తల్లి చెంత కన్నీరు.. ఏడేళ్ల తరువాత తల్లిని చూసిన దర్శన్‌ | - | Sakshi
Sakshi News home page

తల్లి చెంత కన్నీరు.. ఏడేళ్ల తరువాత తల్లిని చూసిన దర్శన్‌

Published Tue, Jul 2 2024 12:30 AM | Last Updated on Tue, Jul 2 2024 7:12 AM

-

దొడ్డబళ్లాపురం: హత్య కేసులో హీరో దర్శన్‌ అరెస్టయ్యాక తొలిసారిగా తల్లి మీనా, తమ్ముడు దినకర్‌ దర్శన్‌ను కలిసారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మీనా ఏడేళ్లుగా దర్శన్‌కు దూరంగా ఉంటున్నారు. వీరిమధ్య మాటల్లేవు. అయితే కుమారుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న తల్లి మనసు తట్టుకోలేకపోయింది. 

సోమవారం ఉదయం ఆమె, దినకర్‌, దర్శన్‌ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్‌ పరప్పన జైలుకు వచ్చి దర్శన్‌ని కలిసారు. కుటుంబ సభ్యులను చూడగానే దర్శన్‌ కన్నీటి పర్యంతమయ్యాడని తెలిసింది. తోడుగా ఉంటామని దర్శన్‌కు కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement