● కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పైసా కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు.
● ఓర్వకల్లు ఇండస్ట్రియల్హబ్కు పరిశ్రమలు వస్తున్నాయని ఇటీవల భరత్ ప్రకటించారు.
● అయితే ఒక్క పరిశ్రమపై కూడా బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు.
● రూ.150కోట్లతో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ శాశ్వత భవనాలు, కర్నూలు నగరానికి ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్డు, డోన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్మైన్స్, శ్రీశైలంలో టైగర్పార్క్, ఆలూరులో జింకలపార్క్, ఆదోని, ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ టైక్స్టైల్ అప్పెరల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు.
● కర్నూలులో మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, కర్నూలులోని సర్వజన వైద్యశాలను ‘రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్’ స్థాయిగా అభివృద్ధి చేస్తామన్నారు.
● నంద్యాలను ‘సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అభివృద్ధిచేసి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను డీమ్డ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
● బడ్జెట్లో వీటికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. నిధులు కేటాయించని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment