మద్యం మత్తులో ఆటో డ్రైవర్‌ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఆటో డ్రైవర్‌ బీభత్సం

Published Tue, Jun 13 2023 7:26 AM | Last Updated on Tue, Jun 13 2023 7:38 AM

- - Sakshi

కర్ణాటక: మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్‌ విచ్చలవిడిగా ఆటో నడపడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా ఓ పాదచారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన బాగేపల్లి రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... బాగేపల్లి రోడ్డులోని శ్రీనివాసపుర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ వెంకట రమణ మద్యం తాగి ఒక్కడే ఆటోలో సొంత ఊరుకు బయలుదేరాడు.

ఈ క్రమంలో వేగంగా వస్తూ మార్గం మధ్యలో రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న నవీన్‌ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నవీన్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ధ్వంసమైన ఆటో 1
1/2

ధ్వంసమైన ఆటో

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు2
2/2

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement