అత్యుత్తమ సేవలకు వరించిన అవార్డు
కోలారు : కోలారు జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి జాతీయ ఆస్పత్రుల మాన్యతా మండలి అంతర్జాతీయ రోగుల సురక్షతా అవార్డు – 2025 లభించింది. ప్రపంచంలోని 70 దేశాల 250 ఆరోగ్య సేవా సంస్థల మధ్య జరిగిన పోటీలో కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని భారత మంటపంలో నిర్వహించిన మండలి 12వ అంతర్జాతీయ రోగుల సురక్షతా సమావేశంలో ఈ అవార్డును ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. కృష్ణప్ప, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె దినేష్ కార్తీక్, డా రాజ్కుమార్కు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment