ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్), వలంటీర్ల సంఘం సంయుక్తంగా శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టింది. విజయవాడ లెనిన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 17 నుంచి ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment