controversial
-
కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?
పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో జరిగిన ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్ షో దూమారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్లో జరిగిన ఈ ఫ్యాషన్ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్లు ఉన్న ట్రాన్స్పరేంట్ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ హాలిడే. ఇది కేన్స్లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్ హాలిడే రిసార్ట్, స్విమ్ దుస్తుల పరంగా ఫ్యాషన్లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్ఎఫ్ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్ మార్కెటింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్ని ఎక్కువగా బాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్ డిజైనర్లు గుల్మార్గ్ ఫ్యాషన్ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..) -
ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు!
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. పోలండ్తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు. -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
డాకు మహారాజ్ స్టెప్స్ పై ఊర్వశీ రౌతేలా స్ట్రాంగ్ కౌంటర్..
-
నేపాల్ కొత్త కరెన్సీ నోట్లలో భారత్ ప్రాంతాలు? మరోమారు ఉద్రిక్తతలు?
ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాతో జతకట్టి, భారత్తో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.చైనాపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న ఓలీ.. ఆ దేశపు సూచనల మేరకు భారత్తో సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేపీ ఓలీ తన తప్పుడు నిర్ణయాలతో భారతదేశంతో సంబంధాలను చెడగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేపాల్ కొత్త నోట్లను ఆయుధంగా వాడుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘నేపాల్ ఖబర్ డాట్ కామ్’ తాజాగా నేపాల్ దేశ బ్యాంక్ జాయింట్ ప్రతినిధి డిల్లిరామ్ పోఖరేల్ తెలిపిన వివరాలను వెల్లడించింది. భారత్లో భాగమైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో కూడిన కొత్త మ్యాప్తో బ్యాంక్ నోట్ల ముద్రణను నేపాల్ దేశ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించిందని పేర్కొంది. ఏడాదిలోగా నోట్ల ముద్రణ పూర్తి కానున్నదని కూడా వెల్లడించింది.కాగా, గతంలో అప్పటి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని నేపాల్ క్యాబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని, సవరించిన మ్యాప్తో కూడిన కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదేపని చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమ భూభాగాలు అని భారత్ స్పష్టం చేసినప్పటికీ, చైనా సూచనలతో నేపాల్ ఈ దుశ్చర్యకు పాల్పడుతోదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ను భారత్కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
10 అత్యంత వివాదాస్పద ‘వికీలీక్స్’
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఐదేళ్లకు పైగా బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలులో, ఏడేళ్లపాటు లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత బుధవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. 2010లో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్లో విడుదల చేయడంతో చిక్కుల్లో పడి న్యాయపోరాటం సాగించారు. ప్రపంచాన్ని కదిలించిన 10 వికీలీక్స్ ఇవే..1. ఇరాక్ యుద్ధం2010లో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణనష్టం, వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యూఎస్ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది. దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా సంకీర్ణ దళాల చర్యల కారణంగా చోటు చేసుకున్న పౌర మరణాలు వికీలీక్స్ కారణంగా వెల్లడయ్యాయి.2. గ్వాంటనామో ఫైల్స్వికీలీక్స్ గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వివరించే పత్రాలను ప్రచురించింది. ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను దీనిలో బహిర్గతం చేసింది. ఇది అంతర్జాతీయ నిరసనలకు ఆజ్యం పోసింది. ఖైదీలను హింసించడం, వారి హక్కులను కాలరాడయం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి.3. ఆఫ్ఘన్ వార్ డైరీఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది, పౌర మరణాలు, రహస్య కార్యకలాపాలు, తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది. యూఎస్ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్న తీరు దీనిలో వెల్లడయ్యింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ బలోపేతమవుతున్నదని వికీలీక్స్ వెల్లడించింది.4. కొల్లేటరల్ మర్డర్ వీడియోబాగ్దాద్లో యూఎస్ అపాచీ హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీల్స్ విడుదల చేసింది. హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి, వారితోపాటు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్, అతని డ్రైవర్పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది. నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది.5. ప్రపంచ నేతలపై ఎన్ఎస్ఏ టార్గెట్అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికీలీక్స్ వెల్లడించింది. బెర్లిన్లో అప్పటి యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన ప్రైవేట్ సమావేశాన్ని ఎన్ఎస్ఏ బగ్ చేసిందని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి.6. డీఎన్సీ ఈ మెయిల్ వివాదం2016లో వికీలీక్స్.. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ)కి చెందిన ఈ మెయిల్స్ను విడుదల చేయడం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచం ముందు వెల్లడయ్యాయి. లీకైన ఈ మెయిల్స్లో డీఎన్సీ అధికారులు బెర్నీ సాండర్స్ కన్నా హిల్లరీ క్లింటన్కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడయ్యింది. ఈ వివాదం సాండర్స్ మద్దతుదారులలో అపనమ్మకాన్ని పెంచింది. ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.7. సౌదీ కేబుల్స్సౌదీ దౌత్య వ్యవహరాలకు సంబంధించిన కీలక విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. లీకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు, రహస్య కార్యకలాపాలు, దౌత్య వివరాలున్నాయి. ఈ లీక్లు సౌదీ అరేబియా విదేశీ విధానాలను, ప్రాంతీయ సంఘర్షణలను బహిర్గతం చేసింది.8. స్నోడెన్ ఎన్ఎస్ఏ పత్రాలుఎడ్వర్డ్ స్నోడెన్తో కలిసి, వికీలీక్స్ గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసే క్లాసిఫైడ్ ఎన్ఎస్ఏ పత్రాలను ప్రచురించింది. ఇది గోప్యతా హక్కులు, ప్రభుత్వ పర్యవేక్షణ, విజిల్బ్లోయర్ల పాత్రపై చర్చలకు దారితీసింది. ఈ వెల్లడి జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛల మధ్య సమతుల్యతపై పలు సందేహాలకు పురిగొల్పింది.9. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికీలీక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈ మెయిల్స్ను ప్రచురించింది. ఇది సైబర్ భద్రత, రాజకీయ పారదర్శకత, విదేశీ జోక్యంపై ఆందోళనలకు దారితీసింది.10. వాల్ట్ 72017లో వాల్ట్ 7 సిరీస్ను వికీలీక్స్ విడుదల చేసింది. దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హ్యాకింగ్ సాధనాలు, నిఘా పద్ధతులను బహిర్గతం చేసింది. ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు, డిజిటల్ గోప్యతపై ఆందోళను లేవనెత్తింది. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. శామ్ పిట్రోడాకు కాంగ్రెస్కు కీలక పదవి
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ దక్షిణాది భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయుల చర్మ రంగుపై జాతివివక్షతో వ్యాఖ్యలు చేయడంతో ఆయన కోల్పోయిన పదవి మళ్లీ దక్కింది. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా హస్తం పార్టీ తిరిగి నియమించింది.శామ్ పిట్రోడాను తక్షణమే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించినట్లు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.కాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తూర్పు భారతీయులు చైనియుల్లా, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్ల కనిపిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. -
లోక్సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్ వేసిన పిటిషన్ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లోనూ జరుగుతుంది. 17సి ఫామ్లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం. -
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
సాక్షి, విజయవాడ: వివాదాస్పద ఎస్పీలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఈసీ సస్పెండ్ చేసిన ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్కు నోటీసులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల లో ఎస్పీల వైఫల్యం, పాత్రపై విచారణ జరగనుంది. ఎస్పీల వివరణ ఆనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది.ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. -
అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్లో తృణమూల్పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు. Simply Outrageous. TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn — Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024 -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్కుమార్కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యాయవ్యవస్థపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
నాగ్పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి ఆయన దేశంలోని న్యాయవ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ‘నాకు చాలా బాధగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు పెట్టాల్సింది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 80 శాతం సమాజానికి అన్యాయం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ చేసే కొన్ని నిర్ణయాల్లో కుల వివక్ష వాసన వస్తోంది. ఇది న్యాయవ్యవస్థ నుంచి ఆశించ లేదు’ అని నాగ్పూర్లో జరిగిన ఎన్సీపీ సమతాపరిషద్ మీటింగ్లో అవద్ మాట్లాడారు. బహుజనులు ఇప్పుడిప్పుడే బార్ కౌన్సిల్లలో కనిపిస్తున్నారని అవద్ అన్నారు. తరాలుగా వారికి విద్య అందకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇదీచదవండి.. అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరి బలి -
కృత్రిమ దీవిలో వివాదాస్పద భవంతి
పోలండ్లోని నోటెకా అభయారణ్యంలో ఈ భవంతి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. నదిలో కృత్రిమ దీవిని ఏర్పాటు చేసుకుని, దానిపై మధ్యయుగాల శైలిలో దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించిన వివరాలు ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియవు. ఎవరు ఎందుకు ఈ భవంతిని నిర్మిస్తున్నారనే దానిపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇది 2025 నాటికి పూర్తి కాగలదని అంచనా. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించి జనాలకు కొంత ఆలస్యంగా తెలిసింది. దీనిపై స్థానిక పర్యావరణవేత్తలు గగ్గోలు చేయడంతో 2020లో ఏడుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతున్నా, దీనిపై పట్టించుకోనందుకు స్థానిక గవర్నర్కు పదవి ఊడింది. అయినా, ఈ భవంతి నిర్మాణం వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం స్పష్టంగా బయటపడలేదు. ఈ పరిణామాల తర్వాత కూడా ఈ భవంతి నిర్మాణం యథా ప్రకారం కొనసాగుతూనే ఉంది. ఈ భవంతి నిర్మాణానికి దాదాపు 75 మిలియన్ పౌండ్లు (రూ.78.94 కోట్లు) ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ భవంతి నిర్మాణం వెనుక జాన్ కుల్సిక్ అనే పోలిష్ కోటీశ్వరుడు ఉన్నట్లు ఒక వదంతి ప్రచారంలో ఉంది. నిజానికి అతడు ఈ నిర్మాణం ప్రారంభించే నాటికే 2015లో మరణించాడు. అయితే, తాను జీవించి ఉండగానే, మరణించినట్లు ప్రచారం చేసుకుని, తెరవెనుక ఉండి ఈ నిర్మాణం కొనసాగిస్తున్నాడనే ప్రచారం బలంగా ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాన్ని నిలిపివేయడానికి పోలిష్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ నెరవేరలేదు. అలాగే ఈ నిర్మాణం వెనుక ఎవరున్నారో, దీనిని ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారో ఇప్పటి వరకు బయటపడకపోవడమే ఆశ్చర్యకరం. -
అలాంటి వ్యక్తితో నటించకపోవడం సంతోషం
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ–‘‘నేను గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్లతో బెడ్ సీన్లలో నటించా. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడం బాధపడ్డాను. కశ్మీర్ షెడ్యూల్ అయిపోయే వరకు త్రిషను చూసే అవకాశం కూడా చిత్రయూనిట్ ఇవ్వలేదు’’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలు త్రిష వద్దకు చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ‘‘మన్సూర్ అలీఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యక్తులతో నటించకపోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ ఆయనతో, అలాంటి వారితో నటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది’’ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ–‘‘త్రిష అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు.. నా మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దు’’ అన్నారు. -
కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ -
ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు. 'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు. కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్సెల్ మార్కెట్తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
డామిట్!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి? ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు. చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది. -
టాయిలెట్ల వెనక చాలా కథ ఉంది.. ఈ వింతలు, విశేషాలు తెలుసా? (ఫోటోలు)
-
తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తీరు మరోసారి వివాదాస్పదమైంది. తండ్రిని హత్యచేసిన వారికి శిక్షలు పడేందుకు పోరాడుతున్నానని చెబుతున్న ఆమె వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అనేకానేక సందేహాలు లేవనెత్తుతోంది. వివేకాను హత్యచేశానని స్వయంగా ఒప్పుకున్న దస్తగిరికి ఆమె పూర్తి అండదండలు అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో కలిసేందుకు సునీత శుక్రవారం ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి బెయిల్ వ్యవహారంలో సునీత వ్యవహారశైలి.. అనంతరం ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె యత్నించడానికి సంబంధం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులను ప్రభావితం చేయడం ద్వారా ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఆమె యత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చన్న బలమైన ఆరోపణలకు సునీత ప్రస్తుత వ్యవహారశైలి బలం చేకూరుస్తోంది. హంతకుడు దస్తగిరికి సునీత అండదండలు.. సాధారణంగా తండ్రిని హత్యచేసిన వారిపై ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. కానీ, వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిపై ఆయన కుమార్తె సునీత అంతులేని సానుకూలత ప్రదర్శిస్తున్నారు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్గా మార్చడాన్ని ఆమె ఏమాత్రం వ్యతిరేకించలేదు. అనంతరం.. బెయిల్ కోసం దస్తగిరి పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అంతేకాదు.. సునీత కూడా అతని బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదు. మరోవైపు.. అసలు హత్యచేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చడాన్ని వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాల్ చేశారు. అతనికి ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కూడా కోర్టును కోరారు. కానీ, సునీత వెంటనే ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం విస్మయపరిచింది. అలాగే, దస్తగిరి బెయిల్ను రద్దుచేయాల్సిన అవసరంలేదని ఆమె న్యాయస్థానికి తెలపడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి ఎలాంటి అర్హతలేదని.. బాధితురాలిగా తనకే అది ఉందని ఆమె వాదించారు. దస్తగిరి బెయిల్పై బయట ఉండటంపట్ల తనకేమాత్రం అభ్యంతరంలేదని చెప్పుకొచ్చారు. అసలు తన తండ్రిని హత్యచేసిన వ్యక్తి జైలులో ఉండాలని కోరుకోవాల్సిన సునీత.. అతను బయట ఉండాలని ఆశిస్తుండటం వెనుక ఏదో మతలబు ఉందన్నది స్పష్టమవుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని బలపర్చాలనే.. నిజానికి.. దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలతో ఎర్ర గంగిరెడ్డి విభేదించారు. సీబీఐ నమోదు చేసిన దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలంలో చెప్పినవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. దాంతో దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలం అంతా కట్టుకథేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. ఎర్ర గంగిరెడ్డిని కలిసి దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను బలపరచాలని ఒత్తిడి చేయడమే సునీత ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకోసం ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేయడం.. ఆయన బెయిల్కు సీబీఐ సహకరించేట్లుగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమె ప్రణాళికగా ఉంది. వివేకా హత్య అనంతరం అక్కడ ఆధారాలను ధ్వంసం చేయాలని ఎర్ర గంగిరెడ్డిని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డి ఆదేశించారు. ఇదే అంశం సునీత, ఆమె భర్తకు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో మాట మార్చాలని.. ఆధారాల ధ్వంసంతో తన భర్తకు సంబంధంలేదని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించాలన్నది సునీత ఉద్దేశం. తాను చెప్పినట్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది. ఎర్ర గంగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఎందుకో!? ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జైల్లో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు విస్మయపరుస్తోంది. గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె జైలు అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దాంతో ఆమె తన న్యాయవాది ద్వారా కొన్ని పత్రాలు ఆయన వద్దకు పంపి సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. అసలు తన తండ్రి హత్యకేసులో ఏ–1గా ఉన్న గంగిరెడ్డిని సునీత కలిసేందుకు యతి్నంచడం సందేహాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుచేయడంతో ఎర్ర గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాను చెప్పినట్లుగా చెబితే దస్తగిరికి సహకరించినట్లుగానే ఎర్ర గంగిరెడ్డికి సహకరిస్తామని ఆయనకు చెప్పేందుకే సునీత ప్రయత్నించినట్లు సమాచారం. వేళ్లన్నీ సునీత, ఆమె భర్తవైపే.. ఈ మొత్తం పరిణామాలతో వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమైంది. ఆమె ఎందుకు హంతకులకు కొమ్ముకాస్తూ మరీ హత్య కేసు దర్యాప్తు దారి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో.. వివేకా హత్యకు గురికావడంతో ఆయన సొంత కుటుంబ సభ్యులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. చదవండి: ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు వివేకా హత్య తరువాత ఆయన రాసిన లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు వెంటనే ఇవ్వకుండా గోప్యంగా ఉంచమని పీఏ కృష్ణారెడ్డితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఇదే అంశంపై సీబీఐ ఇటీవల వారిని విచారించింది కూడా. నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి ఆదేశాలతోనే వివేకా హత్య స్థలంలో ఆధారాల ధ్వంసం చేశారన్నది వెల్లడైంది కూడా. వివేకా రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేత బీటెక్ రవి, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావగారు శివప్రకాశ్రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారన్నది కూడా బహిరంగ రహస్యంగా మారింది. వాస్తవాలు వెల్లడి కాకూడదనే.. ఈ నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డిల పాత్ర ఉందనే వాదన బలపడుతోంది. అంటే ఈ కేసులో వారిని నిందితులుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాము బాధితులమని.. తమకే అర్హత ఉందని చెప్పేందుకు వారు నైతిక హక్కు కోల్పోయారు. మరోవైపు.. ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ముందు నిజాలు వెల్లడిస్తే తమ కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని సునీత ఆందోళన చెందుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు సునీత యత్నించినట్లు స్పష్టమవుతోంది. -
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు అధికార పార్టీ బీఆర్ఎస్కు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డిపై సొంత కూతురే కేసు పెట్టడం కలకలం రేపుతోంది. నాచారంలో తన పేరిట ఉన్న ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించాడని కూతురు తూల్జ భవాని రెడ్డి ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పై చీటింగ్తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు కొంత కాలంగా వివాదస్పదంగా బయటకు వస్తోంది. నోటి దురుసుతనం, వ్యవహార శైలితో ఇంటా బయట విమర్శలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సొంత కూతురు తూల్జ భవాని రెడ్డి తన పేరిట నాచారంలో ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్కు సంబంధించి తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి కినారా గ్రాండ్కు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్ చేయించాడని ఉప్పల్ పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిబ్రవరి 4న ముత్తిరెడ్డి పై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదు చేశారు. ముత్తిరెడ్డిపై ఆరోపణలు ► యశ్వంతపూర్లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించారని గతంలో హైకోర్టుకు వెళ్ళారు మాజీ సర్పంచ్. బతుకమ్మ కుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ సైతం జరిగింది. ► నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. ► చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చెర్యాల బంద్కు పిలుపునిచ్చింది. ► గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదల లేదనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె -
PM Modi:వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కేరళలో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసింగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ చిత్రంపై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు. 'కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గుట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని మోదీ పేర్కొన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్ సినిమాస్.. షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. చదవండి: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ -
Manchu Vishnu Vs Manoj: మంచు మనోజ్, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్ వీడియో వైరల్
మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, విష్ణుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ని నిజం చేస్తూ ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. తన అన్నతో విభేదాలు ఉన్నాయంటూ స్వయంగా మంచు మనోజ్ బయటపెట్టాడు. విష్ణు ఇంట్లోకి చొరబడి తన అనుచరులపై దాడి చేశాడంటూ తాజాగా మనోజ్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టంట సంచలనం రేపుతోంది. విష్ణు ఇంట్లోకి చోరబడి మనోజ్ సన్నిహితుడు అయిన సారథితో వివాదానికి దిగడమే కాదు అతడిపై దాడి చేశాడంటూ మనోజ్ వీడియో విడుదల చేశాడు. ‘ఇదీ పరిస్థితి.. కొంతకాలంగా మా అన్న విష్ణు వ్యవహరం ఇలా ఉంది’ అంటూ మనోజ్ అసలు విషయం బయటపెట్టాడు. -
మోదీ వివాదాస్పద వ్యక్తి!: మస్క్తో కలిపి ఒకేగాటన కట్టిన చాట్జీపీటీ
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీని ‘వివాదాస్పద వ్యక్తి’గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీ పేర్కొంది! ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ను ‘అత్యంత వివాదాస్పద వ్యక్తి’గా అది ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖుల్లో వివాదాస్పదుల జాబితాను చాట్జీపీటీ తాజాగా వెల్లడించింది. అందులో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితరులున్నారు. వీరందరినీ ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా చాట్జీపీటీ పేర్కొనడం విశేషం. వివాదాస్పదులు కాని వారి జాబితాలో అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, మాక్రాన్, కుబేరులు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ తదితరులను పేర్కొంది. -
అనసూయ వాలంటైన్స్ డే స్పెషల్ పోస్ట్.. ఇన్స్టాగ్రామ్లో వాగ్వాదం!
ప్రేమికుల రోజున నటి అనసూయకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. వాలంటైన్స్ డే సందర్భంగా అనసూయ చేసిన స్పెషల్ పోస్ట్పై సోషల్ మీడియాలో రకరకాలు రెస్పాన్స్ వస్తోంది. పలువురు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది అనసూయ. ‘నీతో లైఫ్ చాలా క్రేజీగా ఉంటుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అదేం లేదు అక్క.. వాడి దగ్గర డబ్బు చాలా ఉంది అందుకే’ అంటూ కామెంట్ చేశాడు. ఇక అతడి కామెంట్పై అనసూయ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ సదరు నెటిజన్ను చెప్పుతో కొడతానంటూ చెప్పకనే చెప్పి కౌంటర్ ఇచ్చింది. ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? చెప్పు.. నాకు లేదా మనీ మరి? నీకు అన్ని తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. సారి అదే చెంపలేస్తానంటున్నా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక అనసూయ రెస్పాన్స్ రికౌంటర్ సదరు నెటిజన్ మరో కామెంట్ చేశాడు. ‘మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. రియాలిటీని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా నిజమ నిజమే’ అని అన్నాడు. దీనిపై కూడా అనసూయ రిప్లై ఇచ్చింది. ‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అని అంటూ కామెంట్స్ చేసింది. ఒకరి కామెంట్పై ఒకరు స్పందిస్తూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అనసూయ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, కామెంట్స్ నెట్టింట హాట్టాపిక్గా నిలిచాయి. కాగా గతంలోనూ ఇలానే అనసూయ నెటిజన్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ట్విటర్లో తనని ట్రోల్ చేసిన వారినిక సమాధానం ఇస్తూ ఇలా రెండు, మూడు రోజుల పాటు అనసూయ గొడవ పడింది. అప్పట్లో ఇది చర్చనీయాంశమైంది. అంతేకాదు దనని ట్రోల్ చేసిన వారిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్నగర్, శామీర్పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
రామకృష్ణ రూటే సెపరేటు.. నిజాలు తెలిసి నాలుక మడత
కమ్యూనిస్టు పార్టీలంటే ప్రజా సమస్యల మీద పోరాడతారనే పేరుండేది. కాని ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టి టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రకటనలు అనుమానాలకు తావిస్తోంది. సిద్ధాంతాలకు తిలోదకాలు భారత కమ్యూనిస్టు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణ.. పాతికేళ్ళ క్రితం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే కొంతకాలంగా రామకృష్ణ అనుసరిస్తున్న తీరుతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని సీపీఐ వర్గాలే చెబుతున్నాయి. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా పోరాడే పార్టీగా తమ పార్టీ సీపీఐకి బ్రాండ్ ఉందని, ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ... అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని రామకృష్ణపై సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు రామకృష్ణ. అనంతపురం కేంద్రంగా గత కొన్ని రోజులనుంచి జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జాకీపై పచ్చ పడగ అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జాకీ కంపెనీ ముందుకొచ్చింది. 129 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనంతపురంరాప్తాడు మధ్య 27 ఎకరాల భూమిని సేకరించి కంపెనీకి ఇచ్చింది. 2018లోపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ జాకీ కంపెనీ రాప్తాడులో ఏర్పాటు కాలేదు. రాప్తాడుకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ఈ కంపెనీని ఇరవై కోట్ల రూపాయల కమిషన్లు అడిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఆ రోజున సీపీఐ నేత రామకృష్ణ టీడీపీ నేతల అవినీతి గురించి ప్రశ్నించలేదు. అర్థాంతరంగా పనులు నిలిపివేసి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమపై ఆయన ఏ మాత్రం స్పందించలేదు. నిజాలు తెలిసి నాలుక మడత నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జాకీ అంశం చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డబ్బు డిమాండ్ చేయటం వల్లే జాకీ పరిశ్రమ ఏర్పాటు కాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాం ఆరోపించారు. దీన్నే ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది. తెలుగుదేశం నాయకుల ఆరోపణలకు మద్దతుగా రంగంలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి వల్లే జాకీ పరిశ్రమ రాలేదంటూ టీడీపీ ఆరోపణలను రామకృష్ణ కూడా వల్లె వేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల వల్లే జాకీ కంపెనీ వెళ్లిపోతే..అప్పుడు సీపీఐ నేత రామకృష్ణ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ మాజీ మంత్రి పరిటాల సునీతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యే తోపుదుర్తిపైనా ఆరోపణలు చేస్తున్నారని అనంతపురంలో టాక్ నడుస్తోంది. ఏమైంది చిత్తశుద్ధి? ఆనాడు మౌనంగా ఉండి నేడు హడావిడి చేయడానికి కారణం టీడీపీకి మద్దతుగా నిలవడమేనని కమ్యూనిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామకృష్ణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ నేతల అవినీతి, జాకీ పరిశ్రమ తరలిపోవటంపై నిలదీసి ఉండోచ్చని అంటున్నారు. హింసా రాజకీయాలు అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబాన్ని వెనకేసుకు రావటం ద్వారా సీపీఐ నేత రామకృష్ణ కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బతీశారంటూ జిల్లాలోని వామపక్ష వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
-
ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్పై విమర్శలు!
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నప్పుడూ హోం సెక్రటరీగా ఉన్న సుయోల్లా బ్రేవర్ మాన్ భద్రతా ఉల్లంఘనల విషయమై పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బ్రేవర్ మాన్ రాజీనామ చేసిన కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ కూడా అనుహ్యాంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మళ్లీ సుయోల్లా బ్రేవర్మాన్ని తిరిగి హోమంత్రిగా నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని సునాక్ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఒక మంత్రి మళ్లీ తిరిగి నియమించడం బాధ్యతారహితమైన నిర్ణయం అంటూ రిషిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు లేబర్ నాయకుడు కైర్ స్టార్మర్, కూపర్లు కూడా ఆమెని తొలగించాలని పట్టుపట్టారు. బ్రేవర్ మాన్ అత్యంత మితవాద టోరీ ఎంపీలకు ప్రాతినిథ్యం వహిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఆమె యూకేకు అక్రమంగా వచ్చిన వలసదారులను రువాండ్కు పంపించేందుకు మద్దతు ఇచ్చిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదీగాక ఆమె ఒక ప్రైవేట్ ఇ-మెయిల్కు సెన్సిటివ్ డాక్యుమెంట్ని పంపించిన వివాదాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి ఆమెను దేశీయ భద్రతా సమస్యలకు బాధ్యత వహించే ప్రముఖ స్థానానికి మళ్లీ తిరిగి నియమించడంపై బ్రిటన్ అంతటా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రిషి సునాక్ కూడా ఆ వివాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు. (చదవండి: బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!) -
ఆల్భమ్ సాంగ్లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు
సోషల్ మీడియా సెన్సేషన్, హిందీ బిగ్బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్ తన తీరుతో మరోసారి వివాదంలో నిలిచింది. తాజాగా ఆమె నటించిన ఓ అల్బమ్ సాంగ్పై పలు సామాజిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలో ఉర్ఫీ చీరకట్టు, డాన్స్పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 23న ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ వీడియోలో ఉర్ఫీ తీరు లైంగిక చర్యలను ప్రోత్సహించేలా ఉందంటూ సదరు ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? కాగా ఉర్పీ జావేద్ నటించిన ‘హాయే హాయే యే మజ్బూరీ’ అనే అల్భమ్ సాంగ్ అక్టోబర్ 11న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె రెడ్ కలర్ చీర కట్టులో కనిపించింది. ఉర్ఫీ విభిన్న వస్త్రాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్తో ఆమె తరచూ ట్రోల్స్ బారిన పడుతుంది. తాజాగా ఈ పాటలో సైతం ఆమె చీరకట్టులో ఫుల్ గ్లామర్ షో చేసింది. దీంతో ఉర్పీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోలో ఆమె డ్రెస్సింగ్, డాన్స్ తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టెలా ఉందంటూ పలువురి నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటిపై గతంలో ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ ఇవేవి తనని బాధించలేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సైతం స్పందిస్తూ తన డ్రెస్సెంగ్, ఫ్యాషన్ పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ట్రోల్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా ఫ్యాషన్ తీరు పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. విమర్శలు, వివాదాలు నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను ఏం చేసినా, ఏం పోస్ట్ చేసిన దాన్ని అందరు పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూనే ఉంటారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది కాలంగా జమ్ము రీజియన్ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట. అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. గులాం నబీ ఆజాద్.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటర్ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్ లోకల్స్ను సైతం ఓటర్ లిస్ట్లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంచనా వేస్తున్నారు. -
ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించిన ప్రకాష్ వ్యవహారంలో మహిళ లక్ష్మి పాత్ర వివాదాస్పమవుతోంది. తనను ప్రకాష్ వేధించాడంటూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి మాట మార్చిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఓ విషయంమై శుక్రవారం ఆమె ఫిర్యాదు చేసేందుకు రావడం.. అదీ పోలీసులపైనే కేసు పెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో.. వివరాలు.. కానిస్టేబుల్ ప్రకాష్ తన భార్య లక్ష్మిని లోబరుచుకున్నాడంటూ గార్లదిన్నెకు చెందిన వేణుగోపాల్రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌసింగ్బోర్డులోని ఓ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన వారిద్దరూ కలిసుండడం చూసిన ఆయన అడ్డుకున్నట్లు తెలిసింది. గొడవ జరగడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని మందలించి పంపారు. అప్పటి నుంచి కనిపించని లక్ష్మి సంఘటన జరిగిన 9 రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రత్యక్షమైంది. తనను అనంతపురం టూటౌన్ ఎస్ఐ రాంప్రసాద్, భర్త వేణుగోపాల్రెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు అంజినిరెడ్డి ఆ రోజు చంపాలని చూశారని ఆరోపించింది. స్థానికులు రావడంతో ఎస్ఐతో పాటు అందరూ పరారయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. -
వివాదాస్పద వీడియో.. బీజేపీ మహిళా నేత అరెస్ట్
సాక్షి, చెన్నై: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన బీజేపీ మహిళా నేతను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న సౌదామణి గత జనవరిలో రెండు మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా ఉన్న వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయబడింది. సెంట్రల్ క్రైమ్ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సౌదామణి ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. దానిని కోర్టు తిరస్కరించింది. ఈ నేథ్యంలో శనివారం సెంట్రల్ క్రైమ్, సైబర్ క్రైమ్ పోలీసులు సౌదామణి చెన్నైలోని ఆమె ఇంటిలో అరెస్టు చేశారు. చదవండి: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్! దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
లక్నో: మహ్మద్ ప్రవక్త పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి కార్చిచ్చులా రగిలిపోతుందే తప్ప ఇప్పట్లో ఎక్కడా చల్లబడేటట్లు లేదు. అల్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, సహారన్పూర్లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన వెంటనే నిరసనకారులు పోలీస్స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ప్రయాగ్రాజ్లో ఒక గుంపు కొన్ని మోటార్సైకిళ్లను, బండ్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ప్రయోగించక తప్పలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే నిమ్మితం తొమ్మిది మంది పై గట్టిగా లాఠీ ఝళిపించారు. ఐతే ఈ ఘటన తాలుకా వీడియోని బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్ మీడియాలో ఇది "అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్" అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరు పై, బీజేపీ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.."ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పైగా ఇలాంటి పోలీస్స్టేషన్లను గట్టిగా నిలదీయాలి. కస్టడీ మరణాల్లో యూపీనే నెంబర్ వన్. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘన, దళితులపై వేధింపుల్లో కూడా యూపీనే అగ్రగామిగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ పోలీసు ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి సుమారు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. (చదవండి: బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?) -
Sakshi Cartoon: శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత
శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత -
కేసు గుట్కాయ స్వాహా..!
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల విలువైన నిషేధిత గుట్కా, ఖైనీ విడుదలకు తెరవెనుక ఖాకీలు తోడ్పాటు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిషేధిత గుట్కా, ఖైనీ స్వాధీనం... అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకెళ్తే... ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఒడిశా నుంచి విశాఖకు వస్తున్న లారీని అడవివరం ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ ఆఫ్ బ్యూరో అధికారులు అనుమానంతో ఆపి తనిఖీలు చేశారు. అందులో నకిలీ గుట్కా ఖైనీలతోపాటు రూ.10 లక్షలు విలువ గల నకిలీ మద్యం కూడా దొరికింది. పట్టబడిన 10,050 మద్యం బాటిళ్ల విలువ రూ.10.05 లక్షలు, 20 లక్షల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విలువ రూ.2.07 కోట్లుగా నిర్ధారించారు. అయితే అందులోని అక్రమ మద్యం ఎస్ఈబీ అధికారులే సీజ్ చేశారు. మిగతా సుమారు రూ.2 కోట్లు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసులో లారీలో సరకు లభ్యమైతే వేరే వాహనం నంబర్ ప్లేట్ మార్చి కేసు నమోదు చేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. మరోవైపు ఎస్ఈబీ సిబ్బందైతే రూ.40 వేలు ఇస్తే పట్టుకున్న వాహనాన్ని వదిలేస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. బయటకు వస్తే చాలా ప్రమాదం ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సరకు బయటకు తీసుకొచ్చేందుకు సంబంధిత వ్యక్తులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వీరికి పోలీసులు కూడా సహకరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అసలే రసాయనాలు, కెమికల్స్తో తయారు చేసిన గుట్కా, ఖైనీలు.. ఆపై మూడు నెలలకు పైగా నిల్వ ఉన్న వాటిని బయటకు తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న గుట్కా, ఖైనీలు అధికశాతం నకిలీవే. కొందరు పోలీసుల తీరుతో చెడ్డపేరు రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ నగరంలో స్వేచ్ఛగా గుట్కా, ఖైనీ అమ్మకాలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి విశాఖ నగరానికి అక్రమ మార్గంలో సరకు తరలిస్తున్నారు. అధికారులతో కొందరు బడాబాబులు కుమ్మక్కై సరకు అమ్మకాలు చేస్తున్నారు. లారీల్లో, రైళ్లలో ఏదో ఒక రకంగా సరకు నగరానికి తీసుకొచ్చి దుకాణాలకు చేరవేసి విక్రయిస్తున్నారు. అయితే వీటి నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, టాస్క్ఫోర్స్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ గుట్కా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో కొంత మంది పోలీసులు ముఠా సభ్యులతో చేతులు కలుపుతుండడంతో భారీ స్థాయిలో సరకు సీజ్ చేస్తున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఎస్ఈబీ, టాస్క్ఫోర్స్ సిబ్బంది శ్రమించి నిషేధిత గుట్కా, ఖైనీలను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తుంటే.. అక్కడ మాఫియా సభ్యులు పోలీసులకు ముడుపులు చెల్లించి తమకు అనుకూలంగా కేసును మలచుకొని సరకు విడుదల చేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రక్రియ నిలిపివేత మత్తు పదార్థాలు, గుట్కా, ఖైనీ పట్టుబడిన వెంటనే పంచనామా చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి ఇచ్చిన రిపోర్టుని కోర్టుకు అందజేయాలి. కోర్టు తీర్పు ఆధారంగా ఈ హానికరమైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను దహనం చేయాలి. కానీ పోలీసులు అలా చేయలేదు. స్వాధీనం చేసుకున్న సరకు ఎస్ఈబీ అధికారులు అప్పగించిన తర్వాత గోపాలపట్నం పోలీసులు ఓ గొడౌన్లో భద్రపరిచారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. అక్కడితో తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకున్నారు. సుమారు రెండున్నర నెలల (80 రోజులు)పాటు ఆ ప్రక్రియ ఏమీ పూర్తి చేయకుండా స్వాధీనం చేసుకున్న సరకును గొడౌన్లోనే నిల్వ ఉంచారు. ఇంతలో సరకు తరలిస్తూ పట్టుబడిన నిందితులు బెయిల్పై బయటకు వచ్చి కోర్టును ఆశ్రయించారు. తమ సరకు విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే నిందితులు కోర్టును ఆశ్రయించే వరకు పోలీసులు ఉద్దేశపూర్వక నిర్లిప్తత ప్రదర్శించారని, అందుకు భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానం ఆదేశాలు పాటిస్తాం ఎస్ఈబీ పోలీసులు గుట్కా, ఖైనీ స్వాధీనం చేసుకుని మాకు అప్పగించారు. అనంతరం తాము సీజ్ చేశాం. గుట్కా, ఖైనీ సరకు తిరిగి ఇచ్చేయమని కోర్టు నుంచి సంబంధిత సరఫరాదారులు ఆర్డర్ తెచ్చుకుంటే విడుదల చేయకతప్పదు. ఈ కేసులో కూడా న్యాయస్థానం నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. – మళ్ల అప్పారావు, గోపాలపట్నం సీఐ గోపాలపట్నం పోలీసులకు అప్పగించాం గత ఫిబ్రవరి నెలలో అడవివరం జంక్షన్లో లారీ తనిఖీ చేయగా సుమారు రూ.2కోట్ల విలువైన గుట్కా, ఖైనీ పట్టుబడింది. కేసు నమోదుచేసి గోపాలపట్నం పోలీసులకు సరకు అప్పగించాం. అనంతరం నిందితులు బెయిల్ తెచ్చుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తాము నడుచుకుంటాం. – శ్రీనాథుడు, ఏఈఎస్, ఎస్ఈబీ (చదవండి: ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు) -
లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా?
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ నిర్వాహకుడు శ్రీధర్రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్ చేయించారు. చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే.. అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది. కుటుంబానికి చెడ్డపేరు రాకుండా.. రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు. కందికుంట తీరుపై ప్రజల అసహనం లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ వివాదాస్పద నియామకం కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు రూ. 3 కోట్లు, ఎన్ఎస్ఈకి .. సుబ్రమణియన్కు.. మరో మాజీ ఎండీ, సీఈవో రవి నారాయణ్కు తలో రూ. 2కోట్లు, మాజీ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ వీఆర్ నరసింహన్కు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా రామకృష్ణ, సుబ్రమణియన్ .. మూడేళ్ల పాటు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ లేదా సెబీ దగ్గర నమోదైన ఇతర మధ్యవర్తిత్వ సంస్థతో కలిసి పనిచేయకుండా నిషేధం విధించింది. నారాయణ్ విషయంలో ఇది రెండేళ్లుగా ఉంది. అటు కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకుండా ఎన్ఎస్ఈపై సెబీ ఆరు నెలలు నిషేధం విధించింది. కుట్ర కోణం.. ఈ మొత్తం వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేశారని సెబీ వ్యాఖ్యానించింది. ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యనీయమైన సమాచారం (ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఫలితాలు మొదలైనవి) అన్నింటినీ యోగికి ఆమె చేరవేసేవారని, ఆఖరుకు ఉద్యోగుల పనితీరు మదింపు విషయంలో కూడా ఆయన్ను సంప్రదించేవారని.. సెబీ 190 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. యోగి సూచనల మేరకే ఆనంద్ను నియమించారని, ఎండీ.. సీఈవో స్థాయి అధికారాలన్నీ కూడా కట్టబెట్టారని, అడ్డగోలుగా జీతభత్యాలు పెంచారని తెలిపింది. ‘ముగ్గురి మధ్య జరిగిన ఈమెయిల్ సంప్రదింపులను చూస్తే గుర్తు తెలియని వ్యక్తితో (యోగి) చిత్ర, ఆనంద్ కుమ్మక్కై చేసిన కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద్కు చిత్ర జీతభత్యాలు పెంచేవారు, అందులో నుంచి కొంత భాగాన్ని సదరు గుర్తు తెలియని వ్యక్తికి ఆనంద్ చెల్లించేవారు‘ అని వ్యాఖ్యానించింది. ఈ అవకతవకలన్నీ తెలిసినా, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్ సహ ఇతరత్రా అధికారులెవరూ గోప్యనీయ సమాచారం పేరిట ఆ వివరాలేవి రికార్డుల్లో పొందుపర్చలేదని సెబీ ఆక్షేపించింది. వివరాల్లోకి వెడితే.. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా పని చేశారు. ఆ సమయంలోనే 2013లో ఆనంద్ సుబ్రమణియన్ రూ.1.68 కోట్ల వార్షిక వేతనంతో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటెజిక్ అడ్వైజరుగా నియమితులయ్యారు. అప్పుడు ఆయన బామర్ అండ్ లారీ అనే సంస్థలో రూ. 15 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి మేనేజరుగా ఉన్నారు. పైగా క్యాపిటల్ మార్కెట్లలో ఎటువంటి అనుభవం లేదు. అయినా ఆయన్ను పిలిచి మరీ ఎన్ఎస్ఈలో కీలక హోదా కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన వేతనం విడతల వారీగా 2016 నాటికి రూ. 4.21 కోట్లకు పెరిగింది. అప్పటికి ఆయన గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీకి సలహాదారుగా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన్ను ఎప్పటికప్పుడు అత్యుత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగిగా ప్రచారం చేసినా, ఎక్కడా ఆయన పనితీరు మదింపు చేసిన ఆధారాలేమీ లేవని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
SBI: దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు
ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్స్ల విషయంలో.. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..
సాక్షి, చెన్నై: గతంలో భర్త, కుమార్తెను వదిలి ప్రియుడే కావాలని రచ్చకెక్కిన ఓ మహిళ తాజాగా తాను ఆది పరాశక్తి అవతారం అని చెప్పుకుంటూ.. తెర మీదకు రావడం స్థానికులను విస్మయంలో పడేసింది. పైగా అన్నపూర్ణి అరసు మాతాజీగా భక్తులకు కొత్త సంవత్సరం వేళ ఉపదేశం ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. దీంతో ఈ మాతాజీ కోసం పోలీసులు వేట మొదలెట్టారు. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదిక అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని, భక్తులకు ఉపదేశం చేయనున్నారని సామాజిక మాధ్యమాల వేదికగా ఆహ్వానం పలికే వీడియో వైరల్ అవుతోంది. ఈ మాతాజీ చుట్టూ భక్తులు ఆశీర్వచనాలు తీసుకోవడం, క్షణాల్లో ఆమె పూనకం వచ్చినట్టు ఊగి పోతు భక్తుల కోరికల్ని తీర్చడం, వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్లో ప్రత్యక్షం అయ్యా యి. దీంతో పోలీసులు ఈ మాతాజీ ఎవరోఆరా తీసే పనిలో పడ్డారు. చదవండి: (భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో) తెర మీదకు గత వివాదాలు 2014లో ఓటీవీ ఛానల్ వేదికగా జరిగిన చర్చలో తనకు భర్త, 14 ఏళ్ల కుమార్తె కన్నా, ప్రియుడు అరసే ముఖ్యం అని స్పష్టం చేసి అతడితో వెళ్లి పోయిన అన్నపూర్ణే ఈ మాతాజీగా తేలింది. అలాగే గత వివాదాల వీడియోలు సైతం తెర మీదకు తెచ్చే సోషల్ మీడియా పోస్టులు కూడా భారీగానే పెరిగాయి. మరింత లోతుగా సాగిన విచారణలో ప్రియుడి అరసు అనుమానాస్పదంగా గతంలో మరణించినట్టు తేలింది. ఇక పోలీసుల రాకతో అన్నపూర్ణి, ఆమె భక్తులు పత్తా లేకుండా పోయారు. చెంగల్పట్టు పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాతాజీని అరెస్టు చేసే అవకాశం ఉంది. -
వివాదాస్పదంగా మారిన ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం
-
సమంత ఐటెం సాంగ్ రచ్చ, ఇతర సాంగ్స్పై చర్చ
సాక్షి, హైదరాబాద్: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించిన పుష్ప మూవీ హిట్టాక్తో దూసుకు పోతోంది. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ అంతే వివాదాన్ని సృష్టిస్తోంది. మగజాతిని అవమానించారంటూ ఏకంగా పురుషుల సంఘం సమంతపై కేసు నమోదు చేసేదాకా వ్యవహారం వచ్చిందంటే ఈ సాంగ్పై జరుగుతున్న రచ్చను అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మహిళలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ గతంలో అనేక సినిమాల్లో వచ్చిన సాంగ్స్పై తీవ్ర చర్చకు తెర తీసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న ప్రధాన పాత్రగా వచ్చిన పుష్ప మూవీలో హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్లో.ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్తో పాడిన ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ పాట యూత్ను షేక్ చేస్తోంది. మరోవైపు ఈ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం కోర్టు కెక్కింది. దీనిపై గీతరచయిత చంద్రబోస్ క్షమాపణ చెప్పినా వివాదం సద్దు మణిగినట్టు కనిపించడం లేదు. అంతేకాదు ఆల్ ఐటెం సాంగ్స్ డివోషనల్ సాంగ్సే.. అంటూ ఆ ట్యూన్లో భక్తిగీతం పాడి తన ధోరణిని సమర్ధించుకోవడం పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు ఐటెం నెంబర్లూ దేవుడి పాటలూ రెండూ ఒకటేనా? హిందూ సమాజానికి దేవిశ్రీ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అగ్గి గుగ్గిలమయ్యారాయన. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఈ పాటకు పేరడిగా మేల్ వెర్షన్ అంటూ రచయిత ప్రశాంత్ రాసిన పాటను జానపద గాయకుడు రమణ ఆలపించిన పాట ప్రస్తుతం యూ ట్యూబ్లో పెద్ద సంచలనంగా మారింది. మిలియన్స్ వ్యూస్తో దూసుకుపోతుంది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ యూట్యూబ్ను ఎంత షేక్ చేస్తోందో దాదాపు అంతే క్రేజ్ ఈ పేరడీసాంగ్కు రావడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా అలనాటి జ్యోతి లక్ష్మి చీర కట్టింది పాట దగ్గరనుంచి బావలు సయ్యా అంటూ సిల్క్ స్మితతో పిచ్చి గంతులు వేయించిన పాట వరకు, ఇటీవల రాంచరణ్ మూవీ ‘రంగస్థలం’ లోని జిల్ జిల్ జిగేల్ రాజా ఐటమ్ సాంగ్, ఆర్య-2 సినిమాలోని రింగ రింగ రింగ రింగరింగారే వరకు పాటలపై నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ రెండు పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, డీఎస్పీ సంగీతం సమకూర్చారు. అంతేకాదు రింగ రింగ పాట చాలా అసభ్యంగా ఉందంటూ అభ్యంతరాలు కూడా వ్యక్తమైనాయి. లోక్సత్తా లీగల్ సెల్ సినిమా దర్శక నిర్మాతలకు, మ్యూజిక్ కంపెనీకీ లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే, జనతా గ్యారేజ్ సినిమాలో రామజోగయ్యశాస్త్రి రాసిన పక్కా లోకల్ పాటలోని సాహిత్యం గురించి పెద్ద చర్చే నడించింది. టాలీవుడ్ సూపర్ స్టార్లుగా చెప్పుకునే బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, పవన్కళ్యాణ్, మహేష్ ఇలా టాప్ హీరోల సినిమాల్లోని ఐటెం సాంగ్స్ ఉన్నాయి. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని లంగాబాడీ లంబాడీ ఆడేస్కుంటా కబాడీ, కిల్లర్ నుంచి రంభలకి రంజుమొగుడ్ని, ఇంతులకి ఇంటిమొగుడ్ని , పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ మూవీలోని కెవ్వు కేక నా సామిరంగా కేవ్ కేక, మహేష్ సూపర్ డూపర్ హిట్ మూవీ పోకిరి లోని ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళేపాట పాటల్లోని సాహిత్యం గురించి ఎంత తక్కువ ప్రస్తావించుకుంటే అంత మంచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన అల్లుడా మజాకా పెద్దపాపకేమొ పైట కాస్త పెద్దదాయె, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఇలా.. మహాసముద్రం లాంటి సినీ సాహిత్యంలో ఆడవాళ్ల శరీరాలపై, అంగాంగ వర్ణనపై వచ్చిన అభ్యంతరకర సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉటుంది. ఐటెంసాంగ్ అనే పేరు లేకుండానే ద్వంద్వార్థాలతో మహిళాలోకాన్ని కించపర్చిన సాహిత్యం కొండంత ఉంది. అంతేకాదు ప్రత్యేక డ్యాన్సర్లకు, లేదా యాక్టర్లకు మాత్రమే పరితమైన ఐటెం సాంగ్స్కు ఇపుడు స్టార్ హీరోయిన్లు క్యూ కడుతున్న ధోరణి పెరుగుతోంది. శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని, అమ్మకానికి పెడుతున్నారంటూ ఫీమేల్ ఆర్టిస్టులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మొత్తంగా సినీ ప్రపంచంలోని సాహిత్యంలో విలువులకు పెద్ద పీట వేయాలని పలువురు సినీ విమర్శకులు, మహిళా ఉద్యమ నేతలు కోరుతున్నారు. -
నిఖిల్తో పెళ్లిపై నుస్రత్ సంచలన వ్యాఖ్యలు
Nusrat Jahan on Marriage Controversy: ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక స్థితిపై పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై పలువురు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి గురువారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత పార్లమెంటులో తన వివాహ స్థితిపై తన వైఖరిని స్పష్టం చేసినట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. వ్యాపారవేత్త నిఖిల్ జైన్తో తన వివాహం గురించి నుస్రత్ నోరువిప్పారు. 'టర్కీలో జరిగిన నా పెళ్లికి వారు హోటల్ బిల్లులు, ఖర్చులు కూడా చెల్లించలేదు. వారికి నేను ఏమీ చెప్పనవసరం లేదు. నేను నిజాయితీపరురాలిని. నన్ను తప్పుగా చిత్రీకరించారు. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఎవరి పేరూ చెప్పకుండా, ఇతరులను బాధ్యులను చేయడం, తప్పుగా చూపించడం చాలా సులభం అని' నుస్రత్ పేర్కొన్నారు. చదవండి: (ఆ హీరో నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు : నటి) నుస్రత్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నవంబర్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతానని ఆమె వెల్లడించారు. ఇటీవల తన స్నేహితురాలైన సినీనటి స్రబంతి ఛటర్జీ కుంకుమ శిబిరం నుంచి నిష్క్రమించడం గురించి అడిగినప్పుడు.. తాను ఎప్పుడూ ఎవరికీ రాజకీయ సలహా ఇవ్వనని చెప్పింది. యష్కు కూడా తాను ఎలాంటి రాజకీయ సలహా ఇవ్వనని, అది వారి ఇష్టమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ అన్నారు. చదవండి: (మెగాస్టార్తో స్టెప్పులేయనున్న సల్మాన్ఖాన్) కాగా, నుస్రత్ జహాన్.. నిఖిల్ జైన్ని 2019 జూన్ 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. ఆగస్ట్ 26, 2021న నుస్రత్.. ఇషాన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్గుప్తా పేరును ఇషాన్ తండ్రిగా చేర్చింది. అయితే, భారతీయ చట్టాల ప్రకారం నిఖిల్ జైన్తో వివాహం చెల్లదని, కేవలం లివింగ్ రిలేషన్షిప్గా మాత్రమే పరిగణించబడుతుందని నుస్రత్ వెల్లడించింది. -
ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు
‘ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ రెండు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాలు చూపిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒకరు అభ్యంతరం చెప్పడంతో పోలీసుల అత్యుత్సాహం వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆది, సోమవారాల్లో అహ్మదాబాద్ పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు ముందు వెజల్పూర్ పోలీసులు ఎస్సై ఒడెదర పేరుతో ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆదివారం ఉదయం ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి మంత్రి షా వస్తున్నారని, కాబట్టి, ఆ దగ్గర్లోని 300 ఇళ్ల కిటికీలన్నింటిని మూసేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. జె కేటగిరీ సెక్యూరిటీ నేపథ్యంలోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జులై 10న ఆ నోటీసులను ఐదు అపార్ట్మెంట్లకు, చుట్టుపక్కల ఇళ్లకు అంటించి తప్పనిసరిగా పాటించాలని మైకులో అనౌన్స్ చేశారు కూడా. అయితే వెజల్పూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న పంక్తి జోగ్(44) అనే ఆవిడ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, కాబట్టి కిటికీలు తెరిచే ఉంచుతానని ఆమె స్టేషన్కు వెళ్లి మరీ పోలీసులకు స్పష్టం చేసింది. అంతేకాదు తనలాంటి వాళ్లు ఎందరో ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె పోలీసులతో వాదించింది. నిజానికి ఆమె అభ్యంతరం అదొక్కటే ఒక్కటే కాదు. పంక్తి ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. షా పర్యటన నేపథ్యంలో పోలీసులు నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శించారనేది ఆమె పాయింట్. మూడు రోజుల పాటు చిరువ్యాపారులను వ్యాపారాలు మూసేయాలని ఆదేశించారని, అలాగే మళ్లింపు పేరుతో వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలకు స్థానికులు కొందరు సైతం తోడవ్వడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎస్సైపై చర్యలు? ‘మనం ప్రజాస్వామ్య బద్ధమైన దేశంలోనే ఉన్నామా? వీళ్లు మంత్రులా? రాజులా?. ఆయనేమైనా రాజా? దేవుడా? ఇంత అతి చేస్తున్నారు. కాదు కదా. జనాలు ఓట్లేస్తే గెలిచిన మంత్రి.. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఏంటి?. స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం సామాన్యులకు హక్కులు ఇచ్చింది’ అని ఆమె పోలీసుల ఎదుట వాదించింది. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. అయితే పోలీసులు మాత్రం తాము ప్రజల్ని బలవంతం చేయలేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని చెబుతూనే సర్క్యులర్ గురించి మాట్లాడేందుకు ఎస్సై ఒడెదర నిరాకరించారు. ఇక ఈ వ్యవహారం మీడియా ద్వారా ఫోకస్లోకి రావడంతో అహ్మదాబాద్ కమిషన్ సంజయ్ వాస్తవ స్పందించారు. ఇలాంటి ఆదేశాలను చర్యలను ఉపేక్షించమని, దర్యాప్తు జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ పోలీసులకు తమ నుంచి అలాంటి ఆదేశాలు ఏం జారీ కాలేదని కేంద హోం మంత్రి అమిత్ షా భద్రతా విభాగం వెల్లడించింది. -
ఈ ప్రశ్నలకు బదులేది?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నడిపినట్లు కనిపించడానికి మీడియా సమావేశాల్లో తాపత్రయపడుతున్నారు. కానీ ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్న మొదటి కమిషనర్ ఆయనే కావచ్చు. ప్రజాస్వామ్యబద్ధం అని చెబుతూనే ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బలవంతపు ఎన్నికలను ఆపడం సరేగానీ ఏకగ్రీవాలే జరగకూడదన్న చందంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పదజాలంతో కేంద్రానికి లేఖ ఎలా రాశారు? చంద్రబాబును, టీడీపీని కాపాడటానికే ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలకు ఆయనిచ్చే జవాబేమిటి? ఆయన వ్యవహార శైలితో వైఎస్సార్సీపీ ఇబ్బంది పడుతున్న మాట నిజం. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారన్నది వాస్తవం.ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వ్యవ హారం రోజుకో మలుపు తిరుగుతున్నట్లుగా కథ నడుస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు, వైఎస్సార్సీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తీవ్రమైందని చెప్పాలి. రెండు వ్యవస్థల మధ్య ఈ ఘర్షణ మంచిది కాదు. అయినా కొన్ని సార్లు ఇది తప్పకపోవచ్చు. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం అవుతాయి. నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలితో వైఎస్సార్సీపీ కొంత ఇబ్బంది పడుతున్న మాట నిజం. చీటికి మాటికి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం, ముఖ్యమైన అధికారులను బదిలీ చేశాననీ, అభిశంసించా ననీ ప్రకటనలు చేయడం, తన సొంత యాప్లు తయారు చేయడం, గవర్నర్కు ఫిర్యాదు చేయడం... ఇలాంటివన్నిటిని చేస్తున్న నిమ్మ గడ్డపై ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయ విమర్శలు చేయక తప్పని పరిస్థితి. అది మంచి పరిణామం అని ఎవరూ అనరు. కానీ ఆ అవ కాశం ఇవ్వడం నిమ్మగడ్డ తప్పు కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కలు నడిపినట్లు కనిపించడానికి మీడియా సమావేశాలలో తాపత్రయ పడుతున్నారు. చివరికి తన హృదయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉందంటూనే, ఆ తర్వాత పరిణామాలలో వచ్చిన కేసులలో తాను సాక్షినని కూడా వెల్లడించ డంలో వ్యూహం కనబడుతుంది. నిజానికి ఈ విషయాలు ప్రస్తావించ వలసిన అవసరం లేదు. అయినా ఆయన మాట్లాడారు. మీడియా సమావేశంలో తను చెప్పదలిచింది చెప్పి, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్న మొదటి ఎన్నికల కమిషనర్ నిమ్మ గడ్డే కావచ్చు. అందులోనే ఆయన ప్రధాన బలహీనత కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో నిష్పక్షపాతంగా లేరేమోనన్న అనుమానం కలగడా నికి ఈ విషయం సరిపోతుంది. నిజం చెప్పడానికి ఆలోచించవలసిన అవసరం లేదట. అదే అబద్ధం ఆడాలంటే చాలా ఆలోచన చేయాలట. ఎందుకంటే ఎప్పుడు ఏ అబద్ధం ఆడారో గుర్తుకు తెచ్చుకుని మరీ మాట్లాడాలి కాబట్టి అని ఒక నానుడి. నిమ్మగడ్డ అబద్ధాలు ఆడుతున్నా రని చెప్పడం లేదు కానీ, కొన్ని నిజాలు చెప్పలేకపోతున్నారన్నది వాస్తవం. తాను ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని చెబుతూనే ఏకగ్రీవ ఎన్నికలకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బలవంతపు ఎన్నికలను ఆపడం తప్పు కాదు. కానీ ఆ పేరుతో అసలు ఏకగ్రీవాలు జరగకూడదన్న చందంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏకగ్రీ వంగా ఎన్నికలు జరిగే గ్రామాలకు రివార్డులు ప్రకటిస్తే దాన్ని ఆయన తప్పు పట్టడంలో దురుద్దేశం కనిపిస్తోంది. పైగా ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలపై షాడో టీమ్లను పెడతామని కూడా బెదిరిస్తున్నారు. కొందరు అధికారులను భయపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్న ట్లుగా ఉంది. అన్నిసార్లు ఆయనదే పైచేయి కాదనడానికి ఉదాహరణ సీనియర్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ బదిలీ తంతే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో గొడవ ఎందుకులే అని వారిద్దరిని ముందుగానే బదిలీ చేస్తే, ఆయన దాన్ని తోసిపుచ్చారు. ఆ తర్వాత వారిని అభిశంసించి ఎన్నికల విధులకు అర్హత లేదని ప్రకటిం చారు. కనీసం వివరణ అడగకుండా, కక్షపూరితంగా, ద్వేషంతో వ్యవ హరించారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? నిజం గానే వారు అనర్హులు అయివుంటే ప్రభుత్వం బదిలీ చేసినప్పుడు ఓకే చేస్తే సరిపోయేది కదా. వారిని కావాలని అవమానించి, చివరికి తాను అప్రతిష్ట పాలయ్యారు. ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశా లను తోసిపుచ్చింది. అసలు ఆ అధికారం ఈసీకి లేదని తేల్చింది. దాంతో వారిద్దరూ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వీడియో కాన్ఫ రెన్స్లో పాల్గొనడం అంటే ఎన్నికల కమిషనర్ చేసింది తప్పు అని ఒప్పుకున్నట్లే కదా. దీనిపై ఆయన సరైన వివరణ ఇవ్వగలిగారా? ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ద్వారా గ్రామాలలో కక్షలు వద్దని చెప్పవలసిన పెద్ద మనిషి, ఎన్నికల ద్వారా ఏదో నాయకత్వం వచ్చేస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని కొత్త వాదన తెచ్చారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగినా, రిజర్వేషన్ల ప్రకారం ఎవరి పద వులు వారికే ఉంటాయి. ప్రజలకు ఆ విషయం తెలియదని కమిషనర్ ఉద్దేశం అనుకోవాలి. ఆయా జిల్లాలలో పర్యటిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారో అర్థం చేసుకో వచ్చు. ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే ఆయన నిష్పా క్షికతను అంగీకరించవచ్చు. 2018లో జరపవలసిన పంచాయతీ ఎన్ని కలను ఇప్పటివరకు ఆయన ఎందుకు జరపలేదు? చంద్రబాబు ప్రభు త్వాన్ని ఈ విషయంపై ఎందుకు కనీసం సంప్రదించలేదన్న ప్రశ్నకు సమాధానం వస్తుందా? అప్పుడు గ్రామ స్వరాజ్యం, ప్రజాస్వామ్యం మంట గలిసినా, రాజ్యాంగం అమలు కాకపోయినా ఫర్వాలేదా? వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎన్నికలు ఆరంభించి ప్రభుత్వంతో ఒక్క మాట చెప్పకుండా వాయిదా వేయడంలో ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వగలరా? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పదజాలంతో విమర్శలు చేస్తూ కేంద్రానికి ఒక లేఖ ఎలా రాశారు? ముందు తాను ఆ లేఖ రాయలేదనీ, ఆ తర్వాత తానే రాశాననీ ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? చంద్రబాబును, టీడీపీని కాపాడటానికే అలా చెప్పారన్న ఆరోపణలకు రమేష్ కుమార్ ఇచ్చే జవాబు ఏమిటి? పార్క్ హయత్ హోటల్లో బీజేపీ నేతలను ఎందుకు కలిశారు? ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గించడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం, ఆ పరిణా మాలపై ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్లకు ఇచ్చిన కోట్ల రూపా యల ఫీజు ఎలా చెల్లించగలిగారు? కరోనా కేసులు లేనప్పుడు ప్రభు త్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసి, తదుపరి కరోనా కేసులు ఇప్పటికీ వందల సంఖ్యలో వస్తుంటే, వ్యాక్సినేషన్ జరుగు తున్న తరుణంలో ఎన్నికలు పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గత మార్చిలో మండల జెడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోగా, ఇప్పుడు వాటిని కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిపించడంలో ఉన్న కుట్ర ఏమిటి? తన పదవీకాలం మరో రెండు నెలల్లో ముగుస్తున్నందున, ఇప్పుడైతేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని, ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వాన్ని కదలకుండా చేయ వచ్చన్న ఉద్దేశం ఉందా, లేదా? అలా కాకపోతే ఇళ్ల పట్టాల పంపిణీ ఆపాలనీ, రేషన్ సరుకులు ఇళ్లకు చేరే కార్యక్రమం చేపట్టవద్దనీ లాంటి ఆదేశాలు ఎందుకు ఇస్తారు? అలాగే వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పవలసిన అగత్యం ఏమిటి? వారి సేవలు వాడుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం కలుగుతుందని భావించడం కాదా? పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తే దానిపై ఎందుకు కామెంట్ చేయలేదు? ఒక యాప్ పేరుతో ఎందుకు కొత్త హడావుడి చేయాలని అనుకుంటున్నారు? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలనీ; మంత్రులు బొత్స ,పెద్దిరెడ్డి విమర్శలు చేయకుండా నిలువరించాలనీ చెబుతున్న రమేష్, తాను ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదనీ, ఏ పార్టీ తప్పు చేసినా చర్య తీసు కుంటాననీ ఎందుకు అనడం లేదు? పైగా గవర్నర్ను ప్రతిపక్షాలు కలి శాయనీ, వారు చేసిన ఫిర్యాదులను ప్రామాణికంగా తీసుకుంటాననీ పరోక్షంగా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధికార పార్టీ తప్పులు చేయవచ్చు. అలాగే ప్రతిపక్షాలూ చేస్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం సాధారణంగా జరిగేదే. కానీ ప్రతిపక్ష ఆరోప ణలకు వెంటనే స్పందిస్తున్న తీరు అనుమానాలకు తావివ్వదా? వైసీపీ నేతలు చేసిన విమర్శలకు నేరుగా సమాధానాలు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు? కడపలో వ్యూహాత్మకంగా వైఎస్సార్ని పొగిడిన రమేష్ కుమార్ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి కేంద్రానికి రాసిన లేఖలో చేసిన ఆరోపణలు ఒక కమిషనర్ హోదాకు తగినట్లుగా ఉన్నాయా? సీబీఐ కేసుల గురించి ప్రస్తావించడం అంటే రాజకీయాలు మాట్లాడి నట్లు కాదా? తాను ఎలాంటి పనిచేసినా, అది రాజ్యాంగబద్ధం; ఎదు టివారు విమర్శలు చేస్తే అది హద్దులు దాటడమా? గవర్నర్ వైసీపీ ప్రముఖులపై చర్య తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరించ వచ్చా? కమిషనర్లో ఇన్ని బలహీనతలు ఉన్నా తనకు రాజ్యాంగ పరి రక్షణ ఉందని, న్యాయ వ్యవస్థలో తనకు పట్టు ఉందని భావించి ఇష్టా రాజ్యంగా నడిస్తే ఎదుటివారు చూస్తూ ఊరుకుంటారా? రమేష్ కుమార్ నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి సిద్ధ మైతే అది ఆచరణలో చూపించాలి. నీతులు ఎదుటివారికే కానీ తమకు కాదన్నట్లు ఎవరు వ్యవహరించినా ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుం టారన్నది వాస్తవం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలిజీయం శనివారం దానిని వెనక్కి తీసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద జస్టిస్ పుష్ప ఇటీవల ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. ఆ తీర్పుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే శరీరంతో నేరుగా శరీరాన్ని (స్కిన్ టు స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ కేసు నుంచి నిందితుడిని విముక్తుడిని చేశారు. మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడికాదని కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణించడం కుదరదంటూ వరసగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం జనవరి 20న సమావేశమై పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఆమె తీర్పులు వివాదాస్పదం కావడంతో సుప్రీం కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, విజయవాడ: మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల నుంచి జిఎడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ని తప్పించాలంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు ఎస్ఈసీ లేఖ రాశారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఉద్యోగ వర్గాలలో ఆందోళన నెలకొంది. సంబంధం లేని అంశాలని ప్రవీణ్ ప్రకాష్కి ఆపాదిస్తూ.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ను ఎస్ఈసీ కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు. తన సిఫార్స్ లేఖలు పంపిన పలువురు ఉద్యోగులను సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఎస్ఈసీ తెలిపారు. అధికారులపై చర్యలు అంశం పొలిటికల్ ముఖ్య కార్యదర్శికి సంబంధం లేని విషయమని అధికారులు అంటున్నారు. చదవండి: సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు ఈ నెల 23న కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చేశారని లేఖలో నిమ్మగడ్డ అబద్దపు ఆరోపణలు చేశారు. జీఏడీకి ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో ఎస్ఈసీ తెలపగా, సీఎస్కి రాసిన లేఖలతో జీఏడీ ముఖ్య కార్యదర్శికి ఏ సంబంధముంటుదని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఆయన విఫలమయ్యారని లేఖలో ఎస్ఈసీ పేర్కొనడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేయాల్సి వచ్చిందని, ఈ నెల 25 న అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదంటూ ప్రవీణ్ ప్రకాష్ పై తప్పుడు ఆరోపణలను అధికారులు ఖండిస్తున్నారు. -
ఎమ్మెల్యే ప్రేమ వివాహం.. నేడు కోర్టు ముందుకు
సాక్షి, చెన్నై: భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ఆర్ ప్రభు అంగీకరించారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని ప్రకటించారు. కళ్లకురిచ్చి(రి) ఎమ్మెల్యే ప్రభు త్యాగదుర్గం మలయమ్మన్ ఆలయ అర్చకుడు స్వామినాథన్ కుమార్తె సౌందర్యను సోమవారం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం బెదిరింపుల మధ్య జరిగినట్టు, తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్టు సౌందర్య తండ్రి స్వామినాథన్ ఆరోపించడమే కాదు, కోర్టు తలుపుతట్టారు. దీంతో తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని, ఇందులో ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్లు లేవు అని సౌందర్య ప్రకటించింది. అయినా, పట్టువదలకుండా తన కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకున్నారని, రక్షించాలని కోరుతూ స్వామినాథన్ దాఖలు చేసుకున్న పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ వాదనను విన్న కోర్టు, సౌందర్యను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. (వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రేమ వివాహం) కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యే ప్రభు స్పందించారు. భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమేనని, శుక్రవారం కోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. తన మామతో మాట్లాడేందుకు ప్రయతి్నస్తున్నా, ఆయన పట్టువదలడం లేదని, తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, దీనిని ఆయన రాద్ధాంతం చేయడం విచారకరంగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని, భార్యను కోర్టులో హాజరు పరుస్తానని పేర్కొన్నారు. -
అన్నిటికీ తహ‘సీల్’దారే !
ములకలచెరువు: ములకలచెరువు తహసీల్దార్ పనితీరు వివాదాస్పదమవుతోంది. వీఆర్ఓలు, ఆర్ఐతో సంబంధం లేకుండా వెబ్ల్యాండ్లో భూముల ఆన్లైన్ ప్రక్రియ కానిస్తున్నారు. భూములకు సంబంధించి విచారణ నివేదికలు, ఫైళ్లలో సంతకాలు లేకున్నా..ఆయనే నేరుగా అన్ని పనులను చక్కబెట్టేస్తున్నారు. ఫలితంగా అధికారులు, ఉద్యోగుల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. జరగాల్సింది ఇలా.. రైతులు భూములను వెబ్ల్యాండ్లో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్ఓ, ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తులోని భూములు వివాదాస్పదమైనవా, ఇంతకుమునుపు ఈ భూములు ఎవరి పేరు మీదైనా ఉన్నా యా, భాగపరిష్కారాలు అయ్యాయా లేదా.. అనే విచారణలు చేయాలి. వీఆర్ఓ క్షేత్రస్థాయిలో వన్బీలో రైతు భూమి వివరాలు పరిశీలించి నివేదిక తయారు చేస్తే ఆర్ఐ మరోసారి పరిశీలించి నిర్ధారించి సంతకం చేస్తారు. నివేదికను తహసీల్దార్కు పంపాక ఆయన సంతకం చేస్తే వెబ్ల్యాండ్లో భూమి వివరాలను ఆన్లైన్ చేస్తారు. చేస్తున్నది ఇలా.. వీఆర్ఓ, ఆర్ఐ సంతకాలు లేకుండా తహసీల్దార్ వెబ్ల్యాండ్ దరఖాస్తులపై సంతకాలు చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ పూర్తవుతోంది. తహసీల్దార్కు అనుకూలంగా కొందరు వీఆర్ఓలు సహకరిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన వీఆర్ఓలు, ఆర్ఐతో సంబంధం లేకుండా తహసీల్దార్ డైరెక్ట్గా వెబ్ల్యాండ్లో భూముల ఆన్లైన్ ప్రక్రియ కానిస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ముగ్గురు వీఆర్ఓలతో కలిసి తహసీల్దార్ ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని.. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భీతిల్లుతున్నారు. ఈ–పాస్ పుస్తకాలను తహసీల్దార్ చాంబర్లోని బీరువాలో పెట్టుకుని రైతులకు ఫోను ద్వారా సమాచారం అందించి పుస్తకాలను చేరవేస్తున్నట్లు సమాచారం. వెలుగు చూసిన దరఖాస్తులివీ ♦పెద్దపాళెం పంచాయతీకి చెందిన సి.నారాయణ భూమి వెబ్ల్యాండ్లో ఆన్లైన్ కోసం 451 ఖాతా నంబరు ద్వారా జూలై 7వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 104ఏ, 106/4ఏ, 107బి, 108/1, 116ఏ, 118ఏ, 140/2, 142–4డి, 175–5, 207/2, 89ఏ, 95 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 2.3250 ఎకరాల భూమి ఉంది. ♦సోంపల్లె పంచాయతీకి చెందిన చిన్న కోటప్ప వెబ్ల్యాండ్లో భూమి ఆన్లైన్ చేసుకోవడానికి 122 ఖాతా నంబరు ద్వారా జూన్ 18వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 1215/7, 1215–3డి, 1284–9ఏ, 291/2బి/1, 291/2బి/1, 618–1ఏ2 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 31.7500 ఎకరాల భూమి ఉంది. ♦దేవులచెరువుకు చెందిన వెంకటరమణారెడ్డి వైబ్ల్యాండ్లో భూమి ఆన్లైన్ కోసం 859 ఖాతా నంబరు ద్వారా జూన్లో దరఖాస్తు చేసుకున్నారు. 757/5, 823, 826, 755/1 సర్వే నంబర్లలో అతని భూమి ఉంది. ♦నాయనచెరువుపల్లెకు చెందిన కే. రమణమ్మ భూమి వెబ్ల్యాండ్లో ఆన్లైన్ చేసుకోవడానికి ఖాతా నంబరు 27 ద్వారా జూలై 2వ తేదీ దరఖాస్తు చేసుకుంది. 34–బి, 57/డి, 59 వై, 168/1, 170–ఈ, 14 ఎన్, 25 పి, 167–3హెచ్, 140ఎన్, 10–26ఏ సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ♦దేవులచెరువుకు చెందిన ఎం. నాగమ్మ 1180/2 సర్వే నంబరు ద్వారా 2.07 ఎకరాల విస్తీర్ణం ఆన్లైన్ కోసం జూలైలో దరఖాస్తు చేసుకుంది. ♦మొత్తం రైతుల వైబ్ల్యాండ్ దరఖాస్తుల్లో వీఆర్ఓ, ఆర్ఐ సంతకాలు లేవు. తహసీల్దార్ సంతకం మాత్రమే ఉంది. ఆ అధికారం నాకు ఉంది వెబ్ల్యాండ్లో డైరెక్ట్గా ఆన్లైన్ చేసే అధికారం తహసీల్దార్గా నాకు ఉంది. వీఆర్ ఓలు, ఆర్ఐకు తెలియకుండా భూములు, స్థలాలను ఇప్పటిదాకా ఆన్లైన్ చేయలేదు. – తహసీల్దార్ మహేశ్వరీబాయి అలా చేయడం తప్పు భూములు ఆన్లైన్లో నమోదు చేయాలంటే వీఆర్ఓ, ఆర్ఐ విచారణ నివేదికలు అవసరం. అవి లేకుండా తహసీల్దార్ నేరుగా నమోదుచేయడం జరగదు. అలా జరిగివుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. –మార్కండేయులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు -
అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఐపీఎస్ సెక్షన్ 153(ఎ) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. (కత్తి మహేష్పై మరో కేసు) సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్ట్లు పెడితే కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరికాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు తొలి అరెస్ట్ చేశారు. టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి ఉస్మానియా, కింగ్ కోఠి ఆసుపత్రులలో వైద్యపరీక్షలు నిర్వహించి రిమాండ్ కు తరలించారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్లు పెట్టిన కేసులో కత్తి మహేష్పై ఐపిసి సెక్షన్ 153(a) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. తన ట్విటర్లో రాముడు కరోనా ప్రియుడు అంటూ పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
‘వర్మ శాడిజానికి ప్రతీక మర్డర్ సినిమా’
సాక్షి, హైదరాబాద్: అమృత, మారుతీరావులపై మర్డర్ సినిమా తీయటం రామ్గోపాల్వర్మ శాడిజానికి ప్రతీక అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు.. వారి సామాజిక వర్గాన్ని బజారున పడేయటం హేయమైన చర్య. మర్డర్ సినిమాపై మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్) మారుతీరావు సాధుజీవి, అటువంటి వ్యక్తిని మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరం. అమృత, మారుతీరావులను.. ఒకరు ప్రేమించి తప్పు చేయటం, మరొకరు హత్య చేయించడం ద్వారా ఇద్దరినీ విలన్లుగా సృష్టించటం వర్మ పబ్లిసిటీకి పరాకాష్ట. మర్డర్ సినిమా ద్వారా రెండు కుటుంబాలను వర్మ బజారున పడేస్తున్నారు. వర్మ మా డిమాండ్కు తలొగ్గకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు' అంటూ రామకృష్ణ హెచ్చరించారు. (అమృతా ప్రణయ్ కామెంట్స్పై వర్మ ట్వీట్స్..) -
‘అర్ధనగ్న చిత్రాల ప్రదర్శన సిగ్గుచేటు’
అమృత్సర్: బ్రిటిష్ పాలకులు అమలు చేసిన పైశాచిక విధానాల చరిత్రను నేటి తరం తెలుసుకునే విధంగా జలియన్వాలాబాగ్ను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే పునరుద్దరించిన ఫొటో గ్యాలరీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రాలు అజంతా ఎల్లోరా గుహలలో చిత్రీకరించిన చిత్రాల మాదిరిగానే ఉంటాయని చెబుతారు. కానీ ఫోటోగ్యాలరీలో ప్రదర్శించిన రెండు అర్ధనగ్న మహిళల చిత్రాలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఈ విషయంపై అంతర్జాతీయ సర్వ్కాంబోజ్ సమాజ్ అధ్యక్షుడు బాబీ కంబోజ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర యోధులు, సిక్కు గురువుల చిత్రాలు, కలిగి ఉన్న గ్యాలరీలో సెమీ న్యూడ్ మహిళల చిత్రాన్ని అధికారులు ప్రదర్శించడం సిగ్గుచేటు. అయితే, జలియన్ వాలాబాగ్ భారతీయుల తీర్థయాత్ర కేంద్రం కంటే తక్కువ కాదు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారికి గౌరవం ఇవ్వడానికి ప్రతిరోజూ వందలాది మంది పాఠశాల పిల్లలు, కుటుంబాలతో సహా సందర్శిస్తారు. ఇలాంటిచోట ఫొటో గ్యాలరీలో అర్ధనగ్న మహిళల చిత్రాల్ని అధికారులు ప్రదర్శించారని మాకు తెలియగానే సిగ్గుచేటుగా భావించాం’ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. షాహీద్ ఉధమ్ సింగ్ విగ్రహం ముందు టికెట్లు ఇచ్చే కిటికీ ఏర్పాటు చేయడం ద్వారా అమరవీరులను, గురువులను ట్రస్ట్ అవమానించినట్లు అంతర్జాతీయ సర్వ్ కాంబోజ్ సమాజ్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం, పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న జలియన్ వాలాబాగ్ కాంప్లెక్స్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో, జలియన్ వాలా బాగ్ వద్ద పునరుద్ధరణ పనులు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. ఈ స్మారకాన్ని సందర్శించడానికి జూలై 31 నుంచి తిరిగి ప్రజలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో నిర్మాణ పనులకు రూ. 20కోట్ల రూపాయలను కేటాయించింది. రాజ్యసభ ఎంపీ, జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ స్వైత్ మాలిక్ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 13,1919న జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటీష్ ఇండియా సైన్యం వందల మంది భారత పౌరుల ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : ఎయిమ్స్కు గ్రీన్ సిగ్నల్) -
వివాదాల 'దర్బార్'
దర్బార్ చిత్రం చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయకిగా, నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి టాక్ రకరకాలుగా వస్తున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. దర్బార్ చిత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వివాదాల చుట్టూ తిరుగుతోంది. దర్శకుడు మురుగదాస్ చిత్రంలో రాజకీయాలు లేవంటూనే వివాదాస్పద సన్నివేశాలను జొప్పించి చర్చనీయాంవయానికి దారితీశారు. చదవండి: నితిన్ ఈజ్ బ్యాక్ అనేలా భీష్మ టీజర్ రజనీకాంత్పై కోర్టులో పిటిషన్ దర్బార్ చిత్ర వ్యవహారం నటుడు రజనీకాంత్పై కోర్టులో పిటిషన్ వరకూ దారితీసింది. ఈ చిత్రంలో పోలీసు అధికారులను కించపరచే విధంగా సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ తూత్తుక్కుడికి చెందిన మాజీ రక్షణదళ అధికారి మరియమైఖెల్ శుక్రవారం తూత్తుక్కుడి 3వ మేజిస్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో దర్బార్ చిత్రంలో యూనిఫామ్ సర్వీసర్ల(డిపార్ట్మెంట్)ను కించపరచేవిధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయన్నారు. చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన నటుడు రజనీకాంత్ హిప్పీ జుత్తు, గడ్డంతో నటించడంతో పాటు నేను పోలీస్ కమిషనర్ను కాదు రౌడీని అని మాట్లాడతారన్నారు. ఇవి పోలీసులను, సైనికులను కించపరచేవిగా ఉన్నాయన్నారు. దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన నటుడు రజనీకాంత్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, నిర్మాణ సంస్థలపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ ఈ నెల 21వ తేదీన రానుంది. కాగా మరో ఐఏఎస్ అధికారి అలెక్స్పాల్మీనన్ దర్బార్ చిత్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిత్రంలో పోలీస్ అధికారి రజనీకాంత్ను నాలుగు రోజుల్లో ఫిట్నెస్ను నిరూపించుకోవాలని ఆయన ఆర్డర్ వేస్తారు. రజనీకాంత్ కూడా కసరత్తులు చేసి తన పిట్నెస్ను నిరూపించుకుని తన అధికారాన్ని కాపాడుకుంటారు. దీన్ని ఎగతాళి చేసే విధంగా ఐఏఎస్ అధికారి అలెక్స్పాల్ మీనన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ నాలుగు రోజుల్లో తలైవర్ ఫిట్నెస్ను నిరూపింపజేసింది. తాన్యా చాలాగొప్ప హ్యూమన్ రైట్ వైలేషన్ అని అన్నారు. అదేవిధంగా దర్బార్ చిత్రం పేరును ప్రస్థావించకుండా అయ్యా, రేయ్ తమిళ దర్శకులా ఇకపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నేపథ్యంతో చిత్రాలు చేయకండి, మీ లాజిక్తో మా మెదడు అంతా మొద్దుమారిపోయ్యింది అని పేర్కొన్నారు. ఇప్పుడీయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీస్కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు దర్బార్ చిత్రం విడుదలైన రోజునే పైరసీ వచ్చేసింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా చిత్రంలోని చర్చనీయాంశ సన్నివేశాలను కొందరు వాట్సాప్లో పోస్ట్ చేయడంతో పాటు దర్బార్ చిత్రాన్ని యూడు బిట్లుగా పూర్తి చిత్రాన్ని వాటాప్స్లో పోస్ట్ చేస్తామని, కాబట్టి ఎవరూ చిత్రాన్ని థియేటర్లకు వెళ్లి చూడవద్దు అని ప్రచారం జరుగుతోంది. దర్బర్ చిత్ర నిర్వాహకులు శనివారం చెన్నైలోని పోలీస్కమిషనర్ కార్యాలయంలో ఈ వాట్సాప్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దర్బార్ చిత్రంపై కొందరు కుట్రపన్ని వసూళ్లను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాట్సాప్లో దుష్ప్రచారం చేసే వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సన్నివేశాలను తొలగించారు దర్బార్ చిత్రంలో చోటు చేసుకున్న వివాదాస్పద సంభాషణలు, సన్నివేశాలపై విమర్శనల వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్రంలో డబ్బు ఉంటే జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేసి రావచ్చు అన్న సంభాషణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. జయలలిత స్నేహితురాలు శశికళను ఉద్దేశించే ఆ సంభాషణలను పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు. ఆ సంభాషణలను వినోదం కోసమే పొందుపరచినట్లు, ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు ఆ సంభాషణలు ఎవరినైనా బాధించినట్లైతే వాటిని చిత్రం నుంచి తొలగించడానికి సిద్ధమన్నారు. ఆ తరువాత వాటిని తొలగించారు కూడా. -
దేశ చిత్రపటంతో శశిథరూర్ వివాదాస్పద ట్వీట్
సాక్షి వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన భారతదేశ చిత్రపటం వివాదాస్పదమైంది. ఆయన పోస్ట్ చేసిన చిత్రపటంలో పీఓకే లేదు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు ట్విటర్లో ఆయన వైఖరిని ఎండగడుతున్నారు. వివరాలు.. ‘పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రేపు (ఆదివారం) కేరళలోని కోజికోడ్లో జరగనున్న ర్యాలీకి నాయకత్వం వహిస్తూ, ఈ నిరసనల్లో నేను మొదటి సారిగా పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే’.. అంటూ దేశ చిత్రపటంతో సహా ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే చిత్రపటంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన నెటిజన్లు ఆయన తీరును విమర్శించారు. ఒకరు ‘చాచా నెహ్రూ, ఇందిరా గాంధీలు కశ్మీర్ను పాకిస్తాన్కు బహుమతిగా ఇచ్చేశారు కాబట్టి కశ్మీర్ పాక్తోనే ఉండాలని వారు (కాంగ్రెస్) కోరుకుంటున్నార’ని ఎద్దేవా చేశారు. మరొకరు ‘శశిథరూర్ చెప్పింది నిజమే. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇలాంటి డర్టీ మైండ్సెట్ ఉన్న వాళ్లతో మన దేశాన్ని నిజంగా కాపాడుకోవాలి’ అని విమర్శించారు. ఇంకొకరు ‘సరైన దేశ చిత్ర పటాన్ని ఉంచలేని నీలాంటి మేధావుల బారి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది అనుకోకుండా జరిగిన లోపం కాదు. ఉద్దేశపూర్వకంగా జరిగింది. మిస్టర్ థరూర్! దేశం మిమ్మల్ని గమనిస్తోందం’టూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ.. మీరు, మీ పార్టీ కార్యకర్తలు తరచూ ఇలాంటి చిత్రపటాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దేశాన్ని వక్రీకరించడం, విభజించడం, నాశనం చేయడమే కాంగ్రెస్ విధానమా? ఇలాంటి పని చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలా? వద్దా? అని ప్రశ్నించారు. కాగా, నెటిజన్ల నుంచి విమర్శలు వస్తుండడంతో శశిథరూర్ తన ట్వీట్ను తర్వాత తొలగించారు. చదవండి : శశిథరూర్కు కేంద్ర సాహిత్య పురస్కారం -
అటవీ శాఖలో అవినీతి వృక్షం
అటవీ శాఖలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అటవీ శాఖలోని ఒక ఉన్నతాధికారి బదిలీల్లో చేతివాటం ప్రదర్శించారు. గత ప్రభుత్వం వెన్నుదన్నుతో ఐదేళ్లు ఒకే స్థానంలో విధులు వెలగబెట్టిన ఆ అధికారి వసూళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గతంలో తిరుపతి డివిజన్లో పనిచేసిన ఆ అధి కారికి చిత్తూరు డివిజన్లో విధులు నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో ఆ శాఖపై పూర్తిస్థాయి పట్టు సాధించారు. ఐదేళ్ల కాలంలో ఆయన అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయిందనే ప్రచారముంది. సాక్షి, తిరుపతి/పుత్తూరు: రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇక స్థానచలనం తప్పదని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకున్నారు. ఇంతలో బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే అదనుగా భావించి డివిజన్ పరిధిలోని సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కేవలం నెల క్రితం విధుల్లో చేరిన సిబ్బందిని సైతం బదిలీ చేసినట్లు సమాచారం. ముడుపులే ప్రామాణికంగా ఆ అధికారి బదిలీలకు తెరతీయడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం బది లీలను రద్దు చేసే అవకాశాలున్నాయి. చేతులు మారిన రూ.30 లక్షలు చిత్తూరు పశ్చిమ డివిజన్లో ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం ద్వారా సదరు ఉన్నతాధికారి రూ.30 లక్షలు దం డుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డివిజన్ పరిధిలోని బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు, వాచర్లతో చిత్తూరులో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులనే బదిలీ చేయాల్సి ఉంది. ఆ అధికారి ప్రతి ఉద్యోగి నుంచి బదిలీలకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇవ్వమన్నారు. కేవలం నెల నుంచి సంవత్సరం క్రితం విధుల్లో చేరిన ఉద్యోగులను సైతం ఒత్తిడి చేసి మరీ ఆప్షన్లు తీసుకున్నారు. తన చేతికి మట్టి అంటకుండా దిగువస్థాయిలో నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారి ద్వారా ముడుపుల బాగోతానికి తెరదీశారు. ఒక్కొక్కరి బది లీకి సంబంధించి రూ.25– 50 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి వివాదాస్పదమే గతంలో కుప్పం రేంజ్ అధికారిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఆ అధికారిపై అవినీతి ఆరోపణలున్నట్లు సమాచారం. అక్కడి నుంచి పదోన్నతిపై తిరుపతి వైల్డ్లైఫ్ విభాగానికి బదిలీ కాగా, ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా యి. 2014వ సంవత్సరం ఎన్నికలకు ముందు ఉన్నతస్థాయిలో పైరవీలు చేసుకుని గతంలో రేంజర్గా పనిచేసిన చిత్తూరు సబ్ డివిజన్కే ఉన్నతాధికారిగా బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. కుప్పంలో పనిచేసినప్పటి రాజకీయ సంబంధాలు, సామాజిక నేపథ్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న అధికారి అవినీతికి అర్రులు చాచినట్లు సమాచారం. డివిజన్ పరిధిలోని పుంగనూరు రేంజ్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతిచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ క్వారీలకు అనుమతిస్తూ ఎన్ఓసీ జారీ చేసినట్లు ఉన్నతా«ధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఐదేళ్ల కాలంలో రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం గమనార్హం. ఒకే తేదీతో రెండు ఎస్ఓలు ► బదిలీల్లో భాగంగా ఈనెల 10వ తేదీన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించి ఎస్ఓ (శాంక్చన్ ఆర్డర్) ఇచ్చిన ఉన్నతాధికారి ఇదే తేదీతో మరో ఎస్ఓను కూడా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే తేదీతో రెండు ఎస్ఓలు విడుదల కావడంతో ఏఎస్వో ప్రకారం బదిలీలు వర్తిస్తాయనే విషయం తెలియక ఉద్యోగులు తికమకపడుతున్నారు. ► ఒక ఎస్ఓ ప్రకారం ఒక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ను చిత్తూరు వెస్ట్ రేంజ్ నుంచి పుంగనూరు రేంజ్లోని వల్లిగట్ల బీట్కు బదిలీ చేశారు. మరో ఎస్ఓలో అదే ఉద్యోగిని పుంగనూరు రేంజ్లోని కందూరు బీట్కు బదిలీ చేశారు. నిబంధనలకు పాతరేస్తూ... ►డివిజన్ పరిధిలో జరిగిన బదిలీల్లో నిబంధనలకు పూర్తిగా పాతరేసినట్లు తెలుస్తోంది. ముడుపులివ్వని ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► నెల క్రితమే మదనపల్లె రేంజ్లో విధుల్లో చేరిన ఒక మహిళా ఉద్యోగిని పలమనేరు రేంజ్కు బదిలీ చేశారు. ఆ ఉద్యోగిని నెల వేతనం కూడా తీసుకోకముందే బదిలీ అయ్యింది. ► రెండేళ్ల క్రితం పుంగనూరు రేంజ్లో విధుల్లో చేరి ప్రస్తుతం మెడికల్ సెలవుపై ఉన్న ఒక ఉద్యోగిని కుప్పం రేంజ్కు బదిలీ చేశారు. ► గత ఏడాది మదనపల్లె రేంజ్లో విధుల్లో చేరిన మరో ఉద్యోగిని పీలేరు సామాజిక అడవుల పెంపకం విభాగానికి బదిలీ అయ్యారు. ► ఆరు నెలల క్రితం మదనపల్లె రేంజ్లోని ఒక బీట్కు బదిలీపై వచ్చిన మ హిళా ఉద్యోగిని అదే రేంజ్ పరిధిలోని మరో బీట్కు బదిలీ చేశారు. -
రాజకీయ దుమారంగా "యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" ట్రైలర్
-
వివాదాస్పదంగా చొప్పదండి మునిసిపల్ కమిషన్ తీరు
-
‘వాట్ ద ఎఫ్’ లొల్లి
విజయ్ దేవరకొండ గీతా గోవిందం టీజర్కు మంచి స్పందన వచ్చింది. రిఫ్రెష్మెంట్ యూత్ ఎంటర్టైనర్గా ఉంటుందన్న అంచనాలను దర్శకుడు పరుశురాం(బుజ్జి) అందించాడు. పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కావటంతో ఫ్యామిలీ సెక్షన్ ఆడియన్స్ సైతం మెప్పించే విధంగా ఉంటుందన్న టాక్ నడిచింది. అయితే నిన్న రిలీజ్ అయిన ‘వాట్ ద ఎఫ్ సాంగ్’ తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు గుప్పించారు. పురాణాల ప్రస్తావన తెస్తూ సాగిన పాటపై కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికితోడు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్ కావటంతో యూట్యూబ్ నుంచి చివరకు ఆ పాటను తీసేశారు. అయితే ఈ పాటపై రచయిత శ్రీ మణి క్షమాపణలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగు ప్రజలందరికీ నమస్సుమాజంలి. ఈ రోజు విడుదలైన గీత గోవిందం లో ‘అమెరికా గాళ్ అయినా..’ అనే పాటలోని కొన్ని వాక్యలు కొంత మంది మనోభావాలను గాయపరిచాయని విమర్శలు రావటం జరిగింది. కానీ, మా భావనని తప్పుగా అర్థం చేసుకోవటం జరిగింది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు... ..ఏది ఏమైనప్పటికీ అందరి మనోభావాలను గౌరవించటం మా ప్రాథమిక ధర్మం. ఆ కారణం చేత మేం సదరు పాటలోని అభ్యంతరకర పంక్తులను తొలగించి తిరిగి రచించిన ఆ పాటను యూ ట్యూబ్లో తిరిగి అప్ లోడ్ చేస్తామని తెలిజయేస్తున్నాం’ అంటూ శ్రీ మణి పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆగష్టు 15న విడుదల కానుంది. -
నేను ఇండియన్నే.. క్షమించండి
లాస్ ఏజెంల్స్: నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్లో భారతీయులను ఉగ్రవాదులుగా చూపటం, అందులో ఆమె నటించటంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. సోషల్ మీడియా వేదిక ఆమెను తిట్టిపోస్తూ పలువురు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో సీరియల్ నిర్మాణ సంస్థ ఏబీసీ, నిర్మాతలు క్షమాపణలు తెలియజేయగా, తాజాగా ప్రియాంక స్పందించారు. ‘క్వాంటికో తాజా ఎపిసోడ్తో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరినో కించపరచాలన్న ఉద్దేశం మాత్రం కాదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఓ భారతీయురాలిగా నేను ఎల్లప్పుడూ గర్వపడుతుంటా’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. జూన్ 1న ప్రసారం అయిన ఎపిసోడ్లో ఇండియన్స్ను ఉగ్రవాదులుగా చూపించారు. ‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్లోని మాన్హట్టన్లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్ను చిత్రీకరించారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, ఆ ఎపిసోడ్లో ఆమె నటించటంతో సోషల్ మీడియా వేదికగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కున్నారు. I’m extremely saddened and sorry that some sentiments have been hurt by a recent episode of Quantico. That was not and would never be my intention. I sincerely apologise. I'm a proud Indian and that will never change. — PRIYANKA (@priyankachopra) 9 June 2018 -
ఊహించని వివాదం
హాలీవుడ్ చిత్రాలు, టీవీ సీరియళ్ల కోసం గత రెండున్నరేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆఖరి నిముషంలో అప్రతిష్టను మూటగట్టుకుని భారత్కు బయల్దేరి వస్తున్నారు! అమెరికన్ టెలివిజన్ డ్రామా థ్రిల్లర్ ‘క్వాంటికో’లో సి.ఐ.ఎ ఏజెంటుగా నటిస్తున్న ప్రియాంకను ఆ సీరీస్ తాజా ఎపిసోడ్ ‘ది బ్లడ్ ఆఫ్ రోమియో’లోని ఒక సన్నివేశం ఆమె ఊహించని విధంగా ‘దేశద్రోహి’గా నిలబెట్టింది! న్యూయార్క్పై అణ్వాయుధ దాడి చేయబోతున్న ఒక పాకిస్తానీ.. ప్రియాంకకు పట్టుబడినప్పుడు ఆ ఉగ్రవాది మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది! దర్యాప్తులో అతడొక దారితప్పిన భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. అయితే ఈ సన్నివేశంలో నటించడం ద్వారా ప్రియాంక.. భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని, భారతీయులంటే ఉగ్రవాదుల అన్న భావన ప్రపంచ దేశాల్లో కలగడానికి ఆమె కారణం అయ్యారని జాతీయవాదులు మండిపడుతున్నారు. ‘‘భారతీయుల అభిమానం వల్ల స్టార్గా ఎదిగి, ఇప్పుడు భారతీయులనే అవమానిస్తున్నావా ప్రియాంకా..?’’ అని ట్వీట్లు కూడా మొదలయ్యాయి. ఆన్లైన్లో ఈ నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ‘క్వాంటికో’ను ప్రసారం చేస్తున్న ఎ.బి.సి.కి (అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ) తాకడంతో డిస్నీ నెట్వర్క్ సంస్థ అయిన ఎ.బి.సి. వెంటనే భారతీయులను క్షమాపణ కోరుతూ ‘వాషింగ్టన్ పోస్టు’కు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధానంగా ప్రియాంక నిర్దోషి అని చెప్పడానికే ఎ.బి.సి. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. ‘‘ఆ సన్నివేశానికి మనసు నొచ్చుకున్న మా వీక్షకులకు మా స్టూడియోతో పాటు, ‘క్వాంటికో’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్లూ క్షమాపణ కోరుతున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలన్న ఆలోచన ప్రియాంకది కాదు. స్క్రిప్టు, డైరెక్షన్ కూడా ఆమెవి కావు. స్టోరీ లైన్లో కానీ, క్యాస్టింగ్లో కానీ ఆమె ప్రమేయం లేదు. పూర్తిగా కల్పితం అయిన ఈ సీరీస్లోని సన్నివేశంలో అనుకోకుండా ఇలా కొందరి మనసులు గాయపడ్డాయి’’ అని ఎ.బి.సి. క్షమాపణతో పాటు, వివరణ కూడా ఇచ్చింది. లో రేటింగ్స్ రావడంతో ఇటీవల కొంతకాలం ‘క్వాంటికో’ ఆగి, మొదలైంది. త్వరలో ముగియబోతోంది కూడా. దాంతో జూౖలñ లో షూటింగ్ మొదలు కాబోతున్న ‘భరత్’ చిత్రం (సల్మాన్ఖాన్ హీరో)లో హీరోయిన్గా నటించడానికి ప్రియాంక ఇండియా బయల్దేరబోతుండగా ఈ వివాదం చుట్టుకుంది. -
ఏపీ కేబినెట్ వివాదస్పద నిర్ణయం
-
మనోడైతే ఓకే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమకు అనుకూలంగా ఉన్న వారికి, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు ఉన్న వారిని ఐదేళ్లు దాటినా అదే సబ్ డివిజన్లో కొనసాగించగా, కొంతమందిని పక్కనే ఉన్న స్టేషన్లకు బదిలీ చేశారు. మిగిలిన వారిని సబ్ డివిజన్ దాటి వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కొంతమందికి మినహాయింపు ఇవ్వడాన్ని ప్రశ్నించిన 32 మంది హెడ్కానిస్టేబుళ్లను వీఆర్లో పెట్టడం వివాదాస్పదంగా మారింది. జిల్లాలో పోలీసు సిబ్బంది బదిలీల్లో పారదర్శకత కరువైంది. ఓ సబ్డివిజన్లో ఐదేళ్లు పనిచేసిన సిబ్బందిని మరో సబ్ డివిజన్కు బదిలీ చేస్తామని చెప్పినా వాస్తవంలో దానికి భిన్నంగా జరిగింది. రాజకీయ సిఫార్సులు చేయించుకున్న వారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. వారిని పక్కనే ఉన్న సర్కిల్కు బదిలీ చేసి సిపార్సులు చేయించుకోలేని వాళ్లని దూర ప్రాంతాల్లోని స్టేషన్లకు బదిలీ చేస్తున్నారంటూ కొంత మంది హెడ్కానిస్టేబుళ్లు వ్యతిరేకించినట్లు సమాచారం. నాలుగు రోజుల నుంచి జిల్లాలోని పోలీసు స్టేషన్లలో పనిచేస్తూ ఐదేళ్లు పూర్తి అయిన సిబ్బందికి ఎస్పీ ఎం.రవిప్రకాష్ కౌన్సిలింగ్ చేసి బదిలీలు చేపట్టారు. అయితే బదిలీలు చేసే ముందు యూనిట్ అధికారి ఇంత వరకు ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టేషన్లలో పనిచేయని వారిని ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టేషన్లకు బదిలీలు చేస్తామని, సిబ్బంది ఏవరూ రాజకీయ నేతలతో ఒత్తిడి తీసుకురావద్దని చెప్పారు. కానీ తాజాగా జరిగిన బదిలీల్లో మొత్తం రాజకీయ, సామాజిక కోణంలో బదిలీలు జరిగాయని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి అనుకొని ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫార్సులతో ఏలూరు నగరంలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్న కొంత మంది సిబ్బందిని ఏలూరు మహిళ పోలీసుస్టేషన్, సీసీఎస్, ఏలూరు రూరల్ స్టేషన్లుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. యూనియన్ నాయకుడు కీలకపాత్ర... బదిలీల్లో పోలీసు అధికారుల సంఘం నాయకుడు ఒకరు కీలక పాత్ర పోషించారని, తన సామాజిక వర్గానికి చెందిన, తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని కావాల్సిన స్టేషన్కు బదిలీ చేయించుకున్నారని ఆ శాఖ సిబ్బంది బహిరంగగానే చెబుతున్నారు. నగరంలోని పోలీసు ఉన్నతాధికారి బంగ్లాకు అనుకొని ఉన్న పోలీసుస్టేషన్లో ఏడేళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళ హెడ్కానిస్టేబుల్ పేరు బదిలీ జాబితాలో లేకపోవడం చూస్తుంటే బదిలీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో అర్థం అవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. 32 మంది హెడ్కానిస్టేబుళ్లకు వీఆర్ రాజకీయ నేతల సిఫార్సులు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో కొంత మంది హెడ్కానిస్టేబుళ్లు యూనిట్ అధికారి తీరును తప్పుబట్టారు. దాంతో వారు బదిలీ చేసిన స్టేషన్లకు వెళ్లమని ఖరాకండిగా చెప్పినట్లుగా సమాచారం. ఫలితంగా సుమారు 32 మంది హెడ్కానిస్టేబుళ్లను వీఆర్లో పెట్టినట్లుగా తెలిసింది. మళీ కౌన్సెలింగ్ జరుపుతాం బదిలీల కౌన్సెలింగ్ అంతా పారదర్శకంగా జరిగింది. ఎవరినీ వీఆర్కు పంపలేదు. అందరూ ఒకే స్టేషన్ కోరుకోవడం వల్ల సమస్య వచ్చింది. వారిని పక్కన పెట్టాం. ఒకటి రెండు రోజుల్లో వారికి మళ్లీ కౌన్సెలింగ్ చేసి పోస్టింగులు ఇస్తాం. ఎం.రవిప్రకాష్, ఎస్పీ -
నిరుత్సాహం... వివాదం
ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రదానోత్సవం వివాదంగా మారింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు విజేతలు పాల్గొనలేదు. దానికి కారణం కేవలం 11 మంది విజేతలకు మాత్రమే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డు ప్రదానం చేయడం. సమయం లేని కారణంగా మిగతావారికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అవార్డులు అందజేశారు. వివాదం కావడానికి కారణం ఇదే. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సిన అవార్డు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు గైర్హాజరు అయ్యారని సమాచారం. వాస్తవానికి అవార్డు ప్రదానోత్సవానికి ముందు రోజు రిహార్సల్స్ జరుగుతాయి. అక్కణ్ణుంచే వివాదం మొదలైందని భోగట్టా. రిహార్సల్స్ సజావుగా జరగలేదని కొందరు వాపోయారని తెలిసింది. ఇక.. జాతీయ అవార్డు ప్రదానోత్సం విషయానికొస్తే.. దాదాపు 137 మంది విజేతలు ఉండగా, అందులో సుమారు 75 మంది ‘బాయ్కాట్’ చేయాలనుకున్నారట. 11 మందికి రాష్ట్రపతి ఇస్తే, మిగతావాళ్లకు స్మృతీ ఇరానీ అందజేశారు. ‘‘విజేతలందరూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలనుకున్నాం. కానీ రామ్నాథ్గారు 11 మందికి మాత్రమే అవార్డులు ఇస్తారని తెలిసింది. రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే ఉపరాష్ట్రపతితో అయినా అవార్డులను ఇప్పించాలి. అంతే కానీ ఇలా కేంద్రమంత్రి చేతుల మీదుగా కాదు’’ అని బెస్ట్ కన్నడ ఫిల్మ్ విభాగంలో ‘హెబ్బెట్టు రామక్క’ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ నంజుండే గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దీనిని మేం అవమానంగా భావిస్తున్నాం. దాదాపు 70మంది అవార్డు విజేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలనుకున్నారు’’ అని మరాఠీ ఫిల్మ్ (‘దప్పా’) డైరెక్టర్ ప్రకాశ్ ఓక్ పేర్కొన్నారు. విజేతల మనోభావాలు ఇలా ఉండగా.. ‘‘రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తారని ముందే చెప్పాం. రిపబ్లిక్ డే, కొన్ని ముఖ్యమైన మీటింగ్స్ను మినహాయిస్తే మిగిలిన కార్యక్రమాలకు రాష్ట్రపతి కేవలం గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తారు’’ అని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ తెలిపారు. కాగా, రాష్ట్రపతి అవార్డు ప్రదానం చేయాలనుకున్న 11 మందిలో బెంగాలీ యాక్టర్ రిథీసేన్ ఒకరు. అయితే కారణం బయటకు రాలేదు కానీ ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. అవార్డులు సాధించిన ఓ విజేత.. రాష్ట్రపతి 11మందికి మాత్రమే అవార్డు ప్రదానం చేస్తారని ముందు రోజే స్పష్టం చేశారని ఓ న్యూస్ ఏజెన్సీతో పేర్కొన్నారు. మరి.. ఇంత వివాదం జరుగుతుంటే స్మృతీ ఇరానీ స్పందించలేదా? అంటే.. ‘‘అవార్డు ప్రదానం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నవారి దగ్గరకు వచ్చి.. ఇది రాష్ట్రపతి కార్యాలయం తీసుకున్న నిర్ణయం కాబట్టి నేనేం చేయలేను’’ అని పేర్కొన్నారని ఓ ఫిల్మ్ మేకర్ అంటున్నారు. మన తెలుగు పరిశ్రమ నుంచి ‘బాహుబలి 2’కిగాను నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ దేవినేని, ‘ఘాజీ’ చిత్రానికి పీవీపీ అవార్డులు అందుకున్నారు. -
ఆ ఈవీఎంలను ఎవరికీ అమ్మొద్దు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ‘మా సాంకేతిక నిపుణుల కమిటీ ఆమోదించిన ఈవీఎంలను మా అనుమతి లేకుండా వేరే ఎవరికీ అమ్మకూడదం’టూ ఆ సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, విదేశీ సంస్థల కోసం అవసరమైతే వేరే డిజైన్ ఈవీఎంలను రూపొందించాలంది. అయితే, ఈ ఆదేశాలపై గత నవంబర్లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి. -
కాస్గంజ్ అల్లర్లు.. కలెక్టర్ పోస్టుతో ప్రకంపనలు
లక్నో : కాస్గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు ప్రకంపనలు రేపుతోంది. అల్లర్లపై కలెక్టర్ ఆర్ విక్రమ్ సింగ్ ఆదివారం అల్లర్లపై ఓ సందేశం పోస్టు చేశారు. ముస్లింల ప్రాంతాల్లోకి వెళ్లి వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటన్న? ప్రశ్నను ఆయన సంధించటంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. పోస్ట్ పూర్తి సారాంశం... ‘‘ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైన పాకిస్థాన్ వాసులా? కాదు కదా! అని పేర్కొంటూ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు ఒకదానిని పెట్టారు. గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. కొందరు కన్వరియాలు(శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి పాక్ వ్యతిరేకంగా వెళ్లి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంతగా మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటూ పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవి హోదాలో మతపరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్(బరేలీ ఎమ్మెల్యే కూడా) ‘సింగ్ పోస్టు’పై స్పందించారు. ‘‘ఆయన(ఆర్వీ సింగ్) చేసిన పోస్ట్ను చూడలేదు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సొంత దేశానికి వ్యతిరేకంగా.. పాక్కు అనుకూలంగా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోను’ అని మంత్రి మీడియాతో చెప్పారు. విక్రమ్ సింగ్ అధికారిక ఫేస్ బుక్లోని కొంత భాగం స్క్రీన్ షాట్ ఇక విమర్శలపై సింగ్ స్పందించారు.‘ఇది చాలా చిన్న విషయం. అయినా భూతద్ధంలో చూస్తున్నారు. కాస్గంజ్ ఎస్పీని బదిలీ చేశారు. నిజాయితీగా పని చేస్తున్న నాలాంటి అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అభివృద్ధికి ఆటంకాలే’అని సింగ్ చెప్పారు. గణతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. మరుసటి రోజు చెలరేగిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపవేశారు. మొత్తం 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరిస్థితి సర్దుమణగటంతో మంగళవారం ఉదయం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు. -
వివాదాస్పద పాటతో ఇజ్రాయెల్ ప్రధానికి ఆహ్వానం!
అహ్మదాబాద్ : పద్మావత్ చిత్రంపై వివాదం కొనసాగిన వేళ.. గూమర్ పాటపై కూడా రాజ్పుత్ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. రాణి పద్మిణి పాత్రతో గంతులేయించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొన్నీ మధ్యే మధ్య ప్రదేశ్లో ఓ స్కూల్ కార్యక్రమంలో ఆ పాటపై పిల్లలు నృత్యాలు చేయగా.. రంగ ప్రవేశం చేసిన కర్ణిసేన.. కుర్చీలు విరిచేసి కార్యక్రమాన్ని రసాభాస చేసిపడేసింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి భూపేంద్ర సింగ్ ‘‘చిత్రాన్ని నిషేధించినప్పుడు.. అందులో పాటను ప్రదర్శించటం సరికాదంటూ’’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అదే పాటను ఇప్పుడు గుజరాత్లో ఓ అధికారిక కార్యక్రమానికి వినియోగించటం విశేషం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్లో ఇరు దేశాల సంయుక్త కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నెతన్యాహు-మోదీ రాక సందర్భంగా నిర్వాహకులు స్కూల్ చిన్నారులతో గూమర్ పాటకు నృత్యాలు చేయించారు . ఇరు దేశాల ప్రధానులిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా.. ఈ పాటకు ఓ చిన్నారి ప్రదర్శన ఇవ్వటం విశేషం. స్థానిక బీజేపీ నేతలు దగ్గరుండి మరీ ఈ వేడుకలు నిర్వహించటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే పద్మావత్ను బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. #Ghoomar song of @filmpadmaavat played and dance performed on it in #Ahmedabad. This program is to welcome PM @narendramodi & Isreal PM #Netanyahu. 👏👏👏 pic.twitter.com/layjWd0t5R — Kirandeep (@raydeep) 17 January 2018 -
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
మియా-మలాల.. మార్ఫింగ్ ఫోటో రగడ
సాక్షి, సినిమా : మియా ఖలీఫా.. యూత్కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అడల్ట్ చిత్రాల్లో నటించే ఈ నటి చుట్టూ వివాదాలు కూడా ముసురుకుంటూనే ఉన్నాయి. బుర్ఖా ధరించి నీలి చిత్రాల్లో నటించటంతో ఐసిస్ ఈ లెబనీస్ అమెరికన్ స్టార్ను చంపుతామని బెదిరించటం తెలిసిందే. దీంతో పోలీసులు కొంత కాలం ఆమెకు భద్రతా కూడా కల్పించారు. ఈ మధ్య తన ఆదాయంలో 5వేల డాలర్లను హర్వే తుఫాన్ విరాళంగా ఇవ్వగా.. అదీ వివాదాస్పదం అయ్యింది. ఇక ఇప్పుడు మరో మతపరమైన వివాదం ఆమె మెడకు చుట్టుకుంది. వర్జిన్ మేరీ ఫోటోలో ఆమె ముఖం ఎడిట్ చేసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసింది. ఓ న్యూస్ అవుట్లెట్ పొరపాటున మలలా స్థానంలో తన ఫోటోను ఇలా ముద్రించిందంటూ సందేశం ఉంచింది. జీసస్ తల్లి మేరీ మాతగా తనను తాను చూపించుకోవటంపై మియాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. గత వారం పాక్ ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్ఝై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరగతులకు జీన్స్.. హైహీల్స్ ధరించి హాజరుకాగా.. ఆమె మలాలనా? లేక మియా ఖలీఫానా? అంటూ కొందరు కామెంట్లు చేయటం చూశాం. మరి ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫోటోకు ఏ స్థాయిలో తిట్లు పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
వివాదాస్పదంగా రొయ్యల చెరువులు
తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు అనమతించింది 16, తవ్వేసింది 150 ఎకరాలు ఎదురుచెప్పిన వారిపై పోలీసు కేసులు సిరిపురం ప్రజల తిరుగుబాటుతో వెనుదిరిగిన పోలీసులు కలెక్టర్ కలుగజేసుకోవాలని వినతి కరప (కాకినాడ రూరల్) : కరప మండలం సిరిపురంలో రొయ్యల చెరువు తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. రొయ్యల చెరువులు తవ్వొద్దని ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పనులు జరగకుండా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల తాగు నీరు, పంచాయతీ చెరువులు, పంట కాలువలు కలుషితమై పోతున్నాయని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు, పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. 16 ఎకరాలకు అనుమతి తీసుకుంటే 150 ఎకరాలు రొయ్యల చెరువులుగా తవ్వేశారని సిరిపురం, జి.భావారం తదితర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వందలాది ఎకరాలు రొయ్యలు చెరువులు తవ్వేస్తున్నా నాదస్వరం విన్న నాగుపాము తలాడించినట్టుగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసుశాఖాధికారులు ఆనాయకుడికి వంతపాడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పంట కాలువలు మూసేసినా, రహదారులు «ఇస్టానుసారంగా తవ్వేస్తున్నా, ప్రభుత్వ స్థలంలో 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫారమ్లు ఏర్పాటు చేసినా, దిగువ నుంచి ఎగువకు రొయ్యల చెరువుల్లోని మురికినీరు పోయేందుకు డ్రెయిన్లు తవ్వేస్తున్నా ఇరిగేషన్, పంచాయతీరాజ్శాఖ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎదురుచెప్పిన వారిపై అధికారపార్టీ అండదండలతో పోలీసు, కోర్టు కేసులు బనాయిస్తున్నారని, ఇలాగైతే గ్రామంలో ఉండాలా, వద్దా అని సిరిపురం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పంట పొలాలు చెరువులుగా తవ్వేస్తుండటంతో ఉపాధికోల్పోతున్నామని కౌలు రైతులు, పనుల్లేక పస్తులుండాల్సి వస్తోందని కూలీలు, పంట, మురుగు కాలువ లు ఆక్రమించేసుకోవడం వల్ల తమ భూములకు సాగునీరందడం లేదని రైతులు, రొయ్యల చెరువులవల్ల తాగునీరు కలుషితమవుతున్నాయని, దుర్వాసనతో, దోమలతో గ్రామంలో ఉండలేకపోతున్నామని గ్రామస్తులు ఇలా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. తహసీల్దార్ బూసి శ్రీదేవి గ్రామానికి వచ్చినప్పుడు తమ బాధలు చెప్పుకున్నా, పనులు ఆపలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నెల ఒకటో తేదీన పొక్లెయిన్తో రోడ్డు తవ్వుతుంటే ఆపామని, అయినా వీఆర్వో పట్టించుకోలేదన్నారు. శనివారం రాత్రి కరప ఎస్సై మెల్లం జానకిరాం సిబ్బందితో వచ్చి బెదిరించారని, గ్రామస్తులంతా రావడంతో చేసేదేమీలేక వెనుదిరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. ఒకటో తేదీన రాత్రి పని ఆపితే 3న రోడ్డు తవ్వడానికి పర్మిషన్ ఉందని సంబంధిత అధికారి స్టాంపు కానీ, పూర్తి సంతకంకానీ లేని పత్రాన్ని పోలీసులు చూపించారని, ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆదివారం గ్రామస్తులంతా సిరిపురం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఎట్టి పరిస్థితుల్లోను చెరువులు తవ్వనీయమని తీర్మానించుకున్నారు. పంచాయతీ అనుమతివ్వలేదని, అవసరమైతే ప్రజల తరఫున నిలబడతామని ఉప సర్పంచ్ నున్న రాంబాబు, ఎంపీటీసీ నున్న శ్రీనివాస్లు ప్రజలకు మద్ధతుతెలిపారు. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా ఏమిచేసుకుంటారో చేసుకోండని చెరువులు తవ్వుతున్న చిక్కాల దొరబాబు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అండతోనే గ్రామస్తులు వ్యతిరేస్తున్నా చెరువులు అక్రమంగా తవ్వేస్తున్నట్టు ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సంతకాలతో సోమవారం కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రజలు తెలిపారు. కలెక్టర్ స్పందించి సిరిపురంలో ఉన్నతాధికారితో విచారణ జరిపించి, అనధికారికంగా తవ్విన చెరువులు ధ్వంసంచేయించాలని, ఇకపై పరిసర గ్రామాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అన్యాయంగా కేసు పెట్టారు తనకున్న నాలుగుకుంచాల భూమి చెరువులు తవ్వడానికి ఇయ్యలేదన్న కక్షతో అన్యాయంగా పోలీసు కేసు పెట్టించారు. సొంత భూమి పక్కనే 8.60 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు, తనతో చెప్పకుండా కౌలుభూమిని తవ్వేశారు. ఎదురు చెప్పానని ధాన్యం అమ్మేసుకున్నట్టు అక్రమ కేసుపెట్టి 10 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. చెరువులవల్ల పక్కపొలాలు దెబ్బతిని పండకుండా పోతున్నాయి. అధికారులు కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలి. -
ప్రతి పనికీ ... ఓ రేటుంది బాస్
అదృష్టం కలిసొచ్చి .. అధికార పార్టీ టికెట్పై తొలిసారిగా ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న ఓ నేత తీరు వివాదాస్పదం అవుతోంది. ఒక మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్న సదరు ఎమ్మెల్యే ఆయన సొంత జిల్లాలో వేలు పెట్టని నియోజకవర్గం లేదట. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇక చెప్పనలవి కాకుండా ప్రతాపం చూపిస్తున్నారట సదరు గులాబీ ఎమ్మెల్యే. ఎస్సైల పోస్టింగులు, సీఐల ట్రాన్స్ఫర్లు.. అధికారులకు నచ్చిన చోట పనిచేసుకునే వెసులుబాటు .. ఇలా ఆయన పైరవీ చేయని రంగమే లేదు. కాకుంటే.. ‘ప్రతీ పనికి ఓ రేటుంది బాస్ ’ అంటూ సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే బేరమాడేస్తున్నారు. ఇక, సదరు ఎమ్మెల్యే పైరవీతో అనుకున్న చోట పోస్టింగు దక్కించుకున్న కొందరు పోలీసు అధికారులు .. సంపాదన వేటలో పడ్డారని, పెట్టిన ఖర్చు రాబట్టుకోవద్దా ఏంటీ..? అంటూ తమ సహచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు వినికిడి. ‘చిన్నదో చితకదో మా పనులు మేం చేసుకుంటాం కదా.. తన నియోజకవర్గం సరిపోలేదని, మా నియోజకవర్గాల్లో వేలు పెడుతుంటే మేమేం చేయాలంటూ..’ పార్టీ నేతలు వాపోతున్నారు. అమాత్యునికి చెబుదామంటే.. ఆయనకే అత్యంత నమ్మకస్తుడైన ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేసుడెందుకు..? అనవసరంగా మంత్రి దగ్గర చెడు కావడం ఎందుకని ఎవరికి వారు తమలో తామే మధనపడిపోతున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఓ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే పోకడ చూస్తుంటే ... ‘మళ్లీ మనకు టికెట్ వ చ్చేది ఉందా...? వస్తే గెలిచేది ఉందా..? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం..’ అన్నట్టు ఉందని గులాబీ శ్రేణులు చె వులు కొరుక్కుంటున్నాయి..!! -
తలలు తీసేయగలం.. కానీ!
♦ చట్టంపై గౌరవంతో ఆగిపోతున్నాం ♦ భారత్ మాతా కీ జై అననివారిపై ♦ బాబా రామ్దేవ్ అనుచిత వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై’ నినాదం మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా, ఐంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా యోగా గురు బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఒకతను టోపీ పెట్టుకుని వస్తాడు. తన గొంతు కోసినా భారత్ మాతా కీ జై అని నినదించనంటాడు. ఈ దేశంలో చట్టం ఉంది. లేదంటే నీ ఒక్కడిదేంటి.. మేం లక్షలాది తలలు తెగ్గోయగలం. చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంది కాబట్టి కానీ.. లేదంటే భారతమాతను ఎవరైనా అవమానిస్తే.. లక్షల తలలు నరికే సామర్ధ్యం మనకుంది’ అంటూ రామ్దేవ్ రెచ్చిపోయారు. రోహతక్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సద్భావన సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్దేవ్ వ్యాఖ్యలపై సోమవారం దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిపై మండిపడుతున్నాయి. రామ్దేవ్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి సంజయ్ ఝా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు, ప్రజలు పడుతున్న సమస్యల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. భారత్ మాతాకీ జై అనడం ద్వారా మాతృభూమిపై గౌరవాన్ని, దేశభక్తిని అంగీకరించినట్లు అవుతుందని రామ్దేవ్ చెప్పారు. ఏ మతమైనా ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తే అది జాతి హితాన్ని వ్యతిరేకించినట్లేనన్నారు. మా స్కూళ్లలో చేరాలంటే జై అనాల్సిందే.. బీజీపీ నేత దిలీప్ సంఘానియా, తన ట్రస్టు నడుపుతున్న స్కూళ్లలో చేరాలనునే విద్యార్థులు కచ్చితంగా భారత్ మాతాకీ జై అనాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. -
ఎస్వీయూలో వివాదాస్పదమవుతున్న P.hd అడ్మిషన్లు
-
మంత్రులపై రాజ్నాథ్ అసంతృప్తి
ఢిల్లీ: సహచర కేంద్రమంత్రులు, బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యల పట్ల హోం మంత్రి రాజనాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, నాయకులు మరింత జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. అధికారంలో ఉన్న వారు తమ ఉద్దేశాలను ప్రజలముందు ఉంచే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాట్లాడిన తరువాత.. వక్రికరించారంటూ తప్పించుకోవడం కుదరదన్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ ఫరీదాబాద్ ఘటనపై మాట్లాడుతూ.. ఎవరో కుక్కపై రాయి విసిరితే కేంద్రాన్ని నిందించడం తగదన్నారు. అలాగే మరో మంత్రి రిజిజ్.. ఉత్తర భారతీయులు నిబంధనలను అతిక్రమించడం గర్వంగా భావిస్తారన్న మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఏకీభవిస్తున్నాన్న వ్యాఖ్యలను రాజనాథ్ సింగ్ తప్పుపట్టారు. ఈ రెండు ఘటనలలో మంత్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఎఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తివేత
అగర్తలా: సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేస్తూ త్రిపుర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1997లో ప్రవేశపెట్టిన వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను త్రిపుర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు త్రిపురముఖ్యమంత్రి నేతృత్వంలో బుధవారం జరిగిన మాణిక్ సర్కార్ కేబినెట్ సమావేశం తీర్మానించింది. సమస్యాత్మక ప్రాంతాలలో పరిస్థితిని ఆర్నెల్లకోసారి సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర పోలీసులు, మిగిలిన సెక్యూరిటీ వర్గాల్లో చర్చించి, వారి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం ఉందనీ, ఇక ఈ చట్టం అవసరం లేదని భావించామని హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం మాణిక్ ఈ సందర్భంగా మీడియకు వివరించారు. దీనిపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచితనం, మానవత్వం సాధించిన విజయమంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఉగ్రవాదులను అణిచివేసే పేరుతో సాయుధ బలగాలు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టడంపై పలు ఆందోళనలు చెలరేగాయి. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ మణిపూర్ లో ఇరోం షర్మిల 2000 సం.రం నుంచి పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు త్రిపుర, మణిపూర్ , జమ్ముకాశ్మీర్ లాంటి ఈశాన్య రాష్ర్టాలలో 18 ఏండ్లుగా ఈ చట్టం అమలవుతోంది. -
‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’
దావణగెరె : గోమాతను పూజించేవారు పూజించవచ్చని, తినేవారు తినవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ప్రణవానంద స్వామీజీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి భారతీయ పరంపరలో గోమాతకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. గోమాత గురించి అవహేళనకరంగా మాట్లాడిన ఆంజనేయను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మహాసభ పదాధికారులు ప్రశాంత్, కొట్రేష్, రంగస్వామి, కల్లింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘లింగ’ చిత్రీకరణ అనుమతి రద్దు చేయండి
శివమొగ్గ :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదం రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతోంది. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వద్ద షూటింగ్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. మంగళవారం పర్యావరణ ప్రేమికుల ఒక్కూట ఆధ్వర్యంలో షూటింగ్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని అదనపు కలెక్టర్ నాగరాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త నా.డిసౌజా మాట్లాడుతూ... ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగనమక్కి వద్ద లింగ షూటింగ్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. లింగనమక్కి డ్యాం సమస్యాత్మక ప్రదేశం కావడంతో పాటు పర్యాటకాన్ని పూర్తిగా నిషేధించారని, అదే విధంగా వీడియోలు, ఫొటోలు తీయడం నిషిద్ధమన్నారు. అలాంటి ప్రదేశంలో షూటింగ్ అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం లింగనమక్కి డ్యాం పరిసరాల్లో ఎటువంటి సినిమాలకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని డిసౌజా సలహా ఇచ్చారు. డ్యాం రక్షణ దృష్ట్యా నిబంధనలు పాటించాలని ప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఒక్కూట సంఘం నాయకులు పరిసర రమేశ్, డాక్టర్ శేఖర్ గౌళర్, అశోక్ యాదవ్, మహదేవ ప్ప, ఆన ంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భారతరత్నపై బీజేపీ, కాంగ్రెస్ల రాజకీయం!
-
రచ్చ రచ్చ అవుతున్న సచిన్కు భారతరత్న
-
జీవిత చరిత్రకు ‘నో’
ఓ విజయవంతమైన సినిమాలో ఉండే మలుపులు, మెరుపులు, మసాలాలు, ఇంకా ఎన్నెన్నో విలాపాలూ విలాసాలూ వివాదాలూ కమల్హాసన్ జీవితంలో కూడా ఉంటాయి. అందుకే కమల్హాసన్ జీవిత విశేషాలతో ఓ పుస్తకం వస్తే అది కచ్చితంగా హాట్ కేక్ అవుతుంది. ఎందుకంటే, ఆయన వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం.. రెండూ పసందుగానే ఉంటాయి. పైగా, కమల్తో కొన్నేళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న ఆయన మాజీ భార్య సారిక స్వయంగా తన మాజీ భర్త జీవిత చరిత్ర రాస్తే... ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఆ పుస్తకాన్ని ప్రచు రించడానికి బోలెడంతమంది పోటీపడతారు. ప్రస్తుతం కమల్ జీవిత చరిత్ర రాసే పని మీద ఉన్నారట సారిక. ఇది కమల్కి ఏమాత్రం రుచించడంలేదట. దీని గురించి తెలిసిన కమల్.. ‘‘నా లైఫ్ కాంట్రవర్షియల్. నా అంగీకారం లేకుండా రాసే రాతలు నా పిల్లలను బాధించకూడదనుకుంటున్నాను’’ అని తన ఫ్రెండ్ దగ్గర పేర్కొన్నారట. ఏదేమైనా తన జీవిత చరిత్రను సారిక రాయడం కమల్కి ఇష్టం లేదని అర్థమవుతోంది. ఈ మాటలు ఆ నోటా ఈ నోటా సారికకు చేరే ఉంటాయి. మరి... కమల్ జీవిత చరిత్ర రాయాలనే తన నిర్ణయాన్ని సారిక మార్చుకుంటారో లేక అన్ని విషయాలనూ బయటపెడతారో కాలమే జవాబు చెప్పాలి.