కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ అమలు
కరీంనగర్క్రైం: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ (భారతీయ న్యాయ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం గురువారం వెల్లడించారు. కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి ఉండరాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు చేయొద్దన్నారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు మూసివేయాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలీస్ పెట్రోలింగ్ పార్టీలు విధుల్లో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment