ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
నాగిరెడ్డిపేట: మండలంలోని మాల్తుమ్మెద శివారులో బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట గ్రామానికి చెందిన అబ్రహం, వీరేశంగౌడ్ బడాపహాడ్కు బైక్పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 సమాచారం అందించారు. సిబ్బంది అనిల్, మహే శ్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని మొదటగా చికిత్స నిమిత్తం నాగిరెడ్డిపేటకు మెరుగైన వైద్యం కోసం మెదక్కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment