Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్‌ నాయక్‌ను అప్పగిస్తాం | Malaysia open to considering India request on Zakir Naik if evidence is provided | Sakshi

Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్‌ నాయక్‌ను అప్పగిస్తాం

Aug 22 2024 6:13 AM | Updated on Aug 22 2024 6:13 AM

Malaysia open to considering India request on Zakir Naik if evidence is provided

మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం 

న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్‌ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్‌ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement