కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు

Published Fri, Mar 21 2025 1:28 AM | Last Updated on Fri, Mar 21 2025 1:24 AM

కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు

కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు

కరీంనగర్‌క్రైం: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ (భారతీయ న్యాయ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం గురువారం వెల్లడించారు. కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి ఉండరాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు చేయొద్దన్నారు. పరిసరాల్లోని ఇంటర్నెట్‌ సెంటర్స్‌, జిరాక్స్‌ షాపులు మూసివేయాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ పార్టీలు విధుల్లో ఉంటాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement