ రత్నభాండాగారం తెరిచి, పరిశీలించినట్లు.. సొత్తు అంతా భద్రమేనని ఓ ప్రకటన వెలువరించింది. రెండంతస్తుల రత్నభాండాగారంలో బాహ్య అంతస్తు నుంచి లోపలి అంతస్తుని స్పష్టంగా చూసినట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ సమాచారం స్వామి భక్తులకు కాస్త ఊరటని కలిగించింది. ఈ నెల 18న అసలు విషయం.. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా లభ్యమైన కొత్త సమాచారంతో మళ్లీ స్వామి సొత్తుపై భక్తుల్లో విశ్వాసం నీరుగారింది. 1970 నుంచే జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం బహిర్గతం చేసింది. కొమాకొంతియా గ్రామానికి చెందిన దిలీప్కుమార్ బొరాల్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారం సేకరించారు. రత్నభాండాగారం అసలు తాళం చెవి, నకిలీ తాళం చెవి వాస్తవ సమాచారం తెలియజేయాలని ఆయన జిల్లా ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 18వ తేదీన పూరీ కలెక్టరేట్ ద్వారా ఆయనకు అందినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జగన్నాథ ఆలయం ప్రధాన పాలన అధికారికి 2018 ఏప్రిల్ 4వ తేదీన లేఖ ద్వారా తెలియజేసినట్లు సమాచారం ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తాళం చెవి గల్లంతు ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సమాచారం పట్ల సర్వత్రా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్వామి నిధిపై రహస్యం పాటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన కమిటీలో శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి(సీఏఓ), జిల్లా కలెక్టరు, పోలీస్ సూపరింటెండెంట్, భారతీయ పురావస్తు శాఖ కోర్ కమిటీ సభ్యులు, శ్రీమందిరం పాలక మండలి సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన సమాచారం.. అప్పుడు కమిటీ సభ్యుల ప్రకటనకు పొంతన లేకుండా పోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది. తాళం మాయంపై కలెక్టర్కు లేఖ.. సమాచారం చట్టం ప్రకారం రత్నభాండాగారం తాళం చెవి వివరాలపై 2018 ఏప్రిల్ 3వ తేదీన పూరీ జిల్లా అప్పటి కలెక్టరు(అరవింద అగర్వాల్) జిల్లా కోశాధికారికి లేఖ రాశారు. రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని శ్రీమందిరం అప్పటి ప్రధాన పాలన అధికారి(సీఏఓ) (ప్రదీప్ కుమార్ జెనా)కు 2018 ఏప్రిల్ 4న జిల్లా కలెక్టరు లేఖ ద్వారా తెలియజేశారు. 1970 నుంచి రత్నభాండాగారం తాళం చెవి వివరాలు కానరానట్లు ఆ లేఖలో వివరించారు. ఇప్పుడు భాండాగారం తాళం చెవి వివరాల కోసం అర్జీ పెట్టుకున్న దిలీప్కుమార్ బొరాల్కు ఇదే సమాచారం జారీ చేశారు. ఈ క్రమంలో అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమాచారంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కానరాకుంటే ప్రముఖుల కమిటీ పరిశీలన ఎలా సాధ్యమైందనే దిశగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఈ తాళం చెవి గల్లంతు విషయం ఎటువైపు ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. చదవండి: సోషల్ మీడియాలో మాజీ సీఎం భార్య రచ్చ.. ‘ఆ డ్రెస్ ఏంటి’ -
బెడిసికొట్టిన కిడ్నాప్ డ్రామా
సాక్షి, వేలూరు(తమిళనాడు): ఆంబూరులో కిడ్నాప్ నాటకం ఆడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరులోని ముకకొల్లై ప్రాంతానికి చెందిన ఎర్రగడ్డల వ్యాపారి ఆశీన్. ఇతను ఆదివారం రాత్రి ఆంబూరు సమీపంలోని వేంగిలిలో ఉన్న అత్తగారింటికి కారులో బయలుదేరాడు. ఈ సమయంలో ముగ్గురు యువకులు కారును వెంబడించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆశీన్ ఆంబూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆశీన్కు పిల్లలు లేక పోవడంతో అక్క కుమారుడు అమీద్(21)ను పెంచుకుంటున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో అమీద్ సెల్ నెంబర్ నుంచి ఆశీన్కు ఫోన్ వచ్చింది. అందులో గుర్తుతెలియని వ్యక్తులు అమీద్ను కిడ్నాప్ చేశామని రూ. 10 లక్షలు ఇస్తే వదిలి పెడుతామని హెచ్చరించారు. వీటిపై ఆశీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాదనూర్ వద్ద ఉన్నట్లు సెల్ఫోన్ సిగ్నిల్స్ ద్వారా గుర్తించి.. అక్కడ కారులో దాగి ఉన్న అమీద్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఆంబూరు ఆయిల్లా నగర్కు చెందిన మహ్మద్ సిద్దిక్, కుపేర వీధికి చెందిన అర్హత్ అబీ, పూతోటకు చెందిన పయాస్ అహ్మద్గా తెలిసింది. ఈ ముగ్గురు కిడ్నాపర్లు అమీద్ స్నేహితులుగా తెలిసింది. ప్రణాళిక ప్రకారం మామ అశీన్ కిడ్నాప్ చేయడానికి వేసిన పథకం విఫలం కావడంతో.. అమీద్ తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడినట్లు తేల్చారు. -
ఇంటి నుంచి బయటకు వెళ్లిన మరో వివాహిత అదృశ్యం
సాక్షి, మణికొండ(హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.నాగేశ్వర్రావు, దేవి(35) దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి ఫిలింనగర్ ఎంఆర్సీ కాలనీలో నివాసముంటున్నారు. దేవి పుప్పాలగూడ, అల్కాపురి టౌన్షిప్, ఫైర్పీల్డ్ కాలనీల్లో వంట పని చేస్తుంటుంది. ఈ నెల 13వ తేదీ ఉదయం ఆమె ఫైర్పీల్డ్ కాలనీలో పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన భర్త నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బిట్కాయిన్ కుంభకోణం: వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్కాయిన్ కుంభకోణంలో సీసీబీ పోలీసుల విచారణలో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కుంభ కోణానికి కేంద్రబిందువైన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి, పలు వెబ్సైట్లను హ్యాక్ చేసి బిట్కాయిన్ కార్యకలాపాలకు ఎలా పాల్పడింది బహిర్గతమైంది. ఐదేళ్ల పాటు బిట్కాయిన్ దందాలో భాగస్వామిగా తాజాగా సీసీబీ పోలీసులకు పట్టుబడిన రెండో వ్యక్తి రాబిన్ ఖండేన్వాలా. ఇతడు శ్రీకి దందా పట్ల నోరువిప్పాడు. హ్యాకింగ్ ఎలా చేశారు, ఎవరికి బిట్కాయిన్లను విక్రయించారు, ఈ దందాలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారు అనే విషయాలపై రాబిన్ ఏడు పేజీల వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరీ ఖండేన్వాలా? పశ్చిమబెంగాల్ కు చెందిన రాబిన్ఖండేన్వాలా సీఏ పట్టభద్రుడు కాగా 2012 నుంచి 16 వరకు తండ్రి నిర్వహించే రైస్మిల్ చూసుకునేవాడు. 2016లో రాబిన్ సర్వీసెన్ పేరుతో బిట్కాయిన్ లావాదేవీలను ప్రారంభించాడు. పలు వెబ్సైట్ల తెరిచి అమ్మకం, కొనుగోళ్లను చేసేవాడు. ఇంతవరకు రూ.50 కోట్లు వ్యవహారాలు నిర్వహించినట్లు తెలిసింది. 2017 ఏప్రిల్లో హ్యాకర్ శ్రీకృష్ణ ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఈ సమయంలో శ్రీకృష్ణ తనవద్దనున్న 900 బిట్కాయిన్లు విక్రయించాలని కోరగా, రాబిన్ వాటిని అమ్మి ఆ డబ్బును శ్రీకి అకౌంట్లోకి జమచేశాడు. సుమారు రూ. ఐదారు కోట్ల వ్యవహారాలు నడిపారు. వందలాది కాయిన్ల అమ్మకాలు శ్రీకి గోవాలో పోకర్ ఆన్లైన్ గేమ్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడని రాబిన్ చెప్పాడు. అలా శ్రీకి కోట్లాది రూపాయలను దోచుకుని గోవాలో విలాసాలు చేసేవాడు. 2017 నుంచి అనేక వెబ్సైట్లను హ్యాక్ చేసిన శ్రీకి 130 బిట్కాయిన్లను రాబిన్ ఖండేన్వాలాకు ఇచ్చాడు. దీనిని విక్రయించి రూ.3.48 కోట్ల నగదును 50 మందికి పైగా అకౌంట్లలోకి జమచేశాడు. మిగిలిన డబ్బును శ్రీకి జల్సాలకు చెల్లించాడు. శ్రీకి హ్యాక్ చేయడానికి యాపిల్ మ్యాక్బుక్ ప్రొ ల్యాప్టాప్ను వినియోగించేవాడు. హవాలా ద్వారా రూ.4.98 కోట్లు 2017లో శ్రీకృష్ణ ఇరిడియం టోకెన్లను అందించి రాబిన్ ద్వారా అమ్మేయించాడు. 2018లో బెంగళూరు కు వచ్చినప్పుడు శ్రీకి హ్యాకర్ అని తెలిసిందని విచారణలో చెప్పాడు. ఒక హోటల్లో శ్రీకి, మహమ్మద్ నలపాడ్ తదితరులు తనను కలిశారని తెలిపాడు. బిట్కాయిన్ల గురించి చర్చ జరిపామని, కొద్దినెలల తరువాత ఓ కేసులో నలపాడ్ అరెస్టయ్యాడు. ఈ సమయంలో శ్రీకికి తన ఇంట్లో ఐదురోజులు ఆశ్రయం ఇచ్చానని, ఈ సమయంలో ఢిల్లీ, చండీఘడ్, జైపూర్, ముంబై తదితరాలకు వెళ్లినట్లు రాబిన్ చెప్పాడు. 2018లో శ్రీకి అడగడంతో 30 బిట్కాయిన్లను బదిలీ చేశానని, సుజయ్, సునీశ్, ప్రసిద్ధ్ శెట్టి, సురేశ్ అనే వారిని పరిచయం చేశాడన్నారు. శ్రీకి కి నగదు కావాలనడంతో హైదరాబాద్ అభిషేక్ ద్వారా హవాలా మార్గంలో మొత్తం రూ.4.98 కోట్ల నగదు పంపించానని వివరించాడు. బిట్కాయిన్ నిందితులను వదలం : సీఎం శివాజీనగర: బిట్ కాయిన్ స్కామ్ను బయటికి తీసుకురావడం, విచారణ చేపట్టింది మేమే. ఇందులో ఎంతటి బలమైన వ్యక్తులున్నా శిక్షిస్తాం అని సీఎం బొమ్మై చెప్పారు. ఆదివారం విధానసౌధ ముందు నెహ్రూ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన తరువాత మాట్లాడారు. ఈ కేసులు ఈడీ, సీబీఐకి అప్పగించాము. వారు కోరిన సమాచారాన్ని అందించాము. 2018లో కాంగ్రెస్ సర్కారు నిందితుడు శ్రీకృష్ణను విచారించి ఉంటే అన్ని విషయాలూ బహిరంగమయ్యేవి. ఈ కేసు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడ మోసం జరిగినా చర్యలు తీసుకొంటాము అని చెప్పారు. నన్ను వదిలేయండి: నలపాడ్ బిట్కాయిన్ స్కామ్లో నా పాత్ర లేదు, అనవసరంగా నా పేరును ప్రస్తావించి వేధించవద్దు అని కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2021 జనవరిలో బిట్ కాయిన్ కేసు బయటికి వచ్చింది. దీంతో నాకు సంబంధం ఉంటే ఎప్పుడో అరెస్టు చేసేవారు కదా అని అన్నారు. యూబీ సిటీలో గొడవ కేసులో 117 రోజులు జైలులో ఉన్నాను, మా నాన్న హ్యారిస్ ఎమ్మెల్యే కాబట్టి నాపై కొందరు బురదచల్లుతున్నారు అని అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి అని కోరారు. -
హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక..
ఒక అగ్నిప్రమాదం.. రాత్రికి రాత్రే వారి సంతోషాల్లో నిప్పులు పోసింది. బతుకంతా నిరీక్షించేలా చేసింది. అది శత్రువు పగతో చేసిన ఘోరమో? లేక విధి వికృతంగా పన్నిన పన్నాగమో? తెలియకుండానే జీవితాలకు జీవితాలు ముగిసిపోయాయి. కడుపు కోతకు మించిన దుఃఖం ఉండదు. కన్నబిడ్డలు బతికి ఉన్నారా.. లేదా తెలియని స్థితికి మించిన నరకం ఉండదు. అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు జార్జ్, జెన్నీ సోడర్ దంపతులు. 1945 డిసెంబర్ 24న అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అర్ధరాత్రి ఒంటిగంటకు జార్జ్ నివసిస్తున్న రెండంతస్తుల భవనానికి ఉన్నట్టుండి నిప్పు అంటుకుంది. జెన్నీ, జార్జ్లు.. తమతో నిద్రిస్తున్న నలుగురు పిల్లల్ని తీసుకుని బయటికి పరుగుతీశారు. కానీ పై అంతస్తులో నిద్రపోతున్న మరో ఐదుగురు పిల్లల్ని కాపాడటానికి వీలుకాలేదు. కనీసం ఫైర్ స్టేషన్ కి కాల్ చేద్దామంటే.. టెలిఫోన్ వైర్లు తెగిపడున్నాయి. దగ్గర్లో ఉన్న బొగ్గు ట్రక్కుల సాయంతో పై అంతస్తుకి ఎక్కుదామంటే.. వాటి ఇంజిన్లు స్టార్ట్ కాలేదు. మారిస్(14), లూయీ(9) అనే ఇద్దరు మగపిల్లలు.. మార్తా(12), ఐరీన్ (8), బెట్టీ (5) అనే ముగ్గురు ఆడపిల్లలు పైనే ఇరుక్కుపోయారు. మారిస్, లూయీ, మార్తా, ఐరీన్, బెట్టీ చూస్తుండగానే ఇల్లు కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ జరిగి, ఐదుగురు పిల్లలు సజీవదహనం అయ్యార ని కేసు క్లోజ్ చేశారు పోలీసులు. కానీ జార్జ్ దంపతులు తమ పిల్లలు చనిపోలేదని, కిడ్నాప్ అయ్యారని నమ్మారు. పక్కదారి పట్టించేందుకే అగ్నిప్రమాదాన్ని సృష్టించారనే వాదన వినిపించారు. అందుకు చాలా సాక్ష్యాలను సిద్ధం చేశారు. వాటిలో ముఖ్యమైనది అంతపెద్ద ప్రమాదం జరుగుతుంటే పిల్లల నుంచి ఎటువంటి అరుపులు వినిపించలేదు. లెక్కప్రకారం గంటలోనే కాలి బూడిదైన ఇంటిలో.. ఐదు అస్థిపంజరాలు దొరకాలి. కానీ ఒకే ఒక్క మాంసం ముద్ద, కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. వాళ్ల పనేనా? జార్జ్ సోడర్ ఇటలీలోని సార్డినియాలో 1895లో జన్మించాడు. తన 13వ ఏట కుటుంబంతో కలసి అమెరికాకు వలస వచ్చాడు. ఇక జెన్నీ కూడా వలస వచ్చిన ఇటలీ వాసే. పెళ్లి తర్వాత ఈ జంట ఇటాలియన్ కమ్యునిటీకి చెందిన ఫాయెట్విల్లే సమీపంలో స్థిరపడ్డారు. అయితే ఆ ఏరియాలో ఉన్న ఇతర ఇటాలియన్లు నియంత అయిన బెనిటో ముస్సోలినీని సపోర్ట్ చేసేవాళ్లు. బలమైన రాజకీయాభిప్రాయాలు కలిగిన జార్జ్.. వారితో వాగ్వాదాలకు దిగేవాడు. జెన్నీ, జార్జ్ సోడర్ దంపతులు అదే పగతో వాళ్లెవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారా? అనేది చిక్కుముడిగా మారింది. అగ్నిప్రమాదం జరిగే కొన్ని నెలల ముందు ఒక అపరిచితుడు జార్జ్ వాళ్లింటికి వచ్చి కుటుంబ బీమా తీసుకోవాలని పట్టుబట్టాడు. నిరాకరించడంతో ‘త్వరలోనే ఈ ఇల్లు కాలి బూడిదవుతుంది. పిల్లలు నాశనమయిపోతారు. ముస్సోలినీని విమర్శించి నందుకు మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించి వెళ్లిపోయాడు. అప్పుడు జార్జ్ పట్టించుకోలేదు. ఘటన తర్వాత అతడు దొరకలేదు. ఫోన్ కావాలనే చేశారా? అగ్ని ప్రమాదం జరిగిన రోజు రాత్రి.. పన్నెండున్నరకు గాఢనిద్రలో ఉన్న జెన్నీ ఓ ఫోన్ కాల్కి నిద్రలేచింది. అవతల ఒక ఆడ గొంతు.. జెన్నీ ఎప్పుడూ వినని పేరు. ‘రాంగ్ నంబర్’ అని జెన్నీ అనగానే అవతల నుంచి ఓ నవ్వు వినిపించింది. అర్థం కాని జెన్నీ.. ఫోన్ పెట్టేసి.. వెళ్లి పడుకుంది. అప్పుడే ఇంటి పైకప్పు మీద ఏదో పడిన శబ్దం జెన్నీకి వినిపించింది. గంటలోపే రూమంతా పొగకమ్మింది. మరిన్ని షాకింగ్ నిజాలు.. ఘటన తర్వాత టెలిఫోన్ రిపేర్చేసే వ్యక్తి ఆ ఇంట్లో తగలబడిపోయిన వైర్లను చూసి.. టెలిఫోన్ వైర్లు మంటల్లో కాలిపోకముందే.. ఎవరో కావాలనే లైన్కట్ చేశారని తెలిపాడు. మరోవైపు ఓ స్థానికుడు.. ఆ ఇంటి దగ్గర్లో వాహనాల ఇంజిన్లను తొలగించే పరికరాన్ని చూశానని చెప్పడంతో.. కావాలనే బొగ్గు ట్రక్కుల ఇంజిన్లు పనిచేయకుండా చేశారనే అనుమానం బలపడింది. బూడిదైన ఇంట్లో.. జార్జ్కు సగం కాలిన ఒక గట్టి రబ్బరు వస్తువు కనిపించింది. అది పైనాపిల్ బాంబు తయారు చేయడానికి ఉపయోగించే వస్తువు. అంటే జెన్నీకి ఆ రాత్రి వినిపించిన శబ్దం బాంబేనా? అనే కొత్త సందేహం మొదలైంది. అసలైన నిర్ధారణ ఇదే పిల్లల ఫొటోలను పేపర్లో వేయడంతో పాటు ఆ చుట్టుపక్కల గోడలపై అతికించి.. జాడ చెబితే 5 వేల డాలర్లు ఇస్తానని రివార్డ్ ప్రకటించాడు జార్జ్. అప్పుడే ఒకామె ఆ ఐదుగురు పిల్లల్ని చూశానంటూ వచ్చింది. ఆ ఇంటికి 50 మైళ్ల దూరంలో టూరిస్ట్ బూత్ నడుపుతున్నానని, అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఉదయమే తనకు ఆ పిల్లలు కనిపించారని, వాళ్లు ఫ్లోరిడా లైసెన్స్ ప్లేట్తో ఉన్న ఒక టూరిస్ట్ కారులో ఉన్నారని, వాళ్లకు తానే టిఫిన్ పెట్టానని చెప్పింది. జార్జ్ దంపతుల ఆశలు బలపడ్డాయి. మరోవైపు సౌత్ కరోలినా అనే హోటల్లో పనిచేసే మరొకామె ఐదుగురిలో నలుగురు పిల్లల్ని చూశానని పిల్లలతో పాటు ఎవరో నలుగురు పెద్దవాళ్లూ ఉన్నారని, వాళ్లు పిల్లల్ని నాతో మాట్లాడనివ్వలేదని చెప్పింది. ఇలాంటి పలు ఆధారాలతో 1947లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు ఆ దంపతులు రిక్వెస్ట్ చెయ్యడంతో కేసు రీఓపెన్ అయ్యింది. అందులో భాగంగా ఇంటి బూడిదల్లో దొరికిన మాంసం ముద్దను, ఎముకలను మరోసారి టెస్ట్ చేశారు. అయితే అవి పిల్లలవి కావని, మాంసం ఒక జంతువుదని, ఎముకలు 17 ఏళ్లు పైబడిన గుర్తు తెలియని యువకుడివని తేలాయి. దాంతో రివార్డ్ను 10 వేలకు పెంచాడు జార్జ్. 23 ఏళ్ల తర్వాత 1968లో జార్జ్కు ఫ్రమ్ అడ్రెస్ లేని ఒక పోస్ట్ వచ్చింది. అందులో ఒక యువకుడి ఫొటో ఉంది. ఫొటో వెనుక లూయీ సోడర్, ఐ లవ్ బ్రదర్ ఫ్రాంకీ అని రాసి ఉంది. అదే జార్జ్ కుటుంబానికి చివరిగా దొరికిన ఆధారం. అదే విషయాన్ని పోలీసుల ముందు పెడితే నవ్వారు. కానీ ఆ యువకుడు తప్పిపోయిన పిల్లల్లో ఒకడైన లూయీలానే ఉన్నాడని జార్జ్ నమ్మాడు. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు ఒక డిటెక్టివ్ని కూడా నియమించాడు. కానీ డిటెక్టివ్ డబ్బులు తీసుకున్నంత వేగంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యలేపోయాడు. ఆ పోస్ట్ అందుకున్న ఏడాదికే అనారోగ్యంతో జార్జ్ కన్నుమూశాడు. సుమారు 21 ఏళ్లు జెన్నీ కూడా తన పిల్లలకోసం నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తూనే బతికింది. బతికి ఉన్నన్నాళ్లూ నిరసనగా నల్లటి దుస్తులనే ధరించింది. ఆమె మరణం తర్వాత.. అంటే 1989 నుంచి 2021 వరకూ.. జార్జ్–జెన్నీల చిన్న కూతురు సిల్వియా సోడర్.. తన మనవళ్లతో కలసి.. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో కూడా తన తోబుట్టువులను వెతికే ప్రయత్నం చేసింది. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగేనాటికి సిల్వియా వయసు రెండేళ్లు. 2021 ఏప్రిల్ 21న తన 79వ ఏట.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది సిల్వియా. నాటి ఘటనలో ఏకైక సాక్ష్యంగా మిగిలిన జార్జ్ ఏకైక వారసురాలు సిల్వియా కూడా ఇప్పుడు ప్రాణాలతో లేదు. బహుశా సిల్వియా కంటే పెద్దవాళ్లైన ఆ ఐదుగురు కూడా ప్రాణాలతో ఉండి ఉండరు. కానీ పేగుబంధం కోసం కన్నప్రేమ చేసే పోరాటాలకు ఈ మిస్టరీ ఓ హృదయవిదారకమైన ఉదాహరణగా మిగిలింది. - సంహిత నిమ్మన చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! -
ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్..
రొటీన్కి భిన్నంగా వెరైటీ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? లేక్ ఆఫ్ నో రిటర్న్కు వెళ్లండి. ఎందుకుంటే ఇదో రహస్యాల పుట్ట. మన దేశంలో ఉన్న మిస్టీరియస్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మీరిప్పటి వరకు చాలా సరస్సుల గురించి వినడం, చదవడం, చూడటం జరిగి ఉండవచ్చు. కానీ ఈ మిస్టీరియస్ సరస్సుకు వెళ్లినవారు మాత్రం తిరిగి రావడం ఇప్పటివరకూ జరగలేదు. ఇది కథలో సరస్సు కాదు. ఇలలోని సరస్సే! ఎక్కడుందో తెలుసా.. మనదేశానికి, మయన్మార్కు మధ్య సరిహద్దు ప్రాంతంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో నవాంగ్ యాంగ్ సరస్సు ఉంది. దీనిని అందరూ మిస్టీరియస్ లేక్ అని పిలుస్తారు. అనేక సంఘటనల ఆధారంగా దానికాపేరు వచ్చింది. ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు ఏంటంటే.. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైనికులతో ఉన్న ఒక విమానం ఈ ప్రదేశంలో అత్యవసర ల్యాండ్ అయ్యిందట (వాళ్లు దారి తప్పటం వల్ల). ఐతే చాలా అనూహ్య రీతిలో విమానంతో సహా అందరూ అదృశ్యమయ్యారట. ఒక అధ్యయనం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న జపాన్ సైనికులందరూ మలేరియా కారణంగానే మరణించి ఉంటారని పేర్కొంది. చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! ఐతే ఈ సరస్సు చుట్టుపక్కల గ్రామస్తుల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒక అతనికి ఈ సరస్సులో ఓ పెద్ద చేప దొరికింది. దీంతో అతను ఆ గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలిని మాత్రం అతను విందుకు ఆహ్వానించలేదు. దీంతో సరస్సుకు కాపలా కాస్తున్న వ్యక్తి కోపోద్రిక్తుడై వారిద్దరినీ ఊరు విడిచి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ మరుసటి రోజే ఊరంతా సరస్సులో మునిగిపోయిందట. అక్కడి గ్రామస్తుల్లో ఈ విధమైన జానపద కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఐతే ఈ మిస్టీరియస్ సరస్సు రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! ఈ విధంగా అనేక పురాణాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకాన్ని పెంచాలనే ఆశతో అక్కడి గ్రామస్తులు ఈ స్థానిక బెర్ముడా ట్రయాంగిల్పై రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారనే నానుడి కూడా ఉంది. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! -
Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!
ఎన్నో అద్భుత, మర్మగర్భ దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. వాటిల్లో యోగిని దేవాలయాలు కూడా చెప్పుకోదగ్గవే. మన దేశంలో మొత్తం 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో రెండు దేవాలయాలు ఒడిస్సాలో, రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని మితావాలి గ్రామంలో ఉన్న 64 యోగిని దేవాలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇది గుండ్రని ఆకారంలో, 64 గదుల్తో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత విగ్రహం ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనేపేరు వచ్చింది. ఐతే వీటిల్లో కొన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి. మిగిలినవాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్తోనా.. సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో కొండపైన వృత్తాకారంలో ఉంటుంది ఈ దేవాలయం. చూపరులకు పళ్లెం ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయం మధ్యలో బహిరంగ మంటపం నిర్మించబడి ఉంటుంది. భారత పార్లమెంట్ను నిర్మించిన బ్రిటీష్ ఆర్కిటెక్చర్ సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగానే నిర్మించాడని నానుడి. పార్లమెంటు స్తంభాలు కూడా ఇక్కడి స్తంభాలమాదిరిగానే ఉంటాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తాబేలు రాజు దేవ్పాల్ 1323లో ఈ దేవాలయాన్నినిర్మించాడు. ఇక్కడ జ్యోతిష్యం, గణితం బోధించేవారట. తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు ప్రజలు ఈ శివాలయానికి తరలివచ్చేవారట. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడివుందని అక్కడి స్థానికుల నమ్మకం. అందుకే రాత్రి వేళ ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఇంకా ఎన్నో అంతుచిక్కని మర్మగర్భిత రహస్యాలు ఈ 64 యోగిని దేవాలయంలో దాగివున్నాయి. చదవండి: 'నీ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’ -
చికెన్ దుకాణం తెరవడానికి వెళ్లాడు.. అంతలోనే..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఆదివారంరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన శివన్వాయల్ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. తిరువళ్లూరు జిల్లా మేల్కొండయూర్ గ్రామానికి చెందిన జగదీషన్(29). ప్రైవేటు కంపెనీలో కొరియర్ బాయ్గా పని చేస్తూ ఆదివారం తదితర సెలవు రోజుల్లో తిరువళ్లూరులోని పుంగానగర్లో చికెన్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం చికెన్ దుకాణం తెరవడానికి వెళ్లి ఆ తరువాత రాలేదు. దీంతో తల్లిదండ్రులు జగదీషన్ సెల్ఫోన్లో సంప్రదించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఈక్రమంలో సోమవారం శివన్వాయల్లోని త్రిపురసుందరి ఆలయం వద్ద రక్తపు మడుగులో జగదీషన్ పడివున్నట్లు గుర్తించి స్థానికులు తల్లిదండ్రులకు, వెంగల్ పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. -
మిస్టరీ: మహాసముద్రంలో ఓ అనాథ
కొన్ని విహారయాత్రలు అనుకోని ప్రమాదాలతో విషాదాలుగా మిగిలిపోతే.. మరి కొన్ని విహారయాత్రలు ఊహించని మలుపులతో మిస్టరీలుగా మారిపోతుంటాయి. ఎటువంటి ఆధారాల్లేక ఏళ్లకు ఏళ్లు కథలుగా నడుస్తుంటాయి. అలాంటి ఓ మిస్టరీ 49 ఏళ్ల తర్వాత వీడింది. అదే 1961 నాటి ‘టెర్రీ జో’ ట్రాజెడీ అండ్ క్రైమ్ స్టోరీ! అదొక మహా సముద్రం.. చుట్టూ చిక్కని చీకటి.. నడుమ ఒక ఓడ.. ఓ వైపు పెనుగాలులు, మరోవైపు నాలుకలు చాస్తున్న అలలు.. హఠాత్తుగా ఆర్తనాదాలు.. కలతనిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది 11 ఏళ్ల టెర్రీ జో డ్యూపెరాల్ట్. అప్పటికే కన్నవారు, తోబుట్టువులు ఎవరూ ప్రాణాలతో లేరు. ఎదురుగా వాళ్లందరినీ చంపిన హంతకుడు. కళ్లు మూసి తెరిచేలోపే టెర్రీని ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు. టెర్రీ జో తండ్రి అర్థర్ డ్యూపెరాల్ట్ ఒక డాక్టర్ (ఆప్టోమెట్రిస్ట్). తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి సముద్ర విహారం చేయాలని నిర్ణయించు కున్నాడు. తన స్నేహితుడు, మాజీ నౌకాధికారి జూలియన్ హార్వే, అతని భార్య మేరీ డెనాలను కూడా ఆ యాత్రకు ఆహ్వానించాడు. నవంబర్ 8న బ్లూబెల్ బోట్ను అద్దెకు తీసుకుని.. ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి బహామాలోని ఐల్యాండ్ను సందర్శించడానికి బయలుదేరారంతా. బోట్కి హార్వే కెప్టెన్గా ఉంటే.. అతడి భార్య మేరీ బోట్లో అందరికీ వండిపెట్టేది. రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. తిరుగు ప్రయాణమైన రాత్రి (నవంబర్ 12) బోట్.. శాండీ పాయింట్ దగ్గర ఆగింది. టెర్రీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన రాత్రి అది. ∙∙ తెల్లారే నడిసముద్రంలో టెర్రీ.. బిక్కుబిక్కుమంటూ ఓ చిన్న తెల్లటి తెప్పపై ప్రయాణం చేస్తోంది. సముద్రంలో పడినప్పుడు టెర్రీకి దొరికిన ఒకే ఒక్క ఆధారం బోట్ నుంచి విడిపోయిన ఆ రబ్బరు తెప్ప. నిర్మానుష్యమైన ఆ కడలిలో.. అనాథగా మిగిలిపోయింది టెర్రీ. సుమారు మూడున్నర రోజులు తిండి, నీరు లేక నీరసించి పోయింది. అదృష్టవశాత్తు అటుగా వచ్చిన ఓ వాణిజ్య నౌక కెప్టెన్.. టెర్రీని చూసి, కాపాడి ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే ఊహించని షాక్తో, భయంతో స్పృహ లేకుండా పడుంది టెర్రీ. ఆ రాత్రి ఏం జరిగింది? (టెర్రీ పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో అల్లిన కథనం) ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భార్యని సముద్రంలోకి విసిరేశాడు హార్వే. మేరీ అరుపులు వినిపించిన అర్థర్.. ‘మేరీ ఎక్కడా?’ అని హార్వేని నిలదీయడంతో అర్థర్నూ సముద్రంలోకి తోసేశాడు. అయితే ఆ హత్యను చూసిన అర్థర్ భార్య జీన్తో పాటు అర్థర్ కొడుకు బ్రయిన్(14)లను క్రూరంగా పొడిచి చంపేశాడు. అర్థర్ చిన్న కూతురు రెనే(7)ను కూడా ఎత్తి సముద్రంలో పారేశాడు హార్వే. అయితే ఆ అరుపులకు బోటు కింద నిద్రిస్తున్న టెర్రీజోకు మెలకువ రావడంతో పైకి వచ్చి చూసింది. అప్పటికే బోట్ని సముద్రంలో ముంచి, తప్పించుకునే ప్లాన్లో ఉన్న హార్వే.. టెర్రీనీ ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు. ఆ కథనం ఏదైనా.. బ్లూబెల్ని సముద్రంలో పూర్తిగా ముంచేసి హార్వే ఆ రాత్రి ఈతకొట్టుకుంటూ వెళ్లడాన్ని కళ్లరా చూసింది టెర్రీ. సేఫ్టీ బోటులో మయామీ బీచ్కు చేరుకున్న హార్వే.. ‘తాము ప్రయాణిస్తున్న బోటు సముద్రం మధ్యలో మునిగిపోయిందని, తాను మాత్రమే బతికి బయటపడ్డా’నని పోలీసులకు తెలిపాడు. వెంటనే రెస్క్యూ టీమ్ విమానాల్లో ఓడ కోసం గాలింపులు చేపట్టింది. ఓడకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు హార్వే. కానీ నాలుగు రోజులకు టెర్రీ బతికొచ్చిందని తెలుసుకున్న అతను.. నిజం బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే టెర్రీ మానసిక పరిస్థితి బాగోకపోవడంతో పూర్తి వివరాలు బయటికి రాలేదు. టెర్రీ తన 12 ఏళ్ల వయసులో టెరేగా పేరు మార్చుకుని.. తండ్రి తరపు బంధువుల దగ్గరే పెరిగింది. 1988లో తనని కాపాడిన కెప్టెన్ను కలిసిన టెరే.. అప్పుడు కూడా జరిగిందేంటో చెప్పలేదు. మీడియాకీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కానీ 2010లో తన అనుభవాలని.. సముద్రంలో ఒంటరిగా బతికిన ఆ రోజులని వివరిస్తూ.. ‘ఎలోన్–ఆర్ఫన్డ్ ఆన్ ది ఓషన్ (మహా సముద్రంలో అనాథ)’ అనే పుస్తకం రాసింది. అప్పటికే విస్కాన్సిన్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్లో వాటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా చేసి రిటైర్ అయ్యింది. అయితే మానసికంగా బాగా కుంగిపోయిన టెరే.. ఆ సమస్యను అధిగమించడంలో మానసిక నిపుణుడు రిచర్డ్ డి.లోగాన్ సాయం తీసుకుంది. టెరే బుక్ రిలీజ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అవేంటంటే.. ‘ఆ రోజు రాత్రి నేను బోట్పైకి వెళ్లి చూసేసరికి అమ్మా, అన్నయ్యా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. నాన్న, చెల్లి కనిపించలేదు. కానీ.. కెప్టెన్ హార్వే ఎందుకలా చేశాడనేది నాకు అర్థం కాలేదు. నన్ను సముద్రం మింగేస్తుందని హార్వే భావించాడు కానీ.. ఆ నీరే నన్ను కాపాడింది. అందుకే ఆ నీటితో నాకు అనుబంధం పెరిగింది. ఆ ఘటన నుంచి నేను పూర్తిగా కోలుకోవడానికి 49 ఏళ్లు పట్టింది. బోట్ నుంచి విడిపోయిన తెల్ల తెప్ప సాయంతో నేను సముద్రంలో తేలాను. కానీ తెల్ల తెప్ప వల్ల రెస్క్యూ టీమ్కు నేను కనిపించలేదు. అందుకే 1962లో బోట్స్కి తెల్లటిరంగుకి బదులు ఆరెంజ్ కలర్ వేయడం మొదలుపెట్టారు. నా జీవితం ఎందరికో ప్రేరణ కావాలనే ఈ పుస్తకం రాశాను’ అంటూ తన జీవితాన్ని ప్రపంచం ముందు పెట్టింది. అయితే ఈ ఘటనలో టెరే చూసింది మాత్రమే ప్రపంచానికి ఓ ఆధారం. హార్వే అందరినీ చంపడం నిజమే కానీ.. ఎవరి తర్వాత ఎవరిని చంపాడు? అనేది ఊహాత్మక కథనం. ఎందుకంటే టెర్రీ చూడలేదు, హార్వే ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఆ సంఘటన నేటికీ మిస్టరీనే. హార్వే నేర చరిత్ర హార్వేకి మేరీ నాలుగో భార్య. మొదటి ముగ్గురు భార్యలు ఏం అయ్యారు అనే సమాచారం లేకపోయినా.. బ్లూబెల్ విషాదఘటనకు 12 ఏళ్ల ముందు.. ప్రమాదవశాత్తు కారు చెక్క వంతెన మీద నుంచి నీటిలో పడిపోయిందని నమ్మించి రెండో భార్యను, ఆమె తల్లినీ పొట్టనపెట్టుకున్నాడనే అభియోగం బలపడింది. - సంహిత నిమ్మన చదవండి: Joshi Anumuthu: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
ఆ రాయి అలా ఎందుకుందో అర్థంకాక తలలుపట్టుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పాలి. ఇటువంటి తరహాలో ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఓ పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో అది. ఆ బండరాయి సరిగ్గా మధ్యలో చీలిపోయి ఉంటుంది. ఇందులో వింత ఏమిటంటే.. మధ్యలో చీలిన ఆ రాయి అలా కట్ చేయడం మనుషుల వల్ల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్లో మనం చూడవచ్చు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి కారణంగా పలు సిద్ధాంతాల పేర్లను కామెంట్ చేస్తున్నారు. ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదేనా ఆ రహస్యం బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గౌరవ పరిశోధనా సహచరుడు అయిన లూయిస్ ఈ రాయి వెనుక రహస్యాన్ని చేధించినట్లు తెలిపారు. 'ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే బండరాయి ఆ రకంగా సగానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు. చదవండి: Old Couple Love story: డేటింగ్ యాప్లో పరిచయం.. 70 ప్లస్లో ప్రేమ.. ఆపై పెళ్లి -
శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..
Yemen Hell Of Well: అదొక భారీ బావి. దూరం నుంచి చూస్తే చిన్న గుంతలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే.. లోపల చీకట్లు అలుముకుని భయంకరంగా అనిపిస్తుంది. దాని గురించి చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్లు కథలు కథలుగా చెప్తుంటారు. కొందరేమో దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. ఎక్కువ మంది మాత్రం శవాల దిబ్బగా పేర్కొంటారు. ఖైదీలను, శత్రువులను గుంపులుగా అందులో పడేసి ఊచకోత కోసేవాళ్లని ప్రచారం వినిపించేది మొన్నటిదాకా. కానీ.. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు. యెమెన్(యెమన్) ఆల్ మహారాలోని బార్హౌట్ బావి.. చాలా ఏళ్ల నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటికి తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో ఓ బృందం లోపలికి దిగింది. అందులో శవాల గుట్టలుగానీ, అస్థిపంజరాలుగానీ ఏవీ కనిపించలేవు. కనీసం కంపు వాసన కూడా రాలేదు. లోయ అడుగున ఓ జలపాతం, రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు దొరికాయి వాళ్లకి. కాకపోతే కొన్ని పాములు మాత్రం కనిపించాయట. అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్ చేసి.. ఆ బావి వయసు తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. గతంలో యెమెన్ అధికారుల బృందం ఒకటి ఈ బావిలో 50-60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిందట. ప్రస్తుతం ఈ భారీ బావి మిస్టరీని చేధించినప్పటికీ.. ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ బావి పక్కకు వెళ్లమనే చెప్తున్నారు. -
రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది?
టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని వసతులొచ్చినా.. నేటికీ ఏదో ఒక నదినో, సరస్సునో, వాగునో ఆధారంగా చేసుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. సస్యశ్యామలమైన, అహ్లాదకరమైన వాతావరణం కోసం తాపత్రయపడే మనుషులు సాధారణంగా నీరు పుష్కలంగా లభించే పరిసరప్రాంతాలనే ఇష్టపడుతుంటారు. అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరపడాలని కోరుకుంటారు. ఆ కోరికే మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ వాసుల పాలిట శాపం అయ్యింది. మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్లో న్యోస్ సరస్సు చుట్టూ పల్లెలు పచ్చగా అల్లుకున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు, సమూహాలకు సమూహాలు గుమిగూడి గ్రామాలుగా మారాయి. కానీ ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రి ఊహించని విధంగా శ్మశానాలైపోయాయి. సరస్సు పొంగి ఊళ్ల మీదకు వరదై రాలేదు.. ఎండిపోయి కరువు ఎద్దడులూ తేలేదు. కానీ.. 5,246 ప్రాణాలను బలిగొంది. అసలు ఏం జరిగింది? ఈ వారం మిస్టరీలో.. ‘న్యోస్ సరస్సు’.. ఉనికిలో లేని అగ్నిపర్వత ముఖద్వారంలో ఏర్పడింది. ఆవాసానికి అనువుగా ఉండటంతో.. చా, న్యోస్, సుబుమ్ అనే గ్రామాలు సరసు చుట్టూ ఏర్పడ్డాయి. నీరు పుష్కలంగా ఉండటంతో అక్కడ జనం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 1986లో ఆగస్టు 21న గాఢ నిద్రలో ఉన్న ఆ మూడు గ్రామాల ప్రజలు.. ఇక నిద్రలేవలేదు. మరునాడు ఎక్కడ చూసినా శవాలే. మంచం మీద ఉన్నవారు మంచం మీదే.. బయట ఉన్నవారు బయటే నిర్జీవంగా మారిపోయారు. పశుపక్ష్యాదులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు మాత్రం.. ‘ఆ రాత్రి తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా గాలి స్తంభించింది. ఏదో ఘాటైన వాసన వచ్చింది. ఆ తర్వాత స్పృహ లేదు’ అని చెప్పుకొచ్చారు. చనిపోయినవారి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కథను మిస్టరీగా మార్చాయి. ఈ విపత్తులో 1,746 మంది ప్రజలతో పాటు.. 3,500 జంతువులు, పక్షులు చనిపోయాయని, రాత్రికి రాత్రి ప్రాణాలు తీసేసిన ఆ గాలి అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యోస్ సరస్సు నుంచే వచ్చిందని తేల్చారు. అసలేం జరిగింది? ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండి సరస్సుగా మారింది. నీరు చేరినా బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు. ఆ రాత్రి 9 గంటలకు.. రసాయనిక చర్యల్లో భారీ మార్పులు జరిగి.. ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్ డై ఆక్సైడ్ సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించింది. కొన్ని క్షణాల్లోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది. 25 కిలోమీటర్లుకు పైగా గాలిలో ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కార్బన్ డై ఆక్సైడ్ పీల్చిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపిన పరిశోధకుడు డెవిడ్ బ్రెస్సెన్ నాటి పరిస్థితిని వివరిస్తూ.. ‘నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. న్యోస్ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది. కదలిక చోటుచేసుకోవడంవల్లే ఇంత పెద్ద విపత్తు ఏర్పడింది’ అన్నారు. అయితే ఇలాంటì ఘటనే 1984లో కూడా జరిగింది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో గల మొనౌన్ సరస్సు కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై 37 మంది మరణించారని చరిత్ర చెబుతోంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే.. న్యోస్ ఘటన జరిగుండేది కాదనే విమర్శలూ వెల్లువెత్తాయి. మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు. మొత్తానికి న్యోస్ సరస్సు ఓ విషాదంగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన చదవండి: బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా? -
karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్ విద్యార్థిని కాగా, బుధవారం రాత్రి 10:40కి బళ్లారిలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదేపదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. మెలకువ వచ్చి చూస్తే ఎవరో గుర్తించలేక పోయింది. భయపడిన యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అక్రమ సంబంధం బయట పడకూడదనే.. -
రాత్రికిరాత్రే వందలాది పక్షులు మృతి
-
Tirupati: సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో చిరుద్యోగి భారీ దందా
తిరుపతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఓ చిరుద్యోగి.. ఖరీదైన దుస్తులతో ఆర్భాటంగా కనిపిస్తాడు.. అధికారుల అండదండలతో రూ.కోట్లకు పడగలెత్తాడు.. సొంత సిబ్బంది సాయంతో యథేచ్ఛగా పైరవీలకు పాల్పడుతున్నాడు.. మామూళ్లు ముట్టజెప్పనిదే రిజిస్ట్రేషన్ సాగనివ్వడు.. తన ఆదేశాలను బేఖాతర్ చేస్తే నానా రభస సృష్టిస్తాడు.. ప్రశ్నించిన వారిని కించపరుస్తాడు.. అడ్డొచ్చిన వారిని హడలెత్తిస్తాడు.. కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరి కార్యాలయాన్నే శాసిస్తున్నాడు.. బదిలీ చేసినా మళ్లీ యథాస్థానానికే పోస్టింగ్ తెచ్చుకున్న ఘనుడు.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిరుద్యోగి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సాక్షి, తిరుపతి(చిత్తూరు): తిరుపతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వాటాల రగడ చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారులు తమ అవసరాల కోసం పెంచి పోషించిన అవినీతి వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించింది. పదేళ్ల క్రితం కారుణ్య నియామకం కింద కార్యాలయంలో చేరిన ఓ చిరుద్యోగి ధాటికి ప్రస్తుతం ఉన్నతాధికారులే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లోటుపాట్లను క్షుణ్ణంగా తెలిసిన సదరు ఉద్యోగి విధులు.. సిబ్బంది అడిగిన ఫైళ్లు, టీ, కాఫీలు తెచ్చివ్వడం. కానీ ఆయన ఏనాడూ ఆ పనిని చేసిన పాపాన పోలేదు. తాను సొంతంగా వేతనాలు చెల్లించి ముగ్గురు వ్యక్తులను నియమించుకుని, వారితో ఆయా పనులను చేయిస్తున్నాడు. వారి ద్వారా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లావాదేవీలను నడిపిస్తున్నాడు. ఆయన వైఖరిని భరించలేక బదిలీ చేసినా ట్రిబ్యునల్కు వెళ్లి మరీ తిరుపతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికే పోస్టింగ్ తెచ్చుకోవడం గమనార్హం. రిజిస్టేషన్కు రూ.2వేలు ప్రతి రిజిస్ట్రేషన్కు రూ.2వేలను సదరు చిరుద్యోగికి సమర్పించాల్సిందే. ఇలా రోజుకు సుమారు వంద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలిసింది. తాను నియమించుకున్న వ్యక్తుల ద్వారా ఈ సొమ్మును వసూలు చేయిస్తుంటాడు. మామూళ్ల నగదులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందికి సైతం వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాటాల పంపిణీలో వివాదం ఏర్పడడం వల్లే మంగళవారం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గొడవ జరిగిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఒక చిరుద్యోగి ఇంత భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పారదర్శక లావాదేవీలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనధికారిక సిబ్బంది కార్యాలయంలో యథేచ్ఛగా సంచరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రూ.కోట్లకు పడగలెత్తాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి సమాచారం ఇట్టే తెలుసుకుంటాడు. ఆయన నియమించుకున్న ముగ్గురు అనధికారిక ఉద్యోగులు రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఎవరు ఏ పనిచేశారు.. ఎవరికి ఎంత ముట్టింది అనే విషయాలను ఎప్పటికప్పుడు సదరు చిరుద్యోగికి అందిస్తుంటారు. డాక్యుమెంట్ రైటర్స్ పైనా పెత్తనం చేస్తుంటారు. మాట వినకుంటే దౌర్జన్యాలకు సైతం దిగుతుంటారు. ఇందుకోసం ముగ్గురికి రోజూ రూ.6వేల చొప్పున ఇస్తుంటాడు. ఆయన మాత్రం కనీసం రూ.50వేలు జేబులో వేసుకోనిదే ఇంటికి వెళ్లే ప్రసక్తే ఉండదని తెలిసింది. అక్రమ సంపాదనతో రూ.కోట్లు కూడబెట్టినట్లు సమాచారం. తిరుపతి నగర నడిబొడ్డులో మూడు భవనాలు, విలాసవంతమైన మూడు కార్లు, ఖరీదైన ఐదు మోటారుసైకిళ్లు ఆయన సొంతం. ఇవి కాకుండా మరిన్ని విలువైన ఆస్తులు ఉన్నట్లు పలువురు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆయన పూటకో వాహనంలో కార్యాలయానికి వస్తుంటాడు. చేతి పది వేళ్లకు ఉంగరాలు వేసుకుని ఖద్దర్ దుస్తులతో ఆర్భాటంగా తిరుగుతుంటాడు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! -
పశువులు మేపేందుకు వెళ్లిన మహిళపై అఘాయిత్యం.. ఆపై
సాక్షి, తుమకూరు(కర్ణాటక): పశువులు మేపేందుకు వెళ్లిన మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్యచేసి నగలతో ఉడాయించారు. ఈ ఘోరం తుమకూరు నగర సమీపంలోని బెట్టద బుడద వద్ద చోటు చేసుకుంది. చోటాసాబ్ పాళ్యకు చెందిన శివకుమార్ భార్య జయలక్ష్మి(35) రోజూ తరహాలోనే మంగళవారం ఉదయం పశువులను మేపడానికి కొండప్రాంతానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భర్త గాలిస్తూ కొండ వద్దకు వెళ్లాడు. అక్కడ జయలక్ష్మి విగతజీవిగా కనిపించింది. వంటిపై దుస్తులు చెదిరిపోవడం, మెడలోని మాంగల్యం చైన్, ఇతర బంగారు ఆభరణాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాత్సంద్ర పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: భర్త, పిల్లలు దూరమయ్యారనే మనస్తాపంతో.. -
సాయం చేయబోతే..ఫోన్ మాయం
సాక్షి, కల్లూరు (ఖమ్మం): బైక్పై నుంచి పడిన వ్యక్తిని పైకి లేపుదామని సాయం చేయబోయిన హెచ్ఎం ఫోన్ అపహరణకు గురైంది. నారాయణపురంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగా రామారావు పెనుబల్లి నుంచి వచ్చి మంగళవారం కల్లూరులోని ఎన్నెస్పీ బస్టాప్ వద్ద దిగారు. అకస్మాత్తుగా బైక్పై వచ్చిన ఓ యువకుడు అక్కడే కిందపడ్డాడు. ‘అబ్బా..లేపండి సార్’ అంటూ కోరడంతో సాయం చేస్తుండగా..అంతలోనే మరో వ్యక్తి వచ్చి చేరాడు. అతడిని పైకిలేపుతున్నట్లు నటిస్తూ రామారావు చొక్కా జేబులో ఉన్న రూ.30వేల ఫోన్ను తస్కరించి..అంతకుముందే పడిన యువకుడితో కలిసి పరారయ్యారు. కాసేపటి తర్వాత ఈయన తేరుకుని గుర్తించి..ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే..సాంకేతిక లోపంతో 15రోజులుగా సీసీ కెమెరాలు పని చేయట్లేదని వారు తెలపడంతో..ఉసూరుమంటూ నారాయణపురంలో పాఠశాల విధులకు వెళ్లిపోయారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతున్నారు.. కారణం ఏంటంటే..
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ భౌతిక శాస్త్రం క్వశ్చన్ పేపర్ కొందరు విద్యార్థుల సెల్ఫోన్కు రావడంతో బుక్లో అందులోని సమాధానాలు వెతుక్కుంటూ పరీక్షా కేంద్రం బాధ్యులకు పట్టుబడ్డారు. కళాశాల కేంద్రం వారు శాతవాహనకు సమాచారం అందించగా 9 మంది సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్యూ పరీక్షల విభాగం తెలిపింది. ఇలా జరిగింది...? డిగ్రీ 6,4వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 6వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఎస్సారార్ కళాశాల కేంద్రం వద్ద ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రం బయటే ఉండడాన్ని పరిశీలించిన ఎస్సారార్ అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి చూడగా సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతుండడం కనిపించింది. వెంటనే సెల్ఫోన్లు తీసుకొని చూడగా ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన ఎస్సారార్ అధ్యాపకులు శాతవాహన యూనివర్సిటీకి సమాచారమందించారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 9 సెల్ఫోన్లు సీజ్ చేసి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షల విభాగం అధికారులకు అప్పగించారు. ప్రశ్నాపత్రం లీక్పై విచారణ కమిటీ.. ఈ విషయాన్ని ఎస్యూ పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగప్రసాద్ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ దృష్టికి తీసుకెళ్లగా నలుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిటీ త్వరలోనే నిజానిజాలు తేల్చి సంఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. లీక్ చేసిందెవరు...? ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వ, కళాశాల, ప్రయివేట్ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపాల్/బాధ్యులకు ఆన్లైన్లో ఏ రోజుకారోజు పరీక్షా సమయానికి అరగంట ముందు మాత్రమే యూనివర్సిటీ నుండి వస్తుంది. దానిని ప్రింట్ తీసి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు అందిస్తారు. అరగంట ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా విద్యార్థుల సెల్ఫోన్లకు వెళ్లిందనే విషయాలు తెలియకుండా ఉన్నాయి. దీని వెనక యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారా.. లేదా కళాశాలల వారు ఉన్నారా అనే విషయాలు విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక కమిటీ వేశాం.. విద్యార్థుల సెల్ఫోన్కు ప్రశ్నాపత్రం వచ్చిన విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరుగుతుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బా«ధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ శ్రీరంగప్రసాద్, ఎస్యూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
గుప్తనిధుల కలకలం.. పురాతన రాతి శిల్పానికి డ్రిల్లింగ్..
సాక్షి, అమ్రాబాద్ (మహబూబ్నగర్): మండలంలోని రాయలగండిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం వెనక భాగంలో ప్రహరీ లోపల పురాతన రాతి శిల్పానికి డ్రిల్లింగ్ మిషిన్తో తవ్వినట్లు గుర్తించారు. ఆదివారం ఆలయ పూజారి మోహన్ గమనించి ఆలయ కమిటీ సభ్యులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. రెండు రోజుల క్రితమే గుర్తుతెలియని వ్యక్తులు ఈ తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. అయితే గతేడాది కూడా ఈ ఆలయం వద్ద తవ్వకాల కోసం వచ్చి ప్రజలను చూసి కారులో పారిపోతున్న కొంతమందిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు ఉంటాయనే ఆలోచనతో తవ్వకాలకు పాల్పడుతున్నారని, ఆలయానికి రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రైల్ టికెట్’తో చిక్కిన హంతకులు
-
వీడిన ఫాతిమా హత్య కేసు మిస్టరీ.. మొదటి భార్య గొడవ చేయడంతో..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఫాతిమా మిస్సింగ్ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. తయ్యబ్ సాయంతో ఫాతిమాను వాసిమ్ హత్య చేశాడని ఏడీసీపీ బాబురావు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన కేసు వివరాలను వెల్లడిస్తూ.. గత నెల 11న తేదిన చిట్టినగర్ పీఎస్ పరిధిలో నజీర్ అనే వ్యక్తి తన కుమారై కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఫాతిమా మానసిక రోగంతో బాధపడేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె వ్యాధి నయం చేయించడానికి యూపీకి చెందిన వాసిఫ్ అనే భూత వైద్యుడి దగ్గర చికిత్స కోసం తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తమ స్వస్థలానికి వచ్చిన వాసిఫ్ ఆమెకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకుపోయాడు. అక్కడి నుంచి సహారంగ్ పూర్లోని తన ఇంటికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. దీంతో వాసిఫ్ మొదటి భార్య గొడవకు దిగింది. ఈ క్రమంలో వాసిఫ్ .. ఫాతిమాను వదలించుకోవాలనుకున్నాడు. దీనికోసం తన స్నేహితుడు తయ్యబ్ సహకారం తీసుకున్నాడు. ఇద్దరు కలసి ఫాతిమాకు మాయమాటలు చెప్పి సహరంగ్పూర్లోని హత్నికుండ్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి జలశయంలో తోసేశారు. కాగా, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆమె మృత దేహం పోలీసులకు దొరికింది. కాగా, సహరంగ్ పోలీసులు సహకరంతో.. మృత దేహన్ని స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు.. నిందితులిద్దరినీ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడకు రప్పించారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో హజరుపర్చారు. నిందితులిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని మచిలీపట్నం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వాసిఫ్ వద్ద 60 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మాయగాళ్లను నమ్మవద్దని విజయవాడ పోలీసు అధికారి బాబూరావు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఙప్తి చేశారు. -
వాష్రూమ్ వెళ్లొస్తానని చెప్పిన యువతి.. ఎంతసేపటికీ రాకపోవడంతో..
సాక్షి, అడ్డగుట్ట(హైదరాబాద్): వాష్రూమ్కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తమిళ్నాడులోని రాణిపేట్ జిల్లాకు చెందిన మిని ఏంజెల్(22) తండ్రిపేరు బాబు థామస్, వృత్తి రీత్యా స్టాఫ్ నర్స్. ఈ నెల 29న మిని ఏంజెల్ కుటుంబ సభ్యులందరూ తమిళనాడు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి శబరి ఎక్స్ప్రెస్ కోసం ఎదురుచూస్తున్నారు. వాష్రూమ్ వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన మిని ఏంజెల్ ఎంతసేపటికీ రాకపోవడంతో అక్కడికి వెళ్లి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు జీఆర్పీ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య చేసి.. ఆత్మహత్యగా నాటకం..
సాక్షి, కెలమంగలం(కర్ణాటక): రెండు రోజుల క్రితం ఉరివేసుకొన్న స్థితిలో శవమైన మహిళ కేసును డెంకణీకోట పోలీసులు ఛేదించారు. భర్త, మరిదే నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. డెంకణీకోట సమీపంలోని కాడుముచ్చంద్రం గ్రామానికి చెందిన కూలి కార్మికుడు మారేగౌడ (38). ఇతని భారతి(28). బుధవారం మధ్యాహ్నం ఆమె ఉరివేసుకున్న రీతిలో చనిపోయింది. ఆమె తండ్రి బైరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. భర్త మారేగౌడు, మరిదిచూడేష్లు భారతిని హత్య చేసి ఉరివేసుకుందని అందరూ నమ్మేలా వేలాడదీసినట్లు విచారణలో తేలింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తేలింది. కళ్లల్లో కారం చల్లి నగలు చోరీ క్రిష్ణగిరి: మహిళ కళ్లల్లో కారం చల్లి నగలు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా కురుబరపల్లి సమీపంలోని సామంతమలై గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడివేలు భార్య పట్టు (45) సాయంత్రం నడుచుకుని వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి కళ్లల్లో కారంపొడి చల్లి, కత్తితో పొడిచి ఆమెపై ఉన్న నగలు దోచుకెళ్లారు. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగిరిన మనిషి.. హై అలర్ట్!
టెక్నాలజీ ఎంత వృద్ధి చెందుతున్నా.. దానికంటూ ఓ పరిధి ఉంటుంది. కానీ, అది పరిధి దాటి ప్రవర్తిస్తే.. ఆ టెక్నాలజీ మీదే అనుమానాలు ఏర్పడుతుంటాయి. అలాంటిదే ఈ ఘటన. ఆకాశంలో మనిషి స్వేచ్ఛా విహారం కోసం తయారు చేసిన రెక్కల సాంకేతికత ‘జెట్ప్యాక్’లు అమెరికాను బెంబేలెత్తిస్తున్నాయి. జెట్ప్యాక్ ధరించిన ఓ మనిషి.. అదీ వేల అడుగుల ఎత్తులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంలో ఇది నాలుగో ఘటన కాగా.. లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(LAX) దగ్గర్లో కనిపించడంతో భద్రతాపరమైన అనుమానాలు మొదలయ్యాయి. సాక్రమెంటో: బోయింగ్ 747 ఫ్లైట్ ఒకటి బుధవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే పైలెట్ అదరా బాదరాగా అధికారులకు ఒక రిపోర్ట్ చేశాడు. జెట్ప్యాక్ ధరించిన ఓ వ్యక్తి గాల్లో తేలుతుండడం చూశానని, ఎయిర్పోర్ట్కి 15 మైళ్ల దూరంలో ఐదు వేల అడుగుల ఎత్తున అతను కనిపించాడని రిపోర్ట్ చేశాడు ఓ పైలెట్. దీంతో మిగతా పైలెట్లు అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్త బయటకు లీక్ కావడంతో మీడియా ఛానెల్స్ అత్యుత్సాహం ప్రదర్శించాయి. సీబీఎస్ లాస్ ఏంజెల్స్ ఏకంగా యూఎఫ్వో, ఐరెన్మ్యాన్ అంటూ కథనాలు రాయడం కొసమెరుపు. ఎఫ్బీఐ అలర్ట్ జెట్ప్యాక్ మ్యాన్ కథల్ని మొదట్లో కాలిఫోర్నియా ప్రజలు ‘ఉత్త ప్రచారం’గా భావించారు. అయితే ఆగష్టు 2020లో అమెరికన్ ఎయిర్లైన్స్ పైలెట్ ఒకతను మూడు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ వేసుకున్న ఓ వ్యక్తిని చూశానని చెప్పాడు. ఆ తర్వాత అక్టోబర్లో చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ పైలెట్.. ఆరు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్మ్యాన్ను చూశానని వెల్లడించారు. ఇక అమెరికన్ ఎయిర్లైన్స్ పైలెట్ ఒకతను 300 యార్డ్ల దూరంలో తనకు అతిదగ్గరగా జెట్ప్యాక్మ్యాన్ను చూశానని చెప్పడం కలకలం సృష్టించింది. అంతేకాదు డిసెంబర్లో ఒక ఫుటేజీని రిలీజ్ చేయడం, అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ కూడా అది జెట్ప్యాక్ మ్యాన్ అని నిర్ధారించడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు తాజా ఘటన తర్వాత ఎఫ్బీఐ అప్రమత్తం అయ్యింది. హై అలర్ట్ ప్రకటించి.. డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు అధికారులు. అంత ఎత్తు సాధ్యమేనా? ప్రపంచవ్యాప్తంగా జెట్ప్యాక్ తయారీ కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో లైసెన్స్లతో అమ్మేవి కొన్నే అతితక్కువ మాత్రమే. అయితే జెట్ప్యాక్లో ఇంధనం ఎంత ఎత్తుమేర ఎగరడంలో సపోర్ట్ చేస్తాయనేదానిపై కంపెనీలపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. కాలిఫోర్నియాకు చెందిన జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ.. జెట్ప్యాక్ల సాయంతో గరిష్టంగా పదిహేను వేల అడుగుల ఎత్తుకు ఎగరొచ్చని ఆ మధ్య ప్రకటించుకుంది. కానీ, ఆ కంపెనీ సీఈవో డేవిడ్ మయన్ మాత్రం అది అసాధ్యం అని ఇప్పుడు అంటున్నాడు. జెట్ప్యాక్లతో మనిషి పదిహేను వందల అడుగుల ఎత్తు వరకు వెళ్లడం సాధ్యమవుతుంది. అంతకు మించి వెళ్తే ఇంధన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక చైనా ఎయిర్లైన్స్ పైలెట్ చెప్పిన ఆరువేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ మ్యాన్ నిజం అయ్యి ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు మయన్. ఇదిలా ఉంటే ప్రముఖ ఏవియేషన్ కంపెనీ ‘జెట్మన్ దుబాయ్’.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో పైలెట్ విన్స్ రెఫెట్ ద్వారా ఆరు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ ప్రయోగం చేయించింది. అయితే ఒక రెక్కలో సాంకేతిక ఇబ్బంది తలెత్తడంతో ఆ ప్రయోగం విఫలమైంది. అయినప్పటికీ.. పారాషూట్సాయంతో సేఫ్గా ల్యాండ్ అయ్యాడు రెఫెట్. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన తొమ్మిది నెలల తర్వాత ఓ ట్రైనింగ్ యాక్సిడెంట్లో రెఫెట్ మరణించాడు. -
వికెట్ కీపర్గా మొదలెట్టాడు.. మిస్టరీ స్పిన్నర్లా రాణిస్తున్నాడు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల వరుణ్ చక్రవర్తి.. మిస్టరీ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, అతని బౌలింగ్లో ఉన్న మిస్టరీ.. అతని జీవన ప్రయాణంలోనూ కొనసాగుతుంది. వికెట్ కీపర్గా క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వరుణ్.. ప్రస్తుతం వైవిధ్యమైన బౌలర్గా రాణిస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కెరీర్ ప్రారంభించిన అతను 17 ఏళ్ల వరకు అలానే కొనసాగాడు. అయితే వికెట్ కీపర్గా పెద్దగా రాణించకపోవడంతో క్రికెట్ను పక్కనపెట్టేసి చదువుపై దృష్టిసారించాడు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్రిలాన్స్ ఆర్కిటెక్ట్గా పనిచేశాడు. కానీ ఆ పని కిక్ ఇవ్వకపోవడంతో మళ్లీ 23 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అయితే ఈసారి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కాకుండా మీడియం పేసర్ అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. కానీ మొకాలి గాయం కావడంతో పేస్ బౌలింగ్ను వదిలేసి స్పిన్నర్గా అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో స్పిన్నర్స్ను బాగా కొడతారని భావించిన ఈ తమిళనాడు కుర్రాడు.. తన స్పిన్కు పేస్ను జోడించి విభిన్నమైన వేరియేషన్స్లో బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్స్, ఆర్మ్ బాల్స్ ఇలా మొత్తం ఏడు రకాల వేరియేషన్స్ తో బౌలింగ్ చేసేవాడు. ఒకే ఓవర్లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ వంటి విభిన్నమై వేరియేషన్స్తో బంతులు వేయడం, దానికి పేస్ జోడించడంతో బ్యాట్స్మెన్ తెగ ఇబ్బంది పడేవారు. అనంతరం 2017లో సీఎస్కే నెట్ బౌలర్గా అవకాశం దక్కించుకున్న వరుణ్.. మాజీ కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ దృష్టిని ఆకర్శించాడు. డీకే పట్టుపట్టి మరీ వరుణ్ను కేకేఆర్ నెట్ బౌలర్గా ఎంపిక చేయించాడు. అక్కడ సునీల్ నరైన్ సాయంతో మెళకువలు నేర్చుకున్న వరుణ్.. మిస్టరీ స్పిన్నర్లా మారాడు. దీంతో 2019 ఐపీఎల్ వేలంలో కింగ్స్ పంజాబ్ జట్టు వరుణ్ను రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం 2020 సీజన్లో కేకేఆర్ మేనేజ్మెంట్ వరుణ్ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన అతను 17 వికెట్లు తీశాడు. తాజా సీజన్లోనూ అద్భుతంగా రాణించిన వరుణ్.. 7 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వరుణ్.. గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో అతనికి చోటు దక్కింది. కానీ భుజ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లోనూ అవకాశం దక్కింది. అది కూడా యోయో ఫిట్నెస్ టెస్ట్ అధిగమించకపోవడంతో చేజారింది. -
ఆ ఊర్లో ఏదో జరుగుతుంది.. వరుస మరణాలతో ఆందోళన
తాంసి(బోథ్): వరుస మరణాలతో ఆ గిరిజనం మనసు కీడు శంకిస్తోంది. గ్రామానికి ఏదో కీడు జరిగిందని.. మరణాలకు అదే కారణమని భయం వెంటాడుతోంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి బేతాళ్గూడ గ్రామం నుంచి ఒక్కో కుటుంబం ఇళ్లను ఖాళీ చేసి వెళ్తోంది. ఇక్కడ 20 గృహాలు, 60 మంది జనాభా ఉంటుంది. కొన్ని నెలలుగా వీరు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. మృతులంతా పురుషులే. రెండేళ్లలో 12 మంది మరణించినట్లు సమాచారం. జూన్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా అదే కుటుంబంలో మూడు నెలల కిందట ఒకరు, ఆరు నెలల కిందట మరొకరు అనారోగ్యంతో చనిపోయారు. గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామస్తుల్లో భయం మొదలైంది. గ్రామంలో ఉంటే తామూ చనిపోతామని ఊరు వదిలి వెళ్లారు. బేతాళ్గూడకు రెండు కిలోమీటర్ల దూరంలోని అంబుగాం గ్రామ పాఠశాల సమీపంలో తొమ్మిది కుటుంబాలు తాత్కాలిక షెడ్లు వేసుకున్నాయి. వామన్నగర్ గ్రామంలో మరో ఐదు కుటుంబాలు షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నాయి. అంతుచిక్కని మరణాలు.. గిరిజనులు ఎలా మృతిచెందారో అంతుచిక్కడం లేదు. మరణానికి కారణం అనారోగ్యమా..? సీజనల్ వ్యాధులా..? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలా..? అనేది ఎవరికీ తెలియడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజనులకు సరైన అవగాహన కలి్పంచడం లేదు. మరణాలకు కారణాలు తెలుసుకుని గ్రామస్తులకు అవగాహన కలి్పస్తే ప్రజలు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం వెనుక మిస్టరీ ఇదేనా..!
సాక్షి, విశాఖపట్టణం: మూడు రోజుల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్లో అదృశ్యమైన ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా లభించలేదు. బ్లాస్ట్ ఫర్నేస్లో ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అతడు లేఖ రాసి అదృశ్యమయ్యాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం కోసం ఆత్మహుతి అవుతున్నట్టు లేక రాసి కనిపించకపోవడం కలకలం రేపింది. అయితే ఆయన అదృశ్యం వెనుక మిస్టరీ దాగి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీనివాసరావు కాల్ డేటా బట్టి పలువురిని విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అతడి గురించి పలు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. ఉద్యోగాల పేరిట పలువురు వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్టు శ్రీనివాస్పై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొందరు బాధితులు బయటకు వస్తున్నారు. శ్రీనివాసరావు పని చేసిన స్టీల్ వైర్ రాడ్ మిల్ ఈ విభాగంలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. జాగిలాలు అతను కూర్చున్న ప్రదేశం నుంచి బ్లాస్ట్ ఫర్నేస్కు అక్కడి నుంచి వాహనం పార్కింగ్ చేసిన ప్రదేశం వరకు వెళ్లాయి. ఈ దశలో బ్లాస్ట్ ఫర్నేస్లోకి వెళ్లే అవకాశాలు తక్కువ కావడంతో శ్రీనివాసరావు మరో చోట ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గాజువాక సింహగిరి కాలనీలో ఉంటున్న శ్రీనివాస రావు భార్య సుమ ఆధ్యాత్మక చింతనతో పలువురితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ పరిచయాలతో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శ్రీనివాస రావు పలువురు వద్ద లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఆ డబ్బుతోనే గాజువాక మురళీనగర్ పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున భవంతులు నిర్మించుకున్నాడని బాధితులు చెబుతున్నారు. శ్రీనివాస రావు అదృశ్యమైన రోజే తమకు ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుతాయని చెప్పినట్లు బాధితులు వాపోయారు. తమను నమ్మించి మోసగించాడని ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సాకుగా చూపించి మోసం నుంచి బయట పడాలని శ్రీనివాసరావు ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఆచూకీ కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. చదవండి: ఏం తెలివబ్బా.. మాస్క్తో హైటెక్ కాపీయింగ్ -
వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..?
రాయవరం: మండలంలోని వి.సావరం గ్రామ పరిధిలో ఇటుకుల బట్టీ వద్ద ఈనెల 24న కిడ్నాప్కు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు మూడు రోజులుగా ఆ చిన్నారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్నపాటి క్లూ కూడా దొరకకపోవడంతో వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్కు గురైన చైతన్యకుమార్ అసలు ఏమయ్యాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు కిడ్నాప్ అయ్యాడా? లేకుంటే కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న డ్రైన్లో పడిపోయాడా? అనేది మిస్టరీగానే ఉంది. చైతన్యకుమార్ తల్లిదండ్రులు పనిచేస్తున్న బట్టీలో పని చేస్తున్న మహిళ బాలుడిని మోటార్ సైకిల్పై తీసుకెళుతుండగా చూసానని చెప్పడంతో బాలుడి కిడ్నాప్ అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో అనపర్తి సీఐ భాస్కర్రావు, రాయవరం ఎస్సై సురేష్ దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి: కిడ్నాప్ కు గురైనట్టుగా భావిస్తున్న రెండున్నరేళ్ల బాలుడు చైతన్య కుమార్ తల్లిదండ్రులు దుర్గాభవానీ, లోవరాజులను వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు బుధవారం పరామర్శించారు రాయవరం ఇటుకల బట్టీలో నివాసం ఉంటున్న దుర్గాభవాని, లోవరాజులను కలిసి బాధ పడవద్దు ధైర్యంగా ఉండండి.. మీకు అండగా ఉంటాం అంటూ వారికి ధైర్యం చెప్పారు. బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొంటారని భరోసా ఇచ్చారు. చైతన్యకుమార్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను త్రిమూర్తులు ఆరా తీశారు. సంఘటనా స్థలం నుంచి రామచంద్రపురం డీఎíస్పీ బాలచంద్రారెడ్డితో త్రిమూర్తులు ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదన్నారు. బాలుడిని కనుగొనేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామన్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు.. -
ఇంకా మిస్టరీగానే చిన్నారి కిడ్నాప్ కేసు
రాయవరం: రాయవరంలో కిడ్నాప్కు గురైన చిన్నారి వేమగిరి చైతన్యకుమార్ 48 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. ఈనెల 24న రెండున్నరేళ్ల చైతన్యకుమార్ కిడ్నాప్కు గురైనట్టుగా రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు, ఎస్సై సురేష్ల ఆధ్వర్యంలో ఐదు దర్యాప్తు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఒక బృందం చైతన్యకుమార్ తల్లిదండ్రుల స్వగ్రామమైన అడ్డతీగల మండలం డొక్కపాలేనికి వెళ్లి విచారణ చేశారు. అసలు బాబు కిడ్నాప్కు గురయ్యాడా? లేక తుల్యభాగ డ్రైన్లో పడిపోయాడా? ఇలా అంతుచిక్కని ప్రశ్నలతో పోలీసులు తలలు పట్టుకుంటుండగా.. తమ చిట్టికన్న ఏమయ్యాడో!, ఎక్కడున్నాడో! అని తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా నీరసించి తమ కుమారుడి ఆచూకీ కోసం కుమిలిపోతున్నారు. వలలతో గాలింపు చైతన్యకుమార్ కిడ్నాప్కు గురైనట్టుగా చెబుతున్న వి.సావరం ఇటుకల బట్టీ వద్ద, రాయవరం గ్రామ పరిధిలోని లోవరాజు, దుర్గాభవానీలు నివాసం ఉంటున్న బట్టీ వద్ద పోలీసులు మరోమారు దర్యాప్తు చేపట్టారు. చైతన్యకుమార్ కనిపించకుండా పోయిన బట్టీకి ఎదురుగా తుల్యభాగ మేజర్ డ్రైన్ ఉండడంతో, డ్రైన్లో బాలుడు పడిపోయి ఉండి ఉండవచ్చనే అనుమానంతో గాలింపు చేపట్టారు. డ్రైన్లో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టడంతో పాటుగా, డ్రైన్కు అడ్డంగా వల కట్టారు. అలాగే కాకినాడ నుంచి తీసుకుని వచ్చిన స్నిఫర్ డాగ్తో బాలుడి ఆచూకీకి ప్రయత్నించారు. స్నిఫర్ డాగ్ రెండు బట్టీల వద్దకు వెళ్లింది. తలలు పట్టుకుంటున్న పోలీసులు 48 గంటలు దాటినా బాలుడి ఆచూకీ లభించక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఘటనా స్థలానికి నాలుగు వైపులా ఉన్న గ్రామాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. కనీసం ఏ ఒక్క చిన్న క్లూ లభించినా, దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు అవకాశం ఉండేది. అసలు బాలుడు కిడ్నాప్కు గురయ్యాడా? తుల్యభాగ మేజర్ డ్రైన్లో పడి పోయాడా? అంటూ పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. సెల్ టవర్ల ద్వారా కాల్ డేటాను పరిశీలించే పనిలో పడ్డారు. -
అదృశ్యవాణి: మిస్టరీ రేడియో స్టేషన్
రష్యాలో ఒక రేడియో స్టేషన్ దాదాపు నలభయ్యేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తోంది. దీని నుంచి ఇరవై నాలుగు గంటలూ సిగ్నల్స్ వెలువడుతూనే ఉంటాయి. రేడియో సెట్లు, ట్రాన్సిస్టర్లలో ఈ స్టేషన్ను ట్యూన్ చేస్తే, ఆగి ఆగి నిమిషానికి 25 సార్లు ఒక విచిత్రమైన ధ్వని వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరో ఒకరి గొంతు నుంచి ప్రత్యక్ష ప్రసారాలు కూడా దీని నుంచి వెలువడుతూ ఉంటాయి. దీనిని ఎవరు నడుపుతున్నదీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. తొలిసారిగా దీని ఉనికిని 1982లో జనాలు తెలుసుకున్నారు. అప్పటి నుంచి గమనిస్తున్నా, ఏనాడూ దీని నుంచి వెలువడే విచిత్రమైన ధ్వనికి, అప్పుడప్పుడు వెలువడే ప్రసారాలకుగాని ఏమాత్రం అంతరాయం కలగలేదు. ఇది ఆర్మీ రహస్య కార్యకలాపాలకు చెందినది కావచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి. అయితే, దీనిని నిర్వహిస్తున్నట్లుగా రష్యా ప్రభుత్వం గాని, సైన్యం గాని ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారానికి రెండు మూడుసార్లు ఈ రేడియో స్టేషన్ నుంచి వ్యవసాయ నిపుణుల సలహాలు, పశువుల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. ఈ రేడియో స్టేషన్ ప్రసారాలు 4625 కిలోహెర్ట్›్జ ఫ్రీక్వెన్సీలో ప్రసారమవుతుంటాయని మాత్రమే జనాలకు తెలుసు. అంతకు మించిన వివరాలేవీ ఎవరికీ తెలీదు. దీని పేరేమిటో కూడా తెలీదు. దీని నుంచి వెలువడే సిగ్నల్ ధ్వని కారణంగా జనాలే దీనికి ‘ఎండీజెడ్హెచ్బీ’ (ఎంజేబీ అని పలకాలి) అని పేరు పెట్టుకున్నారు. రష్యన్ మాటలో ఈ మాటకు ‘బజర్’ అనే అర్థం ఉంది. ∙ -
డెత్ మిస్టరీ
-
కరోనా మిస్టరీలు.. మైసూరు రహస్యం?
జ్వరం... దగ్గు... జలుబు ఉంటే కరోనా కావచ్చు.. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లారా... మీకు వైరస్ సోకి ఉండవచ్చు.. మీ పరిసరాల్లో ఎవరైనా కరోనా రోగి ఉన్నారా? అయితే మీరూ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ! ఇటీవలి కాలంలో తరచూ వింటున్న మాటల్లో ఇవి కొన్ని. వాస్తవాలు కూడా.. అయితే... దాదాపు వంద రోజుల కరోనా ప్రస్థానంలో అన్నీ మనకు తెలిసినవే లేవు. తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయి... శాస్త్రవేత్తల మెదళ్లను వేడెక్కిస్తున్నవి కూడా బోలెడున్నాయి! మైసూరు రహస్యం? మైసూరు జిల్లా నంజనగూడులో ఓ 35 ఏళ్ల కరోనా బాధితుడున్నాడు. పేషెంట్ 52.. అని పిలుద్దాం ఇతడిని. ఫార్మా కంపెనీలో ఉద్యోగం. మార్చి 26న వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విదేశాలకు పోయింది లేదు... కరోనా రోగులతో కాంటాక్ట్ అయ్యిందీ లేదు. పది రోజులు తిరక్కుండానే పేషెంట్ 52 పనిచేసే ఫార్మా కంపెనీలో మరో 24 మంది కూడా వైరస్ బారిన పడ్డారు. ఎలా...? మైసూరు జిల్లా యంత్రాంగం ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే పనిలోనే ఉంది. ఇప్పటికైతే మార్చి నెలలో చైనా నుంచి వచ్చిన ఓ ప్యాకేజీపై అనుమానం వ్యక్తమవుతోంది. మందుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి చెన్నైకి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంజనగూడుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్యాకేజీ నమూనాలను సేకరించి పుణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరలాజీకి పంపామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు అధికారులు. చైనాలో వైరస్ ఉధృతి బాగా ఉందని తెలిసీ మందులెలా తెప్పించారని.. ఆ కంపెనీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేస్తూ ఉండగా.. అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ప్యాకేజీ ద్వారా వైరస్ వ్యాపిస్తుందా? అని ప్రశ్నించుకుంటే ఇండియన్ డ్రగ్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ఒక ప్రకటనను గుర్తు చేసుకోవాలి. చైనాలోని హుబే ప్రాంతం నుంచే మనకు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు వస్తున్నాయని, ఆ ప్యాకేజీల ద్వారా వైరస్ సోకేందుకు అవకాశాలు లేకపోలేదని ఈ సంస్థ అప్పట్లో హెచ్చరించింది. ఏ విషయమూ స్పష్టంగా తెలిసేంత వరకూ పేషెంట్ 52కు వైరస్ ఎలా సోకింది అనేది మిస్టరీగానే ఉండిపోతుంది. పులిరాజాకు వైరస్ ఎలా వచ్చింది? న్యూయార్క్లో ఓ మలేసియా పులికి కరోనా వైరస్ సోకిందనే వార్త మీరు చదివే ఉంటారు. కానీ ఎలా వచ్చిందనేది మాత్రం ఇప్పటివరకూ ఓ మిస్టరీనే. బ్రాంక్స్ జంతు ప్రదర్శనశాల సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలోనే ఉన్నారు. లక్షణాలేవీ కనిపించని మానవ కరోనా బాధితుడి నుంచి నాదియా అని పిలుస్తున్న పులికి వైరస్ సోకి ఉంటుందని కొంతమంది అంచనా వేస్తున్నప్పటికీ... సిబ్బందిలో ఎవరికీ కరోనా లేదని పాల్ కల్లే అనే వైద్యుడు చెబుతుండటం గమనార్హం. అడవిలో ఉండే జంతువులను మచ్చిక చేసుకోవడం లేదా వేటాడటం వల్ల వాటిల్లోని వైరస్లు మనిషికి సోకుతాయని మనకు తెలుసుగానీ.. నాదియా విషయంలో జరిగింది దీనికి పూర్తిగా భిన్నం. మనిషి నుంచి జంతువుకు వైరస్ సోకింది? మార్చి 27.. ఇది ఈ పులికి వైరస్ సోకిందని తెలిసిన రోజు. అయితే అంతకు 11 రోజుల ముందే జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. అమెరికాలో వైరస్ కేంద్రంగా మారిన న్యూయార్క్లోనే ఈ జంతు ప్రదర్శనశాల ఉంది కాబట్టి కరోనా బాధితుల్లో ఒకరి నుంచి నాదియాకు సోకి ఉండవచ్చని అనుకున్నారు. కానీ దీన్ని నిరూపించడం ఎలా? అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షించినా, ముక్కులోని ద్రవాలు, రక్తం వంటి వాటిని సేకరించి, పరీక్షించి జంతువుల కోసమే ఉద్దేశించిన పరీక్షలు కూడా నిర్వహించారు. మనుషులకు సోకిన కరోనా వైరసే నాదియా శరీరంలోనూ ఉన్నట్లు స్పష్టమైంది. ఎలా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఒకవేళ మనుషుల నుంచి జంతువులకు సోకి ఉంటే మాత్రం భవిష్యత్లో పెద్ద చిక్కే పొంచి ఉన్నట్లు.. ఆ మరణం ఎలా? కేరళలో కరోనా కారణంగా ఇటీవల ఒక వ్యక్తి మరణించారు. పోతెన్కోడ్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తికి కరోనా వైరస్ ఎలా సోకిందని ఆరా తీసేందుకు వైద్యాధికారులు చేసిన ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువులు, స్నేహితుల నుంచి తాజాగా సేకరించిన 19 నమూనాలు నెగెటివ్గా తేలగా.. అంతకుముందు సేకరించిన 97 నమూనాల్లోనూ వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. పోనీ ఆ వ్యక్తి వివాహం, ప్రార్థన, సమావేశం, అంత్యక్రియల్లాంటి వాటిల్లో పాల్గొన్నాడా? అని పరిశీలించినా అలాంటి ఆధారమేదీ కనిపించలేదు. దీంతో ఈ కేసును ఎవరికీ సంబంధం లేనిదిగా గుర్తించి వదిలేద్దామన్న ఆలోచనలో ఉన్నారు వైద్య సిబ్బంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉండే ఈ పోతెన్కోడ్లో కొన్ని పాజిటివ్ కేసులు ఉన్నప్పటికీ అవన్నీ ఎలా వచ్చాయో స్పష్టమైంది. సమూహ వ్యాప్తికి మాత్రం ఆస్కారం లేదని ఇప్పటికే తీర్మానించారు. పోతెన్కోడ్లో మరణించిన వ్యక్తి మార్చి 10న కరెంటు ఆఫీసుకు వెళ్లాడని అంతకుముందు ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యాడని గుర్తించగలిగారు కానీ.. ఈ ప్రాంతాల నుంచి పాజిటివ్ కేసులేవీ లేవు. రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పుడు కూడా ఈ వ్యక్తి ఎలాంటి లక్షణాలు కనపరచలేదు. జర్మనీలో తక్కువ మరణాలకు కారణం... ప్రపంచం మొత్తమ్మీద శనివారం నాటికి కోవిడ్–19 బారిన పడి మరణించినవారు లక్షకుపైమాటే. అయితే చనిపోతున్న వేగం దేశాన్ని బట్టి మారుతోంది. కానీ.. జర్మనీలో ఇది అతి కనిష్టంగా ఎందుకు ఉందన్నది మాత్రం శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. వరల్డో్డమీటర్ వెబ్సైట్ లెక్కల ప్రకారం.. శనివారం జర్మనీలో 1.22 లక్షల మంది వ్యాధి బారిన పడగా 2,736గా ఉంది. ఇదే సమయంలో ఇటలీలో 1.47 లక్షల కేసులకు గాను మరణించిన వారు 18 వేలకుపైమాటే. స్పెయిన్లో 1.61 లక్షల కేసులకు గాను 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం ఏమిటన్నది తమకు అర్థం కావడం లేదని అంటున్నారు జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ అధికార ప్రతినిధి మారెకీ డీగెన్. ఆరోగ్యశాఖకు చెందిన ఈ సంస్థ వైరస్ కట్టడి చర్యలను పర్యవేక్షిస్తోంది. ఇటలీ, జర్మనీ రెండింటిలోనూ వయో వృద్ధులు ఎక్కువైనా ఒక దేశంలోనే ఎక్కువ మంది బలికావడం గమనార్హం. జర్మనీలో ఇతర దేశాల కంటే భిన్నంగా తీసుకున్న చర్యలు కూడా ఏవీ లేవు. కాకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు బాగా పనిచేస్తాయని వైరాలజిస్ట్ సెంట్మెర్ తెలిపారు. మరణాలు తక్కువగా ఉండేందుకు ఇదో కారణం కావచ్చునని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు కరోనా కోసం వేగంగా ఎక్కువమందికి పరీక్షలు జరపడం కూడా తమకు ఉపయోగపడి ఉండవచ్చని.. బాధితులను తొందరగా గుర్తించడం ద్వారా చాలామంది ప్రాణాలు దక్కి ఉండవచ్చునని వివరించారు. శేష ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.. కరోనా వైరస్కు సంబంధించి ఇంకా చాలా మిస్టరీలే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 23 రోజుల పసికందుకు ఈ వ్యాధి సోకిందని తెలిసింది. అలాగే కొంత కాలం క్రితం లండన్లోనూ ఓ నవజాత శిశువు వైరస్ కోరల్లో చిక్కుకుంది. ఇలా ఒకట్రెండు సంఘటనలను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఈ వైరస్ బారిన పడింది చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 11 వరకూ ఉన్న లెక్కల ప్రకారం తొమ్మిదేళ్ల లోపు వయసున్న వారు ఒక్క శాతం మాత్రమే ఉండగా, పది నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారు కూడా ఇదే స్థాయిలో ఉన్నారు. మరోవైపు 50 –59 మధ్య వయసుల వారి శాతం 25 కాగా, 60– 69 మధ్య వయసుల వారి శాతం 19గా ఉంది. జలుబు కలిగించే వైరస్లకు పిల్లలు అలవాటు పడి ఉండటం వల్ల ఇలా జరుగుతోందని కొందరు చెబుతున్నా స్పష్టమైన కారణాలైతే తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అధిక రక్తపోటు ఉన్న వారు కరోనా కారణంగా మరణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంపై కూడా శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇలాంటి వారిలో గుర్తించిన ఇతర సమస్యలు ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్కు చెందిన టామ్ వింగ్ఫీల్డ్ అంటున్నారు. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువ మంది మధుమేహులు అయ్యేందుకు, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోయేందుకు అవకాశాలు ఉంటాయని, అయితే ఈ కారణాలతోనే కోవిడ్ బారిన పడినప్పుడు వీరు మరణిస్తున్నారా? అన్నది నిర్ణయించాల్సి ఉంది. తండ్రికి వైరస్.. కొడుక్కి నెగెటివ్.. కర్ణాటకలోని బాగల్కోటలో 75 ఏళ్ల వ్యక్తి ఇటీవల కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈయన స్వయంగా విదేశాలకు వెళ్లిందీ లేదు. ఇరుగు పొరుగులో ఎవరికీ వైరస్ కూడా సోకలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈయన కొడుకు బెంగళూరు నుంచి వచ్చాడని తెలుసుకున్న అధికారులు.. ముసలాయనకు వైరస్ ఎలా సోకిందో అర్థమైపోయిందనుకున్నారు. కొడుక్కు పరీక్షలు చేయించారు. ఆశ్చర్యకరంగా అతడిలో వైరస్ లేదని నిర్ధారణ అయ్యింది. అదెలా? అని జిల్లా యంత్రాంగం తలబద్దలు కొట్టుకుంటూనే ఉంది. ఈ లోపు ఆ ముసలాయన నివసించిన ఇంటి నుంచి కనీసం అర కిలోమీటర్ దూరం వరకూ మొత్తం బంద్ పెట్టేశారు. ఒక్కో ఇంటికి వెళుతూ ఎవరైనా కోవిడ్ బారిన పడి తమకు తెలపకుండా ఉన్నారా? అని వెతకడం మొదలుపెట్టారు. చనిపోయిన వ్యక్తి నూనెలు అమ్ముకునే వ్యక్తి కావడంతో అతడి వినియోగదారుల్లో ఎవరైనా వైరస్ను మోస్తూ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చివరకు ఈ వెతుకులాట ఫలితంగా పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది. బెంగళూర్ నుంచి వచ్చిన కొడుకు మరో ఆరుగురితో కలసి ప్రయాణించాడని.. హమ్మయ్యా అనుకున్న పోలీసులు వారందరినీ వెతికి నిర్బంధంలో ఉంచారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు కూడా. వీరిలో ఎవరికైనా వైరస్ ఉందని స్పష్టమైతే ముసలాయనకు వ్యాధి ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. లేదంటే..? ముందు నెగెటివ్.. తర్వాత పాజిటివ్... కరోనా వైరస్ పుట్టిల్లు వూహాన్లో వైద్యులకు, శాస్త్రవేత్తలకు అంతుపట్టని మిస్టరీ ఒకటి చోటు చేసుకుంటోంది. ఒకసారి కరోనా బారిన పడి తేరుకున్న వారిలో ముందుగా నెగెటివ్ సూచించినా... కొంత సమయం తర్వాత పరీక్షల్లో పాజిటివ్ రావడం ఆశ్చర్యపరుస్తోంది. మార్చి 18 నుంచి 22 మధ్య వూహాన్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో గత ఏడాది డిసెంబర్ ఆఖరులో మొదలైన వైరస్ శాంతించిందని భావించారు. కానీ.. వ్యాధి నయమైన కొందరిలో మళ్లీ వైరస్ కనిపించింది. వూహాన్లోని వేర్వేరు క్వారంటైన్ కేంద్రాల సమాచారం మేరకు ఐదు నుంచి పది శాతం మందిలో మళ్లీ పాజిటివ్ కనిపిస్తోంది. వీరిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడం మిస్టరీగా మారింది. కొన్ని రోజుల నుంచి వారాల వ్యవధిలో రెండో పరీక్ష జరగ్గా అంత వేగంగా వైరస్ మళ్లీ సోకే అవకాశాలు తక్కువేనని వైరాలజిస్టులు చెబుతున్నారు. మొదటిసారి పరీక్షల్లో వారికి తప్పుగా నెగెటివ్ వచ్చిందా. తరువాతి పరీక్షల్లో తప్పు జరిగిందా? అన్నది అర్థం కావడం లేదు. రెండో పరీక్షలో పాజిటివ్గా తేలిన వారు వైరస్ను వ్యాపింపజేస్తారా? లేదా? అన్నది కూడా స్పష్టంగా తెలియకపోవడంతో ప్రస్తుతానికి వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. చైనాలో సార్స్ తరహా వైరస్ ఒకటి వ్యాపిస్తోందని అందరికంటే ముందుగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్ లియంగ్కు కూడా చాలాసార్లు నెగెటివ్ వచ్చిన తరువాత గానీ ఒకసారి పాజిటివ్ రాలేదు. అయితే చైనాలో వైరస్ నిర్ధారణకు ఉపయోగిస్తున్న న్యూక్లియిక్ ఆసిడ్ టెస్ట్ కచ్చితత్వం తక్కువని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ వాంగ్ చెన్ స్వయంగా ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. -
కల్తీ కేక్ తినడం వల్లే తండ్రీకొడుకులు మృతి
-
దీప్తిశ్రీ కిడ్నాప్ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం!
సాక్షి, కాకినాడ: కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 48 గంటలైన చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. జగన్నాథపురంలో చిన్నారి చదువుతోన్న స్కూల్ ఆవరణంలో కిడ్నాప్కు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటున్న దీప్తిశ్రీని సవతితల్లి తీసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తల్లి తీసుకెళ్లడంతో తాము ఏమి అడగలేకపోయామని అంటున్నారు. ఆ తర్వాత చిన్నారి కనిపించడం లేదని తండ్రి తమ దగ్గరకు వచ్చారని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. శాంతికుమారినే ఏమైనా చేసి ఉంటుందంటున్నారు. -
ఝాన్సీ ఆత్మహత్యపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి సువ్వాడ నాగ ఝాన్సీ(21) ఆత్మహత్యపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఈ కేసులో అభయోగాలను ఎదుర్కొంటున్న సూర్యను పోలీసులు విచారించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె కాల్ డేటా, వాట్సప్ చాటింగ్లను పరిశీలిస్తున్నామని వివరించారు. చనిపోవడానికి ముందు 14 వాట్సప్ మెసెజ్లు చేసినట్లు సమాచారం. సెల్ఫీ వీడియోలో ఏముంది? ఝాన్సీ చనిపోవడానికి ముందు తన అత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం. అయితే ఆ వీడియోలో ఏముందో పోలీసులు బయటకు చెప్పకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఝాన్సీ తన అపార్ట్మెంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్యా? ప్రేరేపిత ఆత్మహత్యా? హత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య) -
రేప్ బెదిరింపులతోనే భయ్యూ ఆత్మహత్య
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్(50) ఆత్మహత్య వెనుక మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానని సేవకురాలు పలక్ పురాణిక్(25) బెదిరించడంతోనే 2018, జూన్ 12న భయ్యూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇండోర్ డీఐజీ మిశ్రా తెలిపారు. తగు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆశ్రమానికి చెందిన వినాయక్(42), శరద్(34)లు పలక్తో చేతులు కలిపి భయ్యూ మహారాజ్కు హైడోస్ మందులు ఇచ్చారని వెల్లడించారు. వీరంతా కలిసి ఆయన్ను ఆత్మహత్యకు పురిగొల్పా రని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిందన్నారు. -
ఠాణాలో ప్రత్యక్షమైన చంద్రముఖి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జండర్ చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్లోని బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో ఆమె ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం చంద్రముఖి కనిపించకుండా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రాన్స్జండర్లు ఓ వైపు ఆందోళనకు దిగగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. గురువారంలోగా చంద్రముఖిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించడంతో బంజారాహిల్స్ పోలీసులు హుటాహుటిన లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇది జరిగిన 12 గంటల వ్యవధిలోనే చంద్రముఖి పోలీస్స్టేషన్లో ప్రత్యక్షమైంది. ఆమె నోరు విప్పితేగానీ అసలు ఏం జరిగిందన్న విషయం తెలియదు. -
అంతుచిక్కని మిస్టరీ..!
అల్లిపురం(విశాఖ దక్షిణ): సీసీఎస్లో లాకప్ డెత్ విషయంలో మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని మంగళవారం కలకలం రేగిన విషయం తెలిసిందే. మృతిచెందాడని భావిస్తున్న గొర్లి పైడిరాజు(26) మృతదేహం ఆచూకీ బుధవారం కూడా తెలియక పోవడం విశేషం. ఆరోపణల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆదేశాల మేరకు విచారణ అధికారి, జేసీపీ దాడి నాగేంద్రకుమార్ మంగళవారం రాత్రి వి చారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం జేసీపీతో పాటు డీసీపీ ఫకీరప్ప, క్రైం డీసీపీ ఏఆర్ దామోదరరావు, ఏడీపీసీ వి.సురేష్బాబు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారించారు. మూడు బృందాలు ఏర్పాటు చేశాం గొర్లి పైడిరాజు అనే యువకుడు భారత్ బంద్ రోజున అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎంవీపీ పోలీసులు అదుపుకులోకి తీసుకున్నారని జేసీపీ నాగేంద్రకుమార్ తెలిపారు. బంద్ కారణంగా స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో పండావీధిలో గల ఆయన భార్య ఎర్ని కుమారిని తీసుకొచ్చి బైండోవర్ చేసి పంపించేశామని వివరించారు. తరువాత ఏం జరిగిందో మాకు తెలియదని జేసీపీ తెలియజేశారు. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు ముగ్గురు సీఐల నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బృందాలు తిరిగి వచ్చిన తరువాత వివరాలు తెలియజేస్తామని జేసీపీ వివరిచారు. ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులు పైడిరాజు లాకప్ డెత్ అయ్యాడని ఆరోపిస్తున్నారని, రిటైర్డ్ కానిస్టేబుల్ జయకుమార్, సీఐ దుర్గాప్రసాద్లే విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, తరువాత మృతదేహాన్ని అక్కడి నుంచి పోలీస్ జీపులో విజయనగరం తరలించి, అక్కడ దహనం చేశారని ఆరోపిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా... అందులో నిజం లేదని జేసీపీ ఖండించారు. వారు ఆరోపిస్తున్న రిటైర్ట్ కానిస్టేబుల్ జయకుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. విచారణలోనే నిజం తెలియాల్సి ఉందని, ఇంతకు మించి తమ వద్ద సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. పైడిరాజు బతికుంటేకోర్టుకు తీసుకురండి గొర్లి పైడిరాజును పోలీసులే లాకప్ డెత్ చేశారని విశాఖ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ఎన్.హెచ్.అక్బర్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఆయన సీసీఎస్ పోలీస్ స్టేషన్కు వచ్చి జేసీపీ దాడి నాగేంద్రకుమార్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేసీపీతో మాట్లాడుతూ గొర్లి పైడిరాజు అనే వ్యక్తిని సీసీఎస్కు తీసుకురావడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. పైడిరాజును పోలీసులే లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. బతికే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారని, అలాంటప్పుడు తక్షణమే పైడిరాజును కోర్టులో హాజరుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని, లాకప్డెత్కు కారకులైన వారికి షోకాజ్ నోటీసులిచ్చి, జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ను, సీఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
9 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ‘దెయ్యం ఓడ’
థోంగ్వా(మయన్మార్): కొన్ని సంఘటనల వెనుక మర్మమేమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. వాటికి సమాధానం తెలుసుకోవాలన్నా దొరకదు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమైన ఓ భారీ నౌక.. గతవారం హిందూ మహాసముద్రంలో కన్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘దెయ్యం ఓడ’గా పిలుచుకుంటున్న సామ్ రత్లుంగి పీబీ 1600 అనే నౌక వేల టన్నుల సరుకులతో ఇండోనేషియా జెండాతో బయలుదేరింది. ఈ నౌక చివరిసారిగా 2009లో తైవాన్ సముద్ర జలాల్లో కనిపించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. పలు దేశాలకు చెందిన అధికారులు ఎంత గాలింపు చేపట్టిన షిప్ జాడ కనిపెట్టలేకపోయారు. ఎంత వెతికినా నౌక ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో మునిగిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా ఇటీవల ఆగస్టు 30వ తేదీన ఆ నౌకను మయన్మార్ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ మత్స్యకారులు గుర్తించారు. అందులోకి వెళ్లి చూడగా అందులో ఎవరూ కనబడలేదు. అందులో ఎటువంటి సరకులు కూడా లేవు. దీంతో వారు తీరప్రాంత పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా దానిని పరిశీలించారు. అయిన కూడా ఆ నౌక ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోలేకపోయారు. 9 ఏళ్ల తరువాత నౌక వెలుగులోకి రావడంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ.. ఆ నౌక ఇంతకాలం ఎక్కడ ఉంది, అందులోని సరుకులు, సిబ్బంది ఎమయ్యారు అనే ప్రశ్నలు సమాధానాలు లేనివిగానే మిగిలాయి. కాగా, 177.35 మీటర్ల పొడవు, 27.91 మీటర్ల వెడల్పుతో 2001లో ఈ ఓడను నిర్మించారు. -
70 ఏళ్లుగా తిండి, నీరు లేకుండానే..
అహ్మదాబాద్ : తిండి, నీరు లేకుండా కొన్ని రోజులు జీవించచ్చని తెలుసు.. కానీ ఓ యోగి 70 ఏళ్ల నుంచి అవేమీ తీసుకొకుండానే జీవిస్తున్నారు. అతన్ని అందరు ‘బ్రితేరియన్‘ అని పిలుస్తారు. అంటే గాలి పీల్చి బతుకుతాడని అర్థం. గుజరాత్లోని మెహసానాకు చెందిన ప్రహ్లాద్ జానీ అనే 85 ఏళ్ల యోగి గత ఏడు దశాబ్దల నుంచి ఎటువంటి ఆహారం, నీరు తీసుకొకుండా జీవిస్తున్నారు. అక్కడి వారందరు అతన్ని మాతాజీగా పూజిస్తారు. కేవలం గాలి పీల్చి మాత్రమే తన జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ యోగి జీవన శైలి తెలుసుకోవడానికి ప్రపంచంలోని పలువురు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అతనికి పరీక్షలు జరిపి ఆశ్చర్యపోవడం వారి వంతైంది తప్ప ఏ విషయం గుర్తించలేకపోయారు. అతన్ని స్టడీ చేసిన వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. మాతాజీపైనే కాకుండా ఆయన ఆశ్రమంలోని చెట్లపై కూడా పరిశోధనలు జరిపిన నిపుణులు అతని అసాధారణ జీవన విధానాన్ని శోధించలేకపోయారు. 2010లో అతనిపై డీఐపీఏఎస్, డీఆర్డీవో ఆధ్వర్యంలో ఎంఆర్ఐ, అల్ట్రా సౌండ్, ఎక్స్రేలతోపాటు రకరకాలు పరీక్షలు నిర్వహించారు. చివరకు అతని శరీరంలోని ప్రక్రియలు అతను అలా ఉండటానికి దోహదపడుతున్నాయనే అంచనాకు వచ్చారు. అంబా దేవతను పూజించే మాతాజీ.. ధ్యానం వల్లే తనకు శక్తి సమకూరుతుందని చెప్తారు. తమ బాధలు చెప్పుకోవడానికి చాలా మంది మాతాజీ ఆశ్రమానికి వస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు మాతాజీ ఆశీస్సులు పొందినవారిలో ఉన్నారు. -
హమ్మయ్యా.. మిస్టరీ వీడింది.!
ప్రొద్దుటూరు క్రైం : సుమారు ఐదేళ్ల క్రితం ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్ వరుస హత్యలతో అట్టుడుకి పోయింది. కేవలం ఆరు నెలలలోపే ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. అయితే వాటిలో రెండు కేసులను పోలీసులు అప్పట్లో ఛేదించారు. మిగిలిన మూడు కేసుల్లో మాత్రం ఐదేళ్ల నుంచి చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు. కేసుల దర్యాప్తు కోసం అప్పట్లో ప్రత్యేక అధికారిని నియమించినా ఫలితం లేకుండా పోయింది. అనేక దఫాలుగా దర్యాప్తు చేసినా కేసుల్లో పురోగతి కనిపించలేదు. ఒకానొక దశలో ఈ కేసులను మూస్తేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తమ వారిని ఎందుకు చంపారో అర్థం కాక మృతుల కుటుంబ సభ్యులు బాధ పడేవారు. మహిళలు చనిపోయారనే బాధ కన్నా ఎవరు హత్య చేశారు..ఎందుకు చంపాల్సి వచ్చిందనే మానసిక క్షోభే వారిలో ఎక్కువగా కనిపించేది. ఈ క్రమంలో ఇటీవల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసుకు సంబం«ధించి ఒక నిందితుడు దొరకడంతో శ్రీరాంనగర్ హత్యల మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన మహిళలు .. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్లో 2013 ఫిబ్రవరి నుంచి మహిళల హత్యలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న భీమునిపల్లె లక్ష్మీదేవి హత్యకు గురైంది. గాజుల వ్యాపారం చేస్తున్న ఆమె 25న ఇంటి నుంచి వెళ్లిపోగా 26న ఎర్రగుంట్ల మండలంలోని గోపులాపురం వద్ద శవమై కనిపించింది. నిందితులు ఆమె మృతదేహాన్ని కాల్చారు. ఈ హత్య జరిగిన రెండు నెలల్లోపే ఏప్రిల్ 29న శ్రీరాంనగర్లోని చౌడమ్మవీధిలో నివాసం ఉంటున్న మేరువ శారదను హత్య చేశారు. ఆమె భర్త వాసుదేవరావు వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేయగా, ఆమె ఇంటి దగ్గరే రేషన్ పని చేస్తుంటుంది. 29న భర్త దుకాణం నుంచి ఇంటికి రాగా భార్య ఇంట్లో కనిపించలేదు. వీధిలోనూ, బంధువుల ఊళ్లలోను ఆమె కోసం గాలించగా జాడ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు అదే నెల 30న వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు ముద్దనూరు మండలంలోని కమ్మవారిపల్లె గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆమె మృతదేహాన్ని పడేశారు. అదే ఏడాది జూన్ 3న శ్రీరాంనగర్లో గొంటుముక్కల రంగమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. దుండగులు హత్య చేసి ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి మురికి కాలువలో పడేశారు. వీడిన మర్డర్స్ మిస్టరీ..? ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు కడప పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వీరు డబ్బు, నగల కోసం అనేక మంది మహిళలను హత్య చేసినట్లు తెలిసింది. విచారణలో భాగంగా నిందితులను శనివారం శ్రీరాంనగర్కు తీసుకొని వచ్చారు. హత్యకు గురైన ప్రాంతాలు, వారి ఇళ్ల వద్దకు నిందితులను తీసుకొని వెళ్లినట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
రహస్యమే అనర్థాలకు మూలం
విశ్లేషణ ఒక్కో రోగి లోపలికి వస్తుంటే ఇన్స్టాల్మెంట్ చెల్లింపు అయిపోతున్నట్టు వైద్య పెట్టుబడిదారుడికి కనిపిస్తూ ఉంటుంది. మనుషుల రోగాలే వీరి లాభాలు. ఈ బందిపోటు దోపిడీని ఎవరు ఆపుతారు? వైద్య వివరాలను రహస్యంగా దాచే విషయంలో డాక్టర్లు వైద్య కంపెనీల విధానాన్ని అమలు చేయడమే అన్ని సమస్యలకు కారణం. లక్షల రూపాయలు తీసుకుని ఆస్పత్రిలో ఏం చికిత్స చేస్తున్నారో ఎప్పటికప్పుడు రాస్తున్నప్పుడు, ఆ కాగితాలను అప్పటికప్పుడే ఎందుకు ఇవ్వరు? ఆ రికార్డు ఎవరిది? రోగం తనది, డబ్బు తనది, వైద్యశాలను ఎంచుకుని కోరి చికిత్సకోసం వచ్చినపుడు, చికిత్స వల్ల కలిగే బాధ, నిర్లక్ష్యం ఒక వేళ ఉంటే, అందుకు పడే బాధ తనది, ఒకవేళ ఆరోగ్యం బాగైతే బాగుపడేది తను. మరి రికార్డులు తనవి కాదా? అవి వైద్యశాల యజమానుల సొమ్మా? వైద్యశాల సొంతదారుల పొగరంతా బిల్లుగుమస్తా ప్రదర్శిస్తుంటాడు. డాక్టర్ మర్యాదగా మాట్లాడతాడు. రోగిని, బంధువులను గౌరవిస్తాడు. బిల్లింగ్ గుమస్తా మాత్రం పెత్తనం చలాయిస్తుంటాడు. అతని దగ్గర పడిగాపులు కాయాలి. ఈ వైద్య కంపినీలకు బిల్లింగ్ గుమ స్తాలను సంస్కరించాలన్న ధ్యాస ఉండదు. బాకీలన్నీ అడిగినట్టేనా అని విచారిస్తూ డిశ్చార్జి చేయడంలో విపరీతమైన ఆలస్యం చేస్తుంటాడు. డాక్టరు కరుణించినా గుమస్తా వరమివ్వడు. బిల్లింగ్ దగ్గర ఉన్నపుడు యాజ మాన్యపు డబ్బు జబ్బు గుమస్తాకు అంటుకుంటుంది. వైద్యవిద్య ఖరీదు లక్షలు దాటి కోట్లకు పడగెత్తింది. ప్రతిభ లేకపోయినా సీట్లు కొనుక్కునే వారు, ప్రతిభ ఉన్నా భారీ ఫీజు చెల్లించడానికి అప్పులు చేసేవారూ కూడా ఎంత త్వరగా లాభాలు సంపాదించి వడ్డీ చెల్లించాలనే లక్ష్యంతో ఏమైనా చేస్తూనే ఉంటారు. ఒక్కో రోగి లోపలికి వస్తుంటే ఇన్స్టాల్మెంట్ చెల్లింపు అయిపోతున్నట్టు వైద్య పెట్టుబడిదారుడికి కనిపిస్తూ ఉంటుంది. మనుషుల రోగాలే వీరి లాభాలు. ఉచి తంగా వైద్యం చేయనవసరం లేదు. అడ్డూ అదుపూ, నిజం న్యాయం లేని తప్పుడు చికిత్సలు, అన్యాయపు బిల్లులను ఏం చేయాలి? ఈ బందిపోటు దోపిడీని ఎవరు ఆపుతారు? పట్టుదల ఉన్న రోగి గానీ, వారి బంధువులు గానీ కోర్టుకు వెళ్లాలంటే ఈ వైద్య వ్యాపారి అవసరమైన కాగి తాలేవీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఒక్కో కాగితం వారి తప్పుడు చికిత్సలకు తప్పుడు బిల్లులకు సాక్ష్యాలు కనుక. దొంగతనాన్ని బయటపెట్టే సీసీ టీవీ కెమెరాల్లాంటివి ఆ కాగితాలు. కనుకనే రోగికి ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఈ వైద్య దుకాణాల బహిరంగ బందిపోటు దోపిడీని అరికట్టే మొట్టమొదటి చర్య రికార్డులు ఇచ్చే బాధ్యతను వారి మీద మోపడమే. ఒక్కరోజు చికిత్స కాగితం ఇవ్వకపోయినా 50 వేలు ప్రభుత్వానికి, 50 వేలు రోగికి చెల్లించాలనే కఠిన నిబంధనలతో కూడిన చట్టం రావాలి. ఇటువంటి నేరాలు వారంలో అయిదు జరిగితే ఆ వైద్యశాల ఎండీకి నెలరోజుల జైలుశిక్ష విధించాలి. చికిత్స చేసి డాక్టర్ల చికిత్సానుమతి రద్దు చేయాలి. అప్పుడు కాని రోగికి రికార్డులు ఇవ్వాలనే బుద్ధి, రికార్డులు ఇస్తున్నాం గనుక దొంగతనం చేయరాదన్న ఆలోచన వైద్యవ్యాపారులకు కలుగుతుంది. అది చాలా అవసరం. వైద్య సేవలు చేస్తామనే ప్రతిపాదనను రోగి అంగీకరించడంతో ఏర్పాటయిన ఒప్పందం నుంచి రికార్డులు పుట్టాయి కనుక రోగ నిర్ధారణ పరీక్ష నివేదికలు, స్కాన్ నివేదికలు, చికిత్సా పత్రాలు ఆ రోగికి చెందుతాయి. ఎప్పటికప్పుడు ఆ పత్రాలన్నీ రోగికి లేదా అతని బంధువులకు ఇవ్వాల్సిందే. వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షన్ 2(1) కింద వినియోగదారుడు అంటే ఎవరైతే నిర్ధారిత, చెల్లిస్తానన్న, చెల్లించిన, పాక్షికంగా చెల్లించిన, వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన ప్రతిఫలానికి బదులుగా సేవలను స్వీకరించిన వ్యక్తి అని అర్థం. సెక్షన్ 2(1)(ఓ)లో సేవలను నిర్వచించారు. డాక్టర్లు వైద్యశాలల సేవలను ఈ చట్టం పరిధిలోకి తేవడం సరికాదని, తాము బాధ్యులం కాదని డాక్టర్లు వాదించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వి.పి. శాంత(1995) అనే కేసులో సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించి మెడికల్ ప్రాక్టీషనర్ల సేవలు ఈ చట్టం కిందకు వస్తాయని తీర్పు చెప్పింది. వినియోగదారుల చట్టం సెక్షన్ 2(ఎఫ్) లోపం అంటే ఏమిటో నిర్వచించింది. వస్తువులలో అసంపూర్ణత, లోటు, తగినంత లేకపోవడం, నాణ్యత క్షీణిం చడం, పనిచేసే తీరులో తేడా రావడం, చట్టంలో లేదా ఒప్పందంలో నిర్ణయించినంతమేరకు పనిచేయకపోవడం. ఇదే తరహాలో సెక్షన్ 2(జి) సేవలలో లోపాన్ని నిర్వచించింది. చట్టం నిర్దేశించినంత మేరకు లేదా ఒప్పుకున్నంత మేరకు సేవలను నిర్వహించకపోవడం, సేవలు అసంపూర్ణంగా ఉండడం, లోపాలు ఉండడం, నాణ్యత లోపించడం వంటివి జరిగితే నష్టపరిహారాన్ని కోరవచ్చు. ఈ లెక్కన రోగికి రికార్డులు ఇవ్వకపోవడం సేవాలోపం లేదా నిర్లక్ష్యం కూడా కావచ్చు. ఫోర్స్ వర్సెస్ ఎం జ్ఞానేశ్వరరావు కేసులో కేసుషీట్ను సక్రమంగా నిర్వహించకపోవడం, ఇంతకుమునుపు చేసిన నిర్ధారణ పరీక్షల వివరాలు కేస్షీట్లో చేర్చకపోవడం, రోగి అంగీకారం పత్రాలను పారవేయడం నిర్లక్ష్యం కిందకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల మిషన్ తీర్పు చెప్పింది. ఎక్స్ రే ఫిల్మ్ సరైన సమయంలో ఇవ్వకపోవడం సేవాలోపమే అని వి.పి. శాంత వర్సెస్ కాస్మొపాలిటన్ హాస్పటల్ కేసులో నిర్ణయించారు. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
వీడిన జంట హత్యల మిస్టరీ
గుడివాడ : సంచలనం సృష్టించిన గుడివాడ రాజేం ద్ర నగర్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. దొంగతనం కోసం వచ్చిన జిల్లేల సురేష్ ఒక్కడే ఈ హత్యలకు పాల్పడ్డాడని గుడివాడ డిఎస్పీ మహేష్ తెలి పారు. కేసును ఏవిధంగా ఛేదించారో విలేకరులకు వివరించారు. నర్సాపురానికి చెందిన జిల్లేల సురేష్ నేర చరిత్ర నచ్చని తండ్రి అక్కడి నుంచి తరిమివేయడంతో గుడివాడలోని ధనియాలపేటలో స్థిరపడ్డారు. అయితే సురేష్ తల్లి ఈ కుటుంబాన్ని వదిలేసి దుబాయ్ వెళ్లిపోయింది. రెండున్నరేళ్ల క్రితం చెన్నైలోని పెరంబదూర్లో మెకానిక్గా పనిశాడు. సురేష్కు కొద్దికాలం క్రితం వాణీప్రియతో పరిచయం ఏర్పడగా ఈమె కారణంగా సురేష్ భార్య జనవరిలోనే వదిలి వెళ్లిపోయింది. వాణీప్రియ కోసం సురేష్ అప్పుల పాలై దొంగతనాలకు తెరతీశాడు. ఈనెల 8 నుంచి చోరీలకు విఫలయత్నం పెరంబదూర్లో ఉండే సురేష్ ఈనెల 8 నుంచి పలుమార్లు గుడివాడకు వచ్చి రాజేంద్రనగర్లో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించి దొంగతనాలకు ప్రయత్నించాడు. 9న రాజేంద్ర నగర్లోని గొల్లపూడి రాజేశ్వరరావు ఇంట్లో, 9న కామినేని బాబూరాజేంద్ర ప్రసాద్ ఇంట్లో, 12న చెన్న కొండలరావు ఇంట్లో, 13న తోట ఆకాష్ ఇంట్లో దొంగతనాలకు యత్నించాడు. తోట ఆకాష్ ఇంట్లో బైక్ను దొంగతనం చేసి రైల్వేస్టేషన్లో విడిచిపెట్టి వెళ్లాడు. 13న హత్యకు గురైన బొప్పన సాయి చౌదరి ఇంట్లో వెనుక కిటికీ స్క్రూలు తిప్పే ప్రయత్నం చేసి విఫలమై వెళ్లిపోయాడు. హత్యలు ఇలా.. ఈనెల 15న పెరంబదూర్ నుంచి చెన్నైకి వచ్చి అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. అనంతరం గుడివాడ బస్టాండ్కు చేరుకున్నాడు. 16న రాత్రి 12 గంటల వరకు గుడివాడలోని ఓబార్లో కాలం గడిపాడు. అనంతరం సాయి చౌదరి ఇంటి కిటికీని మినీ గ్యాస్కట్టర్తో కట్ చేశాడు. రాత్రి 3.30 గంటలకు సాయి చౌదరి బెడ్రూం డోర్ తీయగా సాయి చౌదరి బయటకు వచ్చి నిందితుడు సురేష్తో పెనుగులాటకు దిగాడు. సురేష్ తెచ్చుకున్న కత్తితో మూడుసార్లు పొడవటంతో సాయిచౌదరి మృతిచెందాడు. అనంతరం సాయిచౌదరి భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఇద్దరి మృతదేహాలను వేరే రూంలోకి లాక్కెళ్లాడు. అనంతరం బంగారం, నగదు, టీవీ, ఇతర వస్తువులతో పాటు కారును వేసుకుని బేతవోలు మీదుగా విజయవాడ రోడ్డులో వెళ్లాడు. పెనుగులాటలో సురేష్ చొక్కా రక్తం కావటంతో సాయి చౌదరి చొక్కాను వేసుకుని వెళ్లాడు. ఇతను ఉపయోగించిన పనిముట్లు, రక్తం అయిన సురేష్ చొక్కాను మానికొండ శివార్లలో వదిలేశాడు. అక్కడి నుంచి విజయవాడ, మార్టూరు, టంగుటూరు మీదుగా 17న 4గంటలకు పెరంబదూర్ వెళ్లాడు. పట్టించిన వేలిముద్రలు.. ఇంటి కిటికీని కట్ చేసే సమయంలో సురేష్ వేలిముద్రలు స్పష్టంగా పడ్డాయి. గ్లౌజులు తెచ్చుకున్నా కంగారులో వాడలేదని తెలిసింది. దీంతో వేలిముద్రలు దొరికాయి. సీసీ కెమేరా పుటేజీ, కారు టోల్గేట్లు దాటి వెళ్లడం వంటి వాటి ద్వారా 17నే పట్టుకున్నారు. పోలీసులకు చుక్కలు చూపించాడు... హత్య జరిగిన తీరు. ఎవరో చేయించి ఉంటారని పుకార్లు హల్చల్ చేయడంతో పోలీసు బృందాలు పెద్దఎత్తునే విచారణకు దిగాయి. సురేష్ను విచారణకు తీసుకురాగా నలుగురు పేర్లు చెప్పాడు. మొదట సురేష్ తమ్ముడు స్నేహితుడు త్రినాథ్ పేరు చెప్పాడు. త్రినాథ్ పెయింటింగ్ పనిచేసుకుంటాడు. తీరా పోలీసు విచారణలో త్రినాథ్ పాత్రలేదని తేలింది. అలాగే సురేష్ తమ్ముడు రాజీవ్ కిషోర్ పేరు చెప్పాడు . ఇతను కడప జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సీసీ పుటేజ్ ఆధారంగా లేడని తేల్చారు. సురేష్ తండ్రి విజయ్కుమార్ పేరు చెప్పాడు. ఇతని ప్రమేయం కూడా లేదని తేలింది. అయితే సురేష్తో పాటు పనిచేసే పెరంబదూర్కు చెందిన శివదొరై పేరు చెప్పాడు. శివ సురేష్కు కిటికీ ఎలా కట్చేయాలి హ్యాండ్ కట్టర్ కొనటానికి, తెచ్చిన బంగారం అమ్మటానికి సాయపడే ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే హత్యసీన్లో లేడు. దీనికి సంబంధించిన అన్ని సీసీ కెమేరా పుటేజ్లను చూపించారు. వాటి ఆధారంగానే ఒక్కడే ఇది చేశాడని తేల్చారు. విలేకరుల సమావేశంలో వన్టౌన్ సీఐ డీవీ రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మిస్టరీగా.. గుర్తుతెలియని మహిళ హత్యోదంతం..!
పరువు హత్యా.. ప్రియుడే కాటేశాడా? మిర్యాలగూడ రూరల్ : మండల పరిధిలోని తుంగపహాడ్ శివారులో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. అసలీ హత్యపై ఇప్పటి వరకు ఫిర్యాదు కూడా అందకపోవడంతో కేసు ఛేదన ఖాకీలకు సవాల్గా మారింది. గుర్తుతెలియని మహిళగా.. మండల పరిధిలోని తుంగపహాడ్ శివారులోని అడవిదేవులపల్లి రోడ్డులో ఈ నెల 6వ తేదీన గుర్తుతెలియని మహిళను హత్యచేసి ఆపై కాల్చేసిన విషయం తెలిసిందే. హత్యోదంతంపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయకపోవడంతో గుర్తుతెలియని మహిళగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు బృందాలు.. మూడు ప్రాంతాలు సీఐ రమేష్బాబు నేతృత్వంలో వాడపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి పోలీస్స్టేషన్ల ఖాకీలు మూడు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. తొలు త రెండు రాష్ట్రాలోని అన్ని పోలీస్స్టేషన్ల వారీగా మిస్సింగ్ కేసులపై దృష్టిపెట్టినా ఇప్పటి వరకు అలాంటి కేసులు తారస పడలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హత్యోదంతం వెలుగులోకి వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించకపోవడంతో ఖాకీలు తలపట్టుకుంటున్నారు. ఏది ఏమైనా కేసును సాధ్యమైనంత త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. సదరు గుర్తుతెలియని మహిళ ఎవరు..? ఏ ప్రాంతానికి చెందింది..? ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కాల్చేశారా..? పోస్టుమార్టం నివేదికలో గర్భిణిగా తేలింది. అయితే, సగం కాలిన మహిళ కు పుస్తెమెట్టెలు లేవు. దీంతో పరువు కోసం కుటుంబ సభ్యులే హత్య చేశారా..? లేక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడే కాటేశాడా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో పోలీసులకు సవాల్గా మిగిలాయి. పోస్టుమార్టం నివేదికలో.. సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు అదే రోజు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సౌకర్యాలు లేవని ఇక్కడి వైద్యులు పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను రప్పించి ఈ నెల 8వ తేదీన గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నివేదికలో సదరు మహిళ గర్భిణిగా తేలింది. -
‘శ్రీ’ విషాదం ఓ మిస్టరీ..?
దుబాయ్/ముంబై : ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు.. గంట గంటకో సంచలన విషయం.. మొత్తంగా సినీనటి శ్రీదేవి మరణం ఓ మిస్టరీగా మారింది! గుండెపోటుతో మృతి చెందినట్టు ఆమె కుటుంబీకులు చెప్పిన విషయం అవాస్తవమని తేలిపోయింది. శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందిందని దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. బాత్రూంలోని టబ్లో స్పృహతప్పి పడిపోవడం వల్లే మరణించినట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం దుబాయ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సమీ వాదీ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఇందులో శ్రీదేవి పూర్తిపేరును ‘శ్రీదేవి బోనీ కపూర్ అయ్యప్పన్’గా పేర్కొన్నారు. ఆమె పాస్పోర్టు నంబర్, ఘటన జరిగిన తేదీ, మృతికి కారణాలను వివరించారు. దుబాయ్ ప్రభుత్వ అధికారిక మీడియా కార్యాలయం కూడా తన ట్విటర్ ఖాతాలో.. శ్రీదేవి ప్రమాదవశాత్తూ స్నానాల తొట్టిలో పడిపోయి చనిపోయిందని తెలిపింది. తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేసినట్టు పేర్కొంది. మరోవైపు గల్ఫ్ న్యూస్ మరో కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి అల్కాహాల్ సేవించిందని, ఆ మత్తులో బాత్ టబ్లో పడిపోయి మరణించిందని పేర్కొంది. అయితే దీన్ని అధికారులెవరూ ధ్రువీకరించలేదు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లేందుకు కారణమేంటన్న దానిపై స్పష్టత రావడం లేదు. అలాగే బాత్టబ్లో మునిగి చనిపోవడం ఎంతవరకు సాధ్యమంటూ బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ సహా పలువురు ప్రశ్నిస్తున్నారు. భౌతికకాయం తరలింపు మరింత జాప్యం శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలించడం మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నారు. కేసు పోలీసుల చేతి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదలాయించడంతోపాటు ఇతర చట్టపరమైన అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం ఇందుకు కారణం. భౌతికకాయం అప్పగింతకు మరో అనుమతి(క్లియరెన్స్) రావాల్సి ఉందని దుబాయ్ పోలీసులు చెప్పినట్లు యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి తెలిపారు. ఎలాంటి అనుమతి రావాల్సి ఉందని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఆ విషయం తెలియదు. అది వారి అంతర్గత వ్యవహారం..’’అని బదులిచ్చారు. భౌతికకాయాన్ని భారత్కు ఎప్పట్లోగా తరలిస్తారని అడగ్గా.. ‘టైం చెప్పడం కష్టం. ఇక్కడ చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’అని పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం ఎంబామింగ్ శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ (మృతదేహం పాడవకుండా ఉండేందుకు చేపట్టే ప్రక్రియ) ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం మధ్యాహ్నం ఎంబామింగ్ చేసే అవకాశం ఉన్నట్టు గల్ఫ్ న్యూస్ పేర్కొంది. ఆ తర్వాత ఎయిర్పోర్టుకు శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అయినా ముంబైకి తరలిస్తారా? లేదా మరింత జాప్యం జరుగుతుందా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘంగా బోనీ విచారణ శ్రీదేవి మృతి కేసులో ముమ్మరంగా విచారణ సాగుతోంది. దుబాయ్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం బోనీని సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. ఆయన పాస్పోర్టు కూడా సీజ్ చేసినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. శ్రీదేవితో హోటల్లో ఎప్పటివరకు ఉన్నారు? ముంబై నుంచి హోటల్కు ఎప్పుడు తిరిగొచ్చారు? సర్ప్రైజ్ చేద్దామని వచ్చారా? లేదా శ్రీదేవి మృతి విషయాన్ని హోటల్ సిబ్బంది చెబితే వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు బోనీని ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే శ్రీదేవి దుబాయ్ వెళ్లినప్పట్నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? ఎవరితో ఫోన్లో మాట్లాడారు? అన్న అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు. బోనీ కపూర్ ఫోన్ కాల్డేటాను సైతం విచారిస్తున్నట్టు సమాచారం. హోటల్ సిబ్బందిని సైతం దుబాయ్ విచారిస్తున్నారు. హోటల్లో శ్రీదేవిని చివరిసారిగా చూసిందెవరు? ఆ సమయంలో ఆమె ఏ పరిస్థితిలో ఉంది? ఆమె గదిలో ఎవరైనా ఉన్నారా? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు బోనీకపూర్ దుబాయ్లోనే ఉండాలని అక్కబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం చెప్పినట్టు తెలిసింది. ఆరోజు అసలేం జరిగింది? శ్రీదేవి మృతి చెందిన రోజు ఏం జరిగిందన్న విషయంపై స్థానిక ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. మేనల్లుడి వివాహ కార్యక్రమం తర్వాత బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ సహా కుటుంబీకులంతా ముంబై వచ్చేశారు. శ్రీదేవి మాత్రం కొద్దిరోజులు దుబాయ్లో ఉండి వస్తానని చెప్పింది. అయితే భార్యకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు బోనీ శనివారం సాయంత్రం మళ్లీ దుబాయ్కు వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో (దుబాయ్ కాలమానం ప్రకారం).. శ్రీదేవి ఉన్న జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ చేరుకున్నారు. నిద్రలో ఉన్న ఆమెను లేపి దాదాపు 15 నిమిషాలసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భర్తతో కలిసి డిన్నర్కు వెళ్లేందుకు శ్రీదేవి సిద్ధమయ్యారు. బాత్రూమ్లోకి వెళ్లి 15 నిమిషాలైనా ఆమె బయటకు రాకపోవటంతో బోనీ తలుపుతట్టారు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే శ్రీదేవి బాత్టబ్లో అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే బోనీ తన మిత్రుడిని పిలిచారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే అప్పటికే శ్రీదేవి మృతిచెందారని ఖలీజ్ టైమ్స్ వివరించింది. అనిల్ కపూర్ నివాసానికి ప్రముఖులు శ్రీదేవి మృతి నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ముంబైలోని ఆమె మరిది అనిల్ కపూర్ ఇంటికి తరలి వస్తున్నారు. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషీ ఆదివారం నుంచి ఈయన ఇంట్లోనే ఉన్నారు. నటీనటులు మాధురీ దీక్షిత్, జయప్రద, టబు, అమీషా పటేల్, సౌత్ సూపర్స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, ఆయన భార్య సారిక, కూతుళ్లు శృతి, అక్షర హాసన్లు, దివ్యా దత్తా, సారా అలీ ఖాన్, జెనీలియా, రితేశ్ దేశ్ముఖ్, దర్శకులు భారతీ రాజా, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిధ్వానీ, శేఖర్ కపూర్, తెలుగు సినీ హీరో వెంకటేశ్ తదితర ప్రముఖులు సోమవారం ఉదయం అనిల్ ఇంటికి వెళ్లారు. అటు లోఖండ్వాలా ప్రాంతంలోని శ్రీదేవి ఇంటికి కూడా ఆమె అభిమానులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. -
ఆయన మిస్సింగ్.. ఓ మిస్టరీ.!
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)లో జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పనిచేసిన ఈగ ఉమామహేశ్వరరెడ్డి గత ఏడాది ఆగస్టు 30వ తేదీన కర్నూలుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఐదు నెలలు దాటినప్పటికీ ఆయనకు సంబంధించిన కనీస సమాచారం కూడా లభించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు సార్లు కడపకు వచ్చి ఆయన బంధువులను విచారించి వెళ్లారు. తాజాగా మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి కర్నూలు నుంచి పోలీసులు వచ్చారు. కొంతమంది ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి వెళ్లారు. ‘మిస్సింగ్’ వివరాలు ఇలా... కడప నగరం ఎన్జీఓ కాలనీకి చెందిన ఉమామహేశ్వర్రెడ్డి వయస్సు 48 సంవత్సరాలు. ఆయన ఇక్కడి డీఎంహెచ్ఓలో ఎస్ఓగా దీర్ఘకాలికంగా పనిచేశారు. ఆయనకు భార్య అనసూయ. ఒక కుమారుడు శివసాయిరెడ్డి ఉన్నారు. ఇతనికి మెడిసిన్లో విశాఖపట్నంలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా ఉమామహేశ్వర్రెడ్డి మంచి అధికారిగా గుర్తింపు పొందారు. గత జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కర్నూలులోని హెల్త్ ట్రైనింగ్ సెంటర్కు బదిలీ అయ్యారు. అయితే ఆయన సేవలు ఇక్కడ కీలకమైనందున నాటి డీఎంహెచ్ఓ రామిరెడ్డి ప్రభుత్వ అనుమతితో ఆయనను ఇక్కడే డిప్యుటేషన్పై విధులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన డిప్యుటేషన్ను ప్రభుత్వం రద్దు చేయడంతో గత ఆగస్టు నెల 30వ తేదీన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఎస్ఓగా బదిలీ అయ్యారు. 14న సాయంత్రం 7.30కి చివరి ఫోన్ కాల్... బంధువుల సమాచారం మేరకు ఉమామహేశ్వర్రెడ్డి కర్నూల్లోని తన కార్యాలయం (మెడికల్ కాలేజీకి)కు ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జీలో బసచేశారు. సెప్టెంబర్ 14వ తేదీన సాయంత్రం 4.45 గంటలకు లాడ్జి నుంచి కిందకు వచ్చారు. ఈ సన్నివేశాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు తెలుపు షర్టు, నల్లని ప్యాంట్ ధరించి ఉన్నాడు. అనంతరం ఆయన 6.30 గంటలకు తన ఆఫీసు (డీఎంహెచ్ఓ) నుంచి బయటకు వెళ్లారు. తరువాత ఆయన లాడ్డీకి వెళ్లలేదు. అనంతరం 7.30 గంటలకు ఆఫీస్లోని రవి అనే ఉద్యోగికి ఫోన్ చేశాడు. అదే చివరి ఫోన్ కాల్. అనంతరం అతని దగ్గర ఉన్న నాలుగు ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి. 15వ తేదీన తెలిసిన విషయం... 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో కర్నూలులోని ఆఫీసు ఉద్యోగి వసంతరెడ్డి కడపలోని ఆఫీసులో ఉమామహేశ్వరరెడ్డి వద్ద పనిచేస్తున్న బాషాకు ఫోన్ చేశారు. ఉమామహేశ్వరరెడ్డి డ్యూటీకి రాలేదని చెప్పారు. దీంతో బాషా ఆ విషయాన్ని ఆయన భార్య అనసూయకు ఫోన్ చేసి తెలిపాడు. అప్పుడు అనసూయ తన భర్త సెల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ఆమె కర్నూలు డీఎంహెచ్ఓకు ఫోన్ చేయగా ఆయన కూడా ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. కడప నుంచి ఆయన బంధువులు కర్నూలు వెళ్లి అక్కడ 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. మూడు బృందాలు ఏర్పాటు... ఉమామహేశ్వర్రెడ్డి బంధులు, కర్నూలు జిల్లా పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆ ప్రాంతాల్లో వెతికారు. ఇంతవరకు స్పష్టంగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే అతను మంత్రాలయం, కోడుమూరు ప్రాంతాల్లో కనిపించినట్లుగా అక్కడ బస చేయడంతో పాటు హోటళ్లలో టిఫిన్ చేశారని ఆయా ప్రాంతాల్లోనివారు కొంతమంది చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉమామహేశ్వరరెడ్డి చేతికి ఉన్న వేళ్ల వ్యత్యాసాన్ని పలువురు ప్రశ్నించినట్లుగా తెలిసింది. అయితే ఈ అంశాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ ఆచూకీ కోసం మూడు బృందాలను నియమించినట్లుగా సమాచారం. ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఆయన బంధువులు తెలిపారు. గతంలో ఆయన భార్య అనసూయ ‘సాక్షి’తో మాట్లాడారు. మా ఆయన కర్నూలుకు బదిలీ అయ్యాక చాలా డల్గా కని పించాడు. అంతేగాక ఆయనకు అప్పుడు కామెర్లు కూడా ఉన్నాయి. బీపీ ఉంది. అక్కడ భోజనం బాగాలేదని, వాతావరణం సరిగా లేదని చెప్పేవాడు. తనను కూడా అక్కడికి తీసుకుపోవడానికి సరైన ఇల్లు కోసం చూస్తున్నట్లుగా చెప్పాడు. ఇంతలోనే ఇలా అయింది. ఆయనకు ఎవరితోనూ గొడవలు, ఎలాంటి సమస్యలు లేవు. అలాగే మాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేవు. అయితే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదు అని తెలిపారు. మొత్తానికి ఉమామహేశ్వరరెడ్డి మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
జయ.. అమృత.. ఓ మిస్టరీ!
చెన్నై: జయలలిత వారసులమంటూ చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇందులో అమృత అనే యువతి సుప్రీంకోర్టుకు వెల్లడించిన అంశాలు.. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకూ సిద్ధమని ప్రకటించటం ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే. అసలు జయకు కూతురుందా? ఉంటే ఆమెనెవరు పెంచారు? జయ సన్నిహితులేమంటున్నారు? ఈ అమృత ఎవరు? ఈ అంశాలపై స్పష్టత వస్తేనే కేసులో చిక్కుముడి వీడుతుంది. ఈ నేపథ్యంలో అమృత చెబుతున్న అంశాలను ఓసారి గమనిస్తే.. అమృత చెబుతున్నదేంటి? జయలలిత సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే 1980 ఆగస్టు 14న చెన్నై సమీపంలోని మైలాపూర్లో జయలలిత నివాసంలో తాను జన్మించినట్లు అమృత తెలిపారు. ‘సినిమా కెరీర్ పాడవకుండా బిడ్డపుట్టిన విషయాన్ని బయటకు రానీయకుండా జయ కుటుంబసభ్యులు జాగ్రత్తపడ్డారు. తనను శైలజ, సారథి దంపతులకు అప్పగించటంతో.. అప్పటినుంచి బెంగళూరులోని రామసంద్రలోనే పెరిగాను. రెండేళ్ల క్రితం శైలజ మృతి చెందగా ఈ ఏడాది మార్చిలో సారథి కన్నుమూశారు. చనిపోయే సమయంలో సారథి తనను పిలిచి నేనున వీరి సొంత కూతురిని కాదని.. జయలలిత ఏకైక కుమార్తెను అనే విషయాన్ని చెప్పారు’ అని అమృత పేర్కొన్నారు. సారథి చెప్పిన మిగిలిన వివరాలను జయ బంధువులనడిగి నిర్దారించుకున్నట్లు అమృత తెలిపారు. జయ సన్నిహితులు, బంధువులు, వరుసకు సోదరైన లలిత, మేన కోడలు రంజని కూడా ఈ విషయాన్ని నిర్ధారించారన్నారు. అమ్మ నన్ను ముద్దుపెట్టుకుంది 1996 జూన్ 6న జయలలిత దగ్గరికి తాను తొలిసారి వెళ్లానని, చూసిన వెంటనే ఆమె తనను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందని అమృత వెల్లడించారు. తర్వాత కూడా పలుమార్లు జయను కలిసినట్లు తెలిపారు. సచివాలయానికి వెళ్లిన ప్రతిసారీ.. ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని అమృత తెలిపారు. అమృత చెప్పే విషయాలను జయ చిన్ననాటి స్నేహితురాలు గీత సమర్థించారు. శోభన్బాబు–జయలలితకు ఓ కుమార్తె పుట్టిందని, ఆమే అమృత అని తెలిపారు. ఈ విషయం శశికళ సహా జయ సన్నిహితులందరికీ తెలుసన్నారు. జయకు కూతురు ఉన్న విషయం వాస్తవమేనని జయ మేనత్త కూతురు ఎల్ఎస్ లలిత కూడా వెల్లడించారు. అయితే.. ఆ కూతురు అమృతేనా కాదా? అనేది నిర్ధారించలేనన్నారు. ఆరుద్ర భార్య అదే చెప్పారు శోభన్బాబుతో సంబంధాన్ని జయలలిత 1979లోనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ సంబంధంపై వార్తలు రాసిన నాటి తమిళ వారపత్రిక ‘స్టార్ అండ్ స్టైల్’కు రాసిన లేఖలో ‘ఏడేళ్లుగా శోభన్ బాబుతో సహజీవనం చేస్తున్నా. ఈ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు’ అని జయలలిత చెప్పినట్లు సమాచారం. శోభన్ బాబు వివాహితుడు కావడం వల్లే ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయానని జయ ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి ధృవీకరించారు. శోభన్బాబు, జయలలిత మధ్య సంబంధముండేదని, అయితే.. శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చేయొద్దనుకోవడంతోనే వీరి ప్రేమ పెళ్లివరకు రాలేదన్నారు. అమృత వెనక శశికళ? సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అమృత వెనక శశికళ ప్రోద్బలం ఉన్నట్లు భావిస్తున్నారు. తన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించడానికి అమృత సమాయత్తం అవుతున్నారు. సుప్రీంలో అమృత పిటిషన్ దాఖలు చేసినప్పుడు మద్దతుగా ఆమె బంధువులు లలిత, రంజనీ సంతకాలు చేశారు. జైల్లో శశికళను రంజని కొన్ని నెలల కిత్రం కలుసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేయాలని రంజనీకి శశికళ సూచించినట్లు తెలుస్తోంది. జయకు స్వయానా కూతురని అమృత నిరూపించుకుంటే, ఆ తరువాత పార్టీ, ఆస్తులను చేజిక్కించుకోవచ్చని శశికళ పథకం పన్నినట్లుగా ఆమె అంతరంగికులే చెబుతున్నారు. జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజనీతో కూడా శశికళకు ముందుగానే పరిచయం ఉంది. 1980లో జయలలిత ప్రసవించినపుడు రంజనీ అక్కడే ఉన్నట్లు లలిత చెప్పిందని సమాచారం. జయలలిత తొలి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి అన్నాశాలై నుంచి అమ్మ సమాధి ఉన్న మెరీనా బీచ్ వరకు మౌనర్యాలీ నిర్వహించారు. జయ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం -
డాక్టర్ సూర్యకుమారి ఆచూకీ ఎక్కడ ?
-
వీడిన హత్యకేసు మిస్టరీ
ఇద్దరి అరెస్టు రాజానగరం : ముక్కినాడలో తీవ్ర సంచలనం సష్టించిన మట్టపర్తి మణికంఠేశ్వరస్వామి (25) హత్య కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. అనపర్తికి చెందిన కర్రి జగదీశ్వరరెడ్డితో పాటు అతడికి సహకరించిన గొండెల ఎర్రయ్యలను అరెస్టు చేసి, శనివారం కోర్టుకు హాజరు పరిచారు. వివరాలను రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్బాబు స్థానిక విలేకరులకు వివరించారు. ముక్కినాడకు చెందిన మట్టపర్తి మణికంఠేశ్వర స్వామి అన పర్తిలోని ఒక కంటి ఆస్పత్రిలో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసే విజయతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వయస్సులో ఉన్న ఇద్దరు ఒకరికొకరు మనస్సును, తనువును ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే విజయని గాఢంగా ప్రేమిస్తున్న అనపర్తికి చెందిన కర్రి జగదీశ్వరరెడ్డికి వీరిద్దరి వ్యవహరం నచ్చలేదు. అంతేకాక మణికంఠస్వామి పరిచయంతో తనను పక్కన పెట్టిందనే అక్కసుతో పలుమార్లు ఇద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా ఎటువంటి మార్పు రాకపోవడంతో ఎలాగైనా మణికంఠస్వామిని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో గత ఏడాది సెప్టెంబర్లో మణికంఠస్వామికి వేరొక అమ్మాయితో వివాహం కావడంతో ఇక ఫర్వాలేదనున్నాడు. కానీ అతను విజయని వదలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న వారిద్దరూ రాజమహేంద్రవరం సినిమాకు Ððవెళ్లిన విషయం తెలుసుకుని, తిరుగు ప్రయాణంలో మణికంఠ స్వామిని హతమార్చాలని పథకం వేసుకున్నాడు. స్నేహితుడైన గొండెల ఎర్రయ్యకు విషయం తెలియజేసి, అతడి సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి మోటారు బైకుపై ముక్కినాడకు సమీపంలో రోడ్డు మలుపు వద్ద కాపు కాచారు. ప్రియురాలు విజయతో కలసి రాజమహేంద్రవరంలో సినిమా చూసి, హోటల్లో భోజనం చేసి, తిరిగి వస్తూ ఆమెను అనపర్తిలో దించి, బైకు ఒంటరిగా ఇంటి వస్తున్న మణికంఠేశ్వరస్వామిని ముక్కినాడ సమీపంలో దారికాచి వున్న వీరు అడ్డగించి, తల పై రాడ్తో బాదారు. నన్ను చంపవొద్దు అంటూ పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోతున్న అతడి కాళ్లను ఎర్రయ్య పట్టుకోగా జగదీశ్వరరెడ్డి పీక నులిమి చంపేశాడు. శవాన్ని వరి పొలంలోకి లాక్కుపోయి పడవేశారు. ఆ సమయంలో జగదీశ్వరరెడ్డి చేతి కడియం అక్కడ జారిపడడంతో దాని ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన రాజానగరం పోలీసులు నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. విషయం తెలుసుకుని విశాఖపట్నం పారిపోయిన నిందితులు, చివరకు శుక్రవారం ముక్కినాడ వచ్చి వీఆర్వో సమక్షంలో లొంగిపోయారని డీఎస్పీ వివరించారు. వారిద్దరినీ కోర్టులో హాజరు పరిచామన్నారు. సమావేశంలో ఎస్సై రాజేష్ కూడా పాల్గొన్నారు. -
వీడని నరేష్ కేసు మిస్టరీ
♦ బైక్ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు..? ♦ ఇప్పటికీ వివరాలు వెల్లడించని పోలీసులు సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్ హత్య కేసులో న్యాయం కోసం కుటుంబ సభ్యులు, అఖిలపక్ష ప్రజాసంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. నరేష్ హత్య వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నరేష్ హత్య జరిగిన రోజు అతన్ని వాహనంపై ఎక్కించుకునిపోయిన మరో యువకుడి ఆచూకీ ఇంత వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అలాగే నరేష్ హత్య అనంతరం అతడి శవాన్ని కాల్చి బూడిద చేసి మూసీలో కలిపిన అస్థికలకు సంబంధించిన నివేదిక ఇంకా బయటపెట్టలేదు. ఒక దశలో హత్యకు గురైంది నరేష్ అవునా.. కాదా..? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోందని ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తానే నరేష్ను చంపానని స్వాతి తండ్రి పోలీసు విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే. నరేష్, స్వాతి ప్రేమ వివాహం అనంతరం ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఆత్మహత్య చేసుకోగా నరేష్ మిస్టరీని హత్యకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు మరణాల వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ చేత విచారణ చేయించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్, స్వాతి మరణాల వెనుక స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డితో పాటు మరికొందరి హస్తం ఉందని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్, స్వాతిలు మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు నరేష్ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు కనిపించకుండాపోయాడని మే 5న భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, 6వ తేదిన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నరేష్ హత్య అనంతరం నిజనిర్ధారణ కమిటీ గ్రామానికి చేరుకుని పలు అంశాలను సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న స్వాతి అంత్యక్రియలు జరిగిన చోట నరేష్ అంత్యక్రియలు జరిగిన ఆనవాళ్లు లేవని నిజనిర్ధారణ కమిటీ తేల్చలేదు. కనీసం శవం కూడా దొరక్కకుండా చేశారని ఆరోపించారు. బైక్పై పల్లెర్లకు... నరేష్, స్వాతిని భువనగిరి బస్టాండ్లో ఆమె తండ్రి శ్రీనివాస్రెడ్డికి అప్పగించిన అనంతరం మరో వ్యక్తితో కలిసి బైక్పై నరేష్ పల్లెర్ల గ్రామానికి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. అయితే నరేష్ను వాహనంపై తీసుకుపోయింది ఎవరన్నది ఇంత వరకు తేలలేదు. మే 2న నరేష్ సోదరి సెల్ఫోన్లో మాట్లాడినప్పుడు అతను ఎల్బీనగర్ వెళ్తున్నట్లు నరేష్ చెప్పాడు. రాత్రి 11 గంటల తర్వాత ఫోన్ పనిచేయకపోవడంతో నరేష్ కుటుంబ సభ్యుల్లో అనుమానం పెరిగింది. మరో వైపు పోలీసులు సేకరించిన ఆధారాల వివరాలు వెల్లడించాలని నరేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్ను హత్య చేశారా లేక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హత్య కథనం సృష్టించారా అన్నది తేల్చాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు కులసంఘాలు, ప్రజాసంఘాలు సీఎంను కలిసే ఆలోచనలో ఉన్నాయి. కేసు ఇలా... మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డికి నరేష్, స్వాతిని అప్పగించారు. ఆ రోజు నుంచి నరేష్ కనిపించకుండాపోయాడు. మే 5న తన కుమారుడు కనిపించడం లేదని నరేష్ తండ్రి వెంకటయ్య భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 6న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 16వ తేదీన స్వాతి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. మే 27న ఎల్బీనగర్ పోలీసుల విచారణలో నరేష్ను తానే హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. కేసు నమోదు చేశారు. మే 30న నిజనిర్ధారణ కమిటీ నరేష్, స్వాతిల స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించి హత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 9న భువనగిరిలో నరేష్ హంతకులను శిక్షించాలని అఖిలపక్షాల సమావేశం జరిగింది. మే 12న సీఎంను కలవాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. జూన్ 16న సీఎస్ను కలిశారు. జూన్ 22న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కలిసి నరేష్, స్వాతి హత్యోదంతంలో నిజనిజాలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు -
మిస్టరీ ముడి విప్పండి!
♦ మళ్లీ తెరపైకి ‘అమ్మ’ మరణం ♦ మిస్టరీ ఛేదించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ♦ శశికళ, పన్నీర్ సహా 186 మందిపై ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్త కలకలానికి కారణమైన అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మళ్లీ తెరపైకి వచ్చింది. అమ్మ మరణం మిస్టరీగా మారడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ప్రధాన కార్యదర్శి శశికళ సహా 186 మందిపై కేసులు పెట్టాలని కోరుతూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జ్వరం, డీహైడ్రేషన్ అస్వస్థతతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇక ప్రాణంతో తిరిగిరాలేదు. గత ఏడాది సెప్టంబర్ 22 నుంచి డిసెంబర్ 5వ తేదీన ఆమె మరణించిందని ప్రకటించే వరకు అంతా గోప్యంగా ఉంచారు. ప్రజలు, పార్టీ నేతలు కోరినా చికిత్స పొందుతున్న జయ ఫొటోను విడుదల చేయలేదు. అమ్మ కోలుకుంటున్నారు, నేడో రేపో డిశ్చార్జ్ అని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు చివరి వరకు ప్రకటిస్తూనే ఉన్నారు. జయ మరణం తరువాత అదే పార్టీకి చెందిన న్యాయవాది పుహళేంది అన్నాడీఎంకే కార్యకర్తల యువజన విభాగాన్ని స్థాపించాడు. ఈ విభాగంలోని కడలూరుకు చెందిన అన్నాడీఎంకే న్యాయవాది సెల్వవినాయగం అమ్మ మరణం వెనుక శశికళ, పన్నీర్సెల్వం హస్తం ఉందంటూ గత నెల తేనాంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో న్యాయవాది పుహళేంది చెన్నై సైదాపేట 18వ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశాడు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె బాగా కోలుకుంటున్నట్లుగా అపోలో యాజమాన్యం విడుదల చేసిన బులిటెన్లలో పేర్కొందని, అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా 2016, డిసెంబర్ 5వ తేదీన రాత్రి 11.30 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె ప్రాణాలు తీశారని, ఈ నేరంలో శశికళ, పన్నీర్సెల్వం, అన్నాడీఎంకే నిర్వాహకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అపోలో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం 186 మంది పాత్ర ఉందని పిటిషన్లో చేర్చాడు. ఈ 186 మందిపై కేసులు నమోదు చేయాల్సిందిగా తేనాంపేట పోలీస్స్టేషన్లో గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోనందున తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టును కోరాడు. జయ మరణంపై కేసులు పెట్టేవరకు తమ పోరాటం ఆగదని న్యాయవాది పుహళేంది మీడియాకు తెలిపారు.