![అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/23/22srl151-180047_mr.jpg.webp?itok=NEPI1rRu)
సిరిసిల్ల క్రైం: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో స్వర్ణకార కుటుంబానికి చెందిన చింతోజు రమేశ్(46) స్థానిక కోర్టు ఎదురుగా హార్డ్వేర్ షాపు నిర్వహిస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా సమయంలో వ్యాపారం దెబ్బతినగా ఇప్పటికీ కోలుకోలేదు. వ్యాపారం, కుటుంబం కోసం దాదాపు రూ.20 లక్షల అప్పులు చేశాడు. తాను ఇబ్బందులు పడుతున్నానని.. ఎప్పటికై నా అప్పులు తీర్చాల్సిందేనని.. కానీ, ఎలా తీర్చాలంటూ భార్యకు చెబుతూ బాధ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం అద్దె ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కాసేపటికి గమనించిన భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పట్టణ స్వర్ణకారులు, ఇతర వ్యాపారులు అక్కడికి తరలివచ్చారు. రమేశ్ అందరితో కలివిడిగా ఉండేవాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య ఉమ, పదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద చిన్నారుల రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. రమేశ్కు కుటుంబసభ్యులతో ఆస్తి విషయంలో తగాదాలు న్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.